గేట్లు బద్దలు కొట్టారు.. తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య | Cm Siddaramaiah Reaction To The Bengaluru Stampede Incident | Sakshi
Sakshi News home page

అభిమానులు గేట్లు బద్దలు కొట్టారు.. తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య

Jun 4 2025 8:19 PM | Updated on Jun 4 2025 9:01 PM

Cm Siddaramaiah Reaction To The Bengaluru Stampede Incident

బెంగళూరు: తొక్కిలాసట ఘటన దురదృష్టకరమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని.. 33 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. స్టేడియం దగ్గరకు లక్ష మందికి పైగా అభిమానులు వచ్చారు. ఇంత భారీగా జనం వస్తారని ఊహించలేదన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. స్టేడియం కెపాసిటి 35 వేల మంది మాత్రమే. కానీ మూడు లక్షలకు పైగా అభిమానులు తరలివచ్చారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని సిద్ధరామయ్య ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ఏ  చిన్న ఘటన జరిగినా ప్రభుత్వాన్నే నిందిస్తూ ఉంటారు. ఈ విషాద ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని సిద్ధరామయ్య తెలిపారు.

కాగా, ఈ దుర్ఘటనపై ఆయన ‘ఎక్స్‌’లో కూడా ట్వీట్ చేశారు. ఈ వార్త తనను షాక్కు గురిచేసిందన్నారు. ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం.. ఈ దుర్ఘటనతో చెదిరిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. చిన స్వామి స్టేడియానికి అంచనాలకు మించి అభిమానులు రావడం వల్లే ఇలా జరిగిందన్నారు.

ఈ తొక్కిసలాటపై కర్ణాటక ప్రజలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు. స్టేడియం కేపాసిటికి మించి భారీగా అభిమానులు వచ్చారని దీంతో.. పోలీసులకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. డీకే మీడియాకు తెలిపారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement