Hijab Row: Karnataka High Court Says Classes Must Start - Sakshi
Sakshi News home page

‘హిజాబ్‌’ రగడ.. స్కూళ్లు తెరవండి: హైకోర్టు

Feb 10 2022 6:16 PM | Updated on Feb 10 2022 7:09 PM

Hijab Row: Classes Must Start  Karnataka High Court - Sakshi

కర్ణాటకలో హిజాబ్‌–కాషాయ కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్‌-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. 

హిజాబ్‌ రగడపై దాఖలైన పిటిషన్‌ను సీజే జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది.  గురువారం విచారించిన ధర్మాసనం..  తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్‌- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది.  కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement