karnataka high court
-
పని మాత్రమే కాదు.. నిద్ర కూడా ముఖ్యమే: కర్ణాటక హైకోర్టు
విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని, సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి కచ్చితంగా అవసరమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయి సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వెల్లడించింది.‘‘ఇవాళ ఈ కానిస్టేబుల్ కావొచ్చు. రేపు మరొకరు కావొచ్చు. మనిషికి నిద్ర సహజం. అలాంటిది మనిషికి నిద్రను దూరం చేస్తే ఎలా?. ఈరోజుల్లో పని-జీవితం మధ్య సమతుల్యం(Worklife Balance)లో నిద్ర-విశ్రాంతి కీలక అంశం. షిఫ్ట్లవారీగా పని చేసినప్పుడు.. ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా?’’ అని జస్టిస్ ఎం నాగప్రసన్న(Justice M Nagaprasanna) ధర్మాసనం వ్యాఖ్యానించింది.వైరల్ వీడియోతో మొదలై..కిందటి ఏడాది మార్చి 23వ తేదీన కల్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పని చేసే చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై చంద్రశేఖర్ను ఉన్నతాధికారులు వివరణ కోరారు. వరుస షిఫ్ట్లలో డ్యూటీ చేయడం మూలంగా తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నానని, వాటి మూలంగానే నిద్ర ముంచుకొచ్చిందని, అయినా తాను 10 నిమిషాలపాటే విశ్రాంతి తీసుకున్నానని వివరణ ఇచ్చారాయన.అయితే కానిస్టేబుల్ వివరణతో అధికారులు సంతృప్తి చెందలేదు. డ్యూటీలో ఉండగా పడుకోవడం తప్పేనని, పైగా ఈ చర్యలో డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెబుతూ సస్పెండ్ చేశారు. ఆపై ఘటనపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సస్పెన్షన్పై ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు.అయితే.. విజిలెన్స్ నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది. సదరు విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారని, వరుసగా మూడు షిఫ్ట్లలో పని చేస్తున్నారని.. కాబట్టి వారిపై పని ఒత్తిడి తగ్గించడానికి మరో ఇద్దరిని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 24 ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి విశ్రాంతి హక్కు ఉంటుంది. అలాగే వేతనంతో కూడిన కాలానుగుణ సెలవులు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంఘ ఒప్పందాల ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి. షిఫ్ట్లవారీగా పని చేసేవాళ్ల విషయంలో ఇది మరీ అవసరం. అసాధారణ సందర్భాలను మినహాయిస్తే.. రోజుకి 8 గంటలు.. వారంలో 48 గంటలకు పని గంటలు మించకూడదు.ఈ కేసులో పిటిషనర్ విధుల్లో నిద్రపోవడంలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదు. వరుస షిఫ్ట్లలో 16 గంటలపాటు పని చేయడం మూలంగా ఆయన అధిక పని ఒత్తిడితో ఇబ్బంది పడ్డారు. అందుకే నిద్రపోయారు.కాబట్టి, సస్పెన్షన్ సరికాదు. తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి అని జస్టిస్ ఎం నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు. -
లక్ష్యసేన్కు ఊరట
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... » ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. » లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. » తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. » కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. » దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి. » మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. » పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. » లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది. -
MUDA Scam.. సీఎం సిద్ధరామయ్యకు ఊరట
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుండి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమయి కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్ ఎం నాగప్రసన్న తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు. లోకాయుత్త దర్యాప్తు చేయగలదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సిద్దరామయ్య తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు.ముడా స్కాం ఇదే..మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది. -
హేమ డ్రగ్స్ కేసుపై కర్ణాటక హైకోర్టు స్టే
-
కన్నడ నటుడు దర్శన్కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఊరట
బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కాస్త ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతోపాటు మరికొందరిపై నమోదైన కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు తమపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు. -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ అనుమతించడం తెలిసిందే. ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ‘‘గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవడం రివాజే అయినా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఇది అలాంటి కేసే’’ అని అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో లబి్ధదారు స్వయానా పిటిషనర్ కుటుంబానికి చెందిన వ్యక్తే. కనుక అభియోగాలపై విచారణ అవసరమన్నది నిస్సందేహం’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు.గవర్నర్ ఏమాత్రం ఆలోచన లేకుండా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బాగా ఆలోచించిన మీదటే దర్యాప్తుకు అనుమతిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ముడా కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆగస్టు 16న అనుమతించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.విచారణకు తానేమీ వెనకాడటం లేదన్నారు. అయితే, ‘‘నేనెందుకు రాజీనామా చేయాలి? అవినీతి ఆరోపణల్లో బెయిల్పై తిరుగుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామా చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ కేసు నాపై, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాల్లో భాగం. అందుకోసం గవర్నర్ అధికారాలను కూడా దురి్వనియోగపరుస్తున్నారు’’ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకు దన్నుగా ఉందని చెప్పారు.రాజీనామా చేయాలి: బీజేపీ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మీ అబద్ధాల సామ్రాజ్యం కుప్పకూలింది. గౌరవప్రదంగా రాజీనామా చేయండి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలు కలి్పంచండి’’ అని పార్టీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ డిమాండ్ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆయన రాజీనామా చేయబోరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘‘ఇదో కుట్ర. సిద్ధరామయ్య నిర్దోíÙత్వాన్ని నిరూపించుకుంటారు’’ అన్నారు. ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచి్చతంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదించారు. ఈ ఆరోపణలపై జూలైలో సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసిచ్చారు. అనంతరం విచారణకు అనుమతిచ్చారు. -
కోర్టులపై నమ్మకం ఉంది, త్వరలోనే నిజాలు బయటకు: సిద్దరామయ్య
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ విషయంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్ను తాజాగా కోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్ నాకు అండగా నిలిచింది. నా పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించాయి. నేను పేదల పక్షాన ఉన్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు బీజేపీ, జేడీఎస్లు నాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుతున్నాయి’ అని మండిపడ్డారు.అయితే తనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంపై చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ నిపుణలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 17A కింద విచారణ రద్దు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.‘ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు. వారి ఆశీస్సులే నాకు రక్షణ. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతాను. ఈ పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుంది. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం. బీజేపీ, జేడీఎస్ల ఈ ప్రతీకార రాజకీయాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.మరోవైపు సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేతలు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు. తమ బాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన 100శాత స్వచ్చమైన సీఎం అని ప్రకటించారు. శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము సీఎంకు అండగా ఉంటాం. ఆయనకు మద్దతు ఇస్తాం. ఆయన ఎల్లప్పుడు రాష్ట్రం, పార్టీ కోసం మంచి పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇక కోర్టు తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తం అవ్వనుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయిందని.. ఇక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ’ అని కన్నడలో బీజేపీ పోస్టు చేసింది. -
ముడా స్కామ్: సీఎం సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఈ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్మామ్లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక.. గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది. ఇదిలాఉండగా... సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్లో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.చదవండి: కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల స్కాం -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
వాచీలు, చెప్పులు, గాజులకు రూ.50 వేలు ఇవ్వాలి
సాక్షి, అమరావతి: భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తం సర్వత్రా సంచలనంగా మారింది. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో ఖర్చుల కింద ఆ మహిళ అడిగిన మొత్తానికి హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. నెల ఖర్చులు రూ.6.16 లక్షలా? అంటూ కర్ణాటక హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ఒంటరి మహిళ నెలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘ఈ స్థాయిలో ఆమె ఖర్చు చేయాలనుకుంటే భర్త సంపాదన మీద కాదు. ఆమెనే సంపాదించుకోమనండి. అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ఈ మహిళకు కుటుంబ బాధ్యతలు లేవు. అంత మొత్తం ఖర్చుల కిందే కావాలంటోంది. సింపుల్గా రూ.6.16 లక్షలు అడిగేసింది. భార్య ఎంత అడిగితే అంత భర్త నుంచి భరణం కింద ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయకుండా గట్టిగా సందేశం పంపాలని ఈ కోర్టు నిర్ణయించింది. భార్యతో విభేదాలు భర్తకు ఈ విధమైన పనిష్మెంట్గా మారకూడదు’ అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ అంత ఖర్చులు ఏమున్నాయని ఆ మహిళ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన వివరాలు హైకోర్టును షాక్కు గురి చేశాయి. భర్త విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అందువల్ల తన క్లయింట్ అయిన మహిళ కూడా అదే స్థాయిలో జీవితాన్ని ఆస్వాదించదలచుకున్నారని ఆ న్యాయవాది చెప్పారు.‘ఇల్లు, తిండి ఖర్చుకు రూ.40 వేలు.. వాచీలు, దండలు, గాజులు, చెప్పులు ఇలాంటి కనీస అవసరాలకు రూ.50 వేలు కావాలి. వైద్యం, కాస్మోటివ్ వంటి వాటి కోసం రూ.4 – 5 లక్షలు అవుతుంది. ఇవి కాక పిల్లల ఫీజులు అవీ ఉన్నాయి. అంతేకాక బంగారం రుణం తీర్చాలి. ఇలా అన్నింటికీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని ఆ న్యాయవాది చిట్టా విప్పారు. వాస్తవ అవసరాలు ఏమిటో చెప్పకుండా ఇలా విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చులు అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయనుకుంటున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భర్త సంపదన రూ.10 కోట్లు ఉందని, అందువల్ల తనకు రూ.5 కోట్లు కావాలని ఎవరైనా అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయా? అని నిలదీసింది. అసలు వాస్తవ ఖర్చులు ఏమిటో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6,16,300 ఖర్చుల కింద ఇప్పించేలా ఆదేశించాలంటూ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. అయితే వాస్తవ ఖర్చుల వివరాలు ఆమె సమర్పించక పోవడంతో ఆమె పిటిషన్ను కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
MUDA Scam: హైకోర్టులో సిద్దరామయ్యకు ఊరట..
బెంగళూరు: తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్దమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టుకు తెలిపారు.వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్ను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిరోధించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు.సీఎంకు ఊరటముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిస్తూ, ఆరోపించిన ముడా కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు, హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు జరగదు.అంతకముందు సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులోనూ చేయనని అన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్లు కుట్ర పన్నాయని మండిపడ్డారు. -
Karnataka: గవర్నర్ V/s సీఎం.. హైకోర్టుకు సిద్దరామయ్య
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముడా అధికారులు తన భార్యకు భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు, తదితరులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు.కాగా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి..సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.అయితే ఆ ఆరోపణలను సిద్దరామయ్య తోసిపుచ్చారు. అతాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది అని విమర్శించారు. -
ఇది అన్యాయం: డీకే శివకుమార్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన. నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్ చేస్తానని చెప్పారాయన.ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్ను తిరస్కరించింది.2013-18 కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్ అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. 2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. -
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జజ్టిస్ ప్రసన్న బి.వరాలే పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్.దినేశ్కుమార్ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సమావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ అనంతరం సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూ డో న్యాయమూర్తిగా జస్టిస్ వరాలే నిలవనున్నారు. ‘‘జస్టిస్ ఎస్.కె.కౌల్ రిటైర్మెంట్తో గత డిసెంబర్ 25 నుంచి సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉన్నందున ఖాళీలుండరాదు. అందుకే జస్టిస్ వరాలే పేరును సిఫార్సు చేస్తున్నాం’’ అని కొలీజియం పేర్కొంది. 56 మంది సుప్రీం న్యాయవాదులకు సీనియర్ హోదా 11 మంది మహిళలతో సహా 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో తెలుగు న్యాయవాది శ్రీధర్ పోతరాజు కూడా ఉన్నారు. -
రోజుకో మలుపు తిరుగుతున్న డీకే శివకుమార్ సీబీఐ కేసు
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్కు ఆహ్వానం -
డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి
బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. 2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది. రాజకీయ దురుద్దేశంతోనే: డీకే రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు. -
అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు
‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ను అడ్డంపెట్టుకొని బయటపడాలని చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని పట్నా, కర్ణాటక హైకోర్టులు రెండు వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. సెక్షన్ 17ఏ అవినీతిపరులకు రక్షణ కవచం కాదని ఈ నెల 7న పట్నా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17 ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ నుంచి సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ చేసిన వాదనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. సెక్షన్ 17ఏ అమలులోకి రాకముందే శివకుమార్పై కేసు నమోదు చేసినందున అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరంలేదన్న సీబీఐ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రిమాండ్కు పంపడం న్యాయపరంగా సరైనదేనని ఈ తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇదీ బిహార్ కేసు బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లాలోని సుగాలి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కిశోర్ కుమార్ అక్రమంగా మద్య రవాణా చేస్తున్న వారిని విడిచిపెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన్ని చకియాకు బదిలీ చేశారు. ఆయన చకియాకు బదిలీ అయిన తరువాత సుగాలి పోలీసు స్టేషన్లో మూసివేసిన ఓ కేసును మళ్లీ నమోదు చేసి సంబంధిత వ్యక్తుల నుంచి లంచం వసూలు చేశారు. దీంతో ఆ జిల్లా ఎస్పీ ఆయన్ని అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కిశోర్ కుమార్ పట్నా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ కింద తనను అరెస్టు చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అనుమతి ఉండాలని వాదించారు. పట్నా హైకోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది. అవినీతి నిరూపితమైనందున ఆయన అరెస్టుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 17ఏను అడ్డంపెట్టుకుని అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని కూడా స్పష్టంగా చెప్పింది. ఇదీ శివకుమార్ కేసు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోనందున సీబీఐ తనపై నమోదు చేసిన కేసు చెల్లదని కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సెక్షన్ 17 ఏ అమల్లోకి రావడానికి (2018 జులై 26కి) ముందు 2013 నుంచి 2018 ఏప్రిల్ మధ్య శివకుమార్ అవినీతికి పాల్పడినందున ఆయనకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది. అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వంగా అవినీతి చేయటం ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావని కూడా చెప్పింది. సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. శివకుమార్ వినతిని తిరస్కరించింది. చంద్రబాబుదీ అవే అడ్డగోలు వాదనలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా ఇదే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోనందున అరెస్ట్ చెల్లదని, కేసు కొట్టివేయాలని వాదిస్తున్నారు. ఈ వాదనను సీఐడీ న్యాయవాదులు సమర్థంగా తిప్పికొట్టారు. అవినీతి వ్యవహారాల నుంచి గంపగుత్తగా రక్షణ కల్పించడం సెక్షన్ 17ఏ ఉద్దేశం కాదని వాదించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదని చెప్పారు. అందువల్ల చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఏ విధంగా అర్హులు కారో వారు విశ్లేషించి మరీ చెబుతున్నారు. ► కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరన్నది నిర్ధారణ అయ్యింది. ► ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదని పట్నా హైకోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదన్నది సుస్పష్టం. ► సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ► సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఆయన చెప్పడం లేదు. సెక్షన్ 17ఏ ప్రకారం తనపై సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదని మాత్రమే చెబుతున్నారు. అందువల్ల స్కిల్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
అక్రమార్కుల కేసులో డీకే శివకుమార్ కు షాక్
-
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు. ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ఆరేళ్లు కలిసుండి.. అత్యాచారం అంటే చెల్లదు: హైకోర్టు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి.. ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని కర్ణాటక హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన దావణగెరెకు చెందిన మహిళ, బెంగళూరుకు చెందిన ఒక పురుషుడు ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. పురుషుడు వివాహానికి నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళ 2021లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. 2013లో ఫేస్బుక్ ద్వారా తమకు పరిచయం కలిగిందని, ఇద్దరి ఆమోదంతోనే సంబంధం కొనసాగిందని పేర్కొన్నాడు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. మహిళ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరేళ్లు సుదీర్ఘ సంబంధం ఉండడం వల్ల ఆమె చేసే అత్యాచారం అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది. చదవండి: కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్లో పడితే అంతే సంగతులు! -
నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? కర్ణాటక హైకోర్టు
బెంగుళూరు: భర్త నల్లగా ఉన్నాడని భార్యా అదేపనిగా కించపరచడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పు బట్టింది. అదొక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ.. దీన్నే బలమైన కారణంగ చెబుతూ ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. తన భర్త నల్లగా ఉన్నాడంటూ ఓ భార్య అతడిని తరచుగా ఆవమానించడంతో ఆ భర్త విసుగు చెంది విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయుయించాడు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత భర్త ఎంత నల్లగా ఉన్నా అతడు నల్లగా ఉన్నాడని ఎద్దేవా చేయడం క్రూరత్వమేనని తెలుపుతూ 44 ఏళ్ల భర్తకు తన 41 ఏళ్ల భార్య నుంచి విముక్తి కలిగిస్తూ విడాకులు మంజూరు చేసింది కర్ణాటక కోర్టు. బెంగుళూరుకు చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. కొన్నాళ్ళకి వారిద్దరికి ఒక అడ బిడ్డ కూడా జన్మించింది. కానీ తరచుగా వారు గొడవ పడుతుండడం.. మాటల మధ్యలో నువ్వు నల్లగా ఉన్నావంటూ ఆమె తిట్టడం.. ఇదొక దైనందిన ప్రక్రియలా కొనసాగేది. దీంతో విసుగు చెందిన ఆ భర్త ఆమె నుండి వేరుగా ఉంటూ 2012లో విడాకుల కోసం ఫ్యామిలి కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డ కోసమే ఆ అవమానాలన్నిటినీ భరించానని ఇక తన వల్ల కాదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. భర్త విడాకుల కోసం కోర్టుకెక్కడంతో కోపోద్రిక్తురాలైన ఆ భార్య.. తన అత్తమామలు తనను బాగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, అదనపు కట్నం తీసుకు రావాలంటూ వేధిస్తున్నారని చెబుతూ భర్త సహా అందరిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందంటూ ఆరోపణలు చేసింది. అనంతరం తన బిడ్డను తన తల్లిదండ్రుల వద్దకు పంపించేసింది. అయితే ఐదేళ్లపాటు సాగిన వాదనలు, వాయిదాలు తర్వాత 2017లో ఫ్యామిలి కోర్టు భర్త విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది. అయినా కూడా శాంతించని భర్త విడాకుల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చివరకు హైకోర్టు కేసు పూర్వాపరాలను పరిశీలించి ఆమె తన భర్తపై చేసిన అక్రమ సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవి, నిర్లక్ష్యమైనవని తెలుపుతూ భర్త నల్లగా ఉన్నాడని అవమానించడం కౄరత్వంతో సమానమని చెబుతూ ఆ భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
డీకే శివకుమార్కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి పదో తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులో కలగజేసు కోబోమని బెంచ్ స్పష్టంచేసింది. గతంలో కర్ణాటక హైకోర్టు సీబీఐ దర్యాప్తుపై స్టేను పలుమార్లు పొడిగించడం తెల్సిందే. -
సుప్రీంకోర్టులో డీకే శివకుమార్కు ఊరట..
సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. అవినీతి కేసులో డీకే శివకుమార్ సీబీఐ దర్యాప్తుపై గతంలో కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వగా.. హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ విచారణపై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే ఇచ్చిందని సుప్రీంకు ఆయన తెలిపారు. డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీబీఐ అప్పీల్ దాఖలు చేసిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన తదుపరి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేసేందుకు నిరాకరించిందని కోర్టుకు పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద పెండింగ్లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. అదే విధంగా తమ ముందున్న కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును కోరేందుకు సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం సీబీఐ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం కాగా డీకే శివకుమార్ అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10న స్టే ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని విచారణ సంస్థను ఆదేశించింది. శివకుమార్పై నమోదైన కేసులు 2020 నాటివని నొక్కి చెబుతూ.. గడిచిన రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై తుది రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. ఇక 2017లో డీకే శివకుమార్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఐటీ శాఖ అందించిన సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అతనిపై విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25, 2019న అప్పటి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అక్టోబర్ 8, 2020న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఎఫైఆర్ నమోదైంది. అయితే దీనిని సవాలు చేస్తూ శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం -
చంపేస్తాం..! హైకోర్టు జడ్జిలకు బెదిరింపులు
బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్లి నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు అందాయి. హైకోర్టులోని ఓ ఉద్యోగితోపాటు పలువురు న్యాయమూర్తులను చంపేస్తామని ఓ పలు నెంబర్ల నుంచి వాట్సాప్ మెసెజ్లు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ అధికారి(పీఆర్ఓ) కే మురళీధరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జూలై 12న రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి మురళీ ధరన్ వాట్సాప్కు మెసెజ్ వచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ మెసెజ్లో తనతోపాటు హైకోర్టులోని ఆరుగురు జడ్జిలను చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) ఉన్నారు. కాగా బెదిరింపులు వచ్చిన నెంబర్ను మురళీధరన్కు హైకోర్టు అధికారికంగా అందించిందని తెలిపారు. పాకిస్థాన్లోని బ్యాంకు ఖాతాకు ₹ 50 లక్షలు చెల్లించాలని లేదంటే.. ఈ లిస్ట్లో పేర్కొన్న వారిని దుబాయ్ గ్యాంగ్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసెజ్లో ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని 75, 66(ఎఫ్) సెక్షన్ల కింద సెంట్రల్ CEN పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు .. నన్ను సీమాతో పోల్చకండి! -
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్తో పోలికా? సరిపోయింది -
శారీరక బంధం నిరాకరణ నేరం కాదు
సాక్షి బెంగళూరు: వివాహం అనంతరం శారీరక సంబంధాన్ని నిరాకరించడం నేరం కాదని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం లైంగిక చర్యకు నిరాకరించడం క్రూరత్వంతో సమానమని తెలిపింది. శారీరక సంబంధం నిరాకరించిన ఘటనలో ఒక భర్తపై భార్య, ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై విచారించిన హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. శారీరక సంబంధాన్ని నిరాకరించడం ఐపీసీ సెక్షన్ 489ఏ కిందికి రాదని, అది నేరం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం–1961 సెక్షన్ 4 కింద దాఖలైన కేసులు, పోలీసు చార్జిషీట్ను వ్యతిరేకిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. ‘పిటిషనర్ ధార్మికుడు. అతని దృష్టిలో ప్రేమ అంటే శారీరక సంబంధం కాదు. అది ఆత్మల కలయిక. అందుకే భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించాడు’అని జడ్జి తెలిపారు. ఇలా శారీరక సంబంధం కలిగి ఉండకపోవడం హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 (1) (ఏ) కింద క్రూరమైన చర్య, అయితే ఐపీసీ 498 (ఏ) కింద నేరం కాదంటూ భర్త, అతని తల్లిదండ్రులపై పెట్టిన కేసులను కొట్టివేశారు. -
ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులతో ఫేస్బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. (సూపర్ ఆఫర్: రూ. 2749 కే యాపిల్ ఐఫోన్ 11!) సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్బుక్ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్బుక్ను హెచ్చరించింది. దక్షిణ కన్నడ జిల్లా నివాసి కవిత పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్బుక్ను ఆదేశించింది. తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు, విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేశారని, తాను పిల్లలతో తన స్వగ్రామంలో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్లో తెలిపారు.2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కి మద్దతుగా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడనే అభియోగంతో సౌదీ పోలీసులు శైలేష్ కుమార్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. (చైనా స్మార్ట్ఫోన్ మేకర్కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్బై, ప్రత్యర్థికి సై!?) అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్కు లేఖ రాసి, నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే ఫేస్బుక్ దీనిపై స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదలకు సాయం చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరిన్ని బిజినెస్వార్తలు, ఇంట్రస్టింగ్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివకుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు సీబీఐ విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నటరాజన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. శివకుమార్ ఆస్తులు కర్ణాటక వెలుపల ఉన్నందున ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు దర్యాప్తు చేసేందుకు సెప్టెంబర్ 25, 2019న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చిందని కోర్టు తెలిపింది. అయితే తనను ఏ దర్యాప్తు సంస్థ విచారించాలో ఎన్నుకునే లేదా తెలిసే హక్కు నిందితుడికి(శివకుమార్) లేదని, చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం విచారణకు అనుమతించేటప్పుడు కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టులో వాదించింది. చదవండి: Karnataka Election: సమరానికి సై.. నేడు అమిత్ షా.. 29న మోదీ! సీబీఐ కేసు నమోదు కాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై 2017లో శివకుమార్కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహించింది. ఐటీ సోదాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ప్రారంభించింది. 2019లో డీఎస్ యడియూరప్ప ప్రభుత్వం శివకుమార్పై దర్యాప్తునకు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 2020 అక్టోబర్లో అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమని, తనపై విచారణను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ 2022 జూలై 28న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అవసరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే మళ్లీ మళ్లీ నోటీసులు పంపుతుందని శివకుమార్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతపై సీబీఐ విచారణకు హైకోర్టు పలుమార్లు స్టేలు విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో భారీ బినామీ లావాదేవీలు ఉండటం వల్ల అంతరాష్ట్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు శివకుమార్ పిటిషన్ను కొట్టి వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎదురుదెబ్బ మే 10న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న శివకుమార్కు హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. కాగా రాబోయే ఎన్నికల్లో రామనగర జిల్లాలోని కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్కు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని, తన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,414 కోట్లుగా ఉంది. -
ప్రేమకు తలొగ్గిన కోర్టు..లవర్ను పెళ్లి చేసుకునేందుకు హత్యకేసు దోషికి పెరోల్
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి. 'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది. అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ -
ప్యాసింజర్ దిగుతుండగా కదిలిన బస్.. ‘ఆర్టీసీ’కి రూ.1.30లక్షల ఫైన్
బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది. 2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్ఆర్టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్టీసీ అధికారులు సైతం వాధించారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి -
కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు
‘కాంతార’ మూవీతో సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చేతన్ కుమార్కు బెంగళూరు హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగా దానిని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వివరాలు.. కాంతార సినిమాలో భూతకోల సంస్కృతిని డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా చూపించాడు. ఈ సంస్కృతికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. అయితే ఈ సంస్కృతి హిందూ మతంలో భాగం కాదంటూ కన్నడ నటుడు చేతన్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివ కుమార్ అనే వ్యక్తి శేషాద్రినగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చేతన్ కుమార్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టెల ఉన్నాయని, హిందూ మనోభవాలను దెబ్బతీసేశాల అతడు వ్యవహరించాడంటూ శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చేతన్ కుమార్ను కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఈ కేసుపై విచారణ చేపట్టగా తాను కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని, హిందూ మతాన్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలు లేవంటూ కోర్టులో వాధించాడు. అదే విధంగా.. తాను ఏ మతాల మద్య విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని వివరణ ఇచ్చాడు. అయితే కోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. ఒక మత సంస్కృతిని కించ పరిచే విధంగా మాట్లాడటం.. మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల విషయంలో చేతన్పై నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా అడ్డుకోలేమని హైకోర్టు పేర్కొంది. చదవండి: హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, మెను, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
ఓలా, ఉబర్, రాపిడోలకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు. కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం -
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
హిజాబ్: కర్ణాటక సర్కార్కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు.. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందించాలని సర్కార్ను కోరింది. అదే సమయంలో పిటిషనర్లను సైతం మందలించింది ధర్మాసనం. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీరే కోరారు. మళ్లీ వాయిదా అడిగారు. ఆపై మళ్లీ విచారణకు కోరారు. ఇప్పుడు మళ్లీ వాయిదా అడుగుతున్నారు. ఇలాంటి వాటికి ఇక్కడ అనుమతి లేదు.. వాదనలు వింటాం అని పేర్కొంటూ సెప్టెంబర్ 5వ తేదీన వాదనలు ఉంటాయని స్పష్టం చేసింది. యూనిఫాం నిబంధనలను విద్యాసంస్థల్లో కఠినంగా అమలు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి సూచిస్తూ.. హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తన తీర్పులో ఆదేశాలు వెల్లడించింది. దీంతో చాలామంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అధికారులను ప్రొత్సహిస్తూ.. ప్రభుత్వం సవతి ప్రేమను ప్రదర్శిస్తోందంటూ పలువురు పిటిషన్లలో పేర్కొన్నారు. హిజాబ్ దుమారం ఈ ఏడాది మొదట్లో.. ఉడిపి నుంచి మొదలై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపెట్టింది. ఇదీ చదవండి: ఆపరేషన్ కమలం విఫలమైందని చూపించేందుకే.. -
న్యాయ సమీక్ష పేరుతో ప్రభుత్వాలను నడిపే ప్రయత్నం చేయకూడదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సమీక్ష ముసుగులో ప్రభుత్వాలను నడపడానికి కోర్టులు ప్రయత్నించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తర కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టు భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై కోర్టు జోక్యం తగదని జస్టిస్ ఎస్.దీక్షిత్, జస్టిస్ పి.కృష్ణ భట్ల ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘పాలన అనేది ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. న్యాయ సమీక్ష ముసుగులో కోర్టులు ప్రభుత్వాలను నడపడానికి ప్రయత్నించకూడదు. కేవలం సూచనల మేరకు ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ఆ పనుల్లో చిన్న తప్పులు ఎత్తిచూపడం, అప్రధానమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపడం మా పని కాదు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి’’ అని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. -
కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూతన నిబంధనల మేరకు రాజకీయ కంటెంట్ను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వం బ్లాక్ చేయాలని కోరిన కంటెంట్కు, ఐటీ చట్టంలోని సెక్షన్ 69–ఏకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్ చేసిన సమాచారాన్ని నిరోధించడం, పౌర వినియోగదారులకు ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం హామీకి భంగం కలిగించడమేనంది. ప్రభుత్వం చెబుతున్న వివాదాస్పద ఖాతాలపై న్యాయసమీక్ష జరపాలని కోర్టును కోరింది. ఈ పరిణామంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ‘కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాల్సిందే’అని ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. జూలై 4వ తేదీలోగా తమ ఉత్తర్వులను అమలు చేయకుంటే చట్టపరమైన రక్షణలు రద్దవుతాయంటూ జూన్ 28వ తేదీన ట్విట్టర్కు హెచ్చరికలు పంపింది. అంటే, ట్విట్టర్ ఉన్నతాధికారులకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీనిపైనా తాజాగా కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సవాల్ చేసింది. (క్లిక్: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు) -
ఏసీబీ అవినీతిపై ఆరోపణలు.. హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అనేది కలెక్షన్ సెంటర్గా మారిందని, అదో అవినీతి కూపమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్పీ సందేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఆరోపించడం వల్ల తనకు బదిలీ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసం బదిలీ బెదరింపును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. 2021 మేలో రూ.5 లక్షల లంచంతీసుకుంటూ అరెస్టయిన బెంగళూరు అర్బన్ కలెక్టరేట్లోని డిప్యూటీ తహశీల్దార్ పీ.ఎస్.మహేశ్ సమర్పించిన బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ హెచ్.పీ.సందేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఏసీబీలో అక్రమాలను ప్రశ్నించినందుకు నాకు బదిలీ బెదిరింపు వచ్చాయి. గతంలో కూడా ఓ న్యాయమూర్తి ఇలా బదిలీ అయ్యారు. నాకు ఎవరైనా భయం లేదు. పిల్లికి గంట కట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. జడ్జి అయిన తరువాత ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను రైతు కొడుకును. ఎలా జీవించాలో నాకు తెలుసు. 50 రూపాయలతో బతకగలను. అలాగే రూ.50 వేలతోనూ జీవించడం తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. రాజ్యాంగానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఏ పార్టీకి లొంగను’ అని స్పష్టం చేశారు. చదవండి: కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! జడ్జి లకే భద్రత లేదు ఎస్ఐ నియామక అక్రమాలకు సంబంధించి ఏడీజీపీ అరెస్ట్ అయినే నేపథ్యంలో హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రను సస్పెండ్ చేయాలని, సీఎం బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కళంకం వచ్చిందని, న్యాయ వ్యవస్థకు భద్రత లేని పరిస్థితి ఉద్భవించిందన్నారు. సోమవారం ప్రభుత్వ అధికారులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అధికారి అరెస్ట్ అయిన అర్ధ గంటలో ఆరోగ్య పరీక్షలకు పంపించారు. అంత త్వరగా విచారణ పూర్తి చేసింది ఎందుకు? అని అన్నారు. కుంభకోణానికి బాధ్యత వహించి సీఎం, హోంమంత్రి తప్పుకోవాలన్నారు. యడ్డి కొడుకుపై ఆరోపణలు మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మంత్రి అశ్వత్థ్ నారాయణ పీఎస్ఐ అక్రమ నియామకాల్లో ప్రమేయముందని, వీరిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిని బెదరించారని, బదిలీ చేస్తామని భయపెట్టారని, న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఏసీబీ కలెక్షన్ బ్యూరో అయిందని విమర్శించారు. -
కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా?
బెంగళూరు: కోర్టు హాల్లో జడ్జి ముందు.. అదీ వాదనలు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్లంతా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందునా ప్రత్యేకించి.. అక్కడున్నవాళ్లను సైలెంట్గా ఉండాలని, జడ్జి ముందు హుందాగా వ్యవహరించాలని బంట్రోతు మధ్యమధ్యలో వారిస్తుంటాడు కూడా. అయితే.. కోర్టు హాల్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నిజంగా తప్పా? అలా కూర్చోవడంపై నిషేధం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది ఇప్పుడు. అయితే అలాంటి నిబంధనేది కోర్టు మార్గదర్శకాల్లో లేదని ఆర్టీఐ ద్వారా సమాధానం వచ్చింది. కర్ణాటక హలసూర్కు చెందిన నరసింహా మూర్తి అనే వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా దీని గురించి వివరణ కోరారు. దీనిపై హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ బదులిస్తూ.. కోర్టు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ, నోటిఫికేషన్లుగానీ, సూచనలుగానీ.. కాలు మీద కాలేసుకోవడం సరికాదని, దానిపై నిషేధం ఉందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టత ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఎక్కడైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ప్రత్యేకించి మార్గదర్శకాలు ఉంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంతే!. గంటల తరబడి అలా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నరసింహా మూర్తి.. ఆ ఆర్టీఐ పిటిషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. -
నమ్మశక్యంగా లేదు... టెలిఫోన్ వైర్లలో 11 కేవీ కరెంటా?
న్యూఢిల్లీ: ‘‘టెలిఫోన్ వైర్ల గుండా ఏకంగా 11 కేవీ కరెంటు ప్రవహించిందా? అయినా అవి వెంటనే కరిగిపోలేదా? పైగా ఆ కరెంటు వాటిగుండా ఓ టీవీలోకి ప్రవహించి ఒకరి మరణానికి కారణమైందా? అంత హై వోల్టేజీ విద్యుత్ ప్రవహించినా టీవీ పేలిపోవడం, ఇంట్లో వైరింగంతా కాలిపోవడం జరగలేదా? అవే టెలిఫోన్ తీగలను పట్టుకున్న నిందితునికీ ఏమీ కాలేదా? ఇదంతా వినడానికే చాలా అసంబద్ధంగా లేదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2003 నవంబర్లో కర్ణాటకలో ఒక వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తూ కరెంటు షాక్కు గురై చనిపోయిన కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. టీవీలో హఠాత్తుగా శబ్దం పెరిగిపోవడంతో దగ్గరికెళ్లి రెండు వైర్లను విడదీసే ప్రయత్నంలో షాక్ కొట్టి సదరు వ్యక్తి మరణించాడు. ఇందుకు కారకులంటూ ఇద్దరిపై కేసు నమోదైంది. వారు కరెంట్ పోల్పై టెలిఫోన్ వైర్లు లాగుతుండగా వాటి గుండా 11 కేవీ విద్యుత్ మృతుని ఇంట్లోని టీవీలోకి ప్రవహించడం మరణానికి కారణమైందంటూ ట్రయల్ కోర్టు వారికి 15 నెలల కారాగార శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించడంతో వారు సుప్రీంకోర్టులో అపీలు చేసుకున్నారు. ‘‘మరణానికి నిందితుల నిర్లక్ష్యమే కారణమనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలేవీ లేవు. అసలంతటి షాక్ కొడితే మృతుని శరీరం తీవ్రంగా కాలిపోవాల్సింది. అలా జరగలేదు. తీగలను ముట్టుకున్న ఒక సాక్షికి అసలేమీ కాలేదంటున్నారు. అదెలా సాధ్యం? ఈ కేసులో ఆరోపణలన్నీ సాంకేతికమైనవి. వాటిపై కనీసం సాంకేతిక నిపుణుడితో మదింపు చేయించలేదు. వీటన్నింటి దృష్ట్యా నిందితులను సంశయ లాభం కింద విడుదల చేయాల్సింది. కానీ కేవలం ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పును కొట్టేసింది. -
Original Choice: ‘ఒరిజినల్ చాయిస్’కు చుక్కెదురు
బెంగళూరు: ఒరిజినల్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీకి కోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ చాయిస్ పేరిట మరో బ్రాండ్ మార్కెట్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. కర్ణాటక హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎంపీ డిస్టెల్లరీస్ లిమిటెడ్ గ్రీన్ చాయిస్ పేరుతో ఓ బ్రాండ్ను మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంది. దీనికి స్టేట్ ఎక్సైజ్ కమిషనర్ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే.. ఒరిజినల్ చాయిస్ తయారీ కంపెనీ జాన్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యర్థి విస్కీ కంపెనీ తమ బ్రాండ్ను కాపీ కొడుతూ మోసపూరితంగా గ్రీన్ చాయిస్ను మార్కెట్లోకి దించుతోందని, పైగా ఎక్సైజ్ కమిషనర్ ఈ అభ్యంతరాలపై తమ వాదనలు సైతం వినకుండా జనవరి 1, 2022 అనుమతులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ జ్యోతి ముళిమణి.. జాన్ డిస్టెల్లరీస్ వాదనలను తోసిపుచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ తమకున్న అధికారాన్ని ఉపయోగించి.. సరైన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇందులో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగినట్లు తాము గుర్తించలేదని, పైగా పోటీదారు కంపెనీపై ట్రేడ్మార్క్ ఉల్లంఘన ఆరోపణలను సైతం తిరస్కరిస్తూ.. గ్రీన్ చాయిస్కు లైన్ క్లియర్ చేసింది కర్ణాటక హైకోర్టు. చదవండి: నటి రమ్య వ్యాఖ్యలపై ఆగ్రహం -
భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!
బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది. ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది. లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్ కాదు! సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్ రేప్ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు. భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు. ‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్ రేప్ను నేరంగా చేశాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్... తదితర దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. -
Marital Rape: కూతురి ముందే అసహజ శృంగారం.. భర్తకు చెంపపెట్టు
బెంగళూరు: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇవాళ(బుధవారం) కీలక ఆదేశాలు ఇచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి తనని భర్త ఒక సెక్స్ బానిసగానే చూస్తున్నాడని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, చివరికి కూతురి ముందే అదీ అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడంటూ కోర్టుకెక్కింది ఓ బాధితురాలు. ఈ క్రమంలో ఆమె అత్యాచార ఆరోపణల కింద కోర్టును ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్ 375 కింద నమోదు అయిన కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చారు. భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భర్తల ఇలాంటి చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చను మిగులుస్తాయి. అనాదిగా.. భర్తలు తమ భార్యలకు తామే పాలకులని భావిస్తున్నారు. భార్యల శరీరం, మనస్సు, ఆత్మను అన్నింటిని అణచివేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. వివాహం అనేది మనిషిలోని మృగాన్ని బయటకు రప్పించి.. భార్యలను శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్స్ కాదంటూ వ్యాఖ్యానించారాయన. కాబట్టి, భార్యతో బలవంతపు శృంగారం చేస్తూ.. ఆమెనొక సెక్స్ బానిసగా చూస్తున్న మీకు(భర్తకు) ఈ కేసు నుంచి విముక్తి ఇవ్వడం కుదరదు అంటూ పిటిషన్ను ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యాచారమే అవుతుంది భార్యపై భర్త చేసే లైంగిక దాడిని.. అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకపోవచ్చు. అయితే మినహాయింపులనేవి కొన్ని ఏళ్ల కిందటివని న్యాయమూర్తి ప్రస్తావించారు. పీనల్ కోడ్ చట్టాలు, అందులో సెక్షన్లు ఎప్పటివో. మధ్యయుగ చట్టంలో.. భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది. నా దృష్టిలో.. మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం. అత్యాచారం అంటే అత్యాచారం, అది స్త్రీ అయిన భార్యపై పురుషుడైన భర్త చేసినా సరే అని పేర్కొన్నారు న్యాయమూర్తి. నేరంగా గుర్తించకపోయినా.. వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. అత్యాచారంగా, తీవ్ర నేరంగా పరిగణించడం గురించి మేం చర్చించ దల్చుకోలేదు. ఎందుకంటే అది చట్టసభలకు సంబంధించిన అంశం. కేవలం భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో మాత్రమే మేం ఈ ఆదేశాలు ఇస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సమాజంలో భర్త అయినా ఇంకెవరైనా అత్యాచార ఆరోపణలకు అతీతులేం కారని, అలా చేస్తే.. చట్టం ముందు అసమానత్వం ప్రదర్శించడమే కాకుండా.. రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్యాంగానికి అంతా సమానమే. నేరం ఎవరు చేసినా నేరమే!. అత్యాచార సెక్షన్కూ మినహాయింపు ఉండద’ని అన్నారు. చాలా దేశాలు మారిటల్ రేప్ను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
‘హిజాబ్ తీర్పు’ జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత
హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్లో వాకింగ్కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్ జనరల్కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు. భగవద్గీత సిలబస్లో.. నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్ సిలబస్లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్ స్కూల్ సిలబస్లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడెంట్స్కు షాక్ హిజాబ్ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. -
‘హిజాబ్’పై హోలీ తర్వాత విచారణ: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. -
హిజాబ్ తీర్పుపై ఒవైసీ స్పందన ఇది
హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసి మరీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. ఈ తరుణంలో.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పుపై స్పందించారు. తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ పదిహేను పాయింట్లతో ట్విటర్లో ఒవైసీ సుదీర్ఘమైన సందేశం ఉంచారు. తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య? అని ఒవైసీ స్పందించారు. తీర్పు వెలువడిన వెంటనే ట్విటర్లోనూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటిషనర్లు సుప్రీం కోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున @AIMPLB_Official మాత్రమే కాకుండా ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నాను అంటూ వరుస పోస్టులు చేశారు. 1. I disagree with Karnataka High Court's judgement on #hijab. It’s my right to disagree with the judgement & I hope that petitioners appeal before SC 2. I also hope that not only @AIMPLB_Official but also organisations of other religious groups appeal this judgement... — Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2022 -
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022 -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పు
-
హిజాబ్ వివాదం.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. తామూ సుప్రీంకు వెళ్తామని వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉందని, ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తీర్పును ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకించారు. కర్ణాటకలో పలుచోట్ల వారు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ కూడా ముఖ్యమేనని, దాన్ని ధరించి తీరతామని అన్నారు. 11 రోజుల విచారణ కర్ణాటకలో జనవరిలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్ బెంచ్ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సీజే ఇంటికి భద్రత తీర్పు నేపథ్యంలో బెంగళూరులో సీజే, మిగతా ఇద్దరు న్యాయమూర్తుల నివాసాలకు పోలీసు భద్రత పెంచారు. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ►వివాదంపై హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు ఆదేశాలను అంతా పాటించాలి. శాంతిభద్రతలను కాపాడాలి. –సీఎం బసవరాజు బొమ్మై ►పిల్లలకు చదువు ముఖ్యం. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. –జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ►హైకోర్టు తీర్పును శిరసావహించాలి. తీర్పును చదివాక పూర్తిగా స్పందిస్తా. –సీఎల్పీ నేత సిద్ధరామయ్య ►హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉంది. – వక్ఫ్ బోర్డు కీలకమైన నాలుగు ప్రశ్నలు, సమాధానాలు కేసుకు సంబంధించి నాలుగు ప్రముఖ వివాదాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 1.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి ఆచరణా. హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కింద సమర్థనీయమేనా? ధర్మాసనం: ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదు. 2.విద్యా సంస్థల్లో యూనిఫాంను తప్పనిసరి చేయడం ఆర్టికల్ 19 (1) కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్ 21 కింద వ్యక్తి హక్కును కాలరాయడం అవుతుందా? ధర్మాసనం: విద్యా సంస్థల్లో యూనిఫాంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని అంశాల్లో నిషేధాజ్ఞలను విధించడం ప్రభుత్వానికున్న రాజ్యాంగ హక్కు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించడానికి వీల్లేదు. 3.యూనిఫాం జీవో నిబంధనలకు వ్యతిరేకమా? ఆర్టికల్ 14, 115లను ఉల్లంఘించడమా? ధర్మాసనం: జీవోలో ఎలాంటి ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్య లేవు. 4.విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా, అందుకు కాలేజీలు అభ్యంతరపెట్టకుండా ఆదేశాలివ్వాలా? ధర్మాసనం: అవసరం లేదు. -
Hijab Row: తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
బెంగళూరు: హిజాబ్ వ్యవహారం.. ప్రధానంగా కర్ణాటకను ఆపై దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అంతా ఎదురు చూస్తున్న కర్ణాటక హైకోర్టు తీర్పు రేపు(మార్చి 15న) వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 11 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. తీర్పును ఫిబ్రవరి 25వ తేదీన రిజర్వ్లో ఉంచిన సంగతి తెలిసిందే. మార్చి 15న మంగళవారం ఉదయం 10గం.30ని. తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఇక ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్లో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి కూడా ఉన్నారు. తీర్పు నేపథ్యంలో కన్నడనాట పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. హిజాబ్ దుమారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో.. హిజాబ్ ధరించిన ఆరుగురు విద్యార్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి హిజాబ్ వ్యవహారం మొదలైంది. ఈ విషయంలో విజ్ఞప్తులను సైతం కళాశాల ప్రిన్సిపాల్ రుద్రే గౌడ తోసిపుచ్చారు. అంతేకాదు.. తల మీద గుడ్డతో క్యాంపస్లోకి అనుమతించినా.. తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. దీంతో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్లతో విద్యాసంస్థల దగ్గర నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేశారు. ఆపై ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. హిజాబ్ అభ్యంతరాలు.. పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహించేదాకా చేరుకుంది. వాళ్లను అనుమతిస్తే.. మమ్మల్ని అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆపై హిజాబ్ అభ్యంతరాలు.. కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని చోట్లకు విస్తరించాయి. ఆపై ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇవ్వగా.. ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత వార్త: హిజాబ్పై కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఏమన్నారంటే.. -
హిజాబ్పై తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫాం మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించి శుక్రవారం పూర్తి చేసింది. తుది తీర్పును వాయిదా(రిజర్వ్) వేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. హిజాబ్ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి(సీడీసీ) ఎలాంటి అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను సీడీసీకి అప్పగించడం సబబు కాదని తెలిపారు. వందల ఏళ్లుగా హిజాబ్ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. -
రెండురోజులు జైళ్లోనే హీరో.. అనుచిత ట్వీట్ ఎఫెక్ట్
హిజాబ్ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. కన్నడనాట హిజాబ్ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ. సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని తెలిపింది. చేతన్ చేసిన ట్వీట్గా వైరల్ అవుతోంది ఇదే అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్ అరెస్ట్ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్ వ్యవహారం హిజాబ్ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అరెస్ట్ను.. హిజాబ్కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా. -
హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కిందకు రాదు: కర్ణాటక ప్రభుత్వం
సాక్షి, బెంగుళూరు: భారత్లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు. చదవండి: హిజాబ్ కాకున్నా చద్దర్తో అయినా కప్పుకోండి! దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు. ఫుల్ బెంచ్ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్ పిటిషన్దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరిమూకలు తన సోదరుడిపై దాడికి దిగారని, తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్ పరివార్ పనేనని ఆమె ఆరోపించారు. చదవండి: హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం -
హిజాబ్ వివాదం: ఎట్టకేలకు స్పందించిన అమిత్ షా
Amit Shah On Hijhab Row: హిజాబ్పై ప్రభుత్వ నిషేధాజ్ఞాలపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ‘హిజాబ్’ ఎఫెక్ట్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెదవి విప్పారు. సోమవారం ఓ ప్రముఖ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఎట్టకేలకు హిజాబ్ అంశంపై స్పందించారు. ‘నా వరకైతే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే.. యూనిఫామ్ ధరించి మాత్రమే స్కూల్కు వెళ్లడం మంచిది. ఒకవేళ కోర్టు గనుక తీర్పు వెలువరించాక నా ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయస్థానాల నిర్ణయాల్ని ఎవరైనా అంగీకరించాలి కాబట్టి. అంతిమంగా.. దేశం రాజ్యాంగం లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉండగా.. హిజాబ్ వ్యతిరేక ఆజ్ఞలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం వాదనల సందర్భంగా కోర్టులో గట్టిగా తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోపక్క బీజేపీ, అనుబంధ విభాగాలు కొన్ని ఈ వ్యవహారాన్ని దేశస్థాయిలోకి విస్తరిస్తున్నాయి. -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
హిజాబ్ వివాదం : హైకోర్టులో కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ప్రభులింగ్ నవాద్గీ వాదనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు విచారణలో భాగంగా ఏజీ.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని చెప్పారు. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేసిన కొంతమంది ముస్లిం బాలికల చేసిన ఆరోపణలను ఏజీ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారమే ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. వారు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ వివాదంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
మా మీద విద్వేషపూరిత వివక్ష
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు. ఈ పిటీషన్ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు. ఎక్కడా హిజాబ్ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హిజాబ్పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు. మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు. గాజులు మత చిహ్నాలు కాదా? సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు. -
హిజాబ్ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు
న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. తమ పిటిషన్పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు భారత్ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది. భారత్లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్తాన్కు పాకిన హిజాబ్ గొడవ కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్కు సైతం పాకింది. హిజాబ్ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు. కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. 16 దాకా వర్సిటీలకు సెలవులు హిజాబ్ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజెస్కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి చెప్పారు. -
హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది. ఇదే పిటిషన్పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. -
హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత స్పందన
-
సుప్రీంకోర్టుకు చేరుకున్న హిజాబ్ వివాదం
-
‘హిజాబ్’ రగడ.. స్కూళ్లు తెరవండి: హైకోర్టు
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. హిజాబ్ రగడపై దాఖలైన పిటిషన్ను సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది. గురువారం విచారించిన ధర్మాసనం.. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది. కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
‘హిజాబ్’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం
బెంగళూరు: హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీక్షిత్ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్ దేవదత్త కామత్ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్ను అనుమతించడమే అవుతుందని వాదించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్ సజన్ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. రాష్ట్రంలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం మెల్లమెల్లగా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇక హిజాబ్ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో మూడురోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు రెండో రోజు (బుధవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా హిజాబ్ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించి.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ పేర్కొన్నారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు.. సింగిల్ బెంచ్ తీర్పుతో తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బెంగళూరులో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేదా ఇటువంటి విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని తెలిపారు. చదవండి: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు గత నెల ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీ హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది. దీనికి పోటీగా పలువురు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో రెండు వర్గాలుగా విద్యార్థులు విడిపోయారు. శివమొగ్గలో పరిస్థితి అదుపుతప్పడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ
-
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ
-
"మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు
Match Fixing Not Punishable Says Karnataka High Court: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం శిక్షార్హం కూడా కాదని ఆదేశించింది. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంది. నిందితులపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని, ఐపీసీ ప్రకారం వీరికి చీటింగ్ కేసు వర్తించదని వివరించింది. ఓ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడితే.. క్రీడను అమితంగా అభిమానించే ప్రేక్షకులను మోసం చేశాడన్న భావన కలగడం సహజమని, అయితే దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను శిక్షించే హక్కు కోర్టుకు లేదని, ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునే అధికారం సంబంధిత క్రికెట్ బోర్డులకే ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, 2019 కేపీఎల్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ అధికారి సహా ఓ బుకీపై బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. వీరిలో సిఎం గౌతమ్ (ప్లేయర్, ఏ1), అబ్రార్ ఖాజీ (ప్లేయర్, ఏ2), అలీ అష్పక్ (బెల్గావి పాంథర్స్ యజమాని, ఏ3), అమిత్ మావి (బుకీ, ఏ4) ప్రధాన నిందితులుగా ఉన్నారు. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ -
కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని/ఆమె డిపెండెంట్కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, అతడు/ఆమెపై ఆ కుటుంబంలోని వారు ఏ మేరకు ఆధారపడ్డారు, వారు వృత్తి, వ్యాపారాల్లో కొనసాగుతున్నారా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. సర్వీస్ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరామితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబం ఏమేరకు ఆ మృత ఉద్యోగిపై ఆధారపడి ఉంది, వారు సాగిస్తున్న వివిధ వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు భీమేశ్ అనే వ్యక్తికి కారుణ్య కారణాలతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. భీమేశ్ సోదరి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉన్నందున తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్ వాదించగా అధికారులు తిరస్కరించారు. దీంతో, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా, ట్రిబ్యునల్ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో, ఆ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. -
రాసలీల సీడీ కేసు: చీఫ్ లేకుండానే విచారణా?!
సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీల సీడీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చట్టబద్ధమా అనే విషయంపై హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసులో బాధిత యువతి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడల ధర్మాసనం విచారించింది. సిట్ విచారణ కొనసాగింపుపై తాము పరిశీలన చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. సిట్ చీఫ్, అదనపు పోలీసు కమిషనర్ సౌమేందు ముఖర్జీ గత మే నెల 1 నుంచి సెలవులో ఉన్నారని, ఆయన గైర్హాజరీలో జరిగిన సిట్ విచారణ చట్టబద్ధమా కాదా అనే విషయం పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆయన లేకుండానే దర్యాప్తు కొనసాగిస్తారా, దీనిపై సమాధానం ఇవ్వాలని సిట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తుది నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. కోతుల బెడదపై హైకోర్టు ఆగ్రహం బనశంకరి: ఐటీ సిటీలో సుమారు లక్షకు పైగా కోతులు ఉన్నాయని అంచనా. ఇవి ఇళ్లు, అపార్టుమెంట్లలో దూరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలువురు హైకోర్టులో కేసులు వేయగా, కోర్టు కూడా బీబీఎంపీకి అక్షింతలు వేసింది. మంగళవారం మరో అర్జీని విచారించిన హైకోర్టు, బీబీఎంపీకి చీవాట్లు పెట్టి కోతుల గోలను అరికట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగర శివార్లలో కోతుల ఉద్యానాన్ని నిర్మించి మొత్తం వానరాలను పట్టి అక్కడకు తరలించాలని బీబీఎంపీ యోచిస్తోంది. -
అక్రమ సంతానం అంటూ ఏమీ ఉండదు: కర్ణాటక హైకోర్టు
బెంగళూరు: అనైతిక బంధంతో పిల్లలకు జన్మనిచ్చేవారు ఉంటారేమోగానీ, అక్రమ సంతానం మాత్రం ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తమ పుట్టుక ఎలా సంభవిస్తుందన్న విషయంతో పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లై కంపెనీ(బీఈఎస్సీఓఎమ్)లో ఉద్యోగం నిమిత్తం ఓ వ్యక్తి దాఖలు పిటిషన్పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. వివరాలు... బీఈఎస్సీఓఎమ్లో పనిచేసే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం మరణించారు. ఈ క్రమంలో 2014లో ఆయన కుమారుడు కె. సంతోష కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాల్సిందిగా సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, సంతోష తన తండ్రికి రెండో భార్య ద్వారా జన్మించిన సంతానం. అది కూడా మొదటి భార్య ఉండగానే, తన తల్లిని తండ్రి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తమ నిబంధనల ప్రకారం, సంతోష అర్జీని బీఈఎస్సీఓఎమ్ తిరస్కరించింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ సంతోష పిటిషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలో తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, హంచాటె సంజీవ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సంతోషకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా... ‘‘తల్లి, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో ఏ బిడ్డ జన్మించదు. అదే విధంగా పుట్టుకలో తన ప్రమేయం కూడా ఉండదు. కాబట్టి అనైతికంగా తల్లిదండ్రులుగా మారిన వారు ఉంటారేమో గానీ, అక్రమ సంతానం అనేది ఉండదు. ఈ కేసుకు సంబంధించి, వ్యక్తిగత చట్టాలను అనుసరించి.. అక్రమ సంతానం అనే పదం లేదు. అదే విధంగా.. హిందూ వివాహ చట్టం-1954 ప్రకారం చట్టబద్ధ, చట్టవిరుద్ధ పెళ్లిళ్ల ద్వారా జన్మించిన సంతానానికి సమాన హక్కులు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకం విషయమై పునరాలోచన చేయాలని ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. కారుణ్య నియామకాలకు.. ఒక ఉద్యోగి మొదటి పెళ్లి రద్దు కాకుండానే, రెండో భార్య లేదా రెండో వివాహం ద్వారా జన్మించిన సంతానం అర్హులు కాలేరంటూ బీఈఎస్సీఓఎమ్ 2011, సెప్టెంబరు 23న జారీ చేసిన సర్కులర్ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
టెన్త్ పరీక్షలకు హైకోర్టు ఓకే
బనశంకరి/బెంగళూరు: రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల నిర్వహణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షల్ని రద్దు చేయాలని సింగ్రిగౌడ అనే వ్యక్తి వేసిన అర్జీని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, సంజీవ్కుమార్ల బెంచ్ కొట్టివేసింది. అందరినీ పాస్ చేయడం, మార్కుల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని హైకోర్టుకు ఏజీ ప్రభులింగ వివరించారు. కోవిడ్ వైరస్ తగ్గడంతో పరీక్షలు నిర్వహించవచ్చని, వారి ఉత్తమ భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అదే విధంగా... ఒకవేళ ఈ ఏడాది రాయకపోతే వచ్చే ఏడాది రాయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.48 శాతంగా ఉన్నందున కోవిడ్ నియమాలను పాటిస్తూ పరీక్షల్ని నిర్వహించాలన్నారు. కానీ బలవంతంగా విద్యార్థుల చేత పరీక్షలు రాయించరాదని తెలిపారు. కాగా, ఈ నెల 19 నుంచి 22 వరకు రెండు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. -
అరెస్ట్ చేయనంటేనే పోలీసుల ఎదుటకు వస్తాను: ట్విట్టర్ ఎండీ
బెంగళూరు: తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే.. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుటకు వస్తానని సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఘజియాబాద్లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో మనిష్ మహేశ్వర్పై యూపీ ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనిష్ మహేశ్వర్ ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మనిష్ మహేశ్వర్ ‘‘వారు(యూపీ పోలీసులు) నాపై చేయి వేయబోమని కోర్టుకు అండర్టేకింగ్ ఇస్తే.. నేను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఇక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. -
నిష్పక్షపాతంగా విచారించండి
సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ట్విట్టర్ ఎండీకి ఊరట
బెంగళూరు/ఘజియాబాద్: వృద్ధ ముస్లింపై దాడి వీడియో ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయిన కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఘజియాబాద్ పోలీసులకు హైకోర్టు సూచించింది. ఆయనను వర్చువల్ విధానంలో విచారించవచ్చని జస్టిస్ జి. నరేందర్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణ అవసరమనుకుంటే జూన్ 29న విచారిస్తామని కోర్టు పేర్కొంది. ఆ వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్కు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు ఇటీవల నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. ప్రతిగా మరో నోటీస్ ఇస్తూ 24 గంటల్లోపు స్వయంగా తమ ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మనీశ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మనీశ్ తరఫు లాయర్ నగేశ్ వాదించారు. చదవండి: అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు -
రాసలీలల కేసు: యువతి తండ్రి పిటిషన్ కొట్టివేత
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి సీడీ కేసులో బాధిత యువతి తండ్రి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తన కూతురు సీఆర్పీసీ 164 కింద కోర్టులో జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం చట్టవ్యతిరేకమని, దీనిని రద్దుచేయాలని యువతి తండ్రి కోరారు. అయితే అర్జీలో బలం లేదని న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తన కూతురును ఎవరో తెరవెనుక నుంచి ఆడిస్తున్నారని తండ్రి ఆరోపించడం తెలిసిందే. కాగా, సీడీ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేయాలని, సిట్ నియామకమే అక్రమమని జార్కిహొళి తరఫు న్యాయవాది మంగళవారం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగనుంది. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
రాసలీలల కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: మాజీమంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించే అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు న్యాయవాదులు వేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్.ఓకా నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ల వాదనల్ని ఆలకించిన న్యాయపీఠం, సిట్ చీఫ్ సౌమేందు ముఖర్జీ అందించిన విచారణ నివేదికను పరిశీలించింది. ఈ సందర్భంగా, ఈ కేసులో నమోదైన మూడు ఎఫ్ఐఆర్లనూ తనిఖీ చేసి కేసు సీబీఐకి అప్పగించాల్సిన పని లేదని పేర్కొంటూ, తదుపరి విచారణను మే 31 కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్ అవుతోందని, టీవీ చానెళ్లలో విచారణ మాదిరిగా చర్చాగోష్టులు నడుస్తున్నాయని అర్జీదారులు వాదించారు. మీడియాను కట్టడిచేయాలని కోరారు. ఈ వాదనల్ని తిరస్కరించిన న్యాయపీఠం ఏ ఆధారంతో ప్రభుత్వం మీడియాను కట్టడి చేయాలని ప్రశ్నించింది. చదవండి: రాసలీలల కేసు: అందుకే అలా చెప్పాను! -
జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల కేసులో బాధిత యువతి సస్పెన్స్ను కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరులో కోర్టులో లొంగిపోతుందని ఆమె న్యాయవాది జగదీశ్ ఆదివారం చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తేలింది. రమేశ్ జార్కిహొళిపై పలు ఆరోపణలను చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. లేఖలో ఏమి ఉందంటే? ‘‘రమేశ్ జార్కిహొళి ప్రమాదకర వ్యక్తి. సామాన్యులను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ అవసరం. సిట్తో దర్యాప్తు చేయించాలి. జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు (హైకోర్టు సీజే) న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. జార్కిహొళి ఏ సమయంలో అయినా నన్ను చంపేస్తాడు’’అని లేఖలో యువతి ఆరోపించింది. సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. జార్కిహోళి ఓ క్రిమినల్. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జార్కిహొళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు’అని ఆరోపణలు చేసింది. మరోవైపు ఆమె హైకోర్టులో హాజరు కావడానికి అనుమతి వచ్చిందని న్యాయవాది జగదీశ్ తెలిపారు. చదవండి: (రాసలీల కేసు: అజ్ఞాతం వీడనున్న యువతి?) సిట్ ముందుకు జార్కిహొళి రమేశ్ జార్కిహొళి సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావడం ఇది మూడోసారి. ఆ యువతితో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు తెలిసింది. సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. తన తరఫు న్యాయవాదులతో కలిసిన అనంతరం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఇందుకోసం నాలుగు రోజుల సమయం అవసరమని రమేశ్ జార్కిహొళి కోరారు. యువతికి సిట్ తాజా నోటీసులు సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్పార్కు పోలీసుల ఎదుటహాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆ యువతికి పోలీసులు ఇప్పటివరకు ఆమెకు 8 సార్లు నోటీసులు పంపించినా ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. మా కూతురితో కొందరి రాజకీయం తమ కూతురు ఒత్తిడిలో ఉందని, ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోరాదని యువతి తల్లిదండ్రులు అన్నారు. ఆమెకు మానసిక కౌన్సిలింగ్ అవసరమని అన్నారు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలియదని, ఆమెను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేపీసీసీ నేత డీకే.శివకుమార్ చెప్పినట్లు నడుచుకుంటోందని యువతి సోదరుడు ఆరోపించారు. సీడీతో సంబంధం లేదు: డీకే బనశంకరి: సీడీ ఘటన తన కుట్రేనని సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అందించాలని యువతి తల్లిదండ్రులపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ సవాల్చేశారు. సోమవారం రాయచూరు ముదగల్లో డీకేశి మాట్లాడుతూ తనకు సీడీలోని అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ అమ్మాయి వెనుక డీకే ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఒత్తిడిలో వారు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అన్నారు. -
‘ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు’
శివాజీనగర: స్మార్ట్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ లేదనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలు ప్రజలకు సేవలను నిరాకరించటానికి లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వైరస్ బాధితులపై నిఘా పెట్టే ఆరోగ్య సేతు మొబైల్ యాప్ను ప్రజలు స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఉండాలని రైల్వే, మెట్రోరైల్, ఆర్టీసీ వంటి పలు ప్రభుత్వ సంస్థలు షరతును విధించాయి. అరవింద్ అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ ఆరోగ్యసేతు తప్పనిసరి కాదని పేర్కొంటూ, కేంద్రానికి అభ్యంతరాల దాఖలుకు అవకాశమిస్తూ విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్ -
శిక్ష పడిన వ్యక్తి నటించకూడదని చట్టంలో లేదు
యశవంతపుర : కేజీఎఫ్–2 సినిమా షూటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించటాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేజీఎఫ్–2లో నటిస్తున్న సంజయ్దత్పై టాడా చట్టం కింద కేసు నమోదై శిక్ష పడింది. ఒక నిందితుడు నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని హుబ్లీకి చెందిన శివశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఓరా విచారించారు. వాదనలు విన్న న్యాయమూర్తి శిక్ష పడిన వ్యక్తి సినిమాలలో నటించకూడదని చట్టంలో లేదని, ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని భావిస్తూ కేసును కొట్టివేశారు. -
‘అత్యాచారం జరిగాక నిద్రపోవడం ఏంటి?’
బెంగళూరు: కర్ణాటక హై కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ‘అత్యాచారం జరిగిన తర్వాత ఓ భారతీయ మహిళ నిద్రపోవడం అనేది అసాధరణమైన విషయం’ అని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు రాకేశ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బార్ అండ్ బెంచ్లోని నివేదిక ప్రకారం.. జస్టిస్ కృష్ణ తీర్పు వెల్లడిస్తూ.. ‘ఈ దారుణం జరిగిన తరువాత అలసిపోయి నిద్రపోయానని సదరు యువతి వివరణ ఇచ్చింది. తన జీవితం నాశనం అయ్యిందని తెలిసిన తర్వాత ఓ మహిళ స్పందన ఇలా ఉండదు. మరి ముఖ్యంగా భారతీయ మహిళలు ఎవరు ఇలా స్పందించరు’ అని పేర్కొన్నారు. అంతేకాక బెయిల్ మంజూరు చేయడానికి మరొక కారణం ఏమిటంటే, బాధితురాలు రాత్రి 11 గంటలకు నిందితుడి కార్యాలయానికి ఎందుకు వెళ్లిందో వివరించడంలో విఫలమయ్యిందని తెలిపారు. అంతేకాక నేరం జరిగినట్లు ఆరోపించిన నాటి రాత్రి ఆమె నిందితుడితో కలిసి మద్యం తాగడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అని జస్టిస్ కృష్ణ పేర్కొన్నారు. (‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది) ఇదిలావుండగా, బెయిల్ మంజూరు చేస్తూ నిందితుడు రాకేష్కు కోర్టు అనేక షరతులు విదించింది. నిందితుడు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లకూడదని తెలిపింది. ప్రతి నెల ప్రతి రెండవ, నాల్గవ శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలు గత రెండేళ్లుగా నిందితుడి వద్ద పని చేస్తుంది. అయితే వివాహం చేసుకుంటానని చెప్పి రాకేష్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది. -
సీసీఐ విచారణ ఆదేశాలు కొట్టివేయండి
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) చేసిన ఆరోపణలే ప్రాతిపదికగా, ఎలాంటి ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే సీసీఐ తమపై దర్యాప్తుకు ఆదేశించిందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు .. భారీ డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ ఒప్పందాలతో పోటీని దెబ్బతీస్తున్నాయని సీఏఐటీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి సీసీఐ విచారణకు ఆదేశించింది. అయితే, దీనిపై స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. తాజాగా దర్యాప్తు ఆదేశాలను పూర్తిగా తోసిపుచ్చాలంటూ ఫ్లిప్కార్ట్ న్యాయస్థానాన్ని కోరింది. -
సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్కార్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పై మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. సీసీఐ దర్యాప్తు ఉత్వర్వులపై ఇటీవల హైకోర్టు నిలుపుదల ఇచ్చిన నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ మరో రిట్పిటీషన్ దాఖల చేసింది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చాలా మూర్ఖమైన, ఏ మాత్రం బుర్ర వాడకుండ సీసీఐ ఇచ్చిన ఆదేశాలంటూ ఫ్లిప్కార్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ పిటిషన్లపై వాదలను కర్నాటక హైకోర్టు సంయుక్తంగా వింటుందా, లేక విడివిడిగా వింటుందా అనేది చూడాలి. దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, యాంటీ ట్రస్టు ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను పక్కన పెట్టాలంటూ ఫిబ్రవరి 18న పిటిషన్ వేసింది. 'ప్రైమా ఫేసీ' అంటే ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులు పోటీదారులకు హాని కలిగిస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే సీసీఐ ప్రాధమిక దర్యాప్తునకు ఆదేశించిందని ఫ్లిప్కార్ట్ వాదించింది. ఇ-కామర్స్ మేజర్లు భారీ డిస్కౌంట్లతో తమకు నష్టం కలిగిస్తున్నారన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) ఆరోపణలపై సంస్థ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత వుందని వాదించింది. అయితే పనికిమాలిన, నిరాధారమైన ఆరోపణలపై స్పందించడంలో సీసీఐ విఫలమైందని ఆరోపించింది. తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలగనుందని ఫ్లిప్కార్ట్ వాదించింది. అంతేకాదు తమ విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు, చట్టపరమైన ఖర్చులు తప్పవని పేర్కొంది. కాగా పోటీ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్ సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిబ్రవరి 10 న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఫిబ్రవరి 14న హైకోర్టు స్టే విధించింది. దీనిపై తమ స్పందనను ఎనిమిది వారాల్లోపల దాఖలు చేయాలని ఫ్లిప్కార్ట్ సహా సీసీఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ను కోరింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తును మొదట పూర్తి చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు గత సంవత్సరం, విదేశీ మారకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండింటిపై ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్ ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై సీసీఐ దర్యాప్తు -
ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్కు కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. యాంటీ ట్రస్ట్ విచారణపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు, అమెజాన్, ఇతర ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలపై దర్యాప్తును శుక్రవారం కోర్టు నిలిపివేసింది. రాయిటర్స్ కథనం ప్రకారం సీసీఐ దర్యాప్తును రెండు నెలల పాటు వాయిదావేసినట్టుగా న్యాయవాదులు వెల్లడించారు. దీంతో దేశంలోని ఈ కామర్స్ సంస్థలకు భారీ ఉపశమం లభించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై దేశీయ చిన్న వ్యాపార సంస్థలు ఎలా స్పందించనున్నాయో చూడాలి. చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్ భారత్కు ఉపకారమేమీ చేయడం లేదు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై సీసీఐ దర్యాప్తు -
నిత్యానందకు నోటీసులపై వింత జవాబు
బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్పోల్ నోటీస్) ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద) ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ నిత్యానంద కథేంటి? -
టోల్ ఫీజు వసూలు నిలిపివేత
దొడ్డబళ్లాపురం : యలహంక–హిందూపురం రహదారి మార్గంలో టోల్ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దొడ్డబళ్లాపురానికి చెందిన లాయర్ వెంకటేశ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిశీలించిన జడ్జీలు రవి మళిమఠ, ఎం నాగప్రసన్న ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. యలహంక–హిందూపురం రాష్ట్ర రహదారి మార్గంలో మారసంద్ర, గుంజూరు వద్ద ఉన్న రెండు టోల్గేట్ల వద్ద రోడ్లు పూర్తిగా అభివృద్ధిపరచకుండా టోల్ వసూలు చేస్తున్నారని లాయర్ వెంకటేశ్ ఆరోపిస్తూ పిల్ వేశారు. పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, జరిగాయి అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక ఇంజినీర్ని నియమించాలని కోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించగా, పనులను పరిశీలించిన ఇంజినీర్ 75 శాతం పనులు జరిగాయని నివేదిక ఇచ్చారు. అయితే లాయర్ వెంకటేశ్ ఇది తప్పుల నివేదిక అని వాదించారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపడంతో కోర్టు టోల్ ఫీజు వసూలుకు బ్రేక్ వేసింది. దీంతో తక్షణం యలహంక–హిందూపురం రహదారి మార్గంలోని రెండు టోల్గేట్లలో ఫీజులు వసూలు చేయడం నిలిపివేసి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. -
ఇల్లు ఖాళీ చేయండి : నటుడు తల్లికి హైకోర్టు సూచన
సాక్షి బెంగళూరు: డిసెంబర్లోగా ఇంటి అద్దె చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని రాకింగ్ స్టార్ యశ్ తల్లి పుష్పకు హైకోర్టు బుధవారం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాలు..2010, అక్టోబర్ 16 నుంచి కత్రిగుప్పేలోని తమ ఇంటిలో పుష్ప నివాసం ఉంటూ అద్దె చెల్లించడం లేదని, అద్దె కోసం వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇంటి యజమాని మునిప్రసాద్ గిరినగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు... మూడు నెలల్లో ఇంటి అద్దె రూ. 9.60 లక్షలను చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ యశ్ తల్లి పుష్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బోపణ్ణ, జస్టిస్ శ్రీనివాస్ హరీశ్ కుమార్ల ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. అద్దె మొత్తం రూ. 23.27 లక్షలను తక్షణమే చెల్లిస్తే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉండొచ్చని, లేదంటే డిసెంబర్లోగా అద్దె మొత్తం చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని పుష్పకు హైకోర్టు ఆదేశించింది. -
మాల్యా లగ్జరీ జెట్ ఎట్టకేలకు అమ్ముడుపోయింది
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్మాల్యాకు చెందిన లగ్జరీ జెట్కు కొనుగోలుదారుడు దొరికాడు. ఎట్టకేలకు ఈ జెట్ అమ్ముడుపోయింది. మూడు వేలం పాటలో కొనేవారే కరువైన ఈ జెట్కు, తాజాగా జరిగిన వేలంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్, ఎల్ఎల్సీ ఈ జెట్ వేలంలో అత్యధిక బిడ్ వేసి మాల్యా లగ్జరీ జెట్ను దక్కించుకుంది. బిడ్ ధర రూ.34.8 కోట్లుగా(5.05 మిలియన్ డాలర్లుగా) ఉంది. ఈ బిడ్ను బాంబే హైకోర్టు ఆమోదించింది. సేవా పన్ను విభాగం నిర్వహించిన ముందస్తు ఈ-వేలాల కంటే ఇది అత్యధిక బిడ్ అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీని బిడ్ తొలుత 1.9 మిలియన్ డాలర్లకు ప్రారంభమైంది. మాల్యా జెట్ పేరు ఎయిర్బస్ ఏ319-133సీ వీటీ-వీజేఎం ఎంఎస్ఎం 2650. కర్ణాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ అయిన సేవా పన్ను విభాగం ఈ వేలం నిర్వహించింది. ఈ వేలంతో మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, సేవా పన్ను విభాగానికి రుణపడిన బకాయిలను, జరిమానాలను రికవరీ చేసుకునేందుకు వీలవుతుంది. ఈ జెట్లో 25 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణించే వీలుంటుంది. ఈ జెట్లోనే బెడ్రూం, బాత్రూం, బార్, కాన్ఫరెన్స్ ప్రాంతం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ జెట్ను సేవా పన్ను విభాగం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ముంబైలో పార్క్చేసి ఉంచింది. దీన్ని ఎయిర్పోర్టు నుంచి తొలగించాలని ఫిర్యాదులు కూడా బాంబే హైకోర్టులో దాఖలయ్యాయి. ఎయిర్పోర్టులో ఈ జెట్ను ఉంచడానికి స్థలం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సేవా పన్ను విభాగం తెలిపింది. పార్క్ అయిన జెట్ వల్ల గంటకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు కోల్పోతున్నామని పేర్కొంది. కర్నాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ దీన్ని విక్రయించాలని ఏప్రిల్లోనే బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఎయిర్లైన్ బెంగళూరుకు చెందినది. -
గౌరీ లంకేశ్ హత్య కేసు: హైకోర్టు సీరియస్
సాక్షి, బెంగళూరు: సంచలన సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులను పోలీసులు హింసిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా దిగువ న్యాయస్థానాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. ‘ఈ ఆరోపణలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 10 రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలి’ అని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లు(ఏసీఎంఎం) ఇద్దరికీ.. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులలో ఒకడైన అమోల్ కాలే.. కస్టడీలో ఉండగా తనను పోలీసులు హింసించారని, మెజిస్ట్రేట్లు కూడా తన మొరను పట్టించుకోలేదని ఓ అఫిడవిట్ దాఖలు చేయించాడు. ‘నా క్లయింట్ని పోలీసులు విచక్షణ రహితంగా హింసించారు. మే 31వ తేదీన ఈ విషయాన్ని థర్డ్ ఏసీఎంఎంకు విన్నవించాం. కానీ, ఆయన పట్టించుకోలేదు. తిరిగి జూన్ 14వ తేదీన ఫస్ట్ ఏసీఎంఎంకు విన్నవించాం. ఆయన వైద్యపరీక్షలకు అనుమతించకుండా నివేదిక రూపొందించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఉల్లంఘించటమే’ అని నిందితుడి తరపు న్యాయవాది అఫిడవిట్లో పేర్కొన్నారు. ‘పైగా కోర్టు ఆదేశాల ప్రకారం రహస్యంగా కాకుండా నిందితుల నుంచి బహిరంగంగా విచారణ చేపట్టి స్టేట్మెంట్లు నమోదు చేశారు. నష్టపరిహారంగా బాధితులకు రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశాలిప్పించండి’ అని న్యాయవాది విన్నవించాడు. వాదనలు విన్న న్యాయస్థానం మెజిస్ట్రేట్ల నుంచి వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. (ఏ కుక్క చచ్చిపోయినా.. ఆయనే బాధ్యుడా?) మరోవైపు నిందితులను హింసించారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక డీజీపీతోపాటు అధికారులకు హైకోర్టు జూన్12న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5, 2017న గౌరీలంకేశ్ హత్యకు గురికాగా, సిట్ దర్యాప్తు ఆధారంగా నిందితులు అమోల్ కాలే, సుజిత్ కుమార్, మనోహర్ ఎడవే, అమిత్ రామచంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ అమ్మ’ -
పబ్ల మూసివేతకు ఆదేశాలు..
సాక్షి, బెంగళూర్ : లైసెన్స్ లేకుండా మ్యూజిక్ ప్లే చేస్తున్న 27 పబ్లపై బెంగళూర్ పోలీసులు కొరడా ఝళిపించారు. పబ్లు, రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ ప్రదర్శించాలంటే అనుమతి తప్పనిసరి అని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో 27 పబ్లను మూసివేయాల్సిందిగా బెంగళూర్ పోలీసులు ఆదేశించారు. అయితే లైవ్ మ్యూజిక్ లేకుండా కార్యకలాపాలు సాగించేందుకు ఈ పబ్లను అనుమతించారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు పబ్ యాజమాన్యాలు లైసెన్సు కోసం దరఖాస్తు చేయకపోవడంతో వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సెక్షన్ 294 కింద వీటిని మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయగా, మరికొన్ని పబ్లకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదేతరహాలో గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్లను తమ ప్రాంగణాల్లో రికార్డింగ్ డ్యాన్స్లు, మ్యూజిక్ కాన్సర్ట్లు నిర్వహించడంపై హెచ్చరికలు జారీ చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్ యాజమాన్యాలను హెచ్చరించింది. -
నిత్యానందకు సుప్రీంలో చుక్కెదురు..
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2010లో నిత్యానందపై అత్యాచార కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలనే ఆయన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. తనపై గల నేరాఆరోపణలపై పునర్విచారణ చేపట్టాల్సిందిగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాల్సిందిగా నిత్యానంద కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కాగా కర్ణాటక హైకోర్టు ఆయన పిటిషన్ను మే 16న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సోమవారం సుప్రీంను ఆశ్రయించారు. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో 2010 ఏప్రిల్లో అరెస్ట్ అయిన నిత్యానందకు, బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. -
సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: ఒక న్యాయమూర్తిని పదోన్నతిపై కర్ణాటక హైకోర్టుకు పంపే ముందు ఆయనపై ఓ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును సుప్రీంకోర్టు కొలీజియం పట్టించుకోలేదని న్యాయశాఖ సీనియర్ అధికారులు తెలిపారు. న్యాయవ్యవస్థలో నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న జస్టిస్ చలమేశ్వర్ ఆరోపణలను వారు ఖండించారు. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కృష్ణ భట్కు పదోన్నతి ఇవ్వాలన్న కొలీజియం సిఫారసుపై ప్రభుత్వం తొందరపడలేదని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు పట్టించుకోలేదనే కారణంతోనే కొలీజియం ప్రతిపాదనలను న్యాయశాఖ రెండుసార్లు వెనక్కి పంపిందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఆ అధికారులు వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి భవన్కు బాధితురాలు ఫిర్యాదు చేయటంతో పదోన్నతి ప్రతిపాదనను రెండోసారి కొలీజియంకు పంపారని తెలిపారు. నిర్దేశిత విధివిధానాల మేరకు..ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్కు మాత్రమే న్యాయశాఖ లేఖ రాసిందనీ, అంతేకానీ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాదన్నారు. అలాంటి అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా కొలీజియం లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కనపెట్టిందని తెలిపారు. -
సన్నీకి మద్దతుగా హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : సన్నీ నైట్ షోపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. పోలీసులు అనుమతి నిరాకరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీ షోను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బెంగళూర్ పోలీసులను ప్రశ్నించింది. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించటంతో షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 రోజుల తర్వాత నిరాకరిస్తున్నట్లు చెప్పటం, అది కూడా భద్రతా కారణం అని చెప్పటం సహేతుకంగా లేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కొత్త సంవత్సరం వేడుకల విషయంలో మిగతా క్లబ్ ఈవెంట్లపై లేని అభ్యంతరాలు కేవలం సన్నీలియోన్ షోపై మాత్రమే ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఈ విషయంలో సన్నీ లియోన్ నుంచి స్పష్టమైన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని.. డిసెంబర్ 31న నగరంలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారో జాబితా ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి బీ వీరప్ప ఆదేశించారు. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం షో నిర్వాహకుడు, ది టైమ్స్ క్రియేషన్స్ యజమాని భవ్య హెచ్ఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ ఏర్పాట్ల కోసం సుమారు 2.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న సమయంలో నాలుగైదు రోజుల్లో అనుమతులు ఇస్తామని పోలీస్ శాఖ చెప్పిందని.. ఇప్పుడు అభ్యంతరాల నేపథ్యంలో షో రద్దైతే తనకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. కాగా, కర్ణాటక రక్షణ వేదిక యువ సేనే అభ్యంతరాల నేపథ్యం, సామూహిక ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులు అనుమతులకు వెనకడుగు వేస్తుండగా.. సన్నీ లియోన్ కూడా స్వచ్ఛందంగా షోకు రావట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. -
యడ్యూరప్పకు భారీ ఊరట
సాక్షి, బెంగళూరు: శివరామ్ కారత్ లేఔట్ భూముల డీనోటిఫికేషన్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పకు భారీ ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శివరామ్ కారత్ లేఔట్ కోసం స్వాధీనం చేసుకున్న భూములను అక్రమంగా డీ–నోటిఫై చేశారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు యడ్యూరప్పపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాల్సిందిగా కోరుతూ యడ్యూరప్ప హైకోర్టులో మధ్యంతర అర్జీని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్పపై నమోదైన కేసు కేవలం రాజకీయ ప్రేరితమని యడ్యూరప్ప తరఫు న్యాయవాది సి.వి.నాగేశ్ న్యాయస్థానం ఎదుట తన వాదనలను వినిపించారు. అంతేకాక ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానానికి తెలియజేశారు. ఏసీబీ, యడ్యూరప్ప తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి అరవింద కుమార్, అర్జీదారులైన యడ్యూరప్ప కోరిన విధంగానే ఎఫ్ఐఆర్ పై మధ్యంతర స్టే జారీ చేశారు. గురువారం నుండే తీర్పు రాసే ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ ప్రక్రియను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేసిన న్యాయమూర్తి అరవింద్ కుమార్, తన తీర్పును ప్రకటించారు. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడంలో ఏసీబీ ఆలస్యం చేసింది. అంతేకాదు ఎఫ్ఐఆర్ ప్రకారం విచారణ చేపట్టడంలో కూడా తారతమ్యాలు కనిపిస్తున్నాయి. ఫిర్యాదుల ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందువల్ల సహజంగానే ఏసీబీ అధికారులపై సంశయం కలుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాలేవీ కూడా న్యాయస్థానానికి కనిపించడం లేదు. అందువల్ల ఈ కేసులో ఎఫ్ఐఆర్పై మధ్యంతర స్టేను జారీ చేస్తోంది’ అని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. సత్యానికి లభించిన విజయం..... కాగా, శివరామ్ కారత్ లేఔట్ భూముల డీ–నోటిఫికేషన్కు సంబంధించి హైకోర్టు యడ్యూరప్పపై ఇచ్చిన స్టే సత్యానికి లభించిన విజయమని బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం శుక్రవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అందరు సీఎంలు భూముల డీనోటిఫికేషన్ చేస్తుంటారు. కానీ, యడ్యూరప్పపై మాత్రం రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారు. ఆయనపై వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని విమర్శించారు. యడ్డీకి నోటీసులు కాగా యడ్యూరప్పకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప పీఏ వినయ్ను యడ్యూరప్ప పీఏ సంతోష్ కిడ్నాప్ చేసి భౌతిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయమై ఈనెల 28న విచారణకు హాజరు కావాలని కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీపీ బడిగేర్ ఈ నోటీసులను జారీ చేశారు. -
సైనైడ్ మల్లిక ఉరి శిక్ష రద్దు
సాక్షి, బెంగళూరు: పలు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సైనైడ్ మల్లికకు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు రవి మళిమఠ్, జాన్ మైకేల్ డి.కున్హాలతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం దొడ్డబళ్లాపురలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి అనే మహిళను హత్య చేసి నగలు, నగదు దోచుకున్న కేసులో సైనేడ్ మల్లిక నిందితురాలు. బెంగళూరు గ్రామీణ కోర్టు మల్లికను దోషిగా తేల్చి ఆమెకు ఉరి శిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సైనైడ్ మల్లికకు ఉరి శిక్షను ఖరారు చేయాల్సిందిగా రిజిస్టార్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. పరిశీలించిన హైకోర్టు ఉరిశిక్షను రద్దు చేయడంతో పాటు ఈ కేసును పునర్విచారించాలని బెంగళూరు గ్రామీణ కోర్టును హైకోర్టు పీఠం సూచించింది. ఆరుగురిని ఆమె హతమార్చినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్లిక ప్రస్తుతం పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. అన్నాడీఎంకే నాయకురాలు శశికళ పక్క సెల్లోనే ఆమె ఉంటున్నారు. -
శశికళపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, బెంగళూరు: అన్నా డీఎంకే నాయకురాలు శశికళ నటరాజన్పై దాఖలైన పిటీషన్ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. శశికళను బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తుమకూరులోని కేంద్ర కారాగారానికి తరలించాలని ట్రాఫిక్ రామస్వామి అనే చెన్నై సామాజిక కార్యకర్త పిటీషన్ దాఖలు చేశారు. అయితే అది తమ పరిధిలోకి రాదని కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్లు ఫిబ్రవరి 15 నుంచి స్థానిక పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది తమిళనాడుకు చెందిన మంత్రులు, వారి అనుచరులు తరచుగా శశికళను కలుస్తున్నారని ట్రాఫిక్ రామస్వామి అనే చెన్నై సామాజిక కార్యకర్త కర్ణాటక హైకోర్టు దృష్టికి ఇటీవల తీసుకువచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల శశికళను తుమకూరు కేంద్ర కారాగానికి తరలించి తమిళనాడు నాయకులు ఆమెతో భేటీ కాకుండా ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే ముఖర్జీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారిస్తూ ఈ విషయం తమ పరిధిలోకి రాదని కేసును కొట్టివేసింది. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది అరవింద్ తెలిపారు. -
కోర్టుకెక్కిన 200 మంది జవాన్లు
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు ఇవ్వట్లేదని, పని చేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నాయని అంటూ తమకు న్యాయం చేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విమానాశ్రయాలతో పాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాయి. గత మూడేళ్లలో 344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పనిచేసే పరిస్థితులు దుర్భరంగా ఉండటం, తీవ్రమవుతున్న ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో వీళ్లు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. -
గాలి జనార్దనరెడ్డికి ఊరట
రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్ చెల్లదు: కర్ణాటక హైకోర్టు సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి రాష్ట్ర హైకోర్టులో సోమవారం భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్లో ఉన్న దాదాపు రూ.884 కోట్ల ఆస్తులు తిరిగి ఆయనకు చేరనున్నాయి. బళ్లారి జిల్లాలో ఇనుప గనుల తవ్వకాలతో అక్రమ మార్గంలో ఆస్తులు సంపాదించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి ఈడీ గతంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.884 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ గాలి జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. -
నా భర్త చనిపోయాడని చెప్పండి
అప్పుడే నా జీవితానికి ఆసరా హైకోర్టులో ఉపాధ్యాయుడి భార్య పిటిషన్ సాక్షి, బెంగళూరు: ఏ భారతీయ మహిళ అయినా తన భర్త చిరాయువుగా ఉండాలని, తాను సుమంగళిగా కన్నుమూయాలని తపిస్తుంది. కానీ విధి ఆమెకు భిన్నంగా రాసింది. భర్త మరణించాడని ప్రకటిస్తే తప్ప ఆమె జీవితం చక్కబడదు. అందుకే ఆ విధంగా గొంతెత్తక తప్పలేదు. ఏడేళ్ల నుంచి చేస్తున్న పోరాటం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కింది. తన భర్త చనిపోయారని ప్రకటించాల్సిందిగా ఓ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు ఈ విషయమై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోర్టుకు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. రామనగర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివకుమారస్వామితో స్థానికంగా నివాసముంటున్న సుమంగళకు 2006లో వివాహమైంది. ఈ క్రమంలో 2010 జనవరి 8న పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన శివకుమార్ కనిపించకుండా పోయారు. ఒకటి రెండు రోజులు బంధువులు, స్నేహితులను విచారించిన సుమంగళ తర్వాత స్థానిక ఐజూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత విద్యాశాఖ శివకుమార్ గైర్హాజరినీ పేర్కొంటూ జీతాన్ని ఆపివేసింది. ఫలించని ప్రయత్నాలు అప్పటి నుంచి సుమంగళి కష్టాలు రెట్టింపయ్యాయి. కుటుంబం గడవడం కోసం బంధువులు సాయపడుతూ వచ్చారు. ఎన్నిసార్లు విద్యాశాఖ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 2014లో ఈ విషయాలన్నీ వివరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో కేసును విచారించిన హైకోర్టు త్వరగా శివకుమార్ జాడ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించినా ఉపయోగం లేదు. దీంతో ఆమె హైకోర్టు తలుపుతట్టారు. తన భర్త చనిపోయాడని ప్రకటించాలని, తద్వారా విద్యాశాఖలో తనకు ఉద్యోగం లభిస్తుందని అందులో పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది ప్రతిమా హొన్నాపుర మాట్లాడుతూ... ‘ఒక వ్యక్తి కనిపించకుండా పోయి ఏడేళ్లు దాటితే మరణించారని భావించవచ్చు. కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు. -
భాస్కర్రావుకు హైకోర్టులో చుక్కెదురు
= చార్జ్షీట్ రద్దును తిరస్కరించిన హైకోర్టు సాక్షి, బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ లోకాయుక్త భాస్కర్రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన చార్జ్షీట్ను రద్దు చేయాల్సిందిగా భాస్కర్ రావ్ వేసిన అర్జీని హైకోర్టు ఏకసభ్య పీఠం తిరస్కరించింది. దీంతో భాస్కర్ రావు న్యాయపరంగా మరిన్ని చిక్కులు ఎదుర్కొనున్నారు వివరాల్లోకి వెళ్తే... భాస్కర్ రావ్ లోకాయుక్త న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు అశ్విన్ రావు రాష్ట్రంలోని వివిధ అధికారులను బెదిరించి భారీగా ముడుపులు తీసుకున్నారని, దీనికి తండ్రి భాస్కర్ రావు కూడా సహకరించాడని ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణ చేసిన సిట్ బృందం భాస్కర్రావును ఏడో నిందితుడిగా చేరుస్తూ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం భాస్కర్రావుకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ చార్జ్షీట్ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ భాస్కర్రావు హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ అర్జీపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి నేతృత్వంలోని ఏకసభ్య పీఠం ఈ అర్జీని తి రస్కరించింది. ఈ అర్జీపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి మంగళవా రం తన తీర్పును ప్రకటించారు. భాస్కర్ రావును విచారణ చేసేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. -
గతవారం బిజినెస్
కింగ్ఫిషర్ మూసివేతకు ఆదేశం ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు విజయ్మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ యన నియంత్రణలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స లిమిటెడ్ అధికారిక మూసివేతకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్కు చెందిన ఎయిర్లైన్ కంపెనీ ఎయిరోట్రన్కు రూ.35 కోట్ల బకాయిల చెల్లింపు వైఫల్యం కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ కింగ్ఫిషర్ సంస్థకు ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలను సరఫరా చేసింది. ఫారెక్స్ నిల్వలు డౌన్ దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడతాయని వివరించారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. త్వరలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వాయిదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్క్లూజన్, ఈపేమెంట్స్, ఈఅగ్రికల్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని అప్లికేషన్సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రాధాన్యమిస్తాం’ అని బిల్గేట్స్ వివరించారు. ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ఏసీసీ, అంబుజాల్లో లఫార్జే వాటా అప్ లఫార్జే హోల్సిమ్ కంపెనీ ఏసీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో తన వాటాలను మరింతగా పెంచుకుంది. లఫార్జే హోల్సిమ్ అనుబంధ కంపెనీ హోల్డర్ ఇండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 3.91 కోట్ల అంబుజా సిమెంట్స్ షేర్లను, 78.7 లక్షల ఏసీసీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ షేర్ల కొనుగోళ్ల విలువ రూ.1,832 కోట్లు. ఈ షేర్ల కొనుగోళ్లతో హోల్డర్ఇండ్ ఇన్వెస్ట్మెంట్ వాటాలు అంబుజా సిమెంట్స్లో 61.62 శాతం నుంచి 63.11 శాతానికి, ఏసీసీలో 0.29 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగారుు. టోకు ధరలు ’కూల్’ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో కొంత శాంతించింది. సెప్టెంబర్లో 3.57 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్లో 3.39 శాతానికి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా 3.70 శాతం క్షీణతలో ఉంది. వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్లో 14 నెలల కనిష్ట స్థారుు 4.20 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. రెండవ నెలా పెరిగిన ఎగుమతులు భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించాయి. వార్షికంగా చూస్తే... అక్టోబర్లో 9.59 శాతం వృద్ధి నమోదయిది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమయియంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదయియంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వాహన రంగంలో 6.5 కోట్ల ఉద్యోగాలు! దేశీ వాహన పరిశ్రమలో వచ్చే దశాబ్ద (పదేళ్లు) కాలంలో 6.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మారుతీ సుజుకీ అంచనా వేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీలో వాహన పరిశ్రమ వాటా 12 శాతానికి చేరుతుందని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కెనిచి అయుకవ అభిప్రాయపడ్డారు. డీల్స్.. అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్ఎల్సీ (డబ్ల్యూఎఫ్టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్ స్టార్టప్ ‘ఫేషియోమెట్రిక్స్’ను సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్బుక్’ కొనుగోలు చేసింది. అరుుతే ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఫేస్బుక్ వెల్లడించలేదు. రిలయన్స ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా ఆరుుల్, గ్యాస్, ఎరువులు, విద్యుత్తు, ఫార్మా, టెలికం వంటి పలు ఇతర పరిశ్రమల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్లో భాగంగా హర్మన్కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది. -
హైకోర్టులో హైడ్రామా: అగ్రిగోల్డ్ నిందితులపై దాడి
ముదుపు పేరుతో లక్షల మందికి టోకారా ఇచ్చి, వేల కోట్లు ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ యజమానులపై బాధితులు దాడిచేశారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను సోమవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తమ రెక్కల కష్టాన్ని దోచుకున్నారంటూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాధితులు.. ఒక్కసారిగా అగ్రిగోల్డ్ యజమానులపై విరుచుకుపడ్డారు. సంస్థ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై బాధితులు చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. దీంతో హైకోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. బాధితులు వందల సంఖ్యలో గుమ్మికూడటంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అతికష్టం మీద నిదితులను సరక్షిత ప్రాంతానికి తరలించగలిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ అగ్రిగోల్డ్ సంస్థ ముదుపుదారులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇదే విషయమై కర్ణాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను కర్ణాటక సీఐడీ పోలీసులు పది రోజుల కిందటే నెల్లూరు జిల్లా నుంచి కర్ణాటకకు తరలించి అక్కడ విచార్తిస్తున్నారు. అయితే ఇదే కేసుపై హైదరాబాద్ హైకోర్టులో సమగ్ర విచారణ జరుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. నిందితులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జడ్జి ఆదేశానుసారం వారిని హైదరాబాద్ కోర్టుకు తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. బాధితుల దాడిలో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి. -
లతారజనీకాంత్కు హైకోర్టులో ఊరట
తమిళసినిమా: సూపర్స్టార్ సతీమణి లతారజనీకాంత్కు కోచ్చడైయాన్ చిత్ర వ్యవహారంలో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్. ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసిన యాడ్ బ్యూరో సంస్ధ అధినేత అభీర్చంద్ నెహర్ బెంగుళూరు కోర్టులో లతారజనీకాంత్పై పిటిషన్ దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ కోచ్చడైయాన్ చిత్రం నిర్మాణంలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సమయంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందన్నారు. అందుకు పూచీకత్తుగా లతారజనీకాంత్ సంతకం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఆమె స్థల డాక్యుమెంట్స్ ఇచ్చారని అవి నకిలీవని తేలిందని అన్నారు. నకిలీ డాక్యుమెంట్స్టో తనను మోసం చేసిన లతారజనీకాంత్పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్పై స్పందించిన బెంగుళూరు కోర్టు పిటిషనదారుడిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషనదారుడు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కొంత కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో గురువారం న్యాయమూర్తి ప్రదీప్.టీ.వైన్కంకర్ సమక్షంలో విచారణకు వచ్చింది.అభీర్చంద్ నెహర్ దాఖలు చేసిన పిటిషన్ను కూలంకషంగా విచారణ జరిపిన ఆయన లతారజనీకాంత్పై ఆరోపణలకు పిటిషన్దారుడు సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. -
మంజునాథ్పై మాకు నమ్మకం లేదు!
కాపు సంఘాల జేఏసీ .. ముద్రగడ దీక్షకు సంఘీభావం నేటి నుంచి హైదరాబాద్లో దీక్షలు సాక్షి, హైదరాబాద్: కాపుల్ని బీసీల్లో చేర్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ్ కమిషన్పై తమకు నమ్మకం లేదని కాపు సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం (కేజేఏసీ) ప్రకటించింది. మంజునాథ్ గతమంతా వివాదాస్పదమేనని ఆరోపించింది. ఆయన నాయకత్వంలో కాపులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదంది. ఈ వ్యవహారమై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. జంటనగరాల కాపు సంఘాల కన్వీనర్ కఠారి అప్పారావు అధ్యక్షతన శనివారంజరిగిన కేజేఏసీ సమావేశానికి వివిధ కాపు సంఘాల నేతలు పర్సా పరమేశ్వరరావు, బైరా దిలీప్, ఇక్కుర్తి నరేశ్, కేవీవీ సత్యనారాయణ, దుర్గారావు, డీవీరావు, సి.శేషయ్య, పి.వి.రామమోహననాయుడు తదితరులు హాజరయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో మంజునాథ్ అనేక వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉందని సమావేశం అభిప్రాయపడింది. మంజునాథ్ కమిషన్ కాపులకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే తమ బతుకు ఛిద్రమవుతుందని, ఆయన్ను మార్చాలని కోరుతూ గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం దంపతులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని తీర్మానించింది. తాము బీసీల వాటాలో కోటా అడగడం లేదని స్పష్టం చేస్తూ ప్రతి జిల్లాలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. -
మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో!
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. కార్పొరేషన్లో మెజారిటీ ఉన్నా.. తమ అభ్యర్థిని మేయర్గా గెలిపించుకోలేక బీజేపీ చతికిలబడింది. సొంత బలం లేకపోయినా, ఎమ్మెల్యేలు.. ఇతరుల బలంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునే పరిస్థితికి వచ్చింది. కానీ.. హైకోర్టు తుదితీర్పును బట్టే ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎన్ మంజునాథ రెడ్డి మేయర్గాను, జేడీ(ఎస్)కు చెందిన హేమలతా గోపాలయ్య డిప్యూటీ మేయర్గాను ఎన్నికయ్యారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక్కడ మొత్తం 198 వార్డులు ఉండగా వాటిలో 100 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్కు 76, జేడీ (ఎస్)కు 14 స్థానాలు దక్కగా ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఎమ్మెల్యేలు, ఇతరుల బలంతో కలిపి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మంజునాథరెడ్డికి 131 ఓట్లు వచ్చాయి. అయితే.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన తుది నిర్ణయం కర్ణాటక హైకోర్టు నుంచి వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సవాలు చేస్తూ ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారు. మేయర్, డిప్యూటీమేయర్లుగా ఎన్నుకోవాలంటే 131 మంది సభ్యులు కావల్సి ఉంటుంది. బీబీఎంపీ మండలిలో మొత్తం 260 మందికి ఓటుహక్కు ఉంది. వాళ్లలో 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఈ ఓట్లు కలిపితేనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. దాంతో మేయర్గా తమ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోగలిగింది. అయితే, ఇలా ఎమ్మెల్యేలు తదితరులకు ఓటుహక్కు కల్పించే సెక్షన్ 7, 10లను సవాలుచేస్తూ బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నికను శుక్రవారం నిర్వహించుకోవచ్చిన హైకోర్టు చెప్పినా.. తుది నిర్ణయం మాత్రం తన రూలింగ్కు లోబడి ఉండాలని తెలిపింది. కార్పొరేటర్లు కానివాళ్లు కూడా మేయర్ ఎన్నికల్లో పాల్గొనడంపై రాజ్యాంగం ఏమంటోందన్న విషయాన్ని చూడాల్సి ఉందని జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ తెలిపారు. -
సానియా ‘ఖేల్ రత్న’కు మార్గం సుగమం
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘రాజీవ్గాంధీ ఖేల్ రత్న’ అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కాస్త ఊరట లభించింది. మొదట ప్రకటించినట్లుగానే సానియాకు ‘ఖేల్ రత్న’ను అందజేయాలని కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నోటీసులు అవార్డు ఇవ్వడానికి అడ్డంకిగా మారబోవని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవార్డుల కార్యక్రమంలో మొదట ఎంపిక చేసిన జాబితాను అమలు చేస్తామన్నారు. మరోవైపు సానియా గెలిచిన గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధారణ విభాగంలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. నాలుగేళ్ల కాల వ్యవధితో పాటు అవార్డు ఇచ్చే ఏడాది... ఏ క్రీడాకారుడైనా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ఖేల్త్న్రతో గౌరవించొచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. వినోద్ కుమార్కూ ఇవ్వండి... మరోవైపు భారత రెజ్లింగ్ మాజీ చీఫ్ కోచ్ వినోద్ కుమార్కు కూడా ‘ద్రోణాచార్య పురస్కారం’ అందించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2012లోనే వినోద్కు ‘ధ్యాన్చంద్ అవార్డు’ ఇచ్చినందున ఆయన పేరును ద్రోణాచార్యకు పరిశీలించలేమంటూ కేంద్రం, మాజీ కోచ్ పేరును పక్కన పెట్టింది. అయితే తనకు నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని, గత అవార్డు దీనికి అడ్డంకి కాదంటూ వినోద్ కోర్టుకెక్కారు. పిటిషన్ను విచారించిన కోర్టు వినోద్ సాధించిన విజయాలు, ఘనతలను సెలక్షన్ కమిటీ పరిశీలనలోకి తీసుకోవాలంటూ తీర్పు చెప్పింది. -
సానియా మీర్జాకు హైకోర్టు ఝలక్
బెంగళూరు: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కర్ణాటక హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన అత్యుతన్న క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. పారా ఒలింపియన్ గిరీషా ఎన్ గౌడ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాల్చింది. అవార్డుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని గిరీషా కోర్టును ఆశ్రయించాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నా అవార్డు ఇవ్వలేదని న్యాయస్థానానికి మొర పెట్టుకున్నాడు. తనకు కాదని సానియాకు ఖేల్ రత్న ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశాడు. 2011-2014 మధ్య కాలంలో సానియా ఒక్క టైటిల్ కూడా నెగ్గని సానియాకు ఖేల్ రత్న ఎలి ఇస్తారని ప్రశ్నించాడు. కర్ణాటకకు చెందిన గిరీషా 2012 సమ్మర్ పారా ఒలింపిక్స్ లో హై జంప్ లో వెండి పతకం సాధించాడు. దీంతో పారాఒలింపిక్స్ మెడల్ సాధించిన 9వ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. అంతేకాదు వెండి పతకం సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు కెక్కాడు. 2013లో కేంద్ర ప్రభుత్వం అతడికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. -
'ధోనీ వంటి సెలెబ్రిటీల లక్ష్యం డబ్బు సంపాదనే'
బెంగళూరు: ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ వాణిజ్య ప్రకటనలో ధోనీ హిందూ దేవుణ్ని అగౌరవపరిచాడంటూ ఆయనపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు విచారించింది. ఉన్నత న్యాయస్థానం ధోనీ తీరును ఆక్షేపించింది. 'ధోనీ వంటి సెలెబ్రిటీలు కేవలం డబ్బు కోసమే యాడ్స్ చేస్తారు. వాటి పర్యవసానాల గురించి ఆలోచించరు. బాధ్యత లేకుండా యాడ్స్పై సంతకాలు చేస్తారు. వీటివల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించరు. వారి లక్ష్యం డబ్బు సంపాదించడం మాత్రమే' అని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎన్ వేణుగోపాల్ గౌడ అన్నారు. షూలు ధరించి, చేతిలో పలు వస్తువులు పట్టుకుని, విష్ణుమూర్తి రూపంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ఓ బిజినెస్ మేగజైన్ కవర్ పేజీలో ప్రచురించడంపై సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్ ఫిర్యాదు చేశారు. కాగా కవర్ పేజీపై ప్రకటన కోసం ధోనీ డబ్బులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ గౌడ స్పందిస్తూ.. డబ్బులు తీసుకోనట్టుగా నిర్దారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధోనీని అదేశించారు. కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. -
అప్పీలుకు రెడీ
కర్ణాటక ప్రభుత్వం మళ్లీ కళ్లు తెరిచింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈనెల 22వ తేదీన అప్పీలుకు వెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వివరాలను కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య శనివారం వెల్లడించారు. ఆర్కేనగర్ పోలింగ్కు మరో వారం రోజులుండగా అప్పీలు ప్రకటన వెలువడడం అమ్మ శిబిరంలో కలకలం రేపింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు, కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు కలుపుకుని 18 ఏళ్లపాటు నడిచిన ఆస్తుల కేసులో జయను దోషిగా పేర్కొంటూ గత ఏడాది తీర్పువెలువడింది. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా పడింది. కర్ణాటక హైకోర్టుకు జయ అప్పీలు చేసుకోగా రెండునెలల పాటు విచారణ సాగిన తరువాత కోర్టు జయను నిర్దోషిగా తీర్పుచెప్పింది. అధికార పీఠానికి మార్గం సుగమం కావడంతో జయ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నిక య్యేందుకు ఆర్కేనగర్ ఉప ఎన్నికను రంగంపైకి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఆర్కేనగర్ ఎన్నికలను బహిష్కరించగా, కేవలం సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. జయ గెలుపు నల్లేరుపై నడకైనా రికార్డు మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే అగ్రనేతలు, మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన పోలింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది పీవీ ఆచార్య అప్పీలుపై మళ్లీ గళం విప్పారు. కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆచార్య తాజా తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలంటూ తన ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు. ఆస్తుల లెక్కలు కట్టడంలో కొన్ని పొరపాట్లు దొర్లాయంటూ ఆచార్య ఆది నుంచి వాదిస్తున్నారు. అప్పీలుకు సిద్ధమైనట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండువారాల క్రితం ప్రకటించారు. అదంతా ఉట్టి నిర్ణయమే, అప్పీలుకు వెళ్లరని అందరూ భావించారు. అయితే, ఈనెల 22వ తేదీన సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆచార్య అకస్మాత్తుగా ప్రకటించారు. అప్పీలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ మేరకు బెంగళూరు మీడియాకు ఆయన వివరాలను తెలియజేశారు. జూలై మొదటి వారం నుంచే అప్పీలుపై విచారణ ప్రారంభమవుతుందని చెప్పడం రాజకీయవర్గాలను ఆలోచనలో పడేసింది. -
జయ కేసు మరో కీలక మలుపు తిరగనుందా?
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలిన అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత కేసు మరో కీలక మలుపు తిరగనుందా? ఈ మేరకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తేల్చిన కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర న్యాయశాఖామంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అప్పీలు చేసుకునేందుకు 90 రోజులు గడువున్నప్పటికీ తీర్పు వచ్చిన 20 రోజుల్లోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు మరోవైపు ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే రెండుసార్లు చెప్పింది. అప్పీలుకు వెళ్లాల్సిందిగా ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని కరుణ గతంలో ప్రస్తావించారు. కాగా, కేసులో అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక పీసీసీ లీగల్, మానవ హక్కుల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో కర్టాటక పాత్ర 'పరిపాలన' వరకే పరిమితమని ఆ విభాగం చైర్మన్ ధనుంజయ పేర్కొన్నారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడడం, ఆ తర్వాత ఈ కేసు నుంచి జయ నిర్దోషిగా తీర్పు వెలువడడంతో ఈనెల 23 వ తేదీన జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. -
జయ కేసులో అప్పీలుకు వెళ్తాం
కరుణానిధి వెల్లడి తీర్పును మనం సవాలు చేయాల్సిన అవసరం లేదని కర్ణాటకకు లీగల్ సెల్ సూచన చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని డీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు పార్టీ జిల్లా కార్యదర్శుల బేటీలో కరుణ ఈ అంశంపై చర్చించారు. ‘ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు డీఎంకేకు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే రెండుసార్లు చెప్పింది. తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని ప్రకటనలో కరుణ పేర్కొన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై డీఎంకే ఒత్తిడి తెస్తోంది. అప్పీలుకు వెళ్లాల్సిందిగా ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని కరుణ ప్రస్తావించారు. కాగా, కేసులో అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక పీసీసీ లీగల్, మానవ హక్కుల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో కర్టాటక పాత్ర ‘పరిపాలన’ వరకే పరిమితమని ఆ విభాగం చైర్మన్ ధనుంజయ పేర్కొన్నారు. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపై చర్చించలేదు. -
నేడు తమిళనాడు సీఎం రాజీనామా
చెన్నై: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా, ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. ఈ రోజే సెల్వం రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 16న జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయవచ్చని సమాచారం. జయలలితకు ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
నేను మేలిమి బంగారాన్ని...
చెన్నై: న్యాయం గెలిచింది... నిజాలు నిగ్గు దేలి..మేలిమి బంగారంలా బైటపడ్డానని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతోషం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు మరో ముగ్గురిపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యర్తలు సంబరాలు చేసుకున్నారు. కర్టాటక హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం కిక్కిరిసిన అభిమానులనుద్దేశించి ఆమె తొలిసారి మాట్లాడారు. న్యాయస్థానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ...కోర్టు తీర్పు తనకు చాలా పూర్తి సంతృప్తి నిచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ శత్రువలు తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాజా తీర్పుతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర భగ్నమైందన్నారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ధర్మమే గెలిచిందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని రుజువైందన్నారు. ఇది తుది తీర్పు కాదని, కోర్టులపైన కోర్టులు ఉంటాయని, అది మనస్సాక్షిగా జయలలిత అభివర్ణించారు. తనకోసం ప్రార్థనలు చేసి ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ట్రయిల్ కోర్టు తీర్పు తరువాత ఆత్మహత్య చేసుకున్న 237 మంది అభిమానులకు సంతాపం తెలిపారు. వాళ్లు కొంచెం సంయమనం పాటించి ఉంటే ఈనాటి సంబరాల్లో పాలు పంచుకునేవారన్నారు. కాగా అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి జయలలితతో పాటు మరోముగ్గురిని నిర్దోషిగా ప్రకటించారు. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. -
జయలలిత నిర్దోషి: హైకోర్టు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఫలితంగా.. ఆమె మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
జయ ‘ఆస్తుల’ కేసులో నేడు తీర్పు
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విషయంలో సోమవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనుంది. గత సెప్టెంబర్ 27న ఇదే కేసులో జయలలితకు స్పెషల్ కోర్టు నాలుగేళ్లు జైలు, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈమెతో పాటు మరో ముగ్గురికి కూడా శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జయలలిత, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ సాగడంతో పాటు తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజలు, ఏఐఏడీఎంకే నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. -
తీర్పు అమ్మకు సానుకూలమా
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు మరో 24 గంటల్లో తేలిపోనుంది. జయ చేసుకున్న అప్పీలుపై ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడ నుండగా, తీర్పు సారాంశం ఎలా ఉంటుందోనని రాష్ట్రమంతా టెన్షన్ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:18 ఏళ్లపాటూ నడిచిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు గత ఏడాది విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాపై జయ కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అమెతోపాటూ ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న శశికళ, ఇళవరసి, మాజీ దత్తపుత్రుడు సుధాకర్లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా పడింది. జనవరి 5వ తేదీన అప్పీలుపై విచారణ ప్రారంభం కాగా మార్చి 11 వ తేదీ వరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో వాదోపవాదాలు సాగాయి. మార్చి 18 వ తేదీలోగా విచారణ ముగించి తీర్పుచెప్పాలని సుప్రీం కోర్టు గతంలోనే కర్నాటక హైకోర్టును ఆదేశించి ఉంది. అయితే అత్యంత కీలకమైన కేసు కాబట్టి తీర్పు వెల్లడిలో మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సుప్రీంకు లేఖ రాశారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీం కోర్టు మే 12వ తేదీలోగా తీర్పు చెప్పేలా గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసిపోతున్న దశలో తీర్పు చెప్పేందుకు కర్నాటక హైకోర్టు సిద్దమైంది. ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటలకు జయ కేసులో తీర్పు చెప్పనున్నట్లు కర్నాటక హైకోర్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. 11న రాష్ట్రవ్యాప్తంగా పూజలు ః తీర్పు తేదీ ఖరారైన నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఊహాగానాల్లో పడిపోయాయి. అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన మిన్నంటింది. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రావాలని ప్రార్థిస్తూ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర శనివారం పూజలు నిర్వహించారు. అలాగే తీర్పు వెలువడే 11 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు నిర్ణయించారు. పార్టీ అనుబంధ న్యాయవాదుల సంఘం సభ్యులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. తీర్పు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటించినపుడు ఆందోళనలు, రాస్తారోకోలు, బస్సుల ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. 11 వ తేదీన తీర్పు అమ్మకు సానుకూలమా, ప్రతికూలమా అనే మీమాంసలో ముందు జాగ్రత్త చర్యలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం అవుతోంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ముమ్మురమైన వాహనాల తనిఖీకి చేపట్టనున్నారు. ఈనెల 12 వ తేదీతో జయకు మంజూరైన బెయిల్ గడువు ముగుస్తుంది. కర్నాటక హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే, ప్రతికూలంగా వస్తే వెంటనే బెయిల్ పొడిగింపు దరఖాస్తును సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక న్యాయవాది తెలిపాడు. -
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
సాక్షి, తిరుమల: రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకర్నారాయణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి విచ్చేసిన వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. తరువాత జస్టిస్ శంకర్నారాయణ కుటుంబసమేతంగా తిరుచానూరు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకుని, కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. -
జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి కర్ణాటక హైకోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ముందు బుధవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి సీఆర్ కుమార్స్వామి తీర్పును రిజర్వ్లో ఉంచారు.ఈ కేసుకు సంబంధించి 14 పేజీల వాదనను ఫిర్యాదుదారు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి న్యాయమూర్తికి బుధవారం అందజేశారు. -
రెండు వారాల్లో తీర్పు
మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మరో రెండు వారాల్లో తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిపోగా రెండు వారాల్లో తీర్పు ఖాయమని భావిస్తున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిం చారు. జయతోపాటూ శశికళ , ఇళవరసి, సుధాకర్కు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ, బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన జయలలిత బెయిల్పై వచ్చిన తరువాత తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేశారు. జయ ఆస్తుల కేసుపై ఇప్పటికే 18 ఏళ్లు విచారణ సాగినందున మూడు నెలల్లోగా అప్పీలుపై తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో కర్ణాటక హైకోర్టులో ప్రతి రోజు విచారణ సాగుతోంది. నలుగురి తరపున న్యాయవాదులు కోర్టుకు హాజరై 31 రోజుల పాటూ వాదనను వినిపించారు. ఇక ఆరు సంస్థల తరపున న్యాయవాదుల వాదన శుక్రవారం ప్రారంభమైంది. నిందితులు నలుగురికి తమ సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని, సంస్థలు ప్రారంభించినపుడు వారు నలుగురూ షేర్ హోల్డర్లు కాదని వాదించారు. కాబట్టి ఈ కేసు నుంచి తమ ఆరు సంస్థలకు విముక్తి ప్రసాదించాలని కోరారు. న్యాయవాదుల వాదన పూర్తి అయిన అనంతరం న్యాయమూర్తి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రయివేటు సంస్థలు తమ వాదనను ఈనెల 23వ తేదీతో ముగించాలని, ఆ తరువాత ప్రభుత్వ న్యాయవాది భవానిసింగ్ తన చివరి వాదనను పూర్తిచేయగానే తీర్పు తేదీని ప్రకటిస్తామన్నారు. చివరి వాదనను వినిపించేందుకు ఐదురోజులు అవకాశం ఇవ్వాలని భవానీసింగ్ కోరారు. ఈ అభ్యర్థనను నిరాకరించిన న్యాయమూర్తి 23వ తేదీన ఆరు సంస్థల వాదన ముగియగానే 24వ తేదీ నుంచి తమ వాదనను వినిపించాలని భవానీసింగ్ను ఆదేశించారు. ఈ కారణాల వల్ల మార్చి మొదటి వారంలో జయ అప్పీలుపై న్యాయమూర్తి తీర్పు ఖాయమని కర్ణాటక హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి. -
667 పుస్తకాలతో కోర్టుకు అప్పీలు ..
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో అప్పీల్ వివరాలు దాఖలు చేశారు. మొత్తం 667 పుస్తకాల్లో 2 లక్షల 15వేల పేజీల పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.100కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆమెకు అక్కడ ఊరట లభించింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షపై చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ....ఈ కేసులో రెండు నెలల్లోగా అప్పీల్కు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆ తర్వాత ఒక్క రోజు కూడా గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జయలలిత ...ఇవాళ అప్పీల్కు సంబంధించిన వివరాలు న్యాయస్థానంలో దాఖలు చేశారు. -
భక్తులకు అమ్మ దర్శనమయ్యేనా ?
అమ్మా అని పిలిచినా ఆలకించవే అమ్మా.. అంటూ తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం విలపిస్తున్నారు. ఆయనతో పాటు.. తమిళ మంత్రివర్గం యావత్తు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు వద్ద బారులు తీరుతోంది. కానీ అమ్మ పురచ్చితలైవి జయలలిత మనసు మాత్రం కొంచం కూడా కరగడం లేదు. ఇన్నాళ్ల పాటు రోజూ తనకు పాదాభివందనాలు చేసిన మంత్రులను ఆమె కరుణించడంలేదు. కర్ణాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురికావడంతోనే ఆమె భక్తులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అమ్మ కోసం... ఎంతవరకైనా వెళతామంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. దాంతో బెయిల్ ఎప్పుడొస్తుందా అని వాళ్లంతా కొండంత ఆశతో సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. వాళ్ల ఆశలు నెరవేరుతాయో, లేదో చూడాలంటే మాత్రం శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే. తమిళనాడు మాజీ సీఎం జయలలితను సాధ్యమైనంత త్వరగా ఆమె స్వరాష్ట్రానికే పంపాలని కర్ణాటక భావిస్తుంది. ఆమెను చూసేందుకు వేలాది సంఖ్యలో తమిళ తంబిలు బెంగళూరు జైలుకు చేరుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జయలలితను తమిళనాడుకు తరలించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బహిరంగంగా తన అభిప్రాయాన్ని ప్రకటించింది. కానీ ఈ విషయంలో సుప్రీం ఏమంటుందో మాత్రం ఇంకా చూడాలి. -
17 వ తేదీన సుప్రీంలో జయ బెయిల్ పై విచారణ
న్యూఢిల్లీ:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. జయ పిటిషన్ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతత్వంలోని ధర్మాసనం మన్నించింది. దీపావళికి ముందు జైల్లోంచి బయటకు రావాలంటే ఈ నెల 17 (శుక్రవారం) జయకు చివరి అవకాశం. శుక్రవారం తర్వాత వారం రోజులు సుప్రీం కోర్టుకు సెలవులు రానున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గత నెలాఖర్లో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. వంద కోట్ల జరిమానా విధించడంతో జయ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో ఆమె నెల 9న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
'తమిళనాడుకు తరలించినా అభ్యంతరం లేదు'
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితను తమిళనాడు జైలుకు తరలించినా తమకు ఎటువంటి అభ్యతరం లేదని కర్ణాటక హోంశాఖ స్పష్టం చేసింది. దీనిపై పొరుగు రాష్ట్రం తమిళనాడు కోర్టు నుంచి అనుమతులు తీసుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి ఏ విధమైన అడ్డంకులూ లేవని హోంమంత్రి కేజే జార్జ్ తెలిపారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ మరియు కొంతమంది ప్రముఖల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత కర్ణాటక జైల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడటమే కాకుండా, మద్దతుదారుల ఆందోళనతో చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయని దేవగౌడ సూచించారు. ఆమె కర్ణాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం సీఎం సిద్ధరామయ్యతో చెప్పినట్లు తెలిసింది. ‘‘జయను చూసేందుకు వేలాదిగా తమిళలు జైలు వద్దకు చేరుకుని గొడవ చేస్తున్నారు.సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడా బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది’’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం జయ జైలు మార్పిడి విషయంలో సానుకూలంగా స్పందించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
బెయిల్ వచ్చిందనుకుని ఆనందం, రాలేదన్న వార్తతో నైరాశ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆస్తుల కేసుకు సంబంధించి, బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మంగళవారం తొలుత బెయిల్ వచ్చిందనుకుని సంబరాలు జరుపుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంతలోనే బెయిల్ రాలేదని తెలుసుకుని నైరాశ్యంలో మునిగారు. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయ బెయిల్ పిటిషన్పై మంగళవారం కిక్కిరిసిన హైకోర్టులో ఎంతోఉత్కంఠగా వాదోపవాదాలు సాగాయి. ఈ దశలో, జయలలితకు షరతులతో కూడిన బెరుుల్ మంజూరుకు తమకు అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) భవానీ సింగ్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో అమ్మకు ఇక బెయిల్ ఖాయం అంటూ తమిళనాడులోని అమ్మ అభిమానులంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. దీనికి తోడు జయుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని జయ టీవీసహా పలు టెలివిజన్ చానళ్లు, న్యూస్ వెబ్సైట్లు వార్తలు వెలువరించడంతో చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయం, పోయెస్ గార్డెన్లోని జయులలిత నివాసం వద్ద సంతోషం వెల్లివిరిసింది. చెన్నైలోని పలు రోడ్ల కూడళ్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. అయితే,.. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు.. ఇంతలోనే పిడుగుపాటు వంటి వార్తతో వారు నైరాశ్యంతో కుంగిపోయారు. కండీషనల్ బెరుుల్పై ఎస్ఎస్పీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదని, జయకు బెయిల్ మంజూరు కాలేదని తెలిసి, ఆవేదన చెందారు. ఎక్కడికక్కడ రాస్తారోకోకు దిగారు. మహిళలు గుండెలవిసేలా రోదించారు. ఊటీ బస్స్టాండ్లో కర్ణాటక ఆర్టీసీ బస్సును వందవుంది అన్నాడీఎంకే కార్యకర్తలు నిలివేశారు. పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టి బస్సును సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని అత్తిపల్లి వద్ద కర్ణాటక పోలీసులు మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే కార్యకర్తలను అడ్డుకున్నారు. -
జయకు బెయిల్ నిరాకరణ
బెయిల్ మంజూరుకు తగిన కారణాలు లేవన్న కర్ణాటక హైకోర్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జయుతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లను జస్టిస్ ఏవీ చంద్రశేఖర నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. జయలలితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ విచారణ సందర్భంగా చెప్పినా ఆయున వాదనతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర ఏకీభవించలేదు. కిక్కిరిసిన కోర్టు హాలులో తీర్పు పాఠాన్ని చదివిన న్యాయమూర్తి ‘అవినీతి.. మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అవినీతి మానవ చరిత్రలోనే ఒక జాడ్యంగా మారిపోయింది అవినీతి కేసులను అధిక ప్రాధాన్యత ప్రాతిపదికపై పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆదేశించింది. అవినీతిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. తీవ్రమైన చర్యలు తీసుకోని పక్షంలో అది సమాజానికి జాడ్యంగా మారుతుంది. అవినీతి సమాజ వ్యతిరేకమైందని 2012లో సుప్రీం కోర్టు ఒక కేసు విచారణలో వ్యాఖ్యానించింది. అందువల్ల తమిళనాడు మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేయడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదు’ అన్నారు. ఆస్తుల కేసులో జయను దోషిగా నిర్ధారిస్తూ, గత నెల 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను, రూ.వంద కోట్ల జరిమానాను, శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు తలా రూ.పది కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టుకు వెళ్లడంపై జయదే నిర్ణయుం బెరుుల్ తిరస్కరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్లే విషయమై జయలలితే స్వయుంగా నిర్ణయం తీసుకుంటారని ఆమె తరఫున హైకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు తనను నిరాశ పరిచాయన్నారు. అంతకు ముందు హైకోర్టులో ఆయన వాదనలు వినిపిస్తూ, జయలలితకు సత్వరమే బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. దాణా కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఉటంకించారు. అయితే ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. బెయిల్కు ముందు లాలూ ప్రసాద్ యూదవ్ పది నెలలు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్ను దాఖలు చేయడానికి జయ తరఫు న్యాయవాదులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించినట్టు తెలిసిన వెంటనే జయలలిత కుప్పకూలి పోయారు. తన బెయిల్ పిటిషన్పై వాదనల గురించి తెలుసుకోవడానికి ఆమె వుంగళవారం ఉదయుం నుంచే టీవీని వీక్షిస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైందని తెలియడంతో ఆమె కుప్పకూలారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. లో-బీపీతో బాధ పడుతున్నట్లు గుర్తించి ఆమెకు వైద్యం చేశారు. భారీ బందోబస్తు: జయలలిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టులోనూ, పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జయ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తమిళనాడుకు వెళ్లాల్సిన కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు జయలలితను తమిళనాడు జైలుకు తరలించే విషయమై తవు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయలలితను తమిళనాడు జైలుకు తరలించాలన్న మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యపై ఆయన మంగళవారం స్పందించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘కన్నడిగులను జైల్లో పెడతాం’ చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం తపించిపోతున్న ఆ పార్టీ శ్రేణులు కర్ణాటకపై పోస్టర్ల యుద్ధానికి శంఖారావం పూరించారు. జయకు బెయిల్ ఇవ్వకుంటే తమిళనాడులోని కన్నడీగులను జైల్లో పెడతాం జాగ్రత్త అంటూ చెన్నై నలుమూలలా పోస్టర్లను అంటించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కావేరీ జలాల వాటా విషయంలో ఉభయు రాష్ట్రాలకూ పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే స్థాయిలో విభేదాలు, విద్వేషాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి విద్వేషాలున్న తరుణంలో జయలలిత బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న పరిణావుం, తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా అన్నాడీఎంకే శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. సోమవారం రాత్రి కర్ణాటక హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘‘హెచ్చరిక..హెచ్చరిక. వంచనతో కూడిన తీర్పును వెలువరించిన కర్ణాటక న్యాయస్థానమా!..జనం ముఖ్యమంత్రి అమ్మను వెంటనే విడుదల చేయి, లేకుంటే తమిళనాడులో నివసించే కర్ణాటక ప్రజలందరినీ చెరలో పెడతాం’’ అని హెచ్చరిస్తూ పోస్టర్లను అంటిం చారు. పోస్టర్లలో మంత్రి వలర్మతి, టీ నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ తదితర ప్రముఖుల పేర్లు ఉండటం చర్చనీయాంశమై ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ఆదేశాలతో కానిస్టేబుళ్లు పోస్టర్లను చింపివేశారు. అరుుతే కర్ణాటక పేరెత్తకుండానే మంగళవారం సాయంత్రం మరో పోస్టరు వెలిసింది. ‘ఖండిస్తున్నాం..తీవ్రంగా ఖండిస్తున్నాం. సత్యమే జీవితం గా బతుకుతున్న నీతిమంతురాలిని జైల్లో పెట్టిన నీకు శ్మశానంలోనూ చోటు లేదు..విడుదల చెయ్ అమ్మను విడుదల చెయ్’అంటూ పోస్టర్లు అంటించారు. -
జయలలితకు బెయిల్ నిరాకరణ
-
జయలలితకు బెయిల్ నిరాకరణ
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. కర్ణాటక హైకోర్టు ప్రాంగణంలో కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. తొలుత జయలలితకు బెయిల్ మంజూరైనట్టుగా వార్తలు వెలువడ్డాయి. తమిళ మీడియా అత్యుత్సాహం చూపడంతో నిజమేననుకుని జాతీయ మీడియా కూడా వార్తలు వెలువడ్డాయి. జయ మద్దతు దారులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో కథ మారిపోయింది. జయలలితతో పాటు ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జయలలిత అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని అంతకుముందు రాం జెఠ్మలాని కోర్టుకు విన్నవించారు. ఆమె చట్టం, న్యాయాన్ని గౌరవించే వ్యక్తని చెప్పారు. జయలలిత దేశం వదలి పారిపోరని రాం జెఠ్మలాని కోర్టుకు తెలియజేశారు. అయితే సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతర వ్యక్తం చేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటీషన్ను కొట్టేసింది. జయ మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
జయలలిత బెయిల్ పిటీషన్పై వాదనలు పూర్తి
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటీషన్పై కర్ణాటక హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది. జయ మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించారు. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. జయకు బెయిల్ వస్తుందని ఆమె మద్దతు దారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రాకపోవచ్చని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతుండగా, మరికొందరు రావచ్చని చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
కర్ణాటక హైకోర్టు వద్ద ఉద్రిక్తత
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తున్నారు. బెయిలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో హైకోర్టు చుట్టుపక్కల భద్రతను పటిష్టం చేశారు. హైకోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు సీబీఐ కోర్టు గత నెల 27న నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, తమిళనాడులో జయలలితకు ఓ పక్క మద్దతు పెరుగుతోంది. మరోపక్క రాష్ట్రంలో పరిస్థితులు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. -
కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'
-
కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'
బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రస్తుతం 'తెల్లచీర' భయపెడుతోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత జైలు నిబంధనల ప్రకారం తెల్ల దుస్తులు ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దాంతో కర్ణాటక సర్కార్తో పాటు జైలు అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. తెల్ల చీర ధరించేలా జయలలితపై ఒత్తిడి తెస్తే పరిస్థితులు ఎలా మారుతాయోనని హడలి పోతున్నారు. మరోవైపు జయ ఉన్న జైలు బయట తమిళ తంబీలు, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలు,ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తే ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొంటాయోనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో జయలలితను తమిళనాడు జైలుకే పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
మళ్లీ అమ్మకు నిరాశే.. బెయిల్ కు నో..!
-
మళ్లీ అమ్మకు నిరాశే.... బెయిల్ కు నో...
బెంగళూరు : పురచ్చితలైవికి మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అభ్యంతరం వ్యక్తం చేయటంతో జయకు బెయిల్ ఇవ్వటం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల ఏడో తేదీన హైకోర్టు సాధారణ బెంచ్లో విచారణకు ఆదేశించింది. కాగా జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు తాజా తీర్పుతో అమ్మతో పాటు అన్నాడీఎంకే వర్గాలకు మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో జయలలిత దసరా పండుగకు జైల్లోనే గడపనున్నారు. -
జయ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం
హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. జయ తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా జయ బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దాంతో జయ బెయిల్ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. -
జయలలిత పిటిషన్పై రేపు విచారణ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది. కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్నారు. జయలలిత దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదావేసింది. అయితే, వచ్చే నెల 2 నుంచి 6 వరకు సెలవులు అయినందున, సత్వర విచారణ కోరుతూ జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదులు హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేసిన నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ** -
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత
-
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత
బెంగళూరు : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్టోబర్ 6వ తేదీ వరకూ జైల్లోనే గడపాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణకు చేపట్టింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీ వరకూ వాయిదా వేసింది. దాంతో జయ సోమవారం వరకూ జైల్లోనే ఉండాలి. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జయతో పాటు జైలు శిక్షకు గురైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జయలలిత
-
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జయలలిత
బెంగళూరు : కర్ణాటల హైకోర్టులో జయలలిత సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపు న్యాయవాదులు ఈరోజు ఉదయం పిటిషన్ వేశారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ...ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జయలలిత తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. ఆయన ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత సాదాసీదాగా గడిపారు. జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్లో ఉంచారు. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జయ
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరనున్నారు. కాగా ఈ బెయిల్ పిటిషన్ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు సమాచారం. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. మరోవైపు అమ్మకు వీరవిధేయుడైన ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిన్న ఆయనను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. -
బెయిల్ కోసం హైకోర్టుకు జయలలిత
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని జయలలిత కోరనున్నారు. న్యాయపరమైన అంశాలపై జయలలిత న్యాయనిపుణులతో చర్చించారు. బెయిల్ పిటీషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే హైకోర్టే బెయిల్ ఇవ్వాలని జయ తరపు న్యాయవాది ప్రసాద్ చెప్పారు. -
నిత్యానందకు పురుషత్వ పరీక్షలకు హైకోర్టు అనుమతి
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర హై కోర్టు అనుమతించింది. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని ఆయన వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హై కోర్టు తెలిపింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ నిత్యానంద హై కోర్టును ఆశ్రయించారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవన్నారు. అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. -
విరాట్ కోహ్లిపై కేసు
బెంగళూరు: భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లిపై క్రీడా ఉత్పత్తుల సంస్థ నైకీ కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. ఒప్పంద నియమావళికి విరుద్ధంగా కోహ్లి వ్యవహరిస్తున్నాడని, తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘిస్తున్నాడని నైకీ కోర్టులో వాదించింది. దీన్ని విచారించిన కర్ణాటక హైకోర్టు... కోహ్లి మరో నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పు ఇస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. నైకీ సంస్థ కోహ్లిని 2008లో ప్రచారకర్తగా నియమించుకుంది. ఐదేళ్ల కాలానికి మరో ఏడాది పొడిగింపుతో కూడిన ఒప్పందాన్ని అతనితో కుదుర్చుకుంది. ఇందులో ఐదేళ్ల ఒప్పందం జూలై 31, 2013తో ముగిసినప్పటికీ... క్లాజ్ ప్రకారం మరో ఏడాది పొడిగింపునకు అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది వరకు కాంట్రాక్టు అమల్లో ఉండనుంది. ఈ మేరకు రూ. 1.42 కోట్లు నైకీ చెల్లించింది. అయితే కాంట్రాక్టు పొడిగింపు తనకు ఇష్టం లేదని ఆ సంస్థకు కోహ్లి లేఖ రాశాడు. క్రికెటర్ ఇలా అర్ధంతరంగా ప్లేటు ఫిరాయించడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన నైకీ సంస్థ కోర్టుకెక్కింది.