Educational institutions
-
‘శ్రీ విశ్వశాంతి’ : చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కల సాకారం!
‘నీ దగ్గర ఏముంది?’ అనే ప్రశ్నకు తిరుగులేని జవాబు... ‘నా దగ్గర కల ఉంది!’ఆ కలే చేతిలో చిల్లిగవ్వ లేని ఎంతోమందిని విశ్వ విజేతలను చేసింది.‘శ్రీ విశ్వశాంతి’ కల కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాల క్రితం... పేదింటి బిడ్డ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు కన్న కల... శ్రీ విశ్వశాంతి. రవీంద్రుడి ‘విశ్వభారతి’లాంటి విలువైన కల అది. ‘ప్రపంచమంతా ఒకే గూడులో’ అనే నినాదం పునాదిపై ఏర్పాటైన ‘విశ్వభారతి’ తనకు స్ఫూర్తి. ఆరుగురు విద్యార్థులతో మొదలైన విశ్వశాంతి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. 16 రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విజయ ప్రస్థానం మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల్లోనే...కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నా దగ్గర కరెన్సీ నోట్లు లేవు. కల మాత్రమే ఉంది. అయినా సరే, చిన్న గుడిసెలో ‘శ్రీ విశ్వశాంతి పాఠశాల ప్రారంభించాను. ఆరుగురు విద్యార్థులతో మొదలైన ఆ పాఠశాల ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లుగా ఎదిగిపోయింది. బలమైన విద్యా వ్యవస్థగా నిర్మాణం అయిన ‘శ్రీ విశ్వశాంతి గ్రామీణ విశ్వ విద్యాలయం’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది.ఆరోజుల్లో...నేను, మా ఆవిడ ప్రమీలారాణి టీచర్లుగా పనిచేసేవాళ్లం. మా నెల జీతం నూట ఇరవై రూపాయలు. ‘మేము కొత్త స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పినప్పుడు విన్నవారు ‘ఎందుకొచ్చిన రిస్కు...వచ్చిన జీతంతో సర్దుకు పోకుండా’ అని సలహా ఇస్తారేమో?...ఇలాంటి సందేహాలు ఎన్నో వచ్చాయి.‘చాలా విజయాలు భద్ర జీవితాల్లోనే ఆగిపోతాయట!’ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ఇక్కడ సుఖంగానే ఉంది కదా... రిస్కు తీసుకోవడం ఎందుకు’ అనుకునే చాలామందిలో నేను ఉండపోదల్చుకో లేదు. నాకు ఇష్టమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఆ మహనీయుడు చెప్పిన విలువైన మాట – ‘అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది’ అయితే నేను మార్పుకు భయపడే రకం కాదు. అందుకే ధైర్యంగా నా కలకు శ్రీకారం చుట్టాను. 1975 ఫిబ్రవరి 22న ఉయ్యూరు పట్ట ణంలో ఒక తాటాకు ΄ పాకలో ‘శ్రీ విశ్వశాంతి’ పాఠశాలను ప్రారంభించాం.‘ఎంతో ఊహిస్తే ఆరుగురు విద్యార్థులేనా!’ అని మేము నిరాశపడిపోలేదు. ‘ఈరోజు ఆరుగురు...రేపు నూరు మంది’ అనుకున్నాము. అది వృథా పోలేదు. మరుసటి ఏడాది నుంచే హాస్టల్ను కూడ ప్రారంభించాము. అక్కడ మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ఉయ్యూరు (గండిగుంట) పరిధిలో సువిశాలమైన 80 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన భవన సముదాయంతో విస్తరించింది. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంది. ఎల్కేజీ నుంచి ప్లస్ 2 వరకూ విద్యాబోధన అందిస్తున్నాం. ‘మాదల ప్రమీలారాణి మెమోరియల్ జూనియర్ కళాశాల’ ఏర్పాటు చేశాం. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 6500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మా గ్రామీణ యూనివర్శిటీపై ప్రత్యక్షంగా 768 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరుగురితో మొదలైన విద్యాసంస్థ అందనంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమిటి? ‘మన ఆదర్శాలు, అంకితభావాన్ని మరచిపోయినప్పుడు మాత్రమే అపజయం ఎదురవుతుంది’ అంటారు నెహ్రు. పేద విద్యార్థులకు అండగా ఉండాలి అనే ఆదర్శాన్ని, సంస్థ కోసం క్షణక్షణం కష్టపడాలి అనే అంకితభావానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. అదే శ్రీ విశ్వశాంతి విజయ రహస్యం. ‘శ్రీ విశ్వశాంతి ‘గుడ్విల్’కు గుడ్ ఎగ్జాంపుల్గా నిలిచినా ‘పక్కా కమర్షియల్’ దారిలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఏ ప్రాంతంలో ప్రాంరంభమైందో ఆ ప్రాంతంలోనే పెరిగి, పెద్దై వటవృక్షమై ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులకు నీడను ఇస్తోంది. విద్యాసంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి సింగిల్ బ్రాంచ్గానే నడుపుతున్నాం. సేవాపథంలో...గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి చేయూతఅందించాలనేది మాదల ప్రమీలారాణి కోరిక. ఆమె కోరిక మేరకు ఏటా 300 మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వశాంతి నిర్వహిస్తోంది. ‘50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనతో విద్య అందించటం కోసం పాటుపడుతున్నాం. కుమారులు, కోడళ్లు అంతా పాఠశాలలోనే ఉంటూ విద్యా ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కగా చదివితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుంది’ అంటున్నారు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఫేస్ ప్రోగ్రాంఅధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్లు, లైబ్రరీలు గ్రామీణ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. ‘ఫేస్ప్రోగ్రాం’ పేరుతో విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఐఐటీ, జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎన్డీఏ, నీట్, ఒలంపియాడ్లకు కోచింగ్లను అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విశ్వశాంతిలో శిక్షణ పొదిన ఎంతోమంది విద్యార్థులు నేవీ, ఆర్మీలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎన్సీసీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానం ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, జెఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది శ్రీవిశ్వశాంతి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ విద్యారత్న’ పురస్కారాన్ని ‘శ్రీవిశ్వశాంతి’ ఫౌండర్ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు అందుకున్నారు. సొంతంగా పాల డైరీచదువుపై మాత్రమే కాదు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రీ విశ్వశాంతి గ్రామీణ యూనివర్శిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. విద్యార్థులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ప్రాంగణం అంతా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. యూనివర్శిటీ సొంతంగా పాల డైరీ నిర్వహిస్తోంది. సమర్థంగా డెయిరీ నిర్వహణకు ‘బెస్ట్ డెయిరీ ఫామ్ ఆఫ్ ఏపీ అవారుర్డును అందుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.ఇష్టంగా కష్టపడాలిప్రతి విద్యార్థికీ లక్ష్యశుద్ధి ఉండాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించు కుంటూ ఇష్టమైన పాఠ్యాంశాలను కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలి. సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తమకు అనువైన, ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో నైపుణ్యం సాధించి స్థిరపడాలి. అందుకు సూక్ష్మమైన, సున్నితమైన మార్గాలను అన్వేషించి సాధించుకోవటం అలవర్చుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. విజయం సాధించటం సులువు అవుతుంది. ఎవరూ పుట్టుకతోనే ఉన్నతులు కారు. జీవితంలో చూపిన అచంచలమైన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నతులను చేస్తుంది. విద్య నేర్పే గురువులు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే... గురువు అంటే నిరంతర విద్యార్థి అని అర్థం. గురువు అనే అర్థం చాలా విస్తృతమైనది. ఇది అర్థం కావాలంటే మన పూర్వ అపూర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ నేను లైబ్రరీల్లో అనేక పుస్తకాలను చదవటం వల్ల తెలుసుకున్నదే. యుద్ధ అశాంతి నుంచి శ్రీ విశ్వశాంతి చదువుకునే రోజుల్లో లైబ్రరీకి ఎక్కువగా వెళ్లేవాడిని. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. ఆయన జీవితం స్పూర్తిదాయకంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా సోదరుడు కృష్ణమూర్తి 18వ ఏట ఆర్మీలో చేరాడు. అప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. ఎందరో సైనికులు చనిపోయారంటూ వార్తలు విని చాలా కలత చెందేవాణ్ణి. యుద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోదనకు, వేదనకు గురవుతున్నాయి. అసలు యుద్ధం ఎందుకు? ఇరు వర్గాల నేతలు కూర్చుని సంప్రదించుకుంటే విశ్వశాంతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఆ ఆకాంక్ష నుంచే పుట్టిందే శ్రీ విశ్వశాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలనే తలంపుతో విద్యాసంస్థను నడుపుతున్నాను.– మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
సీట్లన్నీ మనోళ్లకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15శాతం నాన్–లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ 15 శాతం కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో... ఈ 15శాతం కోటా గడువు ముగిసిపోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే వివిధ ప్రవేశపరీక్షల ప్రకటనలు విడుదలవడంతో నాన్–లోకల్ కోటాను అమలు చేశారు. కమిటీ నివేదిక మేరకు సవరణలు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్–లోకల్ కోటాకు సవరణలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 1974లో తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. దాని ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ లోకల్ జోన్గా పేర్కొంటారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85శాతం సీట్లు స్థానికులకు, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాలు, తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని.. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 60వేలకుపైగా విద్యార్థులకు నో చాన్స్ రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు. నాన్–లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు 60 వేలకుపైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వారంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ (టీజీఈఏపీసెట్)కు గతేడాది 3,54,803 మంది హాజరవగా.. అందులో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు 49,071 మంది, అగ్రి, ఫార్మాకు 12,349 మంది కలిపి 61,420 మంది హాజరయ్యారు. ఎవరెవరు అర్హులు? – ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మిని్రస్టేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తాయి. – ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజియన్గా పరిగణిస్తారు. ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. వారు 85శాతం లోకల్, 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు. – ఇక తెలంగాణ వెలుపల చదువుకున్న సమయాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు... తెలంగాణ వెలుపల ఉద్యోగ కాలాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులున్న అభ్యర్థులు.. 15శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ స్థానికత ఉండి, ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వారిని కూడా అన్–రిజర్వుడ్ కోటా కిందకు తెచ్చారు. – తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. – రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి తెలంగాణ పరిధిలో భార్య, భర్త (స్పౌజ్) పనిచేస్తే.. వారి పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. -
పరీక్షల సమరం
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.మార్చి టు జూన్..మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే. తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు. విద్యార్థుల వెనుక కీలకంగా.. రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే. ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. – ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం) ఒకింత టెన్షన్గానే ఉంది గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. – ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) ––––––––––––––––––పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం.. అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. – సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల) -
ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతీయ వర్సిటీల హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్లు సాధించడం విశేషం. అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో–జీఈఆర్) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. ‘1857లో కోల్కతా, ముంబై, మద్రాస్లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. ఎస్పీయూల ద్వారా పురోగతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది. -
ఉన్నత చదువులకు.. యూఎస్ బాట
అధిక ప్యాకేజీలిచ్చే సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య అవసరమని యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ విద్యార్థులు విదేశాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో విద్యనభ్యసించేందుకు భారతీయ యువత ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే 2023–24లో అమెరికా వర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. – సాక్షి, అమరావతిదేశీయంగా పరిమిత సంఖ్యలోనే సీట్లుదేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఎక్కువ మంది యూఎస్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అధిక కటాఫ్లు, రిజర్వేషన్ విధానాలు, అవినీతి ఘటనల కారణంగా చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన దేశీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారు. అత్యంత పోటీ ఉండే ఐఐటీల్లో లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్కు, అడ్వాన్స్కు హాజరవుతుంటే.. కేవలం వేలల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు.కొన్ని సందర్భాల్లో జనరల్ కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థులకు సైతం సీట్లు దక్కడం లేదు. తత్ఫలితంగా దేశంలో అగ్రశ్రేణి సంస్థల్లో అత్యంత పోటీ వాతావరణం చాలామంది విద్యార్థులను విదేశాల్లో చదువులను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు భారత్లోని కొన్ని అగ్రశ్రేణి సంస్థల ఫీజులతో సమానంగా ఉంటోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చులు అధిక నాణ్యత కలిగిన విద్యను అందించిన ప్రసిద్ధ ఐఐటీలు ఇటీవల ఫీజులను పెంచేశాయి. అందుకే చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అగ్రశ్రేణి వర్సిటీలకు నిలయం అత్యాధునిక పరిశోధన అవకాశాలు, సౌకర్యాలు అందిస్తూ.. అంతర్జాతీయంగా జర్నల్స్ను ప్రచురించే అగ్రశ్రేణి వర్సిటీలకు అమెరికా నిలయంగా మారింది. భారతదేశంలో విద్య కొంతవరకు సాపేక్షంగా ఉన్నప్పటికీ ఐఐటీలు, ఐఐఎంల వంటి అగ్రశ్రేణి సంస్థలు యూఎస్ వర్సిటీలను అందుకోలేపోతున్నాయి. పైగా ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రవేశాలు పొందే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.మరోవైపు అమెరికా వర్సిటీలు విదేశీ విద్యార్థులకు సైతం అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. తద్వారా విద్యా, కెరీర్ వృద్ధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆ దేశం మారింది. ఈ క్రమంలోనే అమెరికాలో 42.9 శాతం మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్, 24.50 శాతం మంది ఇంజనీరింగ్, 11.20 శాతం మంది బిజినెస్ మేనేజ్మెంట్, 5.40 శాతం మంది ఫిజికల్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చేస్తున్నారు. దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో 2023–24లో 3.31 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ అగ్రస్థానంలో నిలబెట్టింది. యూఎస్లో ఉద్యోగ అవకాశాలు జాబ్ మార్కెట్లో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు మెకిన్సే, గూగుల్, అమెజాన్, యాపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి అగ్ర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎఫ్–1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 41శాతం పెరిగింది. -
నేడు ప్రభుత్వ సెలవు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
మన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యమెంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) జరగనుంది. దీనికో సం రాష్ట్రంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా స్కూళ్ళను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారు. ప్రతి మూడేళ్ళకోసారి ఈ పరీక్ష జరుగుతుంది. 2021లో జరిగిన న్యాస్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అయిదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు స్కోర్ కంటే కూడా రాష్ట్ర విద్యార్థుల స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించా రు. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. న్యాస్ను ప్ర తిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలుగా పరీక్షపై పాఠశాలల ప్రధానోపాధ్యా యులు దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఇప్పటికే మూడుసార్లు మోడల్ పరీక్షలు నిర్వహించారు. తాజా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ లేదా మే నెలలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. ఫరాఖ్కు నిర్వహణ బాధ్యతలు న్యాస్ పరీక్షను 2021 వరకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహించింది. ఈసారి నుంచి రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 పేరుతో ఎన్సీఈఆర్టీలోని స్వ తంత్ర సంస్థ ఫరాఖ్ (పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్) నిర్వహిస్తోంది. గ తంలో 3, 5, 8, 10 తరగతులకు న్యాస్ పరీక్ష ఉండేది. ఈసారి 3, 6, 9 తరగతులకు ఆ క్లాసు ల్లోని ప్రమాణాల మేర పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి 50 శాతం, ప్రైవేటు స్కూళ్ళ నుంచి మరో 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,500 పాఠశాలల నుంచి లక్ష మందిని పరీక్షకు ఎంపిక చేశారు. ఈసారి క్రిటికల్ థింకింగ్ కూడా.. న్యాస్ పరీక్ష విధానంలో ఈసారి నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. ఈసారి అదనంగా విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)కు సంబంధించిన నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలు, భవిష్యత్లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. మల్టిపుల్ చాయిస్గా ఉండే ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మూడో తరగతికి 45 ప్రశ్నలు, గంటన్నర సమయం, ఆరో తరగతికి 51 ప్రశ్నలు, గంటన్నర, 9వ తరగతికి 60 ప్రశ్నలకు రెండు గంటల సమయం ఉంటుంది. మొత్తం మీద న్యాస్ పరీక్ష కఠినంగా ఉండే అవకాశం ఉందని టీచ ర్లు చెబుతున్నారు. ప్రశ్నలను అనేక విధాలుగా ఇస్తున్నారని, సెంట్రల్ సిలబస్తో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యార్థులు ఏ మేరకు జవాబిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు. -
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
ఆహార నాణ్యతపై టాస్క్ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న ఆహారం నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభు త్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్య తపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్ఫోర్స్ కమి టీని ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు. ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారిటాస్క్ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.» ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపా« ద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.» ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.» వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.» త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.» ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.» వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనంమల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
వానల వేళ.. కాటేసే కరెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి మెరుగుపడిందికానీ, అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. పెచ్చులూడిపోయి నీరుకారే స్లాబులు, తడిచి చెమ్మెక్కిన గోడలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి.అలాంటి విద్యాసంస్థల్లో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యుత్ వైర్లు, లైన్లు, స్విచ్ బోర్డులు, ఎర్తింగ్, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిపై ఆడిట్ నిర్వహించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు విద్యుత్ ప్రమాదాల నివారణకు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే మేలు » ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్లు, జాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. పాడైపోయిన, అరిగిపోయిన వాటిని వెంటనే మార్చాలి » పాఠశాలలు, కళాశాలల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు తప్పనిసరిగా కంచె ఏర్పాటుచేయాలి »పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి » అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలక్ట్రికల్ సేఫ్టీ నిబంధనలను అనుసరించాలి » భూమిలో ఉన్న స్తంభాలను సరిగ్గా ఇన్సులేట్ చేయాలి. అన్ని కేబుల్స్, జంక్షన్లను ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు, సరి్టఫైడ్ ఎల్రక్టీషియన్లతో తనిఖీ చేయించాలి » ప్రామాణిక, మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి. కేబుల్స్, ప్లగ్లు కరగకుండా నిరోధించాలంటే సాకెట్కు ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ పరికరాలు సర్క్యూట్లో ప్లగ్ చేస్తే.. కరెంట్ వైర్లు వేడెక్కి స్పార్క్ వచ్చి మంటలు చెలరేగుతాయి » విద్యార్థులు, సిబ్బందికి లీకేజీలు, ఎలక్ట్రిక్ షాక్లను అరికట్టడం, బాధితులను రక్షించడం, షాక్కు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో అవగాహన కల్పించాలి » షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి వీలుగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి »సబ్స్టేషన్లు, సరఫరా లైన్లకు దూరంగా పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి »ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, జంక్షన్ బాక్స్, స్ట్రీట్ బాక్స్ మొదలైనవి కూడా పాఠశాలలకు సమీపంలో ఉండకూడదు »పాఠశాల ఆవరణలోను, విద్యార్థులు వెళ్లే మార్గంలోను ఉండే ట్రాన్స్ఫార్మర్లకు పూర్తి స్థాయిలో కంచె వేయాలి » విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్రిక్ పరికరాల్లో మరమ్మతులు వస్తే తప్పనిసరిగా ఎల్రక్టీషియన్ సహాయం తీసుకోవాలి. సొంతంగా మరమ్మతులు చేయకూడదు » కుళాయి, నీళ్ల ట్యాంకులకు సమీపంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించకూడదు » వర్షం, తుపానుల సమయాల్లో సరఫరా లైన్లు ఉన్న ఏ నిర్మాణం కింద ఆశ్రయం పొందకూడదు »కరెంటు తీగలకు సమీపంలోని చెట్లు ఎక్కడం, తాకడం వంటివి చేయకూడదు »ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులకు మెటల్ నిచ్చెనలు ఉపయోగించకూడదు » స్విచ్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ప్లగ్ని పట్టుకుని కేబుల్స్ను డిస్కనెక్ట్ చేయాలి » త్రీ పిన్ ఎర్త్ ప్లగ్లు, సాకెట్లను ఉపయోగించాలి. విరిగిన త్రీ పిన్ ప్లగ్లను ఎప్పుడూ వాడకూడదు » ఎక్స్టెన్షన్ కేబుల్స్ను వినియోగించకపోవడమే మంచిది. తప్పదనుకుంటే ఒకే సామర్థ్యం (ఆంపియర్ రేటింగ్) ఉన్నదాన్ని ఎంచుకోవాలి » అన్ని కనెక్షన్లు గట్టిగా, చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. ఏవైనా వదులుగా ఉంటే వెంటనే ఎలక్ట్రికల్ ఇన్చార్జికి తెలియజేయాలి » కేబుల్స్ చాలా వేడిగా ఉన్నట్లు అనిపించినా.. షాక్ తగిలినా.. పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేయాలి » వర్షం నీటితో నిండిపోయిన రహదారుల్లో విద్యుత్ వైర్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దారిలో వెళ్లే వాహనాలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి » ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలను తాకకూడదు నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోంది మానవ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం నుండి ప్రజలను రక్షించడం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ల కర్తవ్యం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యాసంస్థలు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలి. మేం అందించిన సూచనల ప్రకారం నడుచుకోవాలి. తద్వారా విద్యార్థులను విద్యుత్ షాక్ నుంచి కాపాడుకోగలుగుతాం. – జి.విజయలక్ష్మి, డైరెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ -
సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్
-
TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే. 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పక్కాగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రమూల గ్రామంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన ‘గాయత్రి’నిర్మాణాలపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత అక్కడి నాదెం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్జోన్లను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి.. చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంతమేర జరిగాయన్నది తేల్చి.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. వారి వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.. చట్ట విరుద్ధంగా తమ విద్యా సంస్థల భవనాల కూలి్చవేతకు హైడ్రా, అధికారులు ప్రయతి్నస్తున్నారంటూ.. గాయత్రి విద్యా, సాంస్కృతిక ట్రస్టు, అనురాగ్ వర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గూడ మధుకర్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 796, 813 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్లపై జస్టిస్ టి.వినోద్కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘1954, 1955 కాస్రా పహాణీ ప్రకారం నాదెం చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు. పిటిషనర్ విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఉన్నాయి.కూల్చివేత సహా ఎలాంటి చర్యలు చేపట్టినా పిటిషనర్కు నోటీసులు జారీ చేస్తాం. ఆ భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పిటిషనర్ను ఆదేశించాలి’’అని న్యాయమూర్తిని స్పెషల్ జీపీ కోరారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ.. అధికారుల నుంచి అనుమతి పొందినా కూడా తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను ఆదేశించారు. నాగోల్లోని సర్వే ఆఫ్ ఇండియా, సనత్నగర్, షాద్నగర్లలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి నాదెం చెరువుకు సంబంధించి స్పష్టమైన మ్యాప్లను తీసుకుని.. వాటి ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్థారించాలని స్పెషల్ జీపీకి సూచించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. -
నెల తర్వాత తెరుచుకున్న బంగ్లా బడులు
ఢాకా: బంగ్లాదేశ్లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. హైదరాబాద్లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్స్టేషన్కు తరలించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎసరు పెడుతున్న కూటమి ప్రభుత్వం
-
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్చుప్గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్కే ఫ్లాట్కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్కేక్లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి.అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
నేడు విద్యా సంస్థలకు సెలవు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. -
బిహార్లో 65 శాతానికి రిజర్వేషన్లు
పాట్నా: బిహార్లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75శాతానికి చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తమ్మీద 75 శాతానికి చేరుకున్నాయి’అని అన్నారు . అంతకుముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీల)కు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. -
మరాఠా రిజర్వేషన్లకు ఓకే : ఏక్నాథ్ షిండే
ముంబై: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. రిజర్వేషన్ల అమ లు విషయంలో చట్టపరిధిలో విధివిధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేపడుతున్న ఆందోళనలు, జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. నిరవధిక దీక్ష విరమించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జారంగీని కోరుతూ అఖిలపక్ష భేటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్వర్గం) నాయకుడు అనిల్ పారబ్ తదితరులు సంతకాలు చేశారు. అనంతరం సీఎం షిండే మీడియాతో మాట్లాడారు. హింసకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని రాజకీయ పారీ్టలకు సూచించారు. -
'అన్అకాడమీ'లో అసలేం జరుగుతోంది?
బెంగళూరు: సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ 'అన్అకాడమీ'లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సుబ్రమణియన్ రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం అన్అకాడమీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హా సంస్థ నుంచి వైదొలిగారు. తాజాగా, రామచంద్రన్ సైతం కంపెనీని విడిచి పెట్టి వెళ్లడం ఎడ్టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే, సీఎఫ్వో ఎందుకు రాజీనామా చేశారు? రెండు నెలల క్రితం అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలకు.. వరుస రిజిగ్నేషన్లకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్ట్లో అన్అకాడమీని బ్యాన్చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ లోక్సభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరణ్. పైగా ‘ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,’ అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge. Our learners are at the centre of… — Roman Saini (@RomanSaini) August 17, 2023 దీనికి కారణమైన కరణ్ను అన్అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ విధుల నుంచి తొలగించారు. ‘క్లాసు రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్(కరణ్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని’ పోస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అన్అకాడమీ నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో)సుబ్రమణియన్ రామచంద్రన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హాలు బయటకు వచ్చారు. చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్వేర్ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
ఎన్ఈపీ సారథులు ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)–2020 అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ‘ఎన్ఈపీ సారథి’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు కోసం ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేసింది. తాజాగా వారి జాబితాను ప్రకటించింది. ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన వీరిని ఎన్ఈపీ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యాసంస్థలకు చెందిన వైస్చాన్స్లర్లు, డైరెక్టర్లు ప్రిన్సిపాళ్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతామని యూజీసీ భావిస్తోంది. మన రాష్ట్రం నుంచి 8 కాలేజీలకు చెందిన 23 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. సర్టిఫికెట్, డిప్లొమో, యూజీ, పీజీ విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాల సాధనలో విద్యార్థులను నిమగ్నం చేయడం, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా యూజీసీ దీనికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్కరణలు విజయవంతంగా అమలు కావడానికి విద్యార్థుల ప్రమేయం, వారిలో నిబద్ధత చాలా ముఖ్యమైనవని, అప్పుడే ఇది విజయ వంతం అవుతుందని యూజీసీ అభిప్రాయ పడుతోంది. ఈవెంట్లు, డిబేట్లు, పోటీలు, క్విజ్లు వంటి కార్యక్రమాలను కాలేజీల్లో నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్ఈపీపై ప్రచారం చేయడం, కాలేజీల్లో ఎన్ఈపీ హెల్ప్ డెసు్కల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతిభగల విద్యార్థుల ఎంపిక ఎన్ఈపీ అంబాసిడర్గా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ సంస్థల్లో అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామర్థ్యాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ పటిమ ఉన్న ముగ్గురు విద్యార్థులను నామినేట్ చేశాయి. వారి నుంచి యూజీసీ అర్హులైన వారిని ఎంపిక చేసి ఎన్ఈపీ అంబాసిడర్లుగా ప్రకటించింది. వీరి విధుల్లో ఎన్ఈపీ– 2020 కార్యక్రమాలపై ఇతర విద్యార్థులకు అవగాహన పెంచడం, క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనవి. అంతేగాక ఈ కార్యక్రమం అమలుపై యూజీసీకి ఫీడ్బ్యాక్ను అందించాలి. అంబాసిడర్గా ఎంపికైన వారికి యూజీసీ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్తో వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సర్టిఫికెట్తో పాటు యూజీసీ ఆన్లైన్ ప్రోగ్రామ్లు, ఇతర అవకాశాలను కూడా వారు పొందుతారు. అలాగే ఈ అనుభవం వారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యాకోర్సుల అభ్యాసానికి సహకరిస్తుంది. -
హైదరాబాద్లో స్కూళ్లకు ఇవాళ సెలవు
-
నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది ‘కీ’లు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్ఈఐఆర్బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్ఈఐఆర్బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. అవరోహణ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్నోట్ జారీ చేసిన టీఆర్ఈఐఆర్బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది. ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది. -
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
తెలంగాణలో రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు
-
వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడం పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంటర్ ప్రవేశాల తేదీ పొడిగింపు భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్ గడువు పెంపు ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని ఈ నెల 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు. -
విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు సోమవారం నుంచి పునః ప్రారంభమవుతాయా? వర్షాలు ఇంకా పడుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారా? ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. భారీవర్షాల నేపథ్యంలో గురు, శుక్ర, శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఆలస్యమైందని, దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలెన్నో.... వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, నెట్వర్క్ కనెక్షన్లో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో దోస్త్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఆదివారంతో ముగిసింది. అయితే చాలామంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోవిడత కౌన్సెలింగ్ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువూ పొడిగించాలని కోరుతున్నాయి. డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి దోస్త్కు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ ఈ నెల 26తో ముగుస్తుంది. జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి నెట్లోనో, లేదా కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్టు చేసేందుకు అనేక సమస్యలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని, వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ కారణంగా దోస్త్ రిపోర్టింగ్ గడువు పొడిగించే యోచనపై అధికారులూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. -
విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వానలు తగ్గకపోతే శనివారం కూడా సెలవు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షలను రద్దు చేశారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అకస్మాత్తుగా సెలవు నిర్ణయంతో.. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. కానీ దీనిపై బుధవారం రాత్రి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టుగా గురువారం ఉదయం ప్రకటించారు. ఇది కూడా జిల్లా అధికారులకు మెసేజీల ద్వారా తెలిపారు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనితో సెలవుల విషయం తెలిసేసరికే విద్యార్థులంతా వానలో ఇబ్బందిపడుతూనే స్కూళ్లకు చేరారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడే విద్యార్థులను తిప్పి పంపేయగా.. మరికొన్ని విద్యా సంస్థలు ఒంటి గంట వరకు ఇళ్లకు పంపించాయి. ఆటోల్లో, సైకిళ్లపై, నడుచుకుంటూ బడులకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెలవు విషయం తెలియడంతో తల్లిదండ్రులు హడావుడిగా స్కూళ్ల వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నెట్ ఇబ్బందితో.. ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 22 నాటికల్లా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీనితో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. హాస్టళ్ల నుంచి ఇళ్లకు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో శుక్ర, శనివారాలు సెలవు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
చదువులకూ పెద్దన్నే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం.. దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా? రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్షిప్లు.. ఇలా మరెన్నో సానుకూల అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్! అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నాయి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ మొదలుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సులుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యోగాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ విద్యార్థుల్లో చాలామంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్టన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి. ఎన్నో రకాల వెసులుబాట్లతో.. భారత్లో ఇంటర్మీడియట్లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్ (ప్రధాన సబ్జెక్ట్)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్గా ఎంచుకోవచ్చు. కచ్చితంగా క్లాస్రూమ్లకు రావాలన్న నియమం లేదు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు. గుర్తింపు, ఉద్యోగావకాశాలు అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్వర్క్, ఫార్చ్యూన్–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) అంటారు. యూనివర్సిటీలు స్వయంగా కెరీర్ సర్వీసులను కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న అంశాల నుంచి కంపెనీలతో కెరీర్ ఫెయిర్లు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వరకు సాయం అందిస్తాయి. ఖర్చుల మాటేమిటి? అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలామంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువుకునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు. ♦ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్ర్షిప్ లు, క్యాంపస్లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్) ఈ యూనివర్సిటీలో లభించదు. ♦ కేవలం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు మాత్రమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమనుకుంటే ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ విభాగాన్ని సంప్రదించవచ్చు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది. స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు. తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. -
బోధనాస్పత్రుల బలోపేతం
కర్నూలులోని అశోక్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ కేదారేశ్వరయ్య గత ఫిబ్రవరిలో గుండెపోటుకు గురవటంతో కుటుంబ సభ్యులు స్థానిక జీజీహెచ్లో చేర్చారు. స్టెంట్ వేయడానికి వీలులేని ప్రదేశంలో రక్తనాళాల్లో బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ అవసరమైంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్రెడ్డి చిన్న కోతతో అరుదైన పద్ధతిలో బైపాస్ సర్జరీ చేశారు. ప్రైవేట్లో రూ.5 లక్షలు దాకా ఖర్చయ్యే శస్త్ర చికిత్సను జీజీహెచ్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. తెనాలి రూరల్ మండలం పెదరావూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థికి గత నెలలో ఫిట్స్ రావడంతో కన్ను తీవ్రంగా వాచింది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొనడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ముక్కులో ఇటమాయిడ్ సైనసైటిస్తో ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్థారించిన వైద్యులు ఆర్టిటల్ డికంప్రషన్ ఆపరేషన్ ద్వారా విద్యార్థి కంటి చూపుతో పాటు, ప్రాణాలను కాపాడారు. సుమారు రూ.3 లక్షల ఖరీదైన ఆపరేషన్ను జీజీహెచ్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: అరుదైన శస్త్ర చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోధనాస్పత్రుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోగుల తాకిడికి అనుగుణంగా వనరులు సమకూర్చడంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఏడాదిలో 2.22 లక్షల కేసులు 2022–23లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 2,22,147 కేసులకు వైద్య సేవలు అందించారు. ఇందుకు రూ.388.63 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018–19 నుంచి బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులను పరిశీలిస్తే ఇదే అత్యధికం. టీడీపీ హయాంలో కేవలం 90 వేల లోపు కేసులకు మాత్రమే బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందగా ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం. విజయవాడ జీజీహెచ్ టాప్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవల్లో విజయవాడ జీజీహెచ్ 2022–23లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 27,081 ఆరోగ్యశ్రీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 22,104 కేసులతో కర్నూలు జీజీహెచ్ రెండో స్థానంలో, 21732 కేసులతో విశాఖ కేజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రత్యేక పర్యవేక్షణ ఇన్నాళ్లూ ప్రభుత్వాస్పత్రుల్లో వనరులు సరిగా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని మరింత పెంచి ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2019 నుంచి బోధనాస్పత్రుల్లో 1,582 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు ప్రమోషన్ల రూపంలో కలిపి మొత్తం రెండు వేల వరకూ పోస్టుల భర్తీ చేపట్టింది. గతంతో పోలిస్తే మైనర్, మేజర్ సర్జరీలు, ఇతర చికిత్సలు బోధనాస్పత్రుల్లో గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచినట్లు డీఎంఈ డాక్టర్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతివారం సమీక్ష చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. -
కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది. సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సాహంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవడంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. మూడు విభాగాల్లో కళా గురువులు.. ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు. పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేదికను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు. కళారూపాల జాబితా ఇలా.. హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్ ఉడ్ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్, ఉడ్ కారి్వంగ్, ప్రింటెడ్ టెక్స్టైల్స్, నేచురల్–ఆర్గానిక్ డైస్ ప్రిపరేషన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కార్పెట్ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్ గోయ్ తదితరాలు. శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్/జుగల్బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్/జాజ్, కోయిర్ గానం తదితరాలు. డ్యాన్స్: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదితరాలు. జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలాము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెండి, పంతి, కర్మ, దమ్కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తుల్లాల్, కర్మ, గౌర్ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్ చోలోమ్, నోంగ్క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలికాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్ తదితరాలు. వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, టెక్స్టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్ ఆర్ట్ (రంగోలి/మందన/కోలమెట్సీ), కథకులు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, కామిక్ ఆర్ట్ తదితరాలు. -
ప్రతి విద్యాసంస్థలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు. ర్యాగింగ్ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించడంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులు, సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్లను భాగస్వాములను చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. -
ఆన్లైన్ చదువులపైనే ఆసక్తి
సాక్షి, అమరావతి: ఇప్పుడు అంతా ఆన్లైన్మయం. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇందుకు విద్యా రంగం మినహాయింపు కాదు. ముఖ్యంగా కోవిడ్ కల్లోల పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్స్, వెబ్సైట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా ఇళ్లకే అతుక్కుపోయారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధించాయి. అభ్యసనం మొదలుకుని.. పరీక్షల వరకు అన్నీ ఆన్లైన్ వేదికగానే సాగాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ చదువులపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేరుగా కాలేజీల్లో చదివే అవకాశాల్లేనివారితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు, అదనపు విద్యార్హతలను సంపాదించుకోవాలనుకొనే వారు ఈ ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఆన్లైన్ విద్య అందరికీ మరింత అందుబాటులోకి వచ్చింది. ‘స్వయం’.. వందలాది కోర్సులు.. ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఎడ్టెక్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’ (స్వయం – https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ కోర్సులకు సంబంధించి ఇదివరకు ఉన్న నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకింత సడలించింది. నిర్ణీత ప్రమాణాలతో ఆన్లైన్ కోర్సులను అందించేందుకు పలు సంస్థలకు అనుమతులు కూడా మంజూరు చేస్తోంది. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. మరోవైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులను అభ్యసించేలా చర్యలు చేపట్టాయి. ఆన్లైన్లోనే కాకుండా ఓడీఎల్ విధానంలోనూ.. కరోనాకు ముందు ఆన్లైన్ చదువులవైపు ఆసక్తి చూపినవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా తర్వాత వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021–2022లో ఆన్లైన్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య 170 శాతం మేర పెరిగినట్లు యూజీసీ సహా పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలోనూ ఆన్లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. ఆన్లైన్, ఓడీఎల్ మార్గాల్లో చదువులు కొనసాగిస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మేరకు సంస్థలు కూడా అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్పైనే మోజు.. వివిధ వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు, వాటిలో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులను అభ్యసించే వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఉన్నత విద్య విభాగం సర్వే గణాంకాలు పరిశీలిస్తే.. పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు మాత్రమే ఈ ఆన్లైన్, ఓడీఎల్ కోర్సుల్లో చేరుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారిలో ఎక్కువ మంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీలు వంటి జాతీయస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు కూడా వీటిని అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. -
ఏపీలోనూ విదేశీ కోర్సులు.. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ రాష్ట్రంలోనూ అమలు
విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారానే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సోలార్ పార్క్లు, సోలార్ మోటార్లు, ప్యానల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరతను అధిగమించేలా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు అందుబాటులో ఉండాలి. వీటిలో ఈ దిశగా కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్ నాటికి ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్ పాలసీ ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు అక్కడి విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా కోర్సులు మన విద్యార్థులకు ఏమేరకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయో పరిశీలించి, వాటిని ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలని, ఈ దిశగా వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో సమగ్రత తేవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లోని కోర్సుల పాఠ్య ప్రణాళికను ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ ఓరియెంటెడ్గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్ కోర్సులను ఈ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీలు అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలను కూడా పరిశీలించి, రాష్ట్రంలో కూడా అటువంటి పాఠ్య ప్రణాళికలను అమలు చేయాలన్నారు. స్వయం ఉపాధిని కల్పించే కోర్సుల కోసం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి సంస్థలతో అనుసంధానం (టైఅప్) చేసుకోవాలని సూచించారు. రిస్క్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. వచ్చే జూన్ కల్లా పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన నియామకాలు ► ఉన్నత విద్యా శాఖలో 2 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్లకు సంబంధించిన కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, జూన్ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ► ఉన్నత విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. సమర్థులైన బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలి. తద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలను పెంచేందుకు అవకాశముంటుంది. ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలి. కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా చేయూత ► రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ న్యాక్ తదితర సంస్థల అక్రిడిటేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతుల పరంగా నాణ్యత పెరగాలి. ఈ దిశగా ప్రతి విద్యా సంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. ► కాలేజీలు ప్రమాణాలు పెంచుకునేలా మూడేళ్ల పాటు వారికి చేయూతనివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో అక్రిడిటేషన్కు వీలుగా ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యా సంస్థలు న్యాక్ అక్రిడిటేషన్ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ► కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిసి కరిక్యులమ్ రూపొందించాలి. హై ఎండ్ స్కిల్స్లో భాగంగా సాప్ట్వేర్ స్కిల్స్ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. సెంట్రల్ ఆంధ్రాలో అకడమిక్ స్టాఫ్ కాలేజ్ ► బోధనా సిబ్బంది సామర్థ్యం మెరుగు పరచడానికి తిరుపతి, విశాఖపట్నంలలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలి. వీటితో పాటు సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ► కొన్ని ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కాలేజీల్లోని బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలి. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలి. డ్రాపవుట్లకు తావులేకుండా చర్యలు ► పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమ చేస్తోంది. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ► మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్ (గరిష్ట చేరికల నిష్పత్తి) తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కేసి.రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: సరికొత్త చట్టాలు, అధునాతన సాంకేతికత సహాయంతో ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం మోపాలని ఉన్న త విద్యా, పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికిగాను ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో గురువారం ఇక్కడ ‘విద్యాసంస్థల్లో భద్రతాచర్యలు, రక్షణ విధానం’అనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో మాదవద్రవ్యాలు, సైబర్ నేరాలు, వివక్ష, వేధింపుల నియంత్రణ సవాల్గా మారిందని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. విద్యాసంస్థల్లోకి పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకునే చట్టాలను మార్చాలని, స్వేచ్ఛగా ప్రవేశించి, ఏ కేసునైనా శోధించే వీలు కల్పించాలని, నిఘా వ్యవస్థ కోసం పటిష్టమైన చర్యలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని పోలీ సు అధికారులు అభిప్రాయపడ్డారు. సీసీ కెమెరా లు, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పలువురు సూచించగా వీటన్నింటికీ నిధుల సమ స్య ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అంతిమంగా పోలీసు, విద్యాశాఖ కలిసి పనిచేయాలని, ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు. భద్రత ముఖ్యమే: లింబాద్రి సమావేశం అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థల్లో భద్రత కీలకమైన అంశమని, దీని కోసం పోలీసు లు, విద్యాశాఖ సమన్వయంతో ముందుకువెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుండే వర్సిటీ క్యాంపస్ల్లో డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం వంటి విషయాలపై అవగాహనకు సరికొత్త విధానాలు అనుసరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే వారిలో న్యూనతాభావం తొలగించేందుకు, ఒత్తిడికి లోనవ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరంపై చర్చించనట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడే వీలుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే క్రమంలో వాటిని వినియోగించే విద్యార్థులను నేరస్తులుగా చూడబోమన్నారు. గవర్నర్ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదం పొంది, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం బషీర్బాగ్లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియ ద ని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. -
జేఈఈ మెయిన్ సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 సిలబస్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్లో 16 టాపిక్లు, ఫిజిక్స్ సెక్షన్–ఏలో 20 టాపిక్స్, సెక్షన్–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్లో భాగంగా బీఈ, బీటెక్లో ప్రవేశాలకు పేపర్–1, బీఆర్క్ కోసం పేపర్–2ఏ, బీప్లానింగ్కు పేపర్–2బీని నిర్వహిస్తారు. పేపర్–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ ఆన్సర్కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లుగా పరీక్షలు.. కాగా జేఈఈ మెయిన్ పరీక్షలను జనవరి, ఏప్రిల్లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్ బోర్డులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. -
విద్యార్థుల భద్రతపై సమావేశం
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత, రక్షణ వ్యవస్థ ఏర్పా టుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా జరిగే ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, అదనపు డీజీ స్వాతిలక్రా సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొంటారని ఆయ న తెలిపారు. కళాశాలల్లో చేరే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, సైబర్ నేరాలకు ఆకర్షితులవ్వకుండా, వివిధ కారణాల వల్ల ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. -
AP: అత్యవసర వైద్యం మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసరమయ్యే క్లిష్టమైన సంరక్షణ(క్రిటికల్ కేర్)ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుండెపోటు, కార్డియో వాస్కులర్ స్ట్రోక్స్, శ్వాసకోశ రుగ్మతలు, పాయిజన్, సెప్టిక్ షాక్, ఇతర సందర్భాల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవల కోసం నెల్లూరు జీజీహెచ్, కడప, శ్రీకాకుళం రిమ్స్లలో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా వైరస్ తెలియజేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీసీబీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.71.25 కోట్లతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరు, కడప, శ్రీకాకుళంలో ఒక్కోచోట రూ.23.75కోట్ల ఖర్చుతో రూ.71.25 కోట్లతో 50 పడకల సామర్థ్యంతో సీసీబీలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జీజీహెచ్, కడప రిమ్స్లో సీసీబీల ఏర్పాటుకు డీపీఆర్లు రూపొందించగా, వాటికి ఆమోదం లభించింది. సీసీబీల ఏర్పాటుకు టెండర్లను పిలవాలని ఎన్హెచ్ఎం నుంచి ఏపీఎంఎస్ఐడీసీకి ప్రతిపాదనలను పంపారు. శ్రీకాకుళం రిమ్స్లో సీసీబీ ఏర్పాటుకు డీపీఆర్ను రూపొందిస్తున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి, శరవేగంగా సీసీబీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ ‘సాక్షి’తో చెప్పారు. -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది. -
పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు
హుడాకాంప్లెక్స్(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివా రం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ రంగం కుదేలైనా హైదరాబాద్లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరు కాదు, హైదరాబాదే.. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్బీ నగర్లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్జోన్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
China Zero Covid policy: యూనివర్సిటీలు ఖాళీ
బీజింగ్: చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. దీంతో విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలను సడలించాలని, అధ్యక్షుడు జిన్పింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. డ్రాగన్ దేశంలో ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. పోలీసులు, సైనిక సిబ్బంది భారీ సంఖ్యలో మోహరించడంతో బీజింగ్, షాంఘై సహా పలు నగరాల్లో మంగళవారం ఆందోళనలు పెద్దగా కనిపించలేదు. మరోవైపు ‘జీరో కోవిడ్’ వ్యూహాన్ని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సంకేతాలిచ్చింది. అప్పట్లో వర్సిటీలే ఉద్యమ కేంద్రాలు అధినేత షీ జిన్పింగ్ చదువుకున్న తిసింగువా యూనివర్సిటీ నుంచి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. రాజధాని బీజింగ్లోని పాఠశాలలు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నాయి. గాంగ్డాంగ్ ప్రావిన్స్లోని విద్యాసంస్థలు కూడా విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు బస్సులను సమకూర్చాయి. ఇకపై తరగతులు, వార్షిక పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తేల్చిచెప్పాయి. ఇళ్లకు వెళ్లిపోవాలని కోరుకొనే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని బీజింగ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ప్రకటించింది. చైనాలో 1980వ దశకంలో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో యూనివర్సిటీ క్యాంపస్లే ఉద్యమ కేంద్రాలుగా మారాయి. 1989లో చరిత్రాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థుల ఊరేగింపుపై సైన్యం దాడి చేసింది. యూనివర్సిటీల్లో విద్యార్థులు లేకుండా చేయడం ద్వారా జీరో కోవిడ్ వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చాలన్నదే ప్రభుత్వ వ్యూహమని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో పనిచేస్తున్న చైనా రాజకీయ వ్యవహారాల నిపుణుడు డాలీ యాంగ్ విశ్లేషించారు. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం 30 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా జనం రాకపోకలపై అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తుండడం గమనార్హం. -
2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్ గుర్తింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది. కాలేజీలకు నాక్ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్ ‘ఎ’ గ్రేడ్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెల్ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు. ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. తొలి అడుగుగా నాక్ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్ ప్రిపరేషన్ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్షిప్ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్ ఇంటర్న్షిప్నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్ ఇంటర్న్షిప్ను అందిస్తున్నారు. -
Telangana: మరో గుడ్న్యూస్! డిసెంబర్లో గురుకుల నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారంలోగా పూర్తి... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరి శీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది. డిసెంబర్లో నోటిఫికేషన్ గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది. -
వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎమ్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్), యూనివర్సిటీ ఆఫ్ లండన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు. పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు.. ► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే ఉంటుంది. ► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు ► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు ► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి ► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి ► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు ► ఇప్పటికే టీచింగ్ పొజిషన్లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్ఫామ్ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
నీట్ ఫలితాలు విడుదల 9.93 లక్షల మంది ఉత్తీర్ణత
-
అడ్వాన్స్డ్ను అధిగమిస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది. 2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్గా కొనసాగుతున్నాయి. ప్రవేశానికి రెండంచెల విధానం.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు. 2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది. సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్లో, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది. -
AP: 27న స్కూళ్లకు సెలవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
ఎక్కడ అనుమతిస్తే.. అక్కడే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఇష్టానుసారంగా నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంజూరైన నియోజకవర్గాల పరిధిలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. గురుకుల పాఠశాలలను ఒక చోట మంజూరు చేస్తే మరో ప్రదేశంలో నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు సంబంధించి దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఒకటి బాలికలది కాగా, మరొకటి బాలుర గురుకులం. వీటిని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలి. ఈ మేరకు గురుకుల పాఠశాలల మంజూరు సమయంలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్దేశిస్తారు. కానీ ప్రస్తుతం మూడువంతుల గురుకుల విద్యా సంస్థలను అనుమతించిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలు దొరక్క.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 820 గురుకుల పాఠశాలలు కాగా, వీటిలో మూడోవంతు పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవికాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విడతలవారీగా మంజూరు చేయగా.. వాటికి భవనాలను నిర్మించే వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని సూచించింది. దీంతో గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిబంధనలకు అనుగుణంగా భవనాలను వెతికినప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతాల్లో తగిన భవనాలు లభించక.. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారు. భవనాల లభ్యత ఉన్న చోటనే అద్దెకు తీసుకుని అక్కడే గురుకులాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పెద్ద భవనాలున్న చోట రెండు, మూడు, నాలుగు.. గురుకుల పాఠశాలలను ఒకే క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాల మంజూరు చేసిన ప్రాంతం దాటి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఫిర్యాదులతో.. స్పందించిన సర్కారు అనేక చోట్ల ఆయా నియోజకవర్గాల పరిధి దాటి వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికతకు ప్రాధాన్యతమిస్తూ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా.. అనుమతించిన ప్రాంతంలోనే గురుకుల పాఠశాలలను నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండురోజుల కిందట రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో సమావేశమై లొకేషన్ల అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఎక్కడ మంజూరు చేస్తే అక్కడే గురుకులాన్ని నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలను గుర్తించి వెంటనే అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహాలో ఆదేశాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
జేఈఈ మెయిన్కు 6,29,778 మంది
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ సహా జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం నుంచి తుది విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని తెలిపింది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ అభ్యర్థుల పర్సంటైల్ కూడా ప్రకటించింది. రెండో విడత జరగబోయే పరీక్షకు దేశవ్యాప్తంగా 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఎన్టీఏ పేర్కొంది. సిలబస్ కుదించకుండా చాయిస్ జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానాన్ని ఈ సంవత్సరం పూర్తిగా మార్చారు. గతంలో సెక్షన్–ఏ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బీ లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ తెలిపింది. బీఈ, బీటెక్తో పాటు బీఆర్క్కు సంబంధించిన పేపర్–2ఏ లోని సెక్షన్–బీ లో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్–1, పేపర్–2ఏ, 2–బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్ను ఇచ్చింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. తుది విడత మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే ప్రాథమిక కీ విడుదల చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది. ఆ మర్నాడే పూర్తిస్థాయి పర్సంటైల్ వెలువడే వీలుంది. ఆగస్టు రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్డ్కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుంది. అదేనెల 28న పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. టై బ్రేకర్లోనూ మార్పులు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మొదటి విడత రాసినవారికి సులువే తొలి విడత జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్లకు ఈ పరీక్ష కొంత తేలికగానే ఉండే వీలుంది. జూన్లో జరిగిన పరీక్ష తాలూకూ ప్రశ్నపత్రం ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దాదాపు అవే చాప్టర్స్ వచ్చే వీలుంది. మేథ్స్లో సుదీర్ఘంగా ప్రశ్నలుంటే కంగారు పడకూడదు. నెగెటివ్ మార్కింగ్ను దృష్టిలో పెట్టుకుని జవాబులివ్వాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర బోధకుడు) పాత పేపర్లు తిరగేస్తే మంచిది జూన్లో జరిగిన జేఈఈలో ఫిజిక్స్ పేపర్ మధ్యస్తంగానే ఉంది. ఈసారీ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉండే వీలుంది. ఇవే చాప్టర్స్ను చదువుకుని, పాత పేపర్లు ఒక్కసారి తిరగేస్తే తేలికగా సమాధానం ఇవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నెగెటివ్ మార్కుల బాధ నుంచి తప్పించుకోవచ్చు. – జీకే రావు (ఫిజిక్స్ బోధకుడు) -
తీరుమారని ‘ఉన్నతశ్రేణి’
సమాజానికి దీపధారులుగా దాని అభ్యున్నతికి పాటుపడవలసిన ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు అందుకు విరుద్ధమైన పోకడలు పోతున్నాయని తాజాగా పార్లమెంటుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ల మాటెలా ఉన్నా దేశంలో ఇప్పటికీ ఉన్నతశ్రేణి మేధో కేంద్రాలుగా ఐఐటీ, ఐఐఎంలదే అగ్రస్థానం. ఎన్నడో 50వ దశకంలో ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలో ఈ సంస్థలు మొగ్గతొడిగి క్రమేపీ విస్తరించాయి. కానీ వాటి ఆలోచనా శైలి, పనితీరు మాత్రం ఆ కాలంలోనే ఉండిపోయాయన్న సందేహం కలుగుతుంది. నిరుడు ఢిల్లీ ఐఐటీలోని 8 విభాగాల్లో పరిశోధనలు చేసేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు 637 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోలేదు. మొత్తం 53 పీహెచ్డీ సీట్లుంటే ఆర్థికంగా వెనకబడిన కోటా(ఈడబ్ల్యూఎస్) కింద వచ్చిన 1,362 దరఖాస్తుల నుంచి ఆ సీట్లకు ఎంపిక చేశారు. దేశంలోని మరో 9 ఐఐటీల్లో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. హైదరాబాద్, తిరుపతి ఐఐటీలు సహా ఎనిమిదింటిలో కొన్ని విభాగాల్లో అసలు ఎస్టీ విద్యార్థులే లేరు. మండీ ఐఐటీ అయితే ఎస్టీలతోపాటు ఎస్సీల నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోకుండా చరిత్ర సృష్టించింది. ఎనిమిది ఐఐటీల్లో ఆరు సబ్జెక్టుల్లో ఓబీసీలకు స్థానమే లేదు. ఈ ఐఐటీల్లో హైదరాబాద్, తిరుపతి కూడా ఉన్నాయి. అటు ఐఐఎంల వాలకం కూడా ఇంతే. ఈ సంస్థలు కూడా పీహెచ్డీ సీట్లలో నిబంధనలన్నిటినీ గాలికొదిలాయి. పీహెచ్డీ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం వాటా దక్కాల్సి ఉండగా 2018–19 మొదలుకొని 2021–22 విద్యాసంవత్సరం వరకూ ఏటా కనీసం 4 శాతం కూడా ఆ వర్గాలకు రాలేదు. ఉన్నత శ్రేణి విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలనీ, వాటిపై మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ ఉండరాదనీ అందరూ కోరుకుంటారు. వర్తమానంలో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా ఆలోచించేలా, సంక్లిష్ట సమస్యలకు మెరుగైన పరిష్కారాలను రూపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆ ప్రతిపత్తి తోడ్పడాలి తప్ప అట్టడుగు వర్గాలవారి అవకాశాలకు గండికొట్టేందుకు కాదు. ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు కావొచ్చు, మరేవైనా కావొచ్చు... అవి వైవిధ్య భరిత భారత సమాజాన్ని ప్రతిబింబించాలి. అన్ని వర్గాలవారికీ అందులో భాగస్వామ్యం ఉండాలి. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయి. భిన్న వర్గాలవారు కలిసి చదువుకోవడంవల్ల సమాజ పోకడలు ఎలా ఉంటాయో, పరిష్కారాలు ఆలోచించే తీరెలా ఉండాలో అందరికీ అవగాహన కలుగుతుంది. అది అంతిమంగా సమాజ అభ్యున్నతికి దోహదపడుతుంది. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల సారథులు విశాల దృక్పథంతో వ్యవహరిస్తే అదేమంత కష్టం కాదు. కానీ ఇప్పుడు వెల్లడైన నివేదికలు గమనిస్తే ఆ సంస్థలు శల్యసారథ్యంతో కునారిల్లుతున్నాయనీ, రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశమే దెబ్బతింటున్నదనీ అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతమైనా, మూడేళ్లక్రితం ముంబైలోని ఉన్నత శ్రేణి వైద్య కళాశాల పీజీ విద్యార్థిని పాయల్ తాడ్వి ప్రాణం తీసుకున్న వైనమైనా వాటి సారథుల వైఫల్యాలనూ, ఆ విద్యాసంస్థల నిర్వహణ తీరునూ పట్టిచూపాయి. ఈ ఉదంతాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. కానీ మీడియాకు ఎక్కని, కారణాలు వెల్లడికాని ఆత్మహత్యలు మరెన్నో చూస్తే గుండె చెరువవుతుంది. నిరుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభకు అందజేసిన గణాంకాల ప్రకారం 2014–21 మధ్య ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థులు బలిదానం చేస్తే అందులో 71 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు. ఇక మధ్యలో చదువు చాలించుకుని వెళ్తున్నవారిలో సైతం అట్టడుగు వర్గాలవారే ఎక్కువ. నిరుడు ఆగస్టులో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు ఐఐటీల్లో 60 శాతంమంది డ్రాపౌట్లు రిజర్వేషన్ కేటగిరీలవారే. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరుతెన్నులకు ఈ గణాంకాలు అద్దం పడ తాయి. దశాబ్దాల తరబడి ఈ విద్యాసంస్థలు ఇలా అఘోరిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? పార్లమెంటులో ప్రశ్నలు తలెత్తినప్పుడు వివరాలు తెప్పించుకోవడం, సభముందు పెట్టడం తప్ప మరేమీ చర్యలుండటం లేదా? పదే పదే రాజ్యాంగ విలువలకూ, నియమ నిబంధనలకూ తూట్లు పొడుస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయంగా మిగిలిపోవడం సరైందేనా? ఓబీసీ వర్గంనుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా ఇది కొనసాగడం వింత కాదా? నిజానికి ఐఐటీ, ఐఐఎంలు నెలకొల్పినప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు కూడా ఎదుగుతాయని అందరూ ఆశించారు. అయితే పాఠ్యాంశాలు మొదలుకొని అన్ని విషయాల్లో మన విద్యాసంస్థలు ఈనాటికీ తీసికట్టే. బడ్జెట్లలో విద్యారంగానికి ఎప్పుడూ అరకొర కేటాయింపులే గనుక వాటి ఎదుగుదల ఆరోగ్యవంతంగా లేదు. అసలు ఉన్నతశ్రేణి విద్యాసంస్థల నిర్వహణే ఇంత అన్యాయంగా ఉంటే ఇతరేతర అంశాల్లో ఏం జరుగుతున్నదనుకోవాలి? అధ్యాపక నియామకాలకు ప్రధానార్హత పీహెచ్డీ కనుక అట్టడుగు వర్గాలవారికి అందులో దక్కే అవకాశం సామాజికంగా ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది. మరింతమంది ఎదగడానికి తోడ్పడుతుంది. అందుకే వివిధ వర్గాలకు దక్కవలసిన వాటా కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. నూరు పూలు వికసించేందుకూ, వేయి ఆలోచనలు వర్ధిల్లేందుకూ ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు వేదికలు కావాలి. -
హైదరాబాద్ ఐఐటీ అదుర్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. హెచ్సీయూ భళా.. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ (మూక్స్)కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది. ముందుగా వర్సిటీలు అకడమిక్ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్లు, డీన్లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్లైన్ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్లైన్ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్లైన్ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. -
గురుకులాల్లో మరో 1,000 కొలువులు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో వెయ్యి కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బోధన విభాగానికి సంబంధించినవే. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 వేల ఉద్యోగాలను మూడేళ్ల క్రితం భర్తీ చేయగా..ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది. అత్యధికంగా బీసీ గురుకులంలో.. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిం చనున్న వెయ్యి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్పీఎస్సీకే ప్రభు త్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. వారాంతంలో ట్రిబ్ సమావేశం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఈ వారాంతంలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన 9,096 ఉద్యోగాలకు గురుకుల సొసైటీల ద్వారా ఇండెంట్లు గురుకుల బోర్డుకు చేరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అన్ని సొసైటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత సమావేశమై పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, రోస్టర్, జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల వివరాలను సరిచూసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం..వారికే సగం సీట్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం కానుంది. రెండు కేటగిరీల్లో స్థానికతను విశదీకరిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాసనసభ నియోజకవర్గం యూనిట్గా స్థానికతను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లా యూనిట్గా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశాల ప్రక్రియను స్థానికత ఆధారంగానే నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థలు నిర్ణయించాయి. ప్రతి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లను అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు. నాలుగు సొసైటీల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష.. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష ఉంటుంది. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కలసి ఐదోతరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా వీటీజీసెట్ నిర్వహిస్తున్నాయి. పరీక్ష ఉమ్మడిగా నిర్వహించినప్పటికీ విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాగా, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తోంది. నియోజకవర్గం, జిల్లా యూనిట్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినా.. ఇంకా మిగిలితే అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. వచ్చే వారం ఫలితాలు? నాలుగు గురుకుల సొసైటీల్లో ఐదోతరగతిలో ప్రవేశాలకు మే 8న వీటీజీసెట్–2022 అర్హత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. -
ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల్లో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని పెంచే చర్యలు చేపట్టనుంది. ఆరు యూనివర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టులోనే నిర్వహిస్తుండగా ఇందులో సీటు పొందాలనుకొనే విద్యార్థులకు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్ పూర్తికాక అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ చివరి నాటికే డిగ్రీ కోర్సుల తుది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలని తీర్మానించామన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. మేలో పీజీ నోటిఫికేషన్.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఈ బాధ్యతను ఓయూ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. పీజీ సెట్కు మేలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలని వీసీలకు సూచించారు. ‘న్యాక్’ స్పీడ్ పెంచాలి.. రాష్ట్రంలో ఎక్కువ విద్యాసంస్థలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. అలాగే గుర్తింపు కాలపరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న కాలేజీల స్థాయి పెంపునకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, వర్సిటీల వీసీలు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్రెడ్డి, రమేశ్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలో మాట్లాడాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అన్నారు. కానీ ఇంగ్లిష్ రాజ్యమేలుతున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ని అడ్డుకుంటే, దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. హిందీని అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు... ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా వారిలో తుంచేయాలని చూస్తే ఎలా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా నిలిచిందంటే... భారత్ మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళుతుంది. ఒకే దేశం, ఒకే భాష అని ప్రబోధిస్తున్న ఆరెస్సెస్, బీజేపీల ఎజెండా మళ్లీ ముందు కొచ్చింది. హిందీని జాతీయ, అధికారిక భాషగా ఆమోదించాలంటూ దక్షిణ భారతదేశంపై, ఈశాన్య భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వ పథకం కూడా ముందుకొచ్చింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి ప్రకటన చూస్తే మరింత సీరియస్ అంశాన్ని అది సూచిస్తోంది. అధికార భాషా కమిటీ చైర్మన్ హోదాలో కేంద్ర హోంమంత్రి 2022 ఏప్రిల్ 7న ఒక డేరింగ్ ప్రకటన చేశారు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలో మాట్లా డాలి’ అనేశారాయన. గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇంగ్లిష్ని ప్రధానమైన భావవ్యక్తీకరణ భాషగా కలిగి ఉంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన పూర్తిగా విస్మరించేశారు. అమిత్ షా ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ, భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లు నెలకొల్పు కోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్యాంపస్లలోని విద్యార్థులు, టీచర్లు హిందీ మాట్లాడతారా? ‘అశోకా’ లేదా ‘ఎమిటీ’ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్కి బదులుగా హిందీలో బోధించాలని అమిత్ షా కోరగలరా? ఒకటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రి జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీలను హిందీ మీడియం విద్యాసంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. భారతదేశ భాషా బాహుళ్యవాదం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి ముందు, ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ని వ్యతిరేకించడం ద్వారా దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలను చూడటం ముఖ్యం. ప్రభుత్వ రంగం లోని పరిశ్ర మలను, విద్యాసంస్థలను ప్రైవేటీకరించాలని బలంగా ప్రభోధిస్తున్న వారిలో అమిత్ షా ఒకరు. అయితే దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్ రంగ విద్యాసంస్థలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్ని, కళాశాలలనే నడుపుతున్నాయన్న విషయాన్ని అమిత్ షా విస్మరిస్తున్నారు. హిందీని బోధనా భాషగా, అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ రాబడిని తెచ్చిపెడుతున్న ప్రధాన వనరు అయిన సాఫ్ట్వేర్ కంపెనీలలో హిందీని అమలు చేయడానికి అమిత్ షా ప్లాన్ ఏమిటి? దక్షిణ భారత, ఈశాన్య భారత రాష్ట్రాలను హిందీ మాట్లాడాలని నిర్బంధిస్తే, వాటి భాషలు, వాటి వ్యక్తీకరణ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఇదే మొదటిసారి కాదు. అంతర్గతంగా, బాహ్యాంగా ఆర్థిక సంబంధాలలో ఇంగ్లిష్ ఒకే విధమైన స్థాయిని పొందని కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. తమిళనాడు ప్రథమ ముఖ్యమంత్రిగా సి.రాజగోపాలాచారి పాలిస్తున్నప్పుడు 1937–1940 మధ్యకాలంలో రాష్ట్ర జనాభాపై హిందీని రుద్దాలని ప్రయత్నించారు. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ శిబిరంలో రాజ గోపాలాచారి ఒక మెతకస్వభావం కలిగిన హిందుత్వ వాదిగా ఉండే వారు. హిందీపై ఆయన వైఖరి కాంగ్రెస్లోని బ్రాహ్మణ సిద్ధాంత కర్తలను విభజించి వేసింది. ఉదాహరణకు టి.టి. కృష్ణమాచారి పక్కా హిందీ వ్యతిరేకిగా, ఇంగ్లిష్ సమర్థకుడైన నేతగా ఉండేవారు. అయితే తమిళనాడుపై హిందీని నిర్బంధంగా రుద్దడానికి వ్యతిరేకంగా శూద్ర, దళిత ప్రజానీకాన్ని కూడగట్టిన ఘనత పెరియార్ రామస్వామి నాయకర్కే దక్కాలి. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన హిందీని రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో భారీ స్థాయి ఆందోళనలకు, కాల్పులకు దారితీయడమే కాదు... చాలా మంది ఆత్మాహుతికి కూడా కారణమైంది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక పోరాటంలో 70 మంది ప్రజలు చనిపోయారు. ఫలితంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చరిత్ర తెలిసిందే. అయితే తమిళ ప్రజల ఇంగ్లిష్ అనుకూల ఆందోళనల వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే తమిళ బ్రాహ్మణులే. వీరు చాలావరకు ప్రైవేట్ క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. బ్రాహ్మ ణిజంపై తిరుగుబాటు చేసిన తమిళ బ్రాహ్మణ మహిళ గీతా రామ స్వామి... ఇటీవల రాసిన తన జ్ఞాపకాల్లో (ల్యాండ్, గన్స్, క్యాస్ట్, విమెన్) ఇంట్లోనూ, తాను చదువుకున్న ఇంగ్లిష్ మీడియం పాఠశాల లోనూ పరస్పర వ్యతిరేకమైన విశ్వాసాల మధ్య తన బాల్యం గడిచి పోయిందని చెప్పారు. ఇంట్లో బ్రాహ్మిన్గానూ, పాఠశాలలో కేథలిక్ గానూ తాను గడిపానని ఆమె చెప్పారు. రుతుస్రావం అనేది భయంకరమైన కాలుష్యమని, రజస్వలగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలను తాకితే అవి మైలపడిపోతాయనీ, విరిగిపోతాయనీ బ్రాహ్మణ భావజాలంతో కూడిన ఇల్లు ఆమెకు నేర్పింది. కానీ ఆమె చదివిన పాఠశాల మాత్రం రుతుస్రావం అంటే తనలోని సంతాన శక్తిని చాటే ప్రక్రియ అని ఆమెకు బోధించింది. ఈ విధంగా సమాజంలోని అన్ని ఇతర కులాల వారికంటే బ్రాహ్మణు లను, వైశ్యులను ఇంగ్లిష్ విద్య విముక్తి చేసి పడేసింది. ఈరోజు దేశంలోని బడా బడా బనియా పారిశ్రామిక వేత్తలు ఇంగ్లిష్లోనే వ్యవ హరాలు నడిపిస్తున్నారు. పైగా ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కళాశాలలను నడుపుతున్నారు. మరి హిందీ సమర్థకులైన అమిత్ షా వాటిని మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారా? భారతదేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో అంత ర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా తుంచే యాలని అమిత్షా కోరుకుంటున్నారు. దేశం లోపల కూడా ఇంగ్లిష్ను మాట్లాడే, రాసే సామర్థ్యం లేకపోవడం కారణంగానే ఈ కమ్యూని టీలకు ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానం లేకుండా పోతోంది. వీరు ఇంగ్లిష్ను మాట్లాడలేకపోతే, వారు దాన్ని ఎలా నేర్చుకోగలు గుతారు? ఈ ఇంగ్లిష్ విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణ మూలాలు కలిగిన కమలా హారిస్ ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగలిగారు. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ కాగలిగారు. ఇది మాత్రమే కాదు... వారిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్ మీడియం విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణులు చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాలను చేజిక్కించుకోగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటున్న నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్న ఎస్.జైశంకర్ ఆ ఇంగ్లిష్ విద్యా వారసత్వానికి కొనసాగింపు గానే నిలుస్తున్నారు. ఇంతేకాదు. అమిత్షా దేశాన్నే దహించివేయగల మరొక ఎజెండాపై కూడా కృషి చేస్తున్నారు. విస్తరించిన ఇంగ్లిష్ భాషా పునాది సహాయం తోనే భారత్, చైనా దేశాలు నేడు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడుతు న్నాయి. జాతీయవాద వాగాండబరం ఎలా ఉన్నా, అది ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతి రేకంగా ప్రభావం కలిగించిందంటే... భారతదేశం మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళ్తుంది. జాగ్రత్త! కంచె ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చదివింపుల్లేవ్.. విదిలింపులే!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం... కేంద్రీయ విద్యాసంస్థల మంజూరులో మాత్రం దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. గత 8 ఏళ్లలో మంజూరు చేసిన 220 కేంద్రీయ విద్యాసంస్థల్లో (157 కేంద్రీయ విద్యాలయాలు, 63 జవహర్ నవోదయ విద్యాలయాలు) దక్షిణాదికి కేవలం 40 (37 కేవీలు, 3 జేవీవీలు) మాత్రమే లభించడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ అంశంపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,311 కేంద్రీయ విద్యాసంస్థలు (661 జవహర్ నవోదయ విద్యాలయాలు, 1,650 కేంద్రీయ విద్యాలయాలు) ఉన్నాయని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత... కొత్తగా విద్యాలయాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవీల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్కు 20 మంజూరు చేసిన కేంద్రం... ఆ తర్వాత యూపీకి 16, కర్ణాటకకు 13, ఛత్తీస్గఢ్కు 10 చొప్పున మంజూరు చేసింది. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే అత్యధికంగా ఛత్తీస్గఢ్కు 11, గుజరాత్కు 8, యూపీకి 6 చొప్పున ఇచ్చింది. దాదాపు 17 రాష్ట్రాలకు కొత్తగా జేఎన్వీలు మంజూరు చేయకపోవడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకకు మాత్రమే 3 జేఎన్వీలు మంజూరవగా మిగతా రాష్ట్రాలకు ఒక్కటీ లభించలేదు. జిల్లాకో జేఎన్వీ ఏమైంది..? ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటవగా కొత్త జిల్లాలకు జేఎన్వీలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క జేఎన్వీ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో జేఎన్వీల ఏర్పాటును సైతం ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో కొత్తగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జేఎన్వీలు మాత్రమే ఉన్నాయి. -
గురుకుల సెట్–22 దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న గురుకుల సెట్(వీటీజీసెట్)–2022 దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటీజీసెట్–22 మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
మనమంతా ఒక్కటే..
ఏలూరు (ఆర్ఆర్పేట)/ఉంగుటూరు: మనమంతా ఒక్కటే అనే భావన కలిగినప్పుడే శక్తివంతమైన దేశం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి విద్యాసంస్థల 75 వసంతాల వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. శక్తివంతమైన దేశంలో ఆకలి, దారిద్య్రం, లింగ, వర్ణ వివక్షలు ఉండకూడదన్నారు. మన దేశంలో ఇప్పటికీ 25 శాతం మంది పేదరికంలో, 27 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, భవిష్యత్లో వీటన్నింటినీ అధిగమించి ప్రగతి సాదించాల్సి ఉందన్నారు. సీఆర్ఆర్ విద్యా సంస్థలు 75 ఏళ్లుగా అంకితభావంతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సీఆర్ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు అల్లూరి ఇంద్రకుమార్, ఎంబీఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. జగన్నాథాష్టకం సీడీ ఆవిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానంతో దేశం నష్టపోయిన వైనం పై అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన ద కేస్ ఫర్ ఇండియా పుస్తకానికి తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ను వెంకయ్యనాయుడు ఆవి ష్కరించారు. ఆత్కూరులో విజయవాడ చాప్టర్ స్వ ర్ణభారత్ ట్రస్ట్లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ తనయుడు ప్రసేన్జిత్ హరిచందన్ నేతృత్వంలో డివైన్ క్యాప్సుల్ సంస్థ తీసుకొచ్చిన జగన్నాథాష్టకం సీడీని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సీడీ తీసుకురావడంలో శ్రమించిన ప్రసేన్జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్దాస్ను అభినందించారు. -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు ఖచ్చితమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదికివ్వాలని ఆదేశించింది. కేంద్రం వాటా 15 నుంచి 60 శాతానికి పెంపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ఉపకారవేతనాలను విద్యార్థి ఖాతాలో.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థి పేరిట కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఫీజు నిధులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా రాష్ట్రం వాటా 85 ఉండేది. అయితే గతేడాది నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు. కొత్త నిబంధనతో నష్టమే ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 2.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం తాజా నిబంధనతో ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఖాతాకు ఫీజు నిధులు విడుదల చేస్తే కాలేజీ యాజమాన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుందని వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని విమర్శలూ వస్తున్నాయి. -
విద్యార్ధుల కోసం 200 నగరాల్లో 500 ట్యూషన్ సెంటర్లు..రూ.1,500 కోట్లతో బైజూస్!
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ దేశవ్యాప్తంగా బోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 12–18 నెలల్లో 200 నగరాల్లో 500 సెంటర్లను స్థాపించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ వెల్లడించారు. ఇప్పటికే సంస్థ 80 కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పింది. వీటి ద్వారా 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో తరగతులను నిర్వహిస్తోంది. ట్యూషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏడాదిలో 10,000 పైచిలుకు మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. గూగుల్తో చేతులు కలిపింది ఇప్పటికే బైజూస్ దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ డీల్లో భాగంగా గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, బైజూస్కి చెందిన విద్యార్థి పోర్టల్ను అనుసంధానించారు ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్కి చెందిన మ్యాథ్స్, సైన్స్ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్గా బోధిస్తున్నారు. దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్ క్లాస్రూమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ తెలిపారు. గూగుల్తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
పాఠశాలల్లో ప్రార్థనలపై వివాదం
నశంకరి: పాఠశాలలకు విద్యార్థులు హిజబ్– కాషాయ కండువాలతో రావడం తీవ్ర వివాదాస్పదం కాగా, దక్షిణ కన్నడ, బాగల్కోటే జిల్లాల్లో రెండు పా ఠశాలల్లో ఒకవర్గం విద్యార్థులు పాఠశాలల్లో నమాజ్ చేయడం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇలా అయితే మేము భజన చేస్తామని మరోవర్గం విద్యార్థులు హెచ్చరించారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా అంకత్తడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం నమాజ్ చేసినట్లు వీడియోలు వచ్చాయి. ఇకపై ఎవరైనా తరగతి గదుల్లో నమాజ్ చేసినట్లు కనబడితే తమ విద్యార్థులు భజన చేస్తారని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్భండారీ హెచ్చరించారు. ఇళకల్ ప్రభుత్వ పా ఠశాలలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది. -
పీజీ చదివేవారేరి?
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోని వివిధ పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. బీటెక్తోనే విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. బీటెక్తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లలో భర్తీ కాని సీట్లు.. గత రెండేళ్లలో ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కాగా కొత్త ఐఐటీలైన భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్పూర్, మండి, పాట్నా, రోపార్ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక 2021–22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. ప్లేస్మెంట్లకే విద్యార్థుల ప్రాధాన్యత మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ పూర్తికాగానే విద్యార్థులు మంచి కొలువులకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పీజీ, పీహెచ్డీ సీట్ల వైపు వారు మొగ్గు చూపడం లేదు. బీటెక్ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలంటే ఆసక్తి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు మాత్రమే పీజీ, పీహెచ్డీల్లో చేరుతున్నారు. అయితే వీరి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. పైగా ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను నిర్వహిస్తున్నారు. బీటెక్ ఉత్తీర్ణులు గేట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాగ్ వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కాని సీట్లు ఎన్ఐటీల్లోనే అధికం ఐఐటీలతో పోలిస్తే ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతున్నట్టు కాగ్ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఎన్ఐటీల్లో సీట్లు భర్తీ కావడం లేదని పేర్కొంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఆరు నుంచి ఏడు రౌండ్ల కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నా సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. కొన్నిసార్లు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ను చేపడుతున్నా ఇదే పరిస్థితి. ఐఐటీలు, ఎన్ఐటీలు పరిశోధనలకు ఉద్దేశించినవే అయినా వాటిలో పీహెచ్డీ సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపినవారికే ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో మెరిట్ సాధిస్తున్నవారు లేకపోవడం కూడా ఈ సీట్లు మిగిలిపోవడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పీహెచ్డీ సీట్లు ఉండగా.. ఏటా 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. -
హిజాబ్ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు
న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. తమ పిటిషన్పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు భారత్ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది. భారత్లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్తాన్కు పాకిన హిజాబ్ గొడవ కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్కు సైతం పాకింది. హిజాబ్ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు. కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. 16 దాకా వర్సిటీలకు సెలవులు హిజాబ్ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజెస్కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి చెప్పారు. -
‘హిజాబ్’ రగడ.. స్కూళ్లు తెరవండి: హైకోర్టు
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. హిజాబ్ రగడపై దాఖలైన పిటిషన్ను సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది. గురువారం విచారించిన ధర్మాసనం.. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది. కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
‘హిజాబ్’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం
బెంగళూరు: హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీక్షిత్ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్ దేవదత్త కామత్ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్ను అనుమతించడమే అవుతుందని వాదించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్ సజన్ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
హిజాబ్ వర్సెస్ కండువా.. కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు
కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం.. పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకముందే చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ్క్షలు జారీ చేసింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మగళూరులో పరిణామాలు వాడీవేడిగా సాగాయి. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా.. ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో.. కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో.. వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయ్యింది. దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది కర్ణాటక ప్రభుత్వం. ఎంపిక చేసిన డ్రెస్ కోడ్ కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్ 133 (2) ప్రకారం.. యూనిఫాం ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్నే అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో.. సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వులు పేర్కొనడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థల్లో బాలబాలికలు తమ మతం ప్రకారం ప్రవర్తించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని ఈ సందర్భంగా విద్యాశాఖ పేర్కొంది. సమీక్షల అనంతరం.. ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు(తరగతి గదుల్లో మాత్రం వద్దనే) వ్యక్తంగా.. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. మరోవైపు హిజాబ్ వ్యవహారం కోర్టు గడప తొక్కగా(హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది).. మంగళవారం(ఫిబ్రవరి 8న) పిటిషన్ను విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. విద్యా శాఖతో, న్యాయ శాఖతో సంప్రదింపులు జరిపారు. శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బాలికలు తరగతుల్లో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘తాలిబనైజేషన్’ ప్రోత్సహించినట్లు అవుతుందంటూ బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హిజాబ్ విషయంలో బాలికలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎంల స్పందన మరోలా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ, ఆరెస్సెస్లపై మండిపడగా, హెచ్డీ కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అనుమతించబడిన ప్రదేశాలలో హిజాబ్లను అనుమతించండి, ఈ మధ్య పర్మిషన్ ఇచ్చిన ప్లేసుల్లో మాత్రం నిషేధించండి’ అంటూ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. We're ready for a change in the colour of the hijab in order to match it with the uniform but we cannot leave it. I wear hijab to the Assembly as well, they can stop me if they can. A memorandum will go to the CM & we'll protest in Udupi later: Congress MLA Kaneez Fatima pic.twitter.com/FwkgR3CbR3 — ANI (@ANI) February 6, 2022 -
తొలి రోజు.. అంతంతే హాజరు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. -
తర‘గది’కి ఇరవై మంది..! అమలు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా దృష్ట్యా ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీల్లో పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు రెండు రోజులుగా గదులు, పరిసరాలను దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు స్కూల్ పరిధిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. గతంలో విడుదల చేసిన కోవిడ్ నిబంధనలే ఇప్పుడూ అమలులో ఉంటాయని వారు చెప్పారు. అయితే తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టడం కష్టమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బెంచ్కు ఒకరు చొప్పున, గదికి 20 మందిని మాత్రమే అనుమతించాలనే నిబంధన అమలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో తక్కువ మంది వచ్చినా సామాజిక దూరం పాటించడానికి అవసరమైన మౌలిక వసతులు లేవని చెబుతున్నారు. వారం వరకు కష్టమే ప్రభుత్వ విద్యాసంస్థలు తెరిచినా వారం వరకు పెద్దగా క్లాసులు నిర్వహించలేమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లలో చాలామంది ఇప్పటికీ జలుబు, జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారిని ఇప్పటికిప్పుడు స్కూలుకు రమ్మనడం సరికాదని ఓ టీచర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో కూడా ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి అనారోగ్య సమస్యలున్నట్టు గుర్తించారని, దీనిని బట్టి చూస్తూ మొదటి వారం రోజుల వరకు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏప్రిల్లో పరీక్షలుంటాయి. వారికి సకాలంలో సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల వీరి హాజరు మాత్రం పెరిగే వీలుందని చెబుతున్నారు. వర్సిటీల్లో ఆన్లైనే విశ్వవిద్యాలయాల పరిధిలో మరో వారం పాటు ఆన్లైన్ బోధనే నిర్వహించాలని ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే వాళ్ళంతా 20 ఏళ్లు పైబడిన యువతే. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వర్సిటీ క్యాంపస్లలోని హాస్టళ్ళకు వీరిని అనుమతిస్తే ఇతరులకు వేగంగా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారంపాటు ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓయూ వీసీ రవీందర్ తెలిపారు. ఎక్కువ బెంచీలు వేయడానికి గదులు సరిపోవు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలొచ్చాయి. అయితే విద్యార్థుల హాజరు పెరిగితే నిబంధనల ప్రకారం క్లాసుకు 20 మందినే ఉంచడం సాధ్యం కాదు. ఎక్కువ బెంచీలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉన్నా వేయడానికి తరగతి గదులు సరిపోవు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు. – అరుణ శ్రీ, ప్రధానోపాధ్యాయురాలు, నల్లగొండ -
ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2021–22 నుంచి 2023–24 బ్లాక్ పీరియడ్కు గాను ఫీజుల ప్రతిపాదనలను ఆన్లైన్లో తమకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఇందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కోరుతున్న ఫీజులు, అందుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్ (www.apsermc.ap. gov.in)లో పొందుపరచాలని కోరారు. ఇందుకు ఫిబ్రవరి 15 తుది గడువుని పేర్కొన్నారు. ఇంతకుముందు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను నిర్ణయించామన్నారు. ఆ ఫీజుల పరిధిలోకి రాని విద్యాసంస్థలు అదనపు ఫీజుల వివరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సూచనల మేరకు తిరిగి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. హైకోర్టు సూచన మేరకు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఫీజులను సవరిస్తుందన్నారు. ఏదైనా విద్యా సంస్థ దరఖాస్తు చేసుకోకపోతే ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. -
విద్యా సంస్థలు ఎప్పుడు తెరుద్దాం?
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్ నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముఖంగా ఉంటే వచ్చే నెల 5 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం యోచి స్తోంది. తాజా పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వైద్య అధికారులతో సమీక్ష జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగు తున్నా దాని ప్రభావం స్వల్పంగానే ఉందని వైద్య అధికారులు తెలిపినట్టు తెలిసింది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గితే యథావిధిగా విద్యాసంవత్సరం ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సెలవులు పొడిగించాల్సి వస్తే పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. విద్యా సంస్థలు తిరిగి తెరవాల్సి వస్తే స్కూలుకు రావాలంటూ బలవంతం చేయకుండా, ప్రత్యక్ష బోధనకుతోడు ఆన్లైన్ బోధనా కొనసాగించాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలను తెరవడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. విద్యాసంవత్సరం పొడిగించాలి: వై.శేఖర్రావు (ట్రస్మ అధ్యక్షుడు) కోవిడ్ నేపథ్యంలో సెలవుల పొడిగింపు వల్ల విద్యాబోధన కుంటుపడింది. ఆన్లైన్ విద్యాబోధన చేపట్టినా అది అన్ని స్థాయిల్లోకి వెళ్లడం కష్టంగానే ఉంది. ఇప్పటికే ఏ క్లాసులోనూ సిలబస్ పూర్తవ్వలేదు. ప్రత్యక్ష బోధన చేపట్టినా, విద్యా సంవత్సరాన్ని మే నెల వరకూ పొడిగిస్తేనే సిలబస్ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. -
చిన్నారుల ఆరోగ్యంపై ఫీవర్ సర్వేలో ఆరా..బాగుంటేనే బడి..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే విద్యా సంస్థల రీ ఓపెనింగ్పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభించిన ‘ఇంటింటి జ్వర సర్వే’ని ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బం ది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సర్వేకి సంబంధించి 4,5 రోజుల డేటా ఆధారంగా..విద్యార్థుల లెక్కను విడిగా తీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదే శించినట్టు తెలిసింది. సర్వేకి వచ్చిన కార్యకర్తలు కూడా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ఫీడ్బ్యాక్ తీసుకోవడం విశేషం. సంక్రాంతిని పుర స్కరించుకుని 4 రోజులు ముందుగానే ఈ నెల 8 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా పరిస్థితుల్లో సెలవులు పొడిగిం చింది. అన్నీ బాగుంటే ఈ నెల 31 నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పునరా లోచనలో పడింది. స్కూళ్ళు తెరిచినా చిన్నారు లను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప థ్యంలోనే ఇంటింటి సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సర్వేలో తేలే అంశాలే కీలకం ప్రధానంగా 15 ఏళ్ళలోపు విద్యార్థుల ఆరోగ్య డేటాను పరిశీలించే ఆలోచనలో అధికారులు న్నారు. రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ స్కూళ్లున్నా యి. మరో 12 వేల ప్రైవేటు స్కూళ్ళున్నాయి. వీటిల్లో 1–10 తరగతుల విద్యార్థులు 69 లక్షల మంది వరకు ఉంటారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ సర్వేలో వెల్లడయ్యే అంశాలనే కీలకంగా తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంత మందికి అనారోగ్య పరిస్థితులున్నాయి? ఎంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది? వారిలో తీవ్రత ఎంత? క్వారంటైన్లో ఉంటు న్నారా? ఇలాంటి వివరాలను సర్వేలో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు అందిన సమాచారం ఆధారంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, కరోనా తీవ్రతపై ఓ అంచనాకు వచ్చే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి. 30 శాతం మందిలో అనారోగ్య లక్షణాలు (జలుబు, దగ్గు, జ్వరం) ఉంటే.. వారు స్కూళ్ళకు వెళ్తే వారి వల్ల మరో 20 శాతం మందికి వ్యాప్తి జరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వ్యాధి లక్షణాల తీవ్రత కూడా గమనించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో మాదిరి కరోనా ఈసారి పెద్దగా ప్రభావం చూపడం లేదనే వాదనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సలహాలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులు పంపుతారా? సెకెండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్లో ప్రత్యక్ష బోధన చేపట్టారు. అయితే దాదాపు రెండు వారాల పాటు 22 శాతానికి మించి విద్యార్థుల హాజరు కన్పించలేదు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఈ శాతం ఇంకా తక్కువే నమోదయ్యింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 31 నుంచి స్కూళ్ళు తెరిచినా, కరోనా ఉధృతి ఇదేవిధంగా సాగితే తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా? అనే సంశయం వెంటాడుతోంది. అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నామని, ఇవన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. శానిటైజేషన్ కూడా సమస్యే కరోనా థర్డ్వేవ్ విజృంభించే సమయంలో అతి కీలకమైన అంశం శానిటైజేషన్. సెకెండ్ వేవ్లో దీని అమలు విద్యాశాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. శానిటైజేషన్ బాధ్యతను పాఠశాల హెచ్ఎంలకు అప్పగించారు. స్కూళ్ళకు ప్రత్యేకంగా సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల పరిధిలోని పారిశుధ్య సిబ్బందినే వాడుకోవాల్సి వచ్చింది. అయితే చాలాచోట్ల పంచాయతీ సిబ్బంది ఇందుకు నిరాకరించారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తే వీలుందని, స్కూలు ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్ల శానిటైజేషన్ సమస్యగా మారవచ్చని విద్యాశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. శానిటైజేషన్ ప్రక్రియకు అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తోంది. -
తెలంగాణలో విద్యాసంస్థల మొదలు అప్పటినుంచేనా..?
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలను ఈనెల 31 నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని బుధవారం స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఈనెల 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది. తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్ తీవ్రత నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు. -
‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పెంచాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమాన్ని తెచ్చే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, ఇప్పటికే అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని విమర్శించారు.గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఏవి? టీచర్లు లేకుండా ఇంగ్లిష్ పాఠాలెట్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తే.. పేద పిల్లలకు అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా వస్తాయని.. అది అమలుచేయకుండా సీఎం కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లూ కేజీటు పీజీ అంటూ బుకాయిస్తూ వచ్చారని.. ఇప్పుడు కొత్తగా ఇంగ్లిష్ మీడియం కథ చెప్తున్నారని విమర్శించారు. అసలు టీచర్లే లేని పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠాలు ఎలా చెప్తారని నిలదీశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగిల్ టీచర్ పాఠశాలలన్ని మూసివేసి.. మారుమూల ప్రాంతాల పేదలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు కనుకనే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్ పాల్గొనలేదని మండిపడ్డారు. పబ్బులు, బార్లతో కరోనా వ్యాపిస్తున్నా నియంత్రణ చర్యలు చేపట్టలేదేమని ప్రశ్నించారు. ఎస్పీకి ప్రచారమేంటి? ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తామని టీఆర్ఎస్ చెప్తోందని.. అంటే వారి మిత్రపక్షం ఎంఐఎంకు ద్రోహం చేస్తున్నట్టా అని రేవంత్ ప్రశ్నించారు. క్రిమినల్స్తో చర్చలు జరపబోనని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ.. ‘నేను మాత్రం 420లు, క్రిమినల్స్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాను. కేటీఆర్తో చర్చలు జరపాలంటే సినిమా గ్లామర్ ఉండాలి. అది నా దగ్గర లేదు..’అని వ్యాఖ్యానించారు. ఒక ఎంపీని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు రియల్ ఎస్టేట్ సంస్థ ఉద్యోగితో రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం పంపారని.. జీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. -
‘సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అభినందనీయం’
కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్బీ కాలనీ: జేఏన్టీయూహెచ్లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎక్కడ చూసినా కరోనానే..
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు, ఆఫీసులు, పోలీస్స్టేషన్లు, విద్యాసంస్థలు.. ఎక్కడ చూసినా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ♦గాంధీ ఆస్పత్రిలో సోమవారం 70 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. ♦ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 57 మంది రోగులు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. వీరిలో పది మందిలోనే లక్షణాలు కన్పించినట్టు అధికారులు తెలిపారు. ♦మరోవైపు ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ♦గ్రేటర్ పరిధిలో 32 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ♦పాఠశాల విద్య డైరెక్టరేట్లో నలుగురికి పాజిటివ్గా తేలింది. కొత్తగా 2,447 కేసులు రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యా పెరుగుతున్నట్టు వైద్యారో గ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. సోమ వారం విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 22,197 క్రియా శీల కేసులున్నాయి. వీరిలో ఆస్పత్రుల్లో చేరినవారిలో ఆక్సిజన్పై 964 మంది, ఐసీయూలో 587 మంది చికిత్స పొందుతున్నారు. కరీంనగర్, వరంగల్ తదితర జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లినవారు హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఒక్క రోజులో 80,138 పరీక్షలు.. 2,447 కేసులు రాష్ట్రంలో సోమవారం 80,138 కరోనా పరీక్షలు చేయగా.. అందులో 2,447 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.11 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 2,295 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.31 శాతంగా ఉంది. తాజాగా ఒక్కరోజులో ముగ్గురు కరోనాతో చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,060కు చేరింది. -
గురుకులం దూరాభారం
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్ జిల్లా మహేంద్రహిల్స్లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ ఫొటోలోని భవనం శామీర్పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇది నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్ వసతులు సరిపోక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్కర్నూల్ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇక్కడి గురుకులం మరెక్కడో ♦రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు. ♦ హైదరాబాద్ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. ♦రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్లోనే నిర్వహిస్తున్నారు. -
మెడికల్ కాలేజీలకు సెలవుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. మెడికల్ కాలేజీలను సెలవుల నుంచి మినహాయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవోలో పేర్కొన్నారు. 17 నుంచి విద్యాసంస్థలు పనిచేస్తాయని తెలిపారు. -
సెలవుల్లోనూ ‘స్టడీ’గా.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్వేవ్తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి ప్రణాళిక వారిది? ♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి. ♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్కు కనెక్ట్ చేసే (ఆన్లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. ♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి. ♦ప్రాక్టికల్ నాలెడ్జ్ను త్రీడీ యానిమేషన్తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు. ♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్నగర్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. విద్యార్థుల మూడ్కనుగుణంగా బోధన సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్తో పాటు సిలబస్లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్గా త్రీడీ యానిమేషన్తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. – ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం బడి మరిచిపోకుండా హోం వర్క్ సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి. – పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్ -
తెలంగాణ: ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. 16 తర్వాత వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ.. -
ఎస్సీ గురుకుల టీచర్ల ఉద్యమబాట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ప్యానల్ ఇన్స్పెక్షన్ దుమారం సృష్టిస్తోంది. బోధన సిబ్బంది పనితీరును మదింపు చేసేందుకు తలపెట్టిన ప్యానల్ ఇన్స్పెక్షన్పై సొసై టీ పరిధిలోని టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇన్స్పెక్షన్లను నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంతి కొప్పుల ఈశ్వర్ను కలసిన ఉపాధ్యాయ సంఘ నేతలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమబాట పట్టారు. జనవరి రెండో తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరంచేయాలని భావిస్తున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బోధన కార్యక్రమాలు గందరగోళంలో పడ్డాయి. జూన్ ఒకటిన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం నెలరోజులు ఆలస్యం కాగా, ప్రత్యక్ష తరగతులు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతామనడంతో సొసైటీ పాఠశాలల్లో అలజడి మొదలైంది. ఏమిటి ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్.. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో 268 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 30 డిగ్రీ కాలేజీలు ఉండగా.. మిగతా వాటిలో 238 పాఠశాలలు, జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యా సంస్థల్లోని బోధన సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో నిపుణులను నియమించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఇటీవల పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు. ఈ కమిటీ సభ్యులు ప్రతి పాఠశాలను అకస్మికంగా సంద ర్శిం చి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా పిల్లల స్థితి, పరీక్షల్లో వచ్చిన మా ర్కు లు, భావ వ్యక్తీకరణ.. తదితర అంశాలపై క్షుణ్ణం గా సమీక్షించి ఆయా సబ్జెక్టు టీచర్లకు మార్కులు వేస్తారు. దీంతో టీచర్ల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. పనితీరు అధ్వాన్నంగా ఉంటే వారిపై చర్యలకు సిఫారసు చేసే వీలుంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉండగా.. తాజాగా కొత్త పద్ధతిలో నిర్వహించేందుకు సొసైటీ కార్యాచరణ రూపొందించింది. ఎందుకు వ్యతిరేకత.. ప్రస్తుతం ప్యానల్ ఇన్స్పెక్షన్ను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. గిరిజన గురుకుల సొసైటీలలో కూడా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం. కాగా, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో అమలు చేసే ప్యానల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను ప్రస్తుత విద్యా సం వత్సరానికి మాత్రమే వాయిదా వేయా లని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021–22 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభం కాగా, అక్టోబర్ నెలాఖరు వరకు ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగింది. ఈ నేపథ్యంలో పిల్లల సామర్థ్యాన్ని సాకుగా చూపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో టీఎస్డబ్ల్యూఆర్ఈఐ అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.కృష్ణారెడ్డి, ప్రభుదాస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇన్స్పెక్షన్ను ఈ ఏడాది మాత్రమే వాయిదా కోరుతున్నామని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాలరాజ్ పేర్కొన్నారు. -
మూడేళ్లు.. 76 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ మరణాలు ఏటా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తెలంగాణలో ఏకంగా 76,234 మంది కేన్సర్తో మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు కేన్సర్పై ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో నిలిచింది. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్–2020, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కేన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారం 2018–2020 మధ్య దేశంలో కేన్సర్ మరణాలు గణనీయంగా పెరిగాయి. 2020లో దేశంలో 13.92 లక్షల కేన్సర్ కేసులు నమోదవగా 7.70 లక్షల మంది మరణించారు. అందులో అత్యధికంగా యూపీలో 1.11 లక్షల మంది కన్నుమూయగా ఆ తర్వాత మహారాష్ట్రలో 63,797 మంది మృతిచెందారు. అతితక్కువగా లక్షద్వీప్లో 13 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. పొగాకు ఉత్పత్తుల వాడకంతో... వివిధ రకాల వ్యాధులు, వృద్ధాప్య జనాభా, మారిన జీవనశైలి, పొగాకు ఉత్పత్తుల వాడకం, అనారోగ్యకరమైన ఆహారం, వాయుకాలుష్యంతో కేన్సర్ వ్యాధులు ఏటా పెరుగుతున్నాయి. కేన్సర్పై అవగాహన కోసం జాతీయ కేన్సర్, మధుమేహ, హ్రుద్రోగ వ్యాధులు, స్ట్రోక్ నివారణ, నియంత్రణ కార్యక్రమానికి (ఎన్పీసీడీసీఎస్) కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, మానవవనరుల అభివృద్ధి, ఆరోగ్యంపై అవగాహన, కేన్సర్ నివారణ కోసం చైతన్యం తీసుకురావడం, రోగనిర్ధారణ, నిర్వహణ వంటివి చేయాలని నిర్ణయించింది. ఈశాన్యంలో తక్కువే... ఈశాన్య రాష్ట్రాల్లో కేన్సర్ కేసులు సంఖ్య చాలా తక్కువ ఉండటానికి అక్కడి ప్రజల జీవన విధానమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా సిక్కిం, మేఘాలయాలలో వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగుమందులు వాడరు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు కూడా పెద్దగా ఉండవని అంటున్నారు. విద్యాసంస్థల ఆవరణలో పొగాకు ఉత్పత్తులు నిషేధించాలి.. కేన్సర్ కేసుల నమోదు, మరణాలకు ప్రధాన కారణాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం ఒకటి. కాబట్టి పొగాకు ఉత్పత్తుల వాడకంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. యువత పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. దీన్ని నివారించేందుకు విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలి. కేన్సర్పైనా అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలి. వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి. – శిరీష, పొగాకు నియంత్రణ ఉద్యమ కార్యకర్త, హైదరాబాద్ -
కార్పొరేట్కు దీటుగా... ప్రతిభకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ప్రతిభ కలిగినా పేదరికం కారణంగా కొంతమంది ఆ విద్యా సంస్థల్లో చేరడానికి వెనుకాడతారు. అలాంటి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం పలు ఐఐటీలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. పేద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా తామే భరిస్తామంటూ కొన్ని ముందుకు రాగా వసతి, భోజనాలతో పాటూ ఫీజుల భారమూ తామే చూసుకుంటామని మరికొన్ని ప్రకటించాయి. ఇంకొన్ని అయితే ఆయా విద్యార్థులకు ఫీజులు, వసతితో పాటు పుస్తకాలు ఇతర మెటీరియల్ ఖర్చులు, ప్రయాణ భత్యాలు, పాకెట్ మనీ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఐఐటీలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ ఆఫర్లను ప్రకటించాయి. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) జేఈఈ అడ్వాన్స్ అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్లో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ఐఐటీలు స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందిస్తామని పేర్కొన్నాయి. ఫలితంగా మెరిట్ ఉన్న పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపారు. బాగా చదివితే చాలు ఇక అన్నీ ఉచితమే అన్నట్లుగా ఐఐటీలు పోటీపడి ఆఫర్లు ఇచ్చాయి. ఐఐటీలు.. వాటి ఆఫర్లు ఐఐటీ బాంబే: బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ ఉండి, వారి తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 5 లక్షలకు మించకుంటే మెరిట్–కమ్ మీన్స్ స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ బాంబే పేర్కొంది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలకన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు భోజన సదుపాయంతో పాటు నెలకు రూ. 250 పాకెట్ అలవెన్స్ ఇస్తామంది. అవే కాకుండా ఆ విద్యార్థులకు అధికారికంగా నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ అద్దె చెల్లింపు నుంచి మినహాయింపును ప్రకటించింది. ఐఐటీ గాంధీనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ కామన్ ర్యాంకు జాబితాలో 1,000, ఆపైన ర్యాంకును పొందిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ను అందిస్తామని ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది. బీటెక్ నాలుగేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని సంస్థ భరించేలా ఆ స్కాలర్షిప్ ఉంటుందని వివరించింది. ఐఐటీ భిలాయ్: అన్రిజర్వ్డ్ విద్యార్థులతో పాటు ఓబీసీ వర్గాలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్షిప్ను ఐఐటీ భిలాయ్ అందిస్తోంది. వీరి గరిష్ట పరిమితి సంఖ్యను 25 శాతంగా పేర్కొంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల రాయితీని ఇస్తోంది. నెలకు రూ. 1,000 పాకెట్ మనీని అందించనున్నట్లు పేర్కొంది. ఐఐటీ మద్రాస్: తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు బీటెక్ లేదా డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ పొందితే పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐఐటి మద్రాస్ ప్రకటించింది. తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 1,000తో కూడిన మెరిట్ –కమ్ –మీన్స్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆదాయం రూ. 4.5 లోపు ఉన్నవారికి ట్యూషన్ ఫీజులో మూడింట రెండు వంతుల మినహాయింపు ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిట్ సాధించిన విద్యార్థులకోసం ఐఐటీ ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్ను ఏర్పాటు చేసింది. 30 మంది మెరిట్ విద్యార్థులకు ఏడాదికి 1 లక్ష చొప్పున అందించనుంది. ఈ స్కాలర్షిప్ పథకంలో 15 మంది పురుషులకు, 15 మంది మహిళా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఐఐటీ కాన్పూర్ మెరిట్ విద్యార్థుల కోసం ఐఐటీ కాన్పూర్ ‘బ్రైట్ మైండ్ స్కాలర్షిప్’ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంక్లలో నిలిచిన విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్లో బీటెక్, బీఎస్ ప్రోగ్రామ్లో ప్రవేశం పొందితే ఈ స్కాలర్షిప్ కింద రూ.3 లక్షలు ఇవ్వనుంది. విద్యార్థుల హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులతో పాటు మొత్తం ట్యూషన్ ఫీజులను ఈ స్కాలర్షిప్ కవర్ చేస్తుంది. -
Telangana: ఒక్కరోజులో 190 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 38,615 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత పదిరోజుల రికార్డును చూస్తే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు, గురుకుల పాఠశాలల్లో కేసులు వెలుగుచూడడం, ఇతరత్రా కూడా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గత నెల (నవంబర్) ఒకటో తేదీన 160 కేసులు నమోదు కాగా, 20వ తేదీన 134 కేసులు రికార్డయ్యాయి. 29వ తేదీన కేసుల సంఖ్య 184కు పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,994కు చేరింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,992కి చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 184 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,68,411కి చేరిందని వెల్లడించారు. -
న్యూట్రాస్యూటికల్స్ విప్లవం.. మస్తుగా కెరీర్ అవకాశాలు!!
Nutrify Today world's first launches nutraceuticals academy: కరోనా తర్వాత ఆరోగ్యరంగంతో పాటు అనుబంధ రంగాలన్నింటిలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా పోషకాహార రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఔషధాల రూపంలో పోషకాలను అందించే న్యూట్రాస్యూటికల్స్ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో భారత న్యూట్రాస్యూటికల్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మన స్వదేశీ సంస్థ న్యూట్రిఫై టుడే ఈ రంగాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక అకాడమీకి రూపకల్పన చేసింది. నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా.. ప్రపంచంలోనే ప్రప్రధమ న్యూట్రాస్యూటికల్స్ అకాడమీని న్యూట్రిఫై టుడే (https://academy.nutrifytoday.com/) ప్రారంభించింది. పరిశ్రమ వృద్ధితో పాటుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. తొలి దశలో ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడీమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్, ఆసియా దేశాలే కాకుండా ఆన్లైన్ కరిక్యులమ్ ద్వారా ఇతర దేశాలకు విస్తరించనుంది. గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీసీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి. చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? 100బిలియన్ డాలర్ల పరిశ్రమగా... న్యూట్రిఫై టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. రానున్న 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్కు శిక్షణ అందించగలమని అంచనా వేస్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి భారత్ 8 మిలియన్డాలర్ల మార్కెట్గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయి.. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్డాలర్లను, 2030 నాటికి 100 బిలియన్డాలర్ల విలువ కలిగి ఉంటుంది’’ అని చెప్పారు. ఈ ప్రపంచ ప్రప్రధమ న్యూట్రిఫై టుడే అకాడమీ రూపకల్పనలో డాక్టర్ బాల్కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్; బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్ ; నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ ఓపినియన్ లీడర్ బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్డన్ బేకర్లు కీలకపాత్ర పోషించారు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..
తిరువనంతపురం: మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి.. కేరళ ప్రగతిశీల వైఖరికి ఏమాత్రం అనుకూలంగా లేదని పేర్కొన్నారు. కేరళలోని అనేక విద్యా సంస్థలు తప్పనిసరిగా చీర ధరించాల్సిందేననే పద్దతిని కొనసాగిస్తున్నాయని పలువురు మహిళా ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ‘‘ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో మీ జోక్యం ఏంటంటూ’’ బిందు విద్యాసంస్థల యాజమాన్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తాను మినిస్టర్ని మాత్రమే కాక కేరళ వర్మ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేస్తున్నానని తెలిపారు. కాలేజీకి చుడిదార్లు వేసుకెళ్తాను అన్నారు. (చదవండి: చీర కట్టును ప్రపంచానికి చుట్టింది) ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ.. "ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలో ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలలో పనిచేసినా సరే.. వారి సౌకర్యానికి తగ్గట్టుగా దుస్తులు ధరించే హక్కు ఉంది. మహిళా ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా చీరలు ధరించాల్సిందే అనే ఈ పద్ధతి కేరళ ప్రగతిశీల వైఖరికి అనుకూలం కాదు’’ అన్నారు. "ఒక టీచర్కు అనేక బాధ్యతలు ఉంటాయి. అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదు. ఒకరి దుస్తుల ఎంపిక పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు" అని బిందు స్పష్టం చేశారు. (చదవండి: ‘మిమ్మల్ని చీరలో చూస్తే.. కన్నీళ్లు ఆగవు’) దీనిపై మినిస్టర్ మరింత స్పష్టత ఇస్తూ మే 9, 2014న ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికి , రాష్ట్రంలోని అనేక సంస్థలు ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అందుకే మరోసారి ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్కు వెళ్లిన మహిళకు అవమానం -
TS: ‘పది’లో ఆరు పేపర్లే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే నిర్వహించనున్నారు. దీనితోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. బహుళ ఐచ్చిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఎఫెక్ట్తో.. గత ఏడాది లాక్డౌన్ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఆన్లైన్ క్లాసులు జరిగాయి. సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసులు కూడా మొదలయ్యాయి. అయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (టీఎస్సీఈఆర్టీ)’పేర్కొంది. పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని సిఫారసు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. 2021–22 ఏడాదికి సంబంధించి టెన్త్ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాటైంది. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది. వాటిని ఆరుకు కుదించడం బోర్డు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తొలినాళ్లలో 9, 10 తరగతులు రెండింటి నుంచీ ప్రశ్నలిచ్చేవారు. దీనివల్ల విద్యార్థి సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం తెలుసుకునే అవకాశం ఉండేదని చెప్పేవారు. తర్వాత ఆ విధానాన్ని సరళీకరించి పదో తరగతి పాఠాలకే పరిమితం చేశారు. కొన్నేళ్ల కింద మరోసారి పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ ప్రశ్నల శాతాన్ని ఖరారు చేసేఅవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సిలబస్ గందరగోళం! కోవిడ్ నేపథ్యంలో మొత్తం సిలబస్ బోధించడం కష్టమని భావించిన విద్యాశాఖ దాన్ని 30 శాతం మేర తగ్గించింది. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇంకా బోధించని పాఠాలను నిలిపివేస్తారా? ఎవైనా నిర్థిష్టమైన పాఠాలను ఎంపిక చేసి, కోత పెడతారా? అన్నది తేల్చాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో కొంత సిలబస్ పూర్తికాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకుని, రివిజన్ మొదలుపెట్టాయి. సిలబస్ కోత విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఇబ్బందులు ఉంటాయి’’అని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. సిలబస్పై విద్యాశాఖ వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, నాణ్యతకు పదునుపెట్టే సబ్జెక్టుల్లో కోత పెట్టొద్దని మరో ఉపాధ్యాయ సంఘం నేత నర్సిరెడ్డి సూచించారు. -
స్పేస్ టెక్నాలజీ హబ్గా రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్టెక్ పాలసీ ఫ్రేమ్వర్క్’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసిన ఐటీ శాఖ... దీనిపై ఈ నెల 25లోగా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. రోజువారీ సమస్యలకు పరిష్కారాలు... ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలకు చూపడంలో అంతరిక్ష సాంకేతికత అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘స్పేస్కామ్ పాలసీ 2020’, ‘స్పేస్ ఆర్ఎస్ పాలసీ 2020’, ‘జియో స్పేషియల్ పాలసీ 2021’తదితరాలను విడుదల చేసింది. దీంతో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్), ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’(ఇన్స్పేస్) వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక రంగంలో ప్రైవేటు రంగం మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్పేస్టెక్ పాలసీ ఫ్రేమ్వర్క్’ను సిద్ధం చేసింది. తద్వారా ప్రపంచ స్పేస్ టెక్నాలజీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధి, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు పరీక్ష కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలను ఆహ్వానించడం వంటి లక్ష్యాలను ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మౌలిక వసతులు, వాణిజ్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణల కోసం అనేక విధాన నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగంలో పేరొందిన అనంత్ టెక్నాలజీస్, వీఈఎం టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్ వంటి సంస్థలు, స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్లతోపాటు డీఆర్డీఓ, ఎన్ఆర్ఎస్, అడ్రిన్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఆర్డినెన్స్ ప్యాక్టరీ వంటి రక్షణ రంగ పరిశోధన, తయారీ సంస్థలు హైదరాబాద్లో అంతరిక్ష సాంకేతిక వాతావరణానికి ఊతమివ్వనున్నాయి. అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఉంది. మార్స్ ఆర్బిటర్ మిషన్లోని 30 శాతం విడిభాగాలు రాష్ట్రంలోనే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర టెక్నాలజీ పాలసీ ఆశించిన ఫలితాలను రాబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
నేడు తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు
-
గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి: కేఎన్వీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. -
వామ్మో.. ఒకే పాఠశాలలో 79 మంది విద్యార్థులకు కరోనా
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలోని ఒకే పాఠశాలలో 79 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ధరంపూర్ పట్టణంలోని బోర్డింగ్ పాఠశాలలో జరిపిన కరోనా పరీక్షలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో వైద్య అధికారులు వైరస్ సోకిన వారందరిని క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం ఆ పాఠశాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి అటు వైపు రాకపోకలు నిషేదించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల మూసివేతను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో సెప్టెంబర్ 21 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. స్కూళ్లను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ఆదేశించింది. చదవండి: వ్యాక్సిన్ వేసుకోవాలని వెరైటీగా చెప్పి.. అందరినీ ఆకర్షించాడు -
మార్బర్గ్; అంధుల స్వర్గధామం.. నగరమంతా ‘ప్రత్యేక’మే..
మార్బర్గ్.. జర్మనీలోని ఓ అద్భుత నగరం. కళ్లను కట్టిపడేసే ప్రాచీన భవంతులు, చుట్టూ పచ్చని పర్వతాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దీని సొంతం. జర్మనీలోని సుందర నగరాల్లో ఇది ఒకటి. వీటన్నింటిని మించిన ప్రత్యేకత మార్బర్గ్కు ఉంది. అంధుల సంక్షేమ నగరంగా దీనికి పేరుంది. వారు అత్యున్నత శిఖరాలను అందుకునేలా ముందుకు నడిపించే నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: లియోన్ పోర్జ్కు పుట్టుకతో వచ్చిన అనారోగ్యం వల్ల 8 ఏళ్ల వయసులో క్రమంగా కంటిచూపు మందగించింది. సైన్స్ సంబంధిత విషయాల మీద లియోన్ పోర్జ్కు అమితాసక్తి ఉండేది. అదే సమయంలో మార్బర్గ్ నగరం గురించి.. అంధుల కోసం అక్కడ ఉన్న విద్యా సంస్థల గురించి పోర్జ్ తెలుసుకున్నాడు. వెంటనే సెంట్రల్ జర్మనీలోని తన స్వస్థలం నుంచి సమీపంలోని మార్బర్గ్కు మారిపోయాడు. ఇలాంటి వారు అనేక మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతిభా పాటవాలు చాటుతున్నారు. నగరమంతా ‘ప్రత్యేక’మే.. అంధుల విద్యోన్నతి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ‘బ్లిస్టా’ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థ ఎంతో మంది అంధ విద్యార్థుల జీవితాలను మార్చేసింది. దీనిని స్థాపించినప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు అనేకఆవిష్కరణలు చేశారు. టాక్టైల్ అనే మ్యాథమెటికల్ ఫాంట్ను కూడా కనుగొన్నారు. కాలక్రమేణా మార్బర్గ్.. ఓ ఆదర్శ నగరంగా మారింది. ఇక్కడ బ్లిస్టాతో పాటు అంధుల కోసం మరికొన్ని విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. వారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎలాంటి భయాలు లేకుండా తిరిగేలా మార్పులు తీసుకొచ్చారు. వారిని అప్రమత్తం చేసే బీపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రత్యేక రహదారులు, అవసరమైన చోట్ల వాటిపై కాస్త ఎత్తయిన సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. చదవండి: వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా? అలాగే మార్బర్గ్ను సందర్శించేందుకు వచ్చే పాక్షిక అంధుల కోసం ఎక్కడికక్కడ నగర ల్యాండ్మార్క్స్ను తెలియజేసే చిన్న చిన్న రూపాలను ఉంచారు. వీటి సాయంతో వారు సులభంగా తాము వెళ్లాలనుకొన్న ప్రదేశానికి వెళ్లొచ్చు. అంధుల కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్, ఫుట్బాల్, రోయింగ్, క్లైంబింగ్ క్లబ్లున్నాయి. తరచూ వారికి పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. అలాగే బస్ స్టాప్లను కూడా వీరికి తగిన సమాచారమిచ్చేలా రూపొందించారు. వీరితో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తరచూ డ్రైవర్లు, రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల మెనూ కూడా బ్రెయిలీ లిపిలో ఉంటుంది. బయోకెమెస్ట్రీతో రికార్డుల్లోకి.. బ్లిస్టాతో పాటు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునే వారు భారీ పుస్తకాలతో ఇబ్బంది పడకుండా.. ప్రత్యేక స్క్రీన్ రీడర్స్ అందుబాటులో ఉంటాయి. లియోన్ పోర్జ్ ప్రస్తుతమిక్కడ కంప్యూటర్ సైన్స్, బయోకెమిస్ట్రీ చదువుతున్నాడు. మొత్తం జర్మనీలోనే చాలా తక్కువ మంది ఎంచుకొనే ‘బయోకెమిస్ట్రీ’ చదువుతున్న మొట్టమొదటి అంధ విద్యారి్థగా పోర్జ్ రికార్డుల్లోకి ఎక్కాడు. సాధారణ మనుషులే ఇందులో ఉండే చిత్రాలు, ల్యాబ్ ప్రయోగాలు నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ దీనికి కూడా మార్బర్గ్లోని విద్యా సంస్థలు ప్రత్యామ్నాయాలను కనుగొన్నాయి. అంధ విద్యార్థులు వీలైనంత సులభంగా చదువుకునేలా ఇక్కడి అధ్యాపకులు ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలు కనుగొంటూ, విద్యార్థులతోనే విభిన్న ఆవిష్కరణలు చేయిస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా వీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చదువులో ముందుకు దూసుకువెళ్తున్నారు. చదవండి: వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి -
నచ్చిన కాలేజీ.. మెచ్చిన బ్రాంచ్
గత వారం రోజులుగా ఇదే తంతు. ఎంసెట్ ర్యాంకు తక్కువొచ్చిన, కాస్త అటూ ఇటూగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. ‘టాప్ టెన్ కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్లో సీటు కావాలా? మేమిప్పిస్తాం..’ అని కన్సల్టెన్సీలకు చెందినవారు, దళారీలు ఊదరగొడుతున్నారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే ఏకంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను (పీఆర్వోలు) పెట్టుకుని మరీ సీట్ల సేల్ కోసం విద్యార్థుల వెంటపడుతున్నాయి. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసి ర్యాంకు ప్రకారమే సీటివ్వాలని ఉన్నత విద్యా మండలి పదేపదే చెబుతున్నా అడ్డదారిలో సీట్లన్నీ బేరం పెట్టేస్తున్నాయి. మరోవైపు తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కూడా కొన్ని యాజమాన్యాలు ఉపయోగించుకుంటున్నాయి. వారికి తెలిసిన ఎంసెట్ అర్హత పొందిన విద్యార్థుల ఇళ్లకు పంపి సీటు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నారు పేరు మోసిన కాలేజీలు, ఆ తర్వాత స్థాయి కళాశాలలు కొన్ని.. తమకున్న డిమాండ్ను, తమ కాలేజీల్లో వివిధ బ్రాంచ్లకున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాస్త ర్యాంకులు అటూ ఇటూగా వచ్చి, కన్వీనర్ కోటాలో సీటు రాదని భావించే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా తీసుకుని అలాంటి వారికి కన్సల్టెన్సీల ద్వారా ఎరవేస్తున్నాయి. సాధారణ యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటాయింపులో దోపిడీకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటా కింద ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల ఇంజనీరింగ్ సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో సుమారు 13 వేలు సాధారణ యాజమాన్య కోటా సీట్లు కాగా సుమారు 14 వేల సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసే వారికి ఈ సీట్లు ఇస్తారు. ఫీజు కూడా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం చూస్తే ఏడాదికి దాదాపు రూ. 3.75 లక్షల వరకు వ్యయం అవుతుంది. కానీ డిమాండ్ను బట్టి దాదాపు రూ.15 లక్షల వరకు కాలేజీలు వసూలు చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు కొన్ని కాలేజీల్లో కొంతమంది సాయంతో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దళారుల పాత్రేంటి?: మేనేజ్మెంట్ సీటు ఆశించే తల్లిదండ్రులతో కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు నేరుగా బేరసారాలు చేస్తున్నాయి. పీఆర్వోలను పెట్టుకుని కథ నడిపిస్తున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల సెల్ఫోన్లు బయట సిబ్బంది వద్ద ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కన్సల్టెన్సీలు, దళారులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు నిజానికి కొన్ని కాలేజీల యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా ఆ కాలేజీలో సీటు ధర ఎంతో తెలుసుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ రేటు తల్లిదండ్రులకు చెబుతున్నారు. నేరుగా యాజమాన్యాన్ని కలిసి రమ్మని, వాళ్లతో మాట్లాడామని, సీటు రేటు తగ్గిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బేరసారాలు చేసుకుని వస్తున్నారు. దళారులు, కన్సల్టెన్సీల వల్లే ధర తగ్గిందని భావిస్తున్న తల్లిదండ్రులు వారికి కమీషన్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీలు మాత్రం దళారుల ద్వారా సీట్లు భర్తీ అయ్యేలా నేరుగా బేరాలు కుదుర్చుకుంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ వరంగల్కు చెందిన అరుణ్కు 16 వేల ఎంసెట్ ర్యాంకు వచ్చింది. టాప్టెన్ కాలేజీలో సీఎస్సీ చేయాలన్నది అతని కోరిక. కానీ సీటు వస్తుందా? అని అనుమానం. ఇంతలోనే మీకు సీటిప్పిస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు అవుతుందని చెప్పారు. దీంతో అతను ఆ వ్యక్తి చెప్పే మాట నిజమో? అబద్ధమో? తెలియని అయోమయంలో ఉన్నాడు. నిజామాబాద్కు చెందిన కార్తీక్ హైదరాబాద్లో టాప్టెన్లో ఉన్న ఒక కాలేజీలో డేటా సైన్స్ సీటు కోసం వెళ్లాడు. మేనేజ్మెంట్ కోటాలోనూ కష్టమని చెప్పారు. వేరే బ్రాంచ్ తీసుకోమంటే వద్దని బయటకొచ్చాడు. కాలేజీ బయట ఓ వ్యక్తి సీటిప్పిస్తానంటూ చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే రెండురోజుల తర్వాత సీటు వచ్చింది. కృత్రిమ డిమాండ్ ఈసారి ఇంజనీరింగ్లో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులు కూడా ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ‘ఆ సీట్లు అయిపోయాయి. వేరే బ్రాంచ్ తీసుకుంటారా?’ అని సీటు కోసం వెళ్లిన తల్లిదండ్రులను అడుగుతున్నాయి. వాళ్ల ఆసక్తిని ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి ఎక్కువ మొత్తానికి సీట్లు అమ్మేస్తున్నాయి. కూకట్పల్లికి చెందిన సత్యప్రకాశ్కు ఇదే అనుభవం ఎదురైంది. ‘యాజమాన్యం సీఎస్సీ సీటు కష్టమంది. గేటు దాటి బయటకు రాగానే దళారీ వచ్చాడు. అతని ద్వారా సీటు వచ్చింది..’ అని చెప్పాడు. -
గురుకులాల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అదనంగా గీజర్ సౌకర్యం కూడా కల్పించనుండడంతో విద్యార్థులకు నిరంతరం వేడి నీరు కూడా అందించే వీలుంటుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించిన గిరిజన గురుకుల సొసైటీ.. తాజాగా టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 110 గిరిజన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కరెంటు చార్జీల పొదుపు: వేసవి సీజన్ మినహాయిస్తే.. మిగతా రోజుల్లో గురుకుల విద్యాసంస్థల్లో వేడినీటి వినియోగం ఎక్కువే. శీతాకాలంలో వాడకం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో కరెంటుతో నడిచే గీజర్లతో విద్యుత్ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. కొన్ని స్కూళ్లలో నెలకు వచ్చే కరెంటు బిల్లుల్లో గిజర్ వినియోగానికే రూ.25 వేలకుపైగా చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బిల్లుల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో సోలార్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు, గీజర్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ బిల్లుల్లో దాదాపు 30 శాతం ఆదా అయ్యింది. దీంతో అన్ని స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వారంలోగా టెండర్లు ఖరారైతే పక్షం రోజుల గడువు విధించి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. -
థర్డ్ వేవ్పై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో విద్యా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 97.5 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ జరగ్గా, మిగిలిన 7,388 మందికి కూడా వ్యాక్సిన్ అందించి నూరు శాతం లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. వర్సిటీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు తమ సిబ్బందికి, విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ వేయించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 22 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వంద మందికి ఒకే చోట వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉన్నత విద్యా మండలి కమిషనర్ పోలా భాస్కర్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధిక ఫీజులను నియంత్రించే హక్కు మాకుంది
సాక్షి, అమరావతి: విద్యా సంస్థలు వసూలుచేస్తున్న అధిక ఫీజులను నియంత్రించే అధికారం తమకు ఉందని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్ఈఆర్ఎంసీ) గురువారం హైకోర్టుకు నివేదించింది. అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయడం తమ బాధ్యత అని కమిషన్ తరఫు న్యాయవాది బీఎస్ఎన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. విద్యను వ్యాపారంగా చూస్తున్న కొన్ని విద్యాసంస్థలే ప్రభుత్వ ఫీజులను వ్యతిరేకిస్తున్నాయన్నారు. చాలా విద్యా సంస్థలు తమ ఆదాయ, వ్యయాల వివరాలను కమిషన్కు ఇవ్వడంలేదని ఆయన తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై విద్యా సంస్థలకు అభ్యంతరం ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. కమిషన్ను ఆశ్రయించే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా విద్యా సంస్థలు నేరుగా హైకోర్టును ఆశ్రయించాయని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. ఆదాయ, వ్యయాల వివరాలన్నింటినీ కమిషన్కు సమర్పించి, ఫీజులను పునః పరిశీలించాలని కోరేందుకు అవకాశం విద్యా సంస్థలకు ఉందన్నారు. ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేసే ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాటు విద్యా సంస్థల్లో ఉన్న మౌలిక సదుపాయాలను కమిషన్ పరిశీలించిందని నాయుడు చెప్పారు. ఈ వివరాలను కావాలంటే కోర్టు ముందుంచుతామన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాంతాలు, తరగతుల వారీగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం గత నెల 24న జీఓ 53, 54లను జారీచేసింది. వీటిని సవాలుచేస్తూ తూర్పు గోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం, ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం, తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. -
విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలి: మంత్రి ఆదిమూలపు
సాక్షి, అమరావతి: పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం మంత్రి సమీక్ష చేశారు. విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులతోపాటు ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు, ప్రస్తుతం పాజిటివ్గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని మిగిలిన 7,388 మందికి వెంటనే వేసి 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. 100 మందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తే, చాలావరకు కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పక పాటించాలని సూచించారు. విశ్వ విద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి, విద్యార్థులకు కూడా వాక్సినేషన్కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచే (ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్పించేలా) బాధ్యతను విద్యా సంస్థలు, పరిశ్రమల మండళ్లు, పరిశోధనా సంస్థలు తీసుకోవాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ) ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వెబినార్లో (ఆన్లైన్ కార్యక్రమం) సింగ్ మాట్లాడారు. ఐఈపీఎఫ్ఏ బలోపేతానికి కార్పొరేట్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..!) ఈ సంస్థ ఇప్పటి వరకు 18,000 క్లెయిమ్లను పరిష్కరించింది. షేర్లు, డివిడెండ్లు రూ.1,000 కోట్ల విలువ చేసే మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లించింది. చిన్నతనంలోనే ప్రాథమిక ఆర్థిక అంశాలను నేర్పే విదంగా స్కూళ్లు, కళాశాలలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విజ్ఞానం లోపించడం వల్ల చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మోసపూరిత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్టు చెప్పారు. పొంజి స్కీమ్లను నమ్మి ఎంతో మంది మోసపోయినట్టు పేర్కొన్నారు. -
దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్కు 2021 సంవత్సరానికి గాను దక్షిణ భారతదేశ ఉత్తమ సంస్థ అవార్డు దక్కింది. వర్చువల్ పద్ధతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ గ్రోత్ అండ్ రీసెర్చ్ (సీఈజీఆర్) (ఢిల్లీ) సంస్థ నుంచి అవార్డును నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు అందుకున్నారు. సీఈజీఆర్ సంస్థ 15వ రాష్ట్రీయ శిక్ష గౌరవ్ పురస్కార్ వేడుక సందర్భంగా విద్యా నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల్లో అత్యుత్తమ కృషికి గాను నిట్కు ఈ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా సీఎస్పీ రావు మాట్లాడుతూ.. ఏపీ నిట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇనిస్టిట్యూట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నూతన విద్యా విధానం–2020 మార్గదర్శకాల ప్రకారం 2020–21 విద్యాసంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) పాఠ్యాంశాలను సవరించామన్నారు. నిరంతర మద్దతు ఇస్తున్నందుకు విద్యా మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ పి.శంకరరెడ్డి మాట్లాడుతూ.. నిట్లో నిర్మాణాలను ప్రపంచస్థాయి సదుపాయాలతో రికార్డు సమయంలో చేపట్టడానికి డైరెక్టర్ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ అవార్డు ఇచ్చిన ప్రేరణతో భవిష్యత్లో మరిన్ని మైలురాళ్లు దాటడానికి ప్రయత్నిస్తామన్నారు. -
స్వల్పంగా పెరిగిన విద్యార్థుల హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమైన రెండోరోజు గురువారం విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ పాఠాలకే మొగ్గు చూపాయి. ఆన్లైన్ పాఠాలకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులు దీన్నే ఆప్షన్గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువగా హాజరవుతుండటం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం ప్రభుత్వ స్కూళ్ళలో 38.82 శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 21.74 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 15.04 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి సగటు హాజరు శాతం 25.2గా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. బుధవారం సగటున 21.77 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 52,22,174 మంది కాగా గురువారం 14,76,874 మంది హాజరయ్యారు. హాజరు క్రమంగా పెరిగే అవకాశం! పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీజనల్ జ్వరాలు, ఇతరత్రా అస్వస్థతతో ఉన్న వాళ్ళను మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేశారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. టీచర్కి కరోనా.. పాఠశాల మూసివేత ►వారం రోజులు సెలవులు ప్రకటించిన ఎంఈవో పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపు రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణైంది. బుధవారం విధులకు హాజరై న ఆమెకు గురువారం నలతగా ఉం డటంతో పరీక్ష చేయించుకున్నారు. అం దులో కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజులు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలిపారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. -
30లోగా సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఈనెల 30 నాటికే సన్నద్ధం కావాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులంతా గురువారం నుంచి ప్రతీరోజు పాఠశాలలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో రాజీపడొద్దని సూచించారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలసి ఆమె మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం అత్యవసరమని మంత్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలను 30వ తేదీలోగా శానిటైజేషన్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. జెడ్పీచైర్మన్లు, సీఈవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతిరోజూ పాఠశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. సూచనలు ఇవీ... ►విద్యా సంస్థల్లో పారిశుద్ధ్య బాధ్యతలను గ్రామ పంచాయతీలే చూసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటారు. ►విద్యార్థులకు సర్పంచ్లే మాస్క్లు అందించాలి. ►విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తక్షణమే వైద్య పరీక్షలు చేపట్టాలి. కోవిడ్ నిర్ధార ణ అయితే, మిగతా విద్యార్థులకు, బాధితుడి కుటుంబీకులకు కోవిడ్ పరీక్షలు చేయాలి. అవసరమైన వైద్య సేవలు అందించాలి. ►ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యే తీరును అధికారులు పరిశీలించాలి. ►ఈ నెల 30లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ఇవ్వాలి. ►ఈనెల 26 నుంచి బోధన, బోధనేతర సిబ్బంది విద్యా సంస్థలకు విధిగా హాజరుకావాలి. ►ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చర్యలు చేపట్టాలి. విద్యార్థులు విద్యా సంస్థలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయొద్దు. 5 గంటలకల్లా నివేదిక ఇవ్వాలి... పాఠశాలల పరిస్థితిపై ఎంఈవోలు ప్రతి రోజూ 5 గంటల కల్లా ఆర్డీలకు నివేదిక ఇవ్వాలని మునిసిపల్ పరిపాలన విభాగం కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ.. కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, విద్యాసంస్థల పునరుద్ధరణ చేపడు తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలు, శానిటేషన్ విధానాలపై పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు మార్గదర్శకాలు పంపింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30లోగా ఉచిత పుస్తకాల పంపిణీ జరగాలని సూచించారు. -
సెప్టెంబరు 1 నుంచి కేజీ టూ పీజీ అన్నీ రీఓపెన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్వాడీలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు, కాలేజీలు వచ్చే నెల 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30నాటికి సిద్ధం చేసే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు అప్పగించారు. కరోనా రెండోవేవ్ ఉధృతి కారణంగా మూసివేసిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్తృ తంగా చర్చించిన అనంతరం నిర్ణయాలను ప్రకటించారు. ఈ వివరాలు కేసీఆర్ మాటల్లోనే.. అన్ని అంశాలను పరిశీలించాం.. ‘‘కరోనాతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలపై సమావేశంలో క్షుణ్నంగా చర్చించాం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతంలో కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసంచారం సాధారణ స్థితికి చేరుకుంటోంది. చదవండి: తుపాను ముందు.. ప్రశాంతత! విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్నిరకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని.. విద్యా సంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తాం. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. గ్రామాలు, పట్టణాల్లో ఇన్నిరోజులుగా మూతపడి ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లదే. జిల్లాపరిషత్ చైర్మన్లు తమ జిల్లాల్లో, మండలాధ్యక్షులు తమ మండలాల్లో పర్యటించి.. అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా, శానిటైజేషన్ చేసి ఉన్నాయో లేదో పరిశీలించాలి. జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్థారించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 30లోగా ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. చదవండి: 84 పోస్టులు.. 11,133 మంది పోటీ కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలి పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించాలి. ఒకవేళ కోవిడ్ నిర్థారణ అయితే.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించాలి. స్కూళ్లు, కాలేజీల్లో శానిటైజేషన్, మాస్కులు వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విద్యార్థులు విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, ఇతర జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలి.’’అని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో.. ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని అధికారులు మా దృష్టికి తెచ్చారు. కరోనా నియంత్రణలోకి వచ్చిందని చెప్పారు. ఆయా అంశాలను పరిశీలించి అన్నిరకాల విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు తమ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలను ఆగస్టు నెలాఖరుకల్లా పరిశుభ్రం చేయించాలి. ఆవరణ, మరుగుదొడ్లను, నీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్, ఇతర రసాయనాలతో శుభ్రంగా కడిగించాలి. తరగతి గదులను కూడా కడిగించి, శానిటైజేషన్ చేయించాలి. నేడు జిల్లాల అధికారులతో మంత్రుల భేటీ విద్యాసంస్థల పునః ప్రారంభం నేపథ్యంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపాయి. వీటితోపాటు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, స్కూళ్లకు సమీపంలోని వైద్య కేంద్రాలు, విద్యార్థులకు పరీక్షలు, ఇతర అంశాలనూ పరిశీలిస్తారని వెల్లడించాయి. సమావేశం తర్వాత స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. చదవండి: విద్యార్థులకు గుడ్న్యూస్.. టీ సర్కారు కీలక నిర్ణయం -
మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు
పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
గురుకులాలు తెరుద్దాం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యక్ష బోధనపై వైద్య, ఆరోగ్య శాఖ సూచనల నేపథ్యంలో, విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభు త్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ క్రమం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గురుకుల విద్యా సంస్థలను తెరిచే అంశంపై గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి. వీటిని ప్రత్యేక అనుమతులతో నిర్వహించొచ్చనే అభిప్రాయం ఉంది. వీటి పరిధి లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే ముందు గా పెద్ద పిల్లలున్నటువంటి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తెరిస్తే ఇబ్బందులుండని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదికఅందించేందుకు సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమావేశం కానున్నా యి. అన్ని విభాగాల అధికారులతో పాటు రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశంలో పాల్గొనున్నారు. ఆన్లైన్తో ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో 430 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 230 జూనియర్ కాలేజీలు 2021–22 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. వీటితో పాటు 60 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో బోధన సాగుతుండగా.. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫస్టియర్కు కూడా ఆన్లైన్ బోధన ప్రారంభించాలని భావిస్తున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా పిల్లలు పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంలో తడబాటుకు గురవుతున్నట్లు సొసైటీల పరిశీలనలో తేలింది. దీంతో ప్రత్యక్ష తరగతుల ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించిన అధికారులు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా సంస్థల వారీగా విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తారని, వీరికి తరగతులు నిర్వహించడం కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. కాగా, బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో హాస్టళ్లలో తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేసి కాలేజీలు తెరవొచ్చనే చర్చ జరుగుతోంది. మంగళవారం నాటి సమావేశంలో క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను సేకరించాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సొసైటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
తెలంగాణలో విద్యాసంస్థల భౌతిక తరగతులపై రేపు నిర్ణయం
హైదరాబాద్: విద్యాసంస్థల భౌతిక తరగతులపై రేపు(శుక్రవారం) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ణయించనుంది. సెప్టెంబర్ 1 కన్నా ముందే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మా బడిని... మాకిచ్చేయండి!
కరోనా వైరస్ అత్యంత దారుణంగా మానవాళిని బలిగొంటున్న దరిమిలా గత పద హారు నెలలుగా విద్యా సంస్థలన్నీ మూతబడ్డ విషయం తెలిసిందే. శాస్త్ర సాంకేతిక విప్లవం అందించిన మాధ్య మాల సహకారంతో విద్యా కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోకి మారాయి. జూమ్, గూగూల్ మీట్, ఫేస్బుక్, యుడెమీ, స్కిల్ షేర్, కోర్సియా, ఎడెక్స్, ఎడ్ యాప్ వంటి వర్చువల్, డిజిటల్ ప్లాట్ఫామ్స్కు గిరాకీ పెరిగింది. కోవిడ్ నిబంధనల్ని కొంత సడలించి గత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్కూళ్లు, కాలేజీలు తెరచినప్పటికీ, సెకండ్ వేవ్ ఉధృతితో విద్యా సంస్థలకు మళ్లీ తాళాలు పడ్డాయి. కరోనా కారణంగా విద్యార్థుల మేధోభివృద్ధి చెప్ప లేనంతగా కుంటుబడింది. విద్యాలయంతో తమ రోజువారీ భూభౌతిక సంబంధం, ప్రాకృతిక అను భవం స్తంభించిపోవడం మూలాన ఇటు విద్యార్థు ల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ నిరాశ నిస్తేజాలు అలుముకున్నాయి. ఇవాళ దేశంలోని ముప్పై మూడు కోట్లమంది విద్యార్థులు తమ చదువుల్ని తమకివ్వ మని ముక్తకంఠంతో పెద్దల సమాజానికి, ప్రభుత్వా లకు నివేదించుకుంటున్నారు. ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమై పోవటాన పిల్లల సామాజిక ఎదుగుద లకు పెను ఆటంకం ఏర్పడింది. ఈ మొత్తం ఎపి సోడ్లో ఆన్లైన్ టీచింగ్ ఉత్త బోన్సాయ్ పెంపకం అని రూఢి అయ్యింది. కరోనా కష్టకాలంలో ఆన్లైన్ తరగ తులు, ఇ–లెర్నింగ్ మేలిమి ప్రత్యామ్నాయాలుగా కని పిస్తున్నప్పటికీ, వాటి వ్యవస్థీకృత లోపాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏ రంగం దెబ్బతిన్నా తిరిగి దానికి ఉద్దీపన ఇవ్వవచ్చు, కానీ విద్యావ్యవస్థలో అట్లా కుదరదు. ఇది కాల సంబంధి, వయో సంబంధి. బాలలు పెరుగు తున్న క్రమంలో విద్య అందకపోతే జ్ఞానశూన్యులుగా మిగిలిపోయి ‘ఖాళీ మెదళ్ల తరం’ ఏర్పడుతుంది. ఇది ఆ సమాజానికి ఎంతో నష్టదాయకం. ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిస్వామ్యంలో విద్య ఇంతకు ముందరికంటే ఒక అనివార్యమైన అవసరమైంది. ఇప్పటికీ మనలో కొద్దిమందికి మాత్రమే చదువులు ఉత్తమంగా అందడం, మిగతా వారికి అంతంత మాత్రంగా కూడా అందుబాటులో లేకపోవడం ఒక సాంఘిక విషాదం. ఈ విషాదాన్ని ఆన్లైన్ విద్యా కార్యక్రమం సైతం అధిగమించలేకపోగా మరింత రాజేసింది. నగరాల్లో, పట్టణాల్లోలాగా ఇంటర్నెట్ సౌకర్యం గ్రామాలకు, మారుమూల ఆవాసాలకు విస్త రించకపోవడం, తగినంత సామర్థ్యం గల స్మార్ట్ఫోన్ల కొనుగోలుశక్తి పేదలకు లేకపోవడంతో పాటు గృహ వాతావరణంలోని అనేక అస్తవ్యస్తతలు పిల్లల చదు వుల మీద ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయి. మనది విద్యార్థి కేంద్రక విధానం అని గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంలో విద్యార్థి కేంద్రక విధాన లక్ష్యాలైన నమ్రత, సుగమతలకు దరిదాపుల్లో కూడా ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ లేకపోవడం దాని ప్రధాన లోపం. ముఖ్యంగా పాఠశాల నుండి విద్యార్థులకు అబ్బే అభివ్యక్తీరణ, నాయకత్వ సామర్థ్యం, జట్టుగా పనిచేయడం లాంటివాటిని ఆన్లైన్ తరగతులు దెబ్బ తీశాయి. సోషల్ ఇంటలిజెన్స్, ఎమోషనల్ ఇంటలి జెన్స్, ఎథికల్ ఇంటలిజెన్స్ వాళ్లకు అందకుండా పోయింది. విద్యార్థులు వాళ్లుగా రూపొందించుకునే వ్యక్తిత్వ నిర్మాణానికి క్యాంటీన్, కారిడార్, ప్లేగ్రౌండ్ జ్ఞాపకాలు ఎంతగానో దోహదం పడతాయి. వీటన్ని టినీ కోవిడ్ హరించింది. విద్యార్థికి తన అభ్యసన జీవితంలో తన సహపాఠులతో ఏర్పడే స్నేహ సంబంధం చాలా ఉదాత్తమైంది. ‘ఇతరుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకునేదే విద్యార్జనలో ఎక్కువ’ అంటాడు సుప్రసిద్ధ విద్యా తత్త్వవేత్త జాన్ డ్యూయీ. ఇందుకు ఏ రకమైన టెక్నికల్ కాన్ఫరెన్సింగ్ ప్రోగ్రాం లోనూ అవకాశం ఉండదు. అందుకే కంప్యూటర్లకు, మొబైళ్లకు పిల్లలు టాటా చెప్తూ తోట లాంటి, పాట లాంటి, మంచి మాట లాంటి ‘మా బడిని మాకు ఇవ్వండి’ అని ప్రాధేయపడుతున్నారు. సమయానికి అందాల్సిన పోషకాహారం లాంటి చదువు సంధ్యలు అందినపుడే వాళ్లు ప్రపుల్లం కాగలరు. డా. బెల్లి యాదయ్య వ్యాసకర్త ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ‘ మొబైల్ : 98483 92690 -
Campus Interview: క్యాంపస్లోనే కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంజనీరింగ్ చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యా సంస్థల్లో చదివినవారికి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలో ఏఐసీటీఈ అనుబంధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018–19 సంవత్సరంలో 1.03 లక్షల మంది చదవగా, అందులో 46.09 శాతం మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదే ఏడాది 7.01 లక్షల మంది చదవగా, 53.52 శాతం మంది ఉద్యోగాలు పొంది నట్లు పేర్కొంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా ఇతర పద్ధతుల్లోనూ ఉద్యోగావకాశాలు వస్తున్నాయని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందినవారి శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వడబోత తర్వాతే నియామకాలు స్వదేశీ, విదేశీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను వెతికి పట్టుకొని ఉద్యోగాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా కంపెనీలు కాలేజీలను ఎంపిక చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించేప్పుడు కంపెనీలు వివిధ దశలుగా వడబోత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ కనబర్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఏ దశలో వెనుకబడినా అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలతోపాటు తమ కంపెనీల వద్దకే కాలేజీ విద్యార్థులను పిలిపించుకొని, ఉద్యోగాల కోసం వారిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో చదువులపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఫీజులు, రీయింబర్స్మెంట్ సొమ్ము కోసమే పనిచేసే కొన్ని కాలేజీల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా కాలంలో ఉద్యోగావకాశాలు తగ్గినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో చివరి రెండేళ్లు చదివిన విద్యార్థులు క్లాసులు లేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నారు. -
Unlock 4: థియేటర్లు, డిగ్రీ కాలేజీలకు ఓకే
సాక్షి, బెంగళూరు: అన్లాక్–4 వెసులుబాట్లు అందుబాట్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో గత మూడునెలల నుంచి మూతబడిన సినిమా థియేటర్లను సగం సీట్లతో తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాసంస్థలకూ సై అంది. ఆదివారం కావేరి నివాసంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నేటి నుంచే థియేటర్లు ఏప్రిల్లో కోవిడ్ సెకెండ్ వేవ్ విరుచుకుపడడంతో రాష్ట్రమంతటా సినిమా థియేటర్లకు తాళాలు వేశారు. స్కూళ్లు, కళాశాలలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు అదుపులోకి రావడంతో అన్లాక్– 4కు గేట్లు తీశారు. సోమవారం నుంచి సగం మంది ప్రేక్షకులతో సినిమా టాకీస్లను నడుపుకోవచ్చు. ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ తదితర కాలేజీలను ప్రారంభించవచ్చు. అయితే కాలేజీకి హాజరయ్యే విద్యార్థులు కనీసం ఒక డోస్ కోవిడ్ టీకా అయినా తీసుకుని ఉండాలి. పబ్, క్లబ్, ఈతకొలనుల మూసివేత కొనసాగుతుంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. పర్యాటకంపై సడలింపు యోచన పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలను సడలించాలని సర్కారు నిశ్చయంతో ఉంది. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉవ్విళ్లూరుతుంటారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో పర్యాటక కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కొడగు, చిక్కమగళూరు, మైసూరు ప్రాంతాల్లో అడవులు, రిసార్టు టూర్లకు గిరాకీ పెరుగుతోంది. చారిత్రక ప్రాంతాలైన హంపీ, హళేబీడు, బాదామి తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకుల సంఖ్య పెరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పర్యాటక రంగాన్ని ఆదుకునేలా ఆంక్షలను సడలించి ప్యాకేజీలను ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. మెడికల్ కాలేజీలకూ అనుమతి యశవంతపుర: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ ట్విట్టరలో తెలిపారు. ఆయుష్, దంతవైద్య, పారా మెడికల్ కాలేజీలను తెరుచుకోవచ్చని చెప్పారు. కరోనా టీకా వేయించుకున్న విద్యార్థులు, బోధన సిబ్బంది మాత్రమే హాజరు కావాలన్నారు. మూడో వేవ్కు ముందుజాగ్రత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల చికిత్సలకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
మాన్సాస్ కార్యాలయం ముట్టడి
విజయనగరం టౌన్: మాన్సాస్ (మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్) విద్యా సంస్థల ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యంపై నిరసన తెలిపారు. మ.2 నుంచి సా.6.30 గంటల వరకు కోటలోని మాన్సాస్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవో వెంకటేశ్వరరావును నిలదీశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్యాసంస్థల సిబ్బందికి జీతాలిచ్చేది మాన్సాస్ కరస్పాండెంట్, సీఎఫ్వో లేనని, తాను కాదని తెలిపారు. జీతాల చెల్లింపులో జాప్యంపై ఇప్పటివరకు కరస్పాండెంట్ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. జీతాలిచ్చే కరస్పాండెంట్తో పాటు జాయింట్ సంతకాన్ని సీఎఫ్వో పెడతారని, వారిద్దరూ కలిసి జీతం చెక్పై సంతకం చేయాలన్నారు. తాము ఏటా రూ.మూడున్నర కోట్లను సపోర్టింగ్ ఫండ్ కింద తమ శాఖ తరఫున ఇస్తామన్నారు. ఇప్పుడు ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ చేసే వారిని మార్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారిద్దరూ వచ్చి ఆ చెక్లపై సంతకం పెట్టి ఇచ్చేస్తే సమస్య పరిష్కారమైపోతుందన్నారు. మాన్సాస్ కరస్పాండెంట్, సీఎఫ్వోల సమక్షంలోనే సమస్యను తేల్చుకుందామంటూ ఉద్యోగులు వెనుదిరిగారు. -
ప్రముఖ విద్యావేత్త గ్రేగరి రెడ్డి కన్నుమూత
హిమాయత్నగర్ (హైదరాబాద్): సెయింట్ ఆంథోనీస్, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఉడుముల గ్రేగరి రెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా చికిత్స పొందుతూ దోమలగూడలోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గ్రేగరి రెడ్డికి భార్య, 9 మంది పిల్లలు ఉన్నారు. భార్య ఇటీవలే చనిపోయారు. గ్రేగరి రెడ్డి 1971వ సంవత్సరంలో సెయింట్ ఆంథోనీస్ పేరుతో కింగ్కోఠిలో స్కూల్ను స్థాపించారు. ఆ తర్వాత పదేళ్లకు 1981లో ఇదే ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో హబ్సిగూడ, అస్మన్ఘట్ ప్రాంతాల్లో సెయిం ట్ జోసెఫ్ పేరుతో మరో రెండు స్కూల్స్ను ప్రారంభించారు. ఐసీఎస్సీ బోర్డు మెంబర్గా గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తూ ఇంగ్లిష్ మీడియంలో సమూలమైన మార్పుల కోసం ఆయన కృషి చేశారు. గ్రేగరి రెడ్డి భౌతిక కాయాన్ని బంధువులు, స్నేహితుల సందర్శన కోసం గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కింగ్కోఠి సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉంచనున్నారు. అనంతరం 3 గంటలకు నారాయణగూడ సిమెంట్రీలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా ?
భావి భారత పౌరుల చదువులు వ్యాక్సినేషన్పై ఆధారపడ్డాయి. కరోనా భయాలు తొలగక పోకపోవడంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు తటపటాయిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎప్పుడు టీకా ఇవ్వాలనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలను స్కూళ్లకు పంపడం, టీకాలు ఇవ్వడంపై భారతీయుల ఆలోచణ ధోరణిని తెలుసుకునే ప్రయత్నం లోకల్సర్వే సంస్థ చేసింది. అందులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంపై ఇతర రాష్ట్రాలు ముందు వెనుకా ఆలోచిస్తున్న సమయంలోనే తెలంగాణ సర్కారు నిర్ణయం ప్రకటించింది. అయితే పిల్లలను బడులకు పంపడం, టీకాలు ఇవ్వడంపై తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ 1,789 మంది తల్లిదండ్రు అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది. ► విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమైన పిల్లలను చదువుకునేందుకు పంపిస్తామని 26 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ► జిల్లాలలో పూర్తిగా కోవిడ్ కేసులు తగ్గిపోయినప్పుడే తమ బిడ్డలను విద్యాసంస్థలకు పంపిస్తామని 15 శాతం మంది పేరెంట్స్ తెలిపారు. ► తాము నివాసం ఉండే జిల్లాతో పాటు పొరుగు జిల్లాలలో కూడా జీరో కరోనా కేసులు నమోదయితేనే తమ వాళ్లను స్కూళ్లు/ కాలేజీలకు పంపిస్తామని 24 శాతం మంది కుటుంబ పెద్దలు వెల్లడించారు. ► తమ పిల్లలకు టీకాలు అందించేంత వరకు బడులు/ కాలేజీలకు పంపబోమంటూ 33 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. కేవలం 2 శాతం మంది మాత్రమే ఎటూ తేల్చుకోలేకపోతున్నామన్నారు. (చదవండి: కరోనా: లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ) వ్యాక్సిన్ విషయంలో పిల్లలకు వ్యాక్సిన్ వేయించే విషయంపై ఇటీవల తెలంగాణకు చెందిన 1600ల మంది నుంచి శాంపిల్స్ సేకరించి విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ► సెప్టెంబరు నాటికి పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పిల్లలకు వ్యాక్సిన్ వేయిస్తామని 49 శాతం మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ► పిల్లలకు వ్యాక్సిన్ వేసే విషయంలో ఒకటి నుంచి మూడు నెలల సమయం వరకు వేచి చూస్తామంటూ 31 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. ► 14 శాతం మంది తల్లిదండ్రులు ఈ ఏడాది తమ పిల్లలకు అసలు వ్యాక్సిన్ వేయించబోమని తేల్చి చెప్పారు. ► పిల్లలకు వ్యాక్సిన్ వేసే విషయంలో ఇంకా ఏమీ తేల్చుకోలేదని 6 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ► పిల్లలను బడికి పంపే విషయంలో దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల నుంచి 10,828 శాంపిల్స్ సేకరించగా మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లను బడికి పంంపేందుకు రెడీగా లేమని వెల్లడించారు. ► తాము నివసించే జిల్లాలో కరోనా కేసులు జీరోకు రావడం లేదా పిల్లలకు టీకాలు అందివ్వడం జరిగితేనే తమ బిడ్డలను కాలేజీ/స్కూళ్లకు పంపిస్తామని 76 శాతం మంది తల్లిదండ్రులు ఘంటాపథంగా తేల్చి చెప్పారు. ► సెకండ్వేవ్ ప్రారంభానికి ముందు పిల్లలను బడికి పంపేందుకు దేశ వ్యాప్తంగా 69 శాతం మంది తల్లిదండ్రులు రెడీగా ఉండగా ఇప్పుడా సంఖ్య 20 శాతానికే పరిమితమైంది. ►ఇక సెప్టెంబరులోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ... తమ పిల్లలకు టీకా ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు 65 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. చదవండి : టీకాలందు.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేరయా! -
ఉన్నత విద్యలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం విడుదల చేశారు. ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఏపీకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34, రాజస్థాన్లో 37 మాత్రమే కావడం గమనార్హం. కాలేజీల సంఖ్యా పరంగా ఆలిండియా యావరేజ్ 30 కాగా ఏపీలో 51 ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలున్నాయి. ఏపీ జోరు ఇలా.. ► దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54 శాతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ► విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక (10,231) మొదటి స్థానంలో ఉండగా ఏపీ (2,094) 9వ స్థానం, తెలంగాణ (2,261) ఏడో స్థానంలో నిలిచాయి. ► దేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4 శాతం మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ► దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27.1 శాతంగా ఉండగా.. ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో మహిళలు 30 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఇలా.. ► జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది (85 శాతం) ఆరు డిసిప్లిన్ కోర్సుల్లోనే చేరారు. వీరంతా హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఐటీ అండ్ కంప్యూటర్ విభాగాల్లో ఉన్నారు. ► పీహెచ్డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది పీహెచ్డీలో చేరారు. ► దేశంలో 2019–20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులుండగా వీరిలో 42.5 శాతం మంది మహిళలు. ► ఉన్నత విద్యలో 2019–20లో 3.85 కోట్ల మేర చేరికలున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే. సర్వే జరిగింది ఇలా.. దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు సర్వేకు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. దేశంలో 1,043 యూనివర్సిటీలు, 42,343 కాలేజీలు, 11,779 స్టాండ్ ఎలోన్ (ఒకే విభాగానికి సంబంధించిన కోర్సులను అందించేవి) విద్యాసంస్థలున్న సంగతి తెలిసిందే. వీటిలో 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 స్టాండ్ ఎలోన్ సంస్థలు సర్వేకు గణాంకాలను సమర్పించాయి. తక్కినవి స్పందించలేదు. దేశంలో ఉన్నత విద్యా రంగం గత ఐదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏ మేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు 2015–16 నుంచి 2019–20 మధ్య 11.4 శాతం మేర పెరిగాయి. ఇందులో మహిళల చేరికలు 18.2 శాతం పెరగడం విశేషం. -
వైరల్ వీడియో: మోదీజీ..ఏడేళ్లు స్కూల్స్ మూసేసినా ఫర్వాలేదు.. ఆన్లైన్ క్లాస్లు వద్దు
-
మోదీజీ... కరోనాపై పోరాటంలో మా చదువుల్ని త్యాగం చేస్తాం
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు చదువులు ఆటంకం ఏర్పడకూడదని చాలా పాఠశాలలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్యాభ్యాసం కొనసాగించే వెసలుబాటు లేని కొందరి విద్యార్థుల కష్టాలు మనల్ని కదిలించేలా ఉండగా, మరికొందరి పిల్లలు వారి పరిస్థితులను తెలుపుతున్న వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వారు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు వారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 19 సెకన్ల వైరల్ క్లిప్లో, ఆ ఇద్దరు పిల్లలు.. “ మోదీ జీ కరోనాతో పోరాడటం కోసం మా చదువులను త్యాగం చేయవలసి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏడేళ్లపాటు పాఠశాలలు మూసివేయాల్సి వస్తే, మేము ఆ త్యాగానికి సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. ఈ తరహా వీడియోనే ఇటీవల జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్లైన్ చదువులపై తనకున్న అసహనాన్ని గట్టిగానే వెల్లగక్కింది. తన బాధను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో -
‘పాఠశాల విద్య’ ఆస్తుల 'రీ సర్వే'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తమ అదీనంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు.. వివిధ కార్యాలయాలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల పరిరక్షణకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ శాఖతో పాటు వివిధ విభాగాల పరిధిలో మొత్తం 42,069 స్కూళ్లు, గురుకుల సంస్థలు, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున భూములు, స్థలాలు, భవనాలు, ఇతర పరికరాలతోపాటు కాలక్రమంలో అనేక సదుపాయాలు సమకూర్చింది. ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రభుత్వ స్కూళ్లు, విద్యాసంస్థలకు భూములు, స్థలాలు, ఇతర వస్తువులను అందించారు. అయితే, ఇప్పటివరకు వీటికి సంబంధించి సరైన నిర్వహణ లేకుండాపోయింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు, ఇతర పత్రాలు కనిపించని పరిస్థితి. పలుచోట్ల భూములు, స్థలాలు కూడా అన్యాక్రాంతమయ్యాయి. పరికరాలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంకొన్నిచోట్ల.. కంచే చేను మేసిందన్నట్లు ఆయా గ్రామాలకు చెందిన నేతలు, స్కూళ్ల సిబ్బంది ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గత ప్రభుత్వాల పరిరక్షణ లేకే.. ఈ విద్యా సంస్థలకు సంబంధించిన భూములు, స్థలాల విలువ ఏటేటా పెరిగిపోతుండడంతో అనేకచోట్ల అక్రమార్కులు వాటి రికార్డులు తారుమారు చేసి వాటిని కబ్జాచేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాలూ ఏర్పాటుచేసుకున్నారు. ఇవేకాక.. స్కూళ్లకు కొన్నేళ్లుగా వివిధ పథకాల కింద ప్రభుత్వాలు లక్షలాది రూపాయల విలువ చేసే కంప్యూటర్లు, టీవీలు, ఫర్నీచర్, ఇతర పరికరాలను అందించినా వాటిలో చాలా శాతం ఇప్పుడు కనిపించవు. కొన్నేళ్ల క్రితం వరకు వాచ్మెన్లు ఉండేవారు. కాలక్రమంలో ఆ పోస్టుల భర్తీ లేకపోవడంతో కొన్నేళ్లుగా స్కూళ్లకు భద్రత లేకుండాపోయింది. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలతో సమకూర్చిన పరికరాలకు రక్షణ కరువైంది. గత ప్రభుత్వాలు కూడా ఈ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులు, ఇతర అంశాలను పూర్తిగా విస్మరించాయి. రీసర్వేకు ఏర్పాట్లు ప్రభుత్వ స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు, కార్యాలయాల భూములు, స్థలాల రీసర్వేకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు, ఆర్జేడీలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో వారంతా తమ పరిధిలోని స్కూళ్లు, మండల రిసోర్సు సెంటర్లు, భవిత కేంద్రాలు, జిల్లా ఎలిమెంటరీ విద్యాబోధనా శిక్షణ సంస్థలు (డైట్స్) ఇతర కార్యాలయాలు, సంస్థల భూములు, స్థలాల రీసర్వేకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ ఆస్తుల సరిహద్దులను డీమార్కింగ్ చేసి వాటికి సరైన రికార్డులను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం డ్రోన్ రోవర్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా ఆదేశాలిచ్చారు. ఇకపై ఈ ఆస్తులకు సంబంధించి ‘కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్సు స్టేషన్స్ నెట్వర్క్ను ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. -
గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయిస్తాం
తిరుపతి ఎడ్యుకేషన్: గుర్తింపులేని విద్యాసంస్థలను మూసివేయిస్తామని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్ఈఆర్ఎం) వైస్ చైర్పర్సన్ డాక్టర్ విజయ శారదారెడ్డి చెప్పారు. తిరుపతి పరిసరాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను కమిషన్ సభ్యులతో కలిసి శనివారం ఆమె సందర్శించారు. అనంతరం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూషన్ ఫీజులో 70 శాతం ఫీజును విడతలుగా తీసుకోవాలని ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఈ జీవోను అమలు చేయకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 784 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో 60 శాతం కళాశాలల మూసివేతకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. -
పక్షుల లెక్క 'తేలుద్దాం'
సాక్షి, అమరావతి: పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ‘గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్’ పేరిట ఏటా అంతర్జాతీయంగా నిర్వహించే పక్షుల గణనకు రాష్ట్రంలోనూ ఆదరణ పెరిగింది. ఫిబ్రవరి 11 నుంచి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్న ఈ గణనలో రాష్ట్రానికి చెందిన పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు భాగస్వాములయ్యాయి. తిరుపతి ఐఐటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఏలూరులోని సర్ సీఆర్ఆర్ మహిళా కళాశాల, శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్ కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అలాగే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని పలువురు వలంటీర్లు క్యాంపస్ పక్షుల గణనలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడ నేచర్ క్లబ్, విశాఖ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో సంస్థలు డబ్ల్యూసీటీఆర్ఈ, ఈసీసీటీలకు చెందిన వలంటీర్లూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పక్షుల గణన కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)–తిరుపతి కీలక భాగస్వామిగా పనిచేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పక్షుల గణనలో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, కేంద్రీయ విద్యాలయం పాల్గొని 215 పక్షి జాతులను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా.. ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ పక్షుల గణనలో వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది పక్షుల అభిమానులు(బర్డ్ వాచర్స్) పాల్గొంటారు. ఇందులో భాగంగానే క్యాంపస్ బర్డ్ కౌంట్ పేరుతో విద్యా సంస్థలు, ఇతర సంస్థలు వాటి క్యాంపస్లలో పక్షుల గణన చేపడతాయి. పరిశీలకులు(బర్డ్ వాచర్స్) పక్షుల కదలికలను గమనించి వాటి ఫొటోలు తీసి https://birdcount.in/event/ cbc2021/ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా జరిగే ఈ పక్షుల బర్డ్ కౌంట్లో 2013 నుంచి మన దేశంలోని సంస్థలు పాల్గొంటున్నాయి. క్యాంపస్ పక్షుల గణనలో గతేడాది ఐఐఎస్ఈఆర్ తిరుపతి దేశంలోనే మూడో క్యాంపస్గా నిలిచింది. పక్షుల వైవిధ్యం తెలుసుకునేందుకు దోహదం దేశంలో పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. పక్షులపై అవగాహన ఉన్న ఎవరైనా 15 నిమిషాలపాటు వాటి కదలికలను గమనించి వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి వేలాదిమంది బర్డ్ వాచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. – ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డీనేటర్ రాజశేఖర్ -
సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కళాశాల ప్రిన్సిపాల్ ఈడ్పుగంటి సుధీర్బాబు, ఇంటర్నల్ ఆడిటర్ శివరామప్రసాద్ పక్కదారి పట్టించారు. ఏకంగా రూ.1.62 కోట్లను స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఆర్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కైంకర్యం చేసిందిలా..: సీఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేశారు. ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్టు ఓ నకిలీ జీవో సృష్టించి.. విద్యార్థులు చెల్లించిన ఫీజుల్లో నుంచి 40 శాతం సొమ్మును స్వాహా చేశారు. ఇలా సుమారు రూ.1.62 కోట్ల మేర సొమ్ములు కాజేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ప్రిన్సిపాల్, ఆడిటర్తోపాటు రాణి సంయుక్త, విజయకుమార్ అనే ఉద్యోగులకూ ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. -
అవకాశాలున్నాయ్.. ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా ఐదారు నెలలు విద్యాసంస్థలు తెరుచుకోక ఆన్లైన్ బోధనతో తాపీగా సాగిన ఇంటర్మీడియట్ చదువులు ఇప్పుడు తరగతుల ప్రారంభంతో ఉరుకులు పరుగులు అందుకున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతోపాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్ ముగించి రివిజన్ చేయించే సన్నాహాల్లో పడ్డాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 4 సార్లు పరీక్ష నిర్వహణతో ఎంతో వెసులుబాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 పరీక్షలను 4 సార్లు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. కోవిడ్తో పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి జేఈఈని ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు నాలుగుసార్లు రాయవచ్చు. ఎన్నిసార్లు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది. 13 భాషల్లో 384 ప్రశ్నపత్రాలు జేఈఈ మెయిన్ను ఇంగ్లిష్, హిందీతో పాటు దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, ఉర్దూ, పంజాబీ, ఒడియా, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామీ భాషల్లో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నందున విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉండనుంది. ప్రాంతీయ భాషలో రాసేవారికి ఇంగ్లిష్ ప్రశ్నలు కూడా అందుబాటులో ఉంటాయి. జేఈఈలో బీఈ, బీటెక్లకు పేపర్–1, బీఆర్క్కు పేపర్–2ఏ, బీ, ప్లానింగ్కు పేపర్–2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 384 ప్రశ్నపత్రాలను ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 4 లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేసింది. ఎన్టీఏ ఈసారి జేఈఈ సిలబస్, పరీక్షల ప్యాటర్న్లో కూడా మార్పులు చేసింది. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలో 30 చొప్పున ప్రశ్నలుంటాయి. -
‘దుమ్ము’ దులపండి..!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం 20లోగా క్లీన్ చేయాలి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు శానిటైజేషన్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. -
ఉన్నత విద్యలో 4 కొత్త కోర్సులు
సాక్షి, అమరావతి: ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో నాలుగు కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత విద్య ప్రణాళికామండలి (హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు)తో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర, సెంట్రల్ వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పరస్పర భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి.. పదినెలల ఇంటర్న్షిప్తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో చేరి మూడేళ్లు మాత్రమే చదువుతానంటే డిగ్రీ లభిస్తుందని చెప్పారు. నూతన విద్యావిధానంలో 70 శాతం చేరికలు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరికలు 90 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆధునికీకరిస్తున్నామన్నారు. నైపుణ్యాల కల్పన పెంపు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశోధనల పెంపు లక్ష్యంతో ఎంఎస్ఎంఈ, నేషనల్ రీసెర్చి డెవలప్మెంటు కార్పొరేషన్ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఒక విభాగం ఏర్పాటుచేసి తొలిసారి అకడమిక్ ఆడిట్ చేపట్టామన్నారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లిన్ ఎడ్యుకేషన్ రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామన్నారు. తొలివిడతలో శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, జేఎన్టీయుకే, జేఎన్టీయుఏ, ఆర్జీయూకేటీలను, తదుపరి దశలో నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, పద్మావతి వర్సిటీలను రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామని వివరించారు. నాలుగు వర్సిటీలను ప్రతిపాదించగా కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ, కర్నూలులో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటు చేశామని, టీచర్ ట్రయినింగ్ ప్రాధాన్యతతో ప్రకాశం వర్సిటీని తీర్చిదిద్దనున్నామని, అలాగే విజయనగరంలో వర్సిటీ ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలపై చర్యలు విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఉన్నత విద్యలో పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చామని, 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇంటర్లో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. అవినీతికి తావులేకుండా వర్సిటీలలో పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న అమ్మఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ పాల్గొన్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం మండలి డైరీ ఆవిష్కరణ, మీడియా సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు. ఈ పథకాలతో తమ ఉనికి పూర్తిగా కనుమరుగు అయిపోతోందన్న ఆందోళనతో తెలుగుదేశం సహ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి కుట్ర రాజకీయాలకు దిగుతున్నాయని విమర్శించారు. దేవుళ్లని కూడా రాజకీయాల్లోకి లాగుతూ దిగజారిపోతున్నారని మండిపడ్డారు. రామతీర్థం విగ్రహ ధ్వంసంపై ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించిందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దోషులు ఎవరైనా సరే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం అమ్మ ఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ఈనెల 11న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు. రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి రానీయని బాబు ఇప్పుడెలా సీబీఐ విచారణ అడుగుతారని ఆయన ప్రశ్నించారు. -
కార్పొరేట్ కక్కుర్తి..!
శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కూతురును ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో రూ. 1.2 లక్షల ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. ఈ నెలాఖరులోగా మిగతా ఫీజు చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీల్లో ప్రత్యక్ష బోధన లేదు.. ప్రాక్టికల్స్ లేవు. అయినా మొత్తం ఫీజు చెల్లించాలనడంతో గత్యంతరం లేక తన కూతురు భవిష్యత్తు కోసం అప్పు వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయి. రాయితీ ఇస్తామని ఆశపెట్టడం లేదా పిల్లలకు పాఠాలు చెప్పబోమని బెదిరించి మొత్తం ఫీజును వసూలు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష బోధన, ప్రాక్టికల్స్ లేకపోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. యాజమాన్యాలు చెప్పినంత ఫీజు చెల్లించాలనే డిమాండ్లతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడువులోగా ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాసులు నిలిపేస్తామని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉంటే ప్రైవేటు కాలేజీలే 1,550కుపైగా ఉన్నాయి. అందులో 18 కార్పొరేట్ మేనేజ్మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వాటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సాధారణ కాలేజీల్లో ఫీజులు రూ. 20–30 వేలు ఉండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం కాలేజీని బట్టి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బ్యాచ్ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఎంసెట్, ఐఐటీ కోచింగ్ అంటూ ప్రత్యేక బ్యాచ్ల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. గతేడాది నిర్ణయించిన ఫీజునే ఇప్పుడూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు కావడంతో కొంత రాయితీ ఇవ్వాలని కోరినా కాలేజీలో చేర్చినప్పుడు ఖరారు చేసుకున్న మొత్తాన్నే చెల్లించాలని పట్టుపడుతున్నాయి. ఇక ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిలిపేస్తున్నాయి. ప్రతి వారం నిర్వహించే స్లిప్ టెస్టులకు దూరం చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) కాలేజీలకు భారీ లాభం.. ఓ వైపు ఫీజులను తగ్గించట్లేదు. నిర్దేశిత ఫీజులనే వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఖర్చు భారీగా తగ్గింది. ఉన్న సిబ్బందిని 10 శాతం కంటే తక్కువకు కుదించాయి. వంద మంది లెక్చరర్లు బోధించాల్సిన క్యాంపస్లలో ఆరేడు మంది లెక్చరర్లతో నడిపిస్తున్నాయి. వారితోనే వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో క్యాంపస్లో ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటారు. వారికి 50 మందికిపైగా లెక్చరర్లు అవసరం. వారికి గతంలో వేతనాల రూపంలోనే నెలకు సగటున రూ.12.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదుగురు లెక్చరర్లకు రూ.లక్ష లోపు చెల్లిస్తూ ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ఇలా ఒక్కో కాలేజీలో 90 శాతం మంది బోధనా సిబ్బందిని (మొత్తంగా 10 వేల మందికి పైగా) రోడ్డున పడేసి, వారికి చెల్లించాల్సిన వేతనాల మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్క శాతం మందికే పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా, 2 శాతం మందికి 60 శాతం వేతనాలు, మిగతా వారికి 40 శాతం నుంచి 50 శాతం లోపే వేతనాలు చెల్లిస్తూ.. లెక్చరర్లను అర్ధాకలికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రైవేటు కాలేజీల్లో బోధించే మరో 10 వేల మందికి పైగా లెక్చరర్లు రోడ్డున పడ్డారు. పట్టించుకోని విద్యా శాఖ కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ పట్టించుకోవట్లేదు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించట్లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించినా ఆ తర్వాత గాలికి వదిలేశారు. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేదు: దుబ్బాక జానకిరెడ్డి, రాష్ట్ర లెక్చరర్స్ జేఏసీ ఉపాధ్యక్షుడు ఓ కార్పొరేట్ కాలేజీలో పని చేశాను. కరోనా దెబ్బతో ఉద్యోగానికి దూరమయ్యాను. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది. తెలిసిందల్లా టీచింగే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ వేవ్ అంటున్నారు. అదే పరిస్థితి వస్తే జీవనోపాధి ఇంకా కష్టంగా మారుతుంది. ట్యూషన్లు చెబుతున్నా: మారోజు చంద్రశేఖర్, రాష్ట్ర లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు కరోనాతో కాలేజీ మూత పడినప్పటి నుంచి నో వర్క్– నో పేలోనే ఉన్నాను. ఇకనైనా పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇన్నాళ్లూ పని లేదు. ఇకనైనా ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. అందుకే హోం ట్యూషన్స్ చెప్పి జీవనం కొనసాగిస్తున్నా. నాకు తెలిసిన అనేక మంది లెక్చరర్లు కూలీలుగా మారిపోయారు. -
హ్యుమానిటీస్లో హెచ్సీయూ టాప్
రాయదుర్గం(హైదరాబాద్): రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(ఆర్యూఆర్)–2020లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సత్తా చాటింది. హ్యుమానిటీస్ విభాగంలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 276వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు హెచ్సీ యూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లారివేట్ అనలైటిక్స్ భాగస్వామ్యంతో ఆర్యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ.. ఆర్యూఆర్–2020 హ్యుమానిటీస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ను విడుదల చేసింది. బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక సస్టైనబిలిటీ వంటి అంశాలతోపాటు 20 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలో 800 పైగా విద్యా సంస్థలు ర్యాంకింగ్లో పాల్గొన్నాయి. ప్రపంచంలో హ్యుమానిటీస్ బోధనపరంగా హెచ్సీయూ 53వ స్థానం సాధించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. -
ఫీజు లింక్ క్లాస్ కట్!
వనస్థలిపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో హర్షిత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు మూడు సబ్జెక్టులను ఆన్లైన్లో బోధిస్తున్నారు. గత వారం నుంచి అకస్మాత్తుగా ఆన్లైన్ తరగతులకు సంబంధించిన లింకు ఫోన్కు రావడం లేదు. ఒకరోజు క్లాస్ టీచర్ ఫోన్లో అందుబాటులోకి వచ్చి హర్షిత్ ఫీజు బకాయి ఉందని, పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే సగం ఫీజు చెల్లించినట్లు హర్షిత్ తండ్రి రఘు చెప్పినప్పటికీ... మిగతా సగం కూడా ఇప్పుడే చెల్లించాలని, అయితేనే ఆన్లైన్ పరీక్షలకు అనుమతిస్తామని సదరు టీచర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు పాఠాలు వినడం, పరీక్షలు రాయడం అంతా ఆన్లైన్లోనే. దీనికోసం ప్రతి విద్యార్థికి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ‘లింకు’పంపించాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి. సరిగ్గా ఇక్కడే నొక్కుతున్నాయి యాజమాన్యాలు. లింకులు ఆపివేసి.. చిన్నారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని లంకె పెడుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో మార్చి నెల రెండో వారం నుంచి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అన్లాక్లో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్/ వీడియోల ద్వారా పాఠ్యాంశ బోధన సాగిస్తున్నాయి. ఫీజు కడితేనే లింకు కోవిడ్–19 ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ... ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ముందస్తుగా జూన్ నెలాఖరు నుంచే ఆన్లైన్లో బోధన ప్రారంభించాయి. రాష్ట్రంలో దాదాపు 18 వేల ప్రైవేటు పాఠశాలల పరిధిలో 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు టీసాట్, దూరదర్శన్లో వచ్చే వీడియో పాఠాలతో సరిపెడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం జూమ్ లాంటి యాప్ల ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. తొలుత విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ లింకులు చొరవ తీసుకుని పంపిన యాజమాన్యాలు... ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు కాస్త అలవాటుపడిన తరుణంలో క్రమంగా ఫీజులు చెల్లించాలని బోధన సిబ్బందితో ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమేర చెల్లించినప్పటికీ...సమ్మెటివ్ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీవ్రం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్ లింకులను నిలుపుదల చేస్తున్నారు. ప్రతి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తూ ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వసూలు చేస్తేనే టీచర్లకు జీతం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు పాఠశాల యాజమాన్యాలు బోధన సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. ప్రతి క్లాస్ టీచర్ విధిగా తరగతిలోని విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేయాల్సిందే. అలా లక్ష్యాన్ని సాధించిన వారికే వేతనాలు ఇస్తామని, డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు కావాలని యాజమాన్యాలు నిబంధనలు పెట్టడంతో క్లాస్ టీచర్లు తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. పలు పాఠశాలలు ఈనెల 7వ తేదీనుంచి సమ్మెటివ్–1 పరీక్షల షెడ్యూల్ జారీ చేశాయి. ఫీజులు చెల్లించిన విద్యార్థులకే ఈ పరీక్షలకు సంబంధించిన లింకులను జారీ చేస్తున్నారు. బకాయిపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాస్ టీచర్లు ఫోన్ చేసి ఫీజులు కట్టాలని చెబుతున్నారు. ఫీజులు ఇవ్వకుంటే నిర్వహణ ఎలా? స్కూల్ నిర్వహణ అంతా ఫీజులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. సిబ్బంది వేతనాలు, బిల్డింగ్ నిర్వహణ కోసం ఒత్తిడితోనే ఫీజులు వసూలు చేస్తున్నాం. చాలా స్కూళ్లలో 35% విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించలేదు. ఇలాగైతే స్కూల్ ఎలా నడుస్తుంది. పూర్తి ఫీజు కాకున్నా... కనీస మొత్తాన్నైనా చెల్లించాలి.ఆమేరకే టీచర్లకు బాధ్యతలు అప్పగించాం. –టి.ఎన్.రెడ్డి, సెక్రటరీ, హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
550, 111 జీవోలకు సవరణ
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు 550, 111లను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన జీవోల్లోని నిబంధనలపై స్పష్టత ఇస్తూ, ఎలాంటి సందేహాలకు తావులేకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేసేలా తాజాగా సవరణలు ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం... ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్తో వేరే కాలేజీలో సీటు పొందితే ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీటును మెరిట్ ప్రకారం అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్ ద్వారా కేటాయింపు అయిన కాలేజీలోని సీటులో చేరని పక్షంలో ఖాళీ అయిన ఓపెన్ కేటగిరీ సీటును తిరిగి ఓపెన్ కేటగిరీగానే పరిగణిస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి ఖాళీచేసే సీటును పొందిన అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థి కూడా ఆ సీటులో జాయిన్ కాని పక్షంలో..అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ అయ్యేవరకు కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వేర్వేరుగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ఇలావుండగా కమిటీ చేసిన సిఫారసులతో మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అమల్లోకి తెస్తోంది. ► ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీనికిముందు అన్నీ కలిపి చేయడం వల్ల ఒకింత గందరగోళానికి దారితీసేది. ► అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఒకేసారి తమకు నచ్చినన్ని ఆప్షన్లు ఇచ్చుకొనేలా చేస్తున్నారు. తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. గతంలో ఆప్షన్లను పలుమార్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ► ఈసారి ఒక కౌన్సెలింగ్లో సీటు వచ్చిన అభ్యర్థి దానిలో జాయినయినట్లు ఆన్లైన్ ద్వారా రిపోర్టు చేస్తేనే తదుపరి కౌన్సెలింగ్కు, స్లైడింగ్కు అనుమతిస్తారు. ► గతంలో ఒక కౌన్సెలింగ్లో కాలేజీలో సీటు వచ్చిన అభ్యర్థి అందులో జాయినయినట్లు ఆప్షన్ ఇవ్వకున్నా తదుపరి కౌన్సెలింగ్కు, స్లైడింగ్కు అవకాశముండేది అలా స్లైడింగ్లతో ఆప్షన్లు ఇస్తూ ఆ అభ్యర్థి చివరకు ఎక్కడా జాయిన్ కాకుంటే ఆ సీట్లు ఖాళీగా మేనేజ్మెంటుకు మిగిలేవి. చివరకు ఇదో పెద్ద అక్రమాల తంతుగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దీనికి కొంతవరకు అడ్డుకట్టవేసేలా జాయినింగ్ రిపోర్టును తప్పనిసరి చేస్తోంది. -
చదువుల తల్లి బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుని శిఖరాగ్రాన్ని అందుకోవాలని కలగన్న విద్యార్థిని ఐశ్వర్య చివరకు బలవన్మరణానికి పాల్పడటం మన విద్యా వ్యవస్థలో అమలవుతున్న అస్తవ్యస్థ విధానాలకు అద్దం పడుతోంది. మన పాలకులు ప్రాథమిక విద్యారంగంలో చాలా కృషి చేసినట్టు కనబడతారు. 14 ఏళ్ల వయసొచ్చేవరకూ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తున్న పాలకులు ఆ తర్వాత ‘మీ చావు మీరు చావండ’ని వదిలేస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ పైపైకి ఎదగాలని కలగంటున్నవారికి మాత్రం ఎలాంటి దారీ చూపడం లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంటు పథకంవంటివి దేశంలో చాలాచోట్ల లేవు. కనుకనే విద్యా వ్యాపారం వేయి తలల నాగుపాములా విద్యార్థుల్ని కబళిస్తోంది. యువతను ఊరిస్తూ, వారి ఆకాంక్షల్ని సొమ్ము చేసుకోవ డానికి ప్రయత్నిస్తోంది. దాన్ని కూడా దాటుకుని ముందుకెళ్ల గలిగినవారికి ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఈ వైకుంఠపాళిలో అత్యంత ప్రతిభావంతురాలైన ఐశ్వర్య బలైపో యింది. ఆమె నిరుడు ఇంటర్మీడియెట్లో 98.5 శాతం మార్కులు సాధించడమే కాదు...ఢిల్లీ యూని వర్సిటీకి చెందిన పేరెన్నికగన్న లేడీ శ్రీరాం కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్(ఆనర్స్)లో సీటు కూడా సంపాదించుకుంది. అందుకోసం ఆ నిరుపేద కుటుంబం తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 2 లక్షలు సమకూర్చవలసివచ్చింది. రెండో కుమార్తెను పాఠశాల మాన్పించవలసివచ్చింది. ‘సా విద్యా యా విముక్తయే’(విముక్తి ప్రసాదించేదే విద్య’) అన్న మకుటాన్ని ధరించిన ఆ కళాశాల ఆచరణలో ఐశ్వర్యవంటి నిరుపేద యువతులకు నిజంగా అక్కరకొస్తోందా? ఐశ్వర్య అక్కడ చేరడానికి ఆ కుటుంబం పడిన పాట్లు గమనించినా, ఆ చదువును కొనసాగించడం అసాధ్యమని నిర్ణయించుకుని ఆమె తనువు చాలించిన తీరు చూసినా ఆ కళాశాల ప్రకటిత ఉద్దేశానికీ, అక్కడ చదువుకునే నిరుపేద పిల్లల సమస్యలకూ పొంతన లేని వైనం వెల్లడవుతుంది. ఆ కళాశాలనుంచి మెరికల్లాంటివారు బయటికొస్తున్నారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు భిన్నరంగాల్లో కీలక స్థానాల్లో వున్న అనేకమంది మహిళలు అక్కడ చదువుకున్నవారే. మయన్మార్ నేత ఆంగ్సాన్ సూకీ, బ్రిటానియా ఎండీ వినితా బాలి, బోఫోర్స్ స్కాంను బయటపెట్టిన చిత్రా సుబ్రహ్మణ్యం, ఐఎంఎఫ్లో కీలక పదవిలో వున్న గీతా గోపీనాథ్, ఇంకా అనేకమంది నాయకులు, ఉన్నతాధికారులు, ప్రముఖ జర్న లిస్టులు, రచయితలు ఒకప్పుడు ఆ కళాశాల విద్యార్థినులే. ఐశ్వర్య చదువుకు లేడీ శ్రీరాం కళాశాలలో ఎదురైన అడ్డంకులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటర్మీడియెట్లో ప్రతిభ చూపినందుకు ఆమెకు ఇన్స్పైర్ పథకం కింద ఇవ్వాల్సిన ఉపకారవేతనం తొలి విడత మొత్తం ఎన్నడో మార్చిలో అందవలసివుండగా ఎనిమిది నెలలుగా అది పెండింగ్లో వుండిపోయింది. సెకండియర్ అయ్యాకే దాన్ని అందిస్తామని చెప్పారట. పైగా ఆ కాలేజీకి అను బంధంగా వుండే హాస్టల్ని సైతం కరోనా పేరుతో మార్చి 15న మూసేశారు. మొదటి సంవత్సరానికి మాత్రమే హాస్టల్ వుంటుందని, సెకెండియర్ విద్యార్థులు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని విద్యార్థిను లకు వర్తమానం పంపారు. అందుకు కారణాలేమైనా చెప్పవచ్చుగానీ... అవి సహేతుకమైనవి కాదు. సుప్రీంకోర్టు ఓబీసీ కోటా విషయంలో జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సివస్తోందని ప్రిన్సిపాల్, యాజమాన్యం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రెండు సంవత్సరాలూ ఐశ్వర్యవంటి నిరుపేద విద్యార్థులు ఖరీదైన దేశ రాజధాని నగరంలో ఎలా మనుగడ సాగించాలో, చదువులెలా పూర్తిచేసుకోవాలో వారి బుర్రలకు తట్టలేదు. హాస్టల్ మూసివేతపై చర్చలకొస్తామని చెప్పిన విద్యార్థి సంఘానికి జవాబు లేదు. సెప్టెంబర్ 27న హాస్టల్ ఖాళీ చేయాలని ఐశ్వర్యకు తాఖీదు వచ్చింది. ఢిల్లీ వంటిచోట పేయింగ్ గెస్ట్గా వుండాలన్నా నెలకు రూ. 30,000 తప్పనిసరి. పైగా ఈమధ్య మొదలైన ఆన్లైన్ విద్య అంతరాలను మరింతగా పెంచింది. రోజూ జరిగే 6, 7 తరగతుల కోసం ఒక మంచి ల్యాప్ట్యాప్, చదువుకు ఆటంకంలేకుండా మెరుగైన డేటాతో వైఫై కనెక్షన్ వుంటే తప్ప విద్యార్థుల అవసరాలు తీరవు. ఈ అవకాశంలేనివారు చదువుకు దూరం కావాల్సిందే. తరగతి గదినుంచి నిష్కారణంగా విద్యార్థిని గెంటేయడానికీ, దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఉద్యోగాలు, ఉపాధి చర్చకొస్తాయిగానీ... చదువులకు మాత్రం ఎప్పుడూ చోటుండదు. మంగళవారం ఫలితాలు వెలువడుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలే తీసు కుంటే అక్కడ పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒకరంటే, కాదు... కాదు 19 లక్షల ఉద్యోగాలిస్తామని మరొకరు హామీలిచ్చారు. ముఖ్యమంత్రిగా వున్న నితీష్కుమార్ అయితే ‘మేం ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇచ్చేశాం’ అని చెప్పారు. కానీ ప్రతిభగల పిల్లల్ని పాడె ఎక్కిస్తున్న విద్యారంగ అస్తవ్యస్థ విధానాల గురించి మాత్రం అక్కడ చర్చ లేదు. అక్కడే కాదు... చాలా రాష్ట్రాల్లో చదువులపై సమగ్ర మైన చర్చ జరగడం లేదు. విద్యను ఆధునికీకరిస్తామని చెబుతున్న జాతీయ విద్యావిధానం కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా, ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించుకోవడానికి అనుమతి స్తోంది. అయితే సామాజిక బాధ్యతగా కనీసం 20 శాతంమంది పిల్లలకు ఉచిత విద్య, మరో 30 శాతంమందికి ఉపకారవేతనాలు ఇవ్వడం తప్పనిసరి చేస్తారట. ఆచరణలో ఇదేమవుతుందో చూడాలి. ఏదేమైనా తన మరణంతో ఐశ్వర్య ఉన్నత విద్యలో వున్న అంతులేని అగాధాలను బయట పెట్టింది. రకరకాల కారణాలతో ప్రతిభగల నిరుపేద పిల్లలకు తలుపులు మూసుకుంటున్న ఉన్నత విద్యాసంస్థల తీరును బయటపెట్టింది. ఈ లోపాలను సవరించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక కారణాలతో ప్రతిభగల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటం పాలకుల బాధ్యత. -
కోవిడ్ నిబంధనలతో కాలేజీలు ఓపెన్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఎనిమిది నెలలుగా మూతబడిన యూనివర్సిటీలు, కాలేజీలు తెరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో పనిచేస్తున్న విద్యా సంస్థలను తెరిచే విషయమై నిర్ణయాధికారాన్ని వాటి వైస్ చాన్సలర్లు, హెడ్లకు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలకు అనుగుణంగా తెరచుకోవచ్చని సూచించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో విద్యా సంస్థలను తెరవరాదని యూజీసీ స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను రానివ్వరాదని పేర్కొంది. ఆరోగ్యసేతు యాప్ వినియోగించేలా విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించాల్సిందిగా చెప్పింది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక వెసులుబాట్లు చేసుకోవాలని తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. తగిన జాగ్రత్తలతో హాస్టళ్లు తెరచుకోవచ్చని సూచించింది. -
‘ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా పూర్తి పారదర్శకత’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి బడిగంటలు మోగబోతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ తెలిపారు. కరోనా కారణంగా అయిదు నెలల ఆలస్యంగా తరగతులు ప్రారంభవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలకు సూచనలకు అనుగుణంగా పాఠశాలలు ప్రారంభవుతున్నాయన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..నవంబర్ 2వ తేదీన 9,10 తరగతులు, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 16 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంబిస్తామని తెలిపారు. నవంబర్ 23న అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్ డే స్కూళ్లు 23న ఆరు, ఏడు, ఎనిమిది తరగతి విద్యార్ధులకు, డిసెంబర్ 14 నుంచి ఒకటి నుంచి అయిదవ తరగతి వరకు విద్యార్ధులకు తరగతులు ప్రారంబిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. నవంబర్ 2న నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల రెండవ సంవత్సరానికి సంబంధించిన విద్యార్ధులకు తరగతులు ప్రారంబిస్తామన్నారు. మార్చి నెలాఖరుకి తొలి సెమిస్టర్ పూర్తి చేస్తామని, ఆగష్టు నాటికి ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేస్తామన్నారు. బీటెక్, బీ ఫార్మా కోర్సులకు సంబంధించి సీనియర్ విద్యార్ధులకు నవంబర్ రెండు నుంచి, మొదటి సంవత్సరం విద్యార్దులకు డిసెంబర్ ఒకటిన తరగతులు ప్రారంబిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి పరీక్షల ప్రణాళిక షెడ్యూల్ కూడా రూపొందించినట్లు తెలిపిన మంత్రి ఆదిమూలపు సరేష్ 180 రోజులపాటు పని దినాలు ఉండేలా విద్యా సంవత్సరం రూపొందించినట్లు వెల్లడించారు. చదవండి: నవంబర్ 2 నుండి పాఠశాలల పునఃప్రారంభం తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. ప్రతీ విద్యార్థి భౌతిక దూరం పాటించేలా.. తరగతి గదులు ఎప్పటికపుడు శానిటైజ్ చేసే విధంగా ప్రత్యేక ఆదేశాలు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తాం. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తాం. ఇంటర్ అడ్మిషన్లలో ఎక్కడా గందరగోళం లేదు. ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఇంటర్ అడ్మిషన్లలో సీట్ల కొరతంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా సీట్ల కొరత లేదు. ఇంటర్లో 5,83,580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 561 కళాశాలల ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. కనీస సౌకర్యాలు కూడా కల్పించని కొన్ని కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా. కనీస సౌకర్యాలు కల్పించని 613 కళాశాలలపై చర్యలు తీసుకున్నాం’. అని వెల్లడించారు. -
వినియోగదారుల చట్టం కిందకి విద్యాసంస్థలు?
న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సేవల్లో లోపం వినియోగదారుల చట్టం–1986 కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తమిళనాడులోని సేలంకి చెందిన వినాయక మిషన్ యూనివర్సిటీ సరైన సేవలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థి మనుసోలంకి, ఇతర విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్వేశారు. ధర్మాసనం ఈ అప్పీల్ను విచారణకు అంగీకరించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) నిర్ణయంపై అప్పీల్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆరు వారాల్లోగా తమ వాదనను వినిపించాలని ఆదేశించింది. మహర్షి దయానంద్ యూనివర్సిటీ వర్సెస్ పీటీ కోషి కేసులో గతంలో సుప్రీంకోర్టు, విద్యని సరుకుగా పరిగణించలేమని తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలు థాయ్లాండ్లోనూ, రెండున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో చదువు చెప్పిస్తామని విద్యార్థులను 2005–2006 సంవత్సరంలో చేర్చకున్నారు. విద్యార్థులకు ఎంబీబీఎస్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని, వాటికి కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చేలా చూస్తామని కూడా ఇచ్చిన హామీని విద్యాసంస్థలు నెరవేర్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. -
సిలబస్ సర్దుబాట
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యాసంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలల సమయాన్ని కోల్పోవడంతో పాఠ్యప్రణాళికల పునర్వ్యవస్థీకరణపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేపట్టారు. విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి.. ఎన్ని పనిదినాలు ఉంటాయన్న అంశాల ఆధారంగా సిలబస్ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ క్యాలెండర్, పాఠ్యప్రణాళికల రూపకల్పనపై దృష్టి సారించారు. కోవిడ్ వల్ల స్కూళ్లు మార్చి నుంచి మూతపడడంతో 2019–20 విద్యాసంవత్సరంలో చివరి పరీక్షలు నిర్వహించలేకపోయారు. – 2020–21 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కావలసి ఉన్నా కోవిడ్ కారణంగా సాధ్యంకాలేదు. సెప్టెంబర్ 5నుంచి ఆపై అక్టోబర్ 2నుంచి తెరవాలని చూసినా కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. – తాజాగా నవంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి స్కూళ్లు తెరవనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే చెప్పారు. – స్కూళ్లను ఎప్పటినుంచి తెరవాలి, విద్యార్థులను ఎలా రప్పించాలనే విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదించారు. – దాదాపు అయిదు నెలల కాలం నష్టపోతున్నందున ఈ సమయాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి, వేసవి సెలవుల్లోనూ తరగతులను కొనసాగిస్తే కొన్నిరోజులు సర్దుబాటవుతాయని భావిస్తున్నారు. – ఎన్ని పనిదినాలు ఉంటాయో తేలితే ఆమేరకు సిలబస్ను కుదించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణమండలి డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి చెప్పారు. తమ విద్యార్థులకు 50 శాతం మేర సిలబస్ తగ్గించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. – 11, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ 30 శాతం మేర సిలబస్ కుదించింది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా అదే మాదిరి సిలబస్ను కుదించి వెబ్సైట్లో ఉంచింది. యూజీసీ మార్గదర్శకాల మేరకు డిగ్రీ సిలబస్ – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను అనుసరించి ఉన్నత విద్యలో డిగ్రీ తదితర కోర్సుల్లో సిలబస్పై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. – తొలుత కాలేజీలను నవంబర్ 2 నుంచి తెరవాలన్న యూజీసీ ఇప్పుడు నవంబర్ 18 నుంచి తెరవాలని ఆదేశించింది. – పనిదినాలు తగ్గకుండా సర్దుబాటు చేసుకోవాలని, విద్యాసంవత్సరాన్ని ఆగస్టు చివరి వరకు కొనసాగించవచ్చని పేర్కొంది. – డిగ్రీలో ఒక సెమిస్టర్కు 90 రోజుల చొప్పున ఏడాదికి 180 పనిదినాలు ఉండాలి. ఆగస్టు వరకు విద్యాసంవత్సరం కొనసాగిస్తే పనిదినాలు సరిపోవచ్చని, సిలబస్ కుదింపు అవసరం లేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం'
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్, మేథమేటిక్స్ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ను చేపడుతుంది. విభిన్న రీతుల్లో ప్రశ్నలు.. ► ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీలలో వివిధ విభాగాల్లో విభిన్నమైన రీతుల్లో ప్రశ్నలున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు. ► మేథమేటిక్స్ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని కోచింగ్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. ► కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ ప్యాట్రన్ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు. ► అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారని గుంటూరుకు చెందిన అధ్యాపకుడొకరు చెప్పారు. ► బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు. ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్లో ఒక్కో దానిలో 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ► కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ► మొత్తం మీద పేపర్–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న ఫలితాలు ► ఫలితాలు అక్టోబర్ 5న వెల్లడవుతాయి. తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది. ► ఈసారి 7కు బదులు ఆరు విడతల కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్కు ముందు అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్ కౌన్సెలింగ్లు నిర్వహిస్తారు. ► ప్రాథమిక ఆన్సర్ కీలను త్వరలోనే ప్రకటించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ► అధికారిక బులెటిన్ ప్రకార, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
'పొగ'కు చెక్ పెడదాం
సాక్షి, అమరావతి: స్కూళ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు.. సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటి వాసన ఉండకూడదు. పొగ పొడ సూపకూడదు. స్కూలు, దాని పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. చిన్నతనం నుంచే పొగ అంటే చిన్నారులకు తెలియకూడదు. దాని ప్రభావానికి అసలే లోనుకాకూడదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్మోక్ ఫ్రీ జోన్స్గా స్కూళ్లను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం దీనిపై మార్గదర్శకాలు రూపొందించగా.. వాటిని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను స్మోక్ ఫ్రీ జోన్లుగా అమలు చేస్తోంది. ఈ కేటగిరీల్లో పక్కాగా నిబంధనలు ► పొగ తాగే వారే కాదు.. అసలు పొగ ఆనవాళ్లు స్కూలు చుట్టూ కనిపించకూడదు. స్కూలులో పనిచేసే టీచర్లే కాకుండా స్కూలు డ్రైవర్లు పొగ తాగినా నేరమే. ► ప్రతి స్కూలులో ముఖ ద్వారం వద్ద, లోపల గోడలపైన ‘టొబాకో లేని స్కూలు’ అని బోర్డులు తగిలించాలి. స్కూలు కాంపౌండ్కు 100 గజాల పరిధిలో బీడీలు, సిగరెట్లు, గుట్కా దుకాణాలు కనిపించకూడదు. ► పొగతో కలిగే హాని ఎలాంటిదో తెలిపే స్టిక్కర్లు స్కూలు గోడలపై కనిపించాలి. స్కూలు ఆవరణలో ఎవరైనా పొగ తాగితే వారిపై చర్యలు తీసుకునే అధికారి, హోదా, ఫోన్ నంబరు గోడపై రాసి ఉండాలి. ► 6 మాసాలకోసారి టొబాకో నిర్మూలనపై విద్యార్థులతో టీచర్లు చర్చించాలి. ఎవరైనా పొగ తాగితే వారిపై తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకూ తెలియజేయాలి. రోజుకు 3,500 మంది మృతి ► దేశంలో పొగాకు వాడకం కారణంగా రోజూ 3,500 మంది మృతి చెందుతున్నారు. దేశంలో 9.95 కోట్ల మంది ఏదో ఒక రూపేణా పొగాకు ఉపయోగిస్తున్నారు. 19.94 కోట్ల మంది పొగలేని పొగాకు వాడుతున్నారు. ► ఒక్కొక్కరు సగటున సిగరెట్కు నెలకు రూ.1,192, బీడీలపై రూ.284 వ్యయం చేస్తున్నారు. ఏటా 13 లక్షల మంది పొగాకు కారక క్యాన్సర్లతో మృతి చెందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడించింది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో 30 చోట్ల ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటరాధారితంగా ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ► పేపర్–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి. ► అభ్యర్థులు అడ్మిట్కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. ► కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా సమర్పించాలి. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ► కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్ నంబర్ కనిపిస్తాయి. ► రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ కావచ్చు. ► ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలి. ► షూస్ కాకుండా ఓపెన్ పాదరక్షలు మాత్రమే ధరించాలి. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.