COVID19: India Records 55,342 New Corona Positive Cases In One Day - Sakshi
Sakshi News home page

ఒక్క‌రోజే 55,342 క‌రోనా పాజిటివ్ కేసులు

Published Tue, Oct 13 2020 10:26 AM | Last Updated on Tue, Oct 13 2020 2:39 PM

Inida Records 55,342 New  Corona Positive Cases says Health Bulletin - Sakshi

సాక్షి, ఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ వైరస్ విజృంభిస్తోంది. గచిచిన 24 గంటల్లో  55,342 పాజిటివ్ కేసులు నమోదవంతో  మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కు చేరింది. తాజా బులిటెన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 706 మంది మృతి చెందారు. దీంతో  దేశంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య1,09,856 కు చేరింది. క‌రోనా కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఊర‌ట క‌లిగించే అంశం.  నిన్న ఒక్క‌రోజే  దేశవ్యాప్తంగా  71,760 మంది క‌రోనా నుంచి  కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో  62,27,296  మంది  కోవిడ్‌ నుంచి కోలుకోగా  ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులున్న‌ట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులెటిన్ విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా  కోవిడ్‌ బాధితుల రికవరీ రేటు 86.36 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉండ‌గా, మరణాల రేటు 1.53 శాతానికి తగ్గిందని పేర్కొంది.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement