health ministry
-
కారుణ్య మరణానికి గ్రీన్సిగ్నల్
సాక్షి బెంగళూరు: తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక, వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం కర్ణాటకలో ఈ చారిత్రక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. మొండి వ్యాధి బాధితులు, మరణాంతక రోగగ్రస్తులు లేదా కోమా స్థితిలో ఉన్న వారికి, ఎలాంటి చికిత్స అందించినా బతకడం అసాధ్యం అనే వారికి ఈ ఆదేశాల ద్వారా గౌరవప్రదమైన మరణానికి అవకాశం లభించింది. కారుణ్య మరణానికి అవకాశం కల్పించేందుకు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్యులు కారుణ్య మరణానికి ఆ రోగి అర్హుడా కాదా అనే విషయాన్ని ధ్రువీకరిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వైద్య నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ తొలుత సంబంధిత రోగి ఎలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండబోదని ధ్రువీకరించిన తర్వాతే కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఆ రోగి కుటుంబ సభ్యుల వినతి మేరకు మాత్రమే వైద్యుల బృందం ఈ పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతించాక రోగి లైఫ్ సపోర్టు సిస్టమ్ను తొలగిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. -
మరణించినా మరికొందరిలో ప్రభవిస్తున్నారు!
సాక్షి, అమరావతి: మరణించినా అవయవదానం ద్వారా మరికొందరికి ప్రాణం పోస్తున్న వారి సంఖ్య గత మూడేళ్లుగా పెరుగుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 2021 నుంచి 2023 వరకు అవయవదానాల సంఖ్య 42,040కు చేరిందని, అదే సమయంలో రాష్ట్రంలోనూ ఈ సంఖ్య 965కు చేరిందని పేర్కొంది. అవయవదానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరణించాక అవయవదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసినవారవుతారన్న తరహాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవయవదానం నమోదును సులభతరం చేసేందుకు ఆధార్ అనుసంధానంతో డిజిటల్ వెబ్ పోర్టల్ను గతేడాది సెప్టెంబర్లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మరణించాక తమ అవయవాలను దానం చేస్తామంటూ ఇప్పటి వరకూ రెండు లక్షల మంది ఈ పోర్టల్లో ప్రతిజ్ఞ చేయడం విశేషం. అవయవదానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా భారతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెమినార్లు, వెబ్నార్లు, వర్క్షాప్ల వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అవయవాల సేకరణ, మార్పిడి, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలతో మూడంచెల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, ఐదు ప్రాంతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్లు, రాష్ట్ర స్థాయిలో 21 రాష్ట్ర అవయవాలు, టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం 900పైగా ఇనిస్టిట్యూషన్లు, ఆస్పత్రులు అవయవాల మార్పిడి, పునరుద్ధరణ నెట్వర్క్తో అనుసంధానమయ్యాయి.రూ.10 వేల పారితోషికంబ్రెయిన్ డెడ్ అయి అవయవదానాలు చేస్తున్న వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అవయవాల సేకరణ అంనతరం భౌతిక కాయాన్ని ఉచిత రవాణా సదుపాయాలతో స్వస్థలాలకు చేర్చడంతో పాటు.. కుటుంబ సభ్యులకు రూ.10 వేల పారితోషికం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను సత్కరించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
భారత్లో అనుమానిత మంకీపాక్స్ కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు: భారత ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉంది. చైనాలో నమోదవుతున్న శ్వాససంబంధ కేసులన్నీ సాధారణమైనవేనని, వాటికి పెద్ద ప్రత్యేకత లేదని తెలిపింది. అయినా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చెప్పిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంతేగాక ఈ వైరస్ సోకిన వారిలో ఫ్యాటలిటీ రేటు(మరణాల రేటు) తక్కువగా ఉందని వెల్లడించింది. గతంలో చైనా నుంచే పుట్టుకొచ్చిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దీంతో చైనీయుల్లో ఎలాంటి వైరస్ కారక వ్యాధుల కేసులు నమోదైనా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ కేసులపై భారత ఆరోగ్య శాఖ స్పందించింది. ఇటీవల కోయంబత్తూరులో వెలుగు చూసిన వైరస్ కేసులు కూడా కరోనా కేసులు కాదనే విషయం స్పష్టమైంది. ఇదీచదవండి.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా... -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్లో చైర్పర్సన్తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్లో గర్భిణీ మృతి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెంచ్.. ‘‘ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తోన్న బడ్జెట్ ఎంత?’’ అని ప్రశ్నించింది హైకోర్టు. ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలంటూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: వాతావరణ శాఖ హెచ్చరికలతో కేసీఆర్ పర్యటన వాయిదా -
అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవయవాల మార్పిడి కోసం గత ఏడాది వరకు 56,852 మంది వెయిటింగ్లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించింది. అలాగే గతేడాది 16,041 మందికి అవయవాల మార్పిడి చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ద్వారా అవయవాల వారీగా రోగులను జాతీయ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నట్లు తెలిపింది. మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు రోగుల నమోదు రుసుము వసూలును నిలుపుదల చేసినట్లు చెప్పింది. గతంలో 65 సంవత్సరాల్లోపు వ్యక్తుల నుంచి మాత్రమే అవయవ దానాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మరణించిన ఏ వయసు వ్యక్తి అయినా అవయవదానం చేయడానికి అనుమతించామని తెలిపింది. ఈ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం పంపించినట్లు వెల్లడించింది. అవయవ మార్పిడిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహించామని, ఒక దేశం ఒకే విధానం అమలు చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొంది. వెయిటింగ్లో ప్రాధాన్యతను నిర్ణయించడం కోసం ప్రారంభ నమోదును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించడానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఐదు ప్రాంతీయ అవయవాల మార్పిడి సంస్థలను, అలాగే ఆంధ్రప్రదేశ్తో సహా 20 రాష్ట్రాల్లో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా కిడ్నీల కోసం, తరువాత కాలేయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నట్లు వివరించింది. -
డేంజర్ ‘లైఫ్స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
భయం లేదు... భయం లేదు...
చైనాలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు ప్రపంచానికి తంటాగా మారింది. ప్రత్యామ్నాయ వ్యూహ మేదీ లేకుండానే లోపభూయిష్ఠమైన కఠోర జీరో కోవిడ్ విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తేయడం అందరికీ తలనొప్పి తెచ్చిపెడుతోంది. చైనాలో వేలల్లో వస్తున్న కోవిడ్ కేసుల ఫలితంగా జనవరిలో భారత్లో కరోనా విజృంభణ తప్పకపోవచ్చనీ, రానున్న 40 రోజులు మన దేశానికి అత్యంత కీలక మనీ కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొనడాన్ని ఆ దృష్టితో చూడాలి. ఈ ప్రకటన ప్రజలూ, పాలకులూ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తోంది. అయితే, భారీ సంఖ్యలో కేసులు బయటపడ్డా దేశంలో నాలుగోవేవ్ రాకపోవచ్చనీ, వచ్చినా ఆస్పత్రి పాలవడాలు, మరణాలు తక్కువగానే ఉండవచ్చనీ ఆరోగ్య శాఖ చెప్పడం ఒకింత ఊరట. అలాగని చైనాలో పరిస్థితులు, జపాన్లో బుధవారం ఒక్కరోజులో 415 మరణాలు మనల్ని అజాగ్రత్త పనికిరాదంటున్నాయి. గత రెండు రోజుల్లో దేశంలోని వివిధ నగరాల్లో ర్యాండమ్ శాంపిల్ టెస్టింగ్లోనే 39 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులు పాజిటివ్గా తేలడం లాంటి ఘటనలు పారాహుషార్ చెబుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల ఏ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, ఇతర దేశాలు అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షించుకోక తప్పదు. చైనా వార్తలతో మన దేశంలోనూ ఉన్నత స్థాయి సమావేశాలు, అన్ని రాష్ట్రాల్లో ముందుజాగ్రత్తగా మాక్ డ్రిల్స్ చేసింది అందుకే. చైనా, జపాన్ తదితర 6 దేశాలల నుంచి భారత్కు వచ్చే యాత్రికులకు 72 గంటల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీకాకరణ జోరు పెంచాలి. రెండు ప్రాథమిక డోసులే వేసుకున్నవారు మూడోదైన ముందుజాగ్రత్త డోస్ (బూస్టర్ డోస్) వేసుకోవాలని వైద్యుల సూచన. ప్రపంచంలో సగటున ప్రతి 100 మందిలో 30 మందికి పైగా బూస్టర్ వేసుకున్నా, మన దగ్గర ఆ సంఖ్య 16 చిల్లరే కావడం పెరిగిన అలక్ష్యానికి చిహ్నం. కొత్తగా ముక్కులో చుక్కలుగా వేసే టీకా (భారత్ బయోటెక్ వారి ఇన్కోవాక్)కు బూస్టర్గా కేంద్రం అత్యవసర అనుమతి నిచ్చింది. జనవరి చివర నుంచి అలా మరో అస్త్రం చేతికి అందినట్టే! ఇప్పటికే దేశంలో అధిక శాతం మందికి గతంలో కరోనా సోకడంతో సహజ వ్యాధినిరోధకత ఉంది. టీకాలు తెచ్చిన వ్యాధినిరోధకత దానికి జత కలసి, హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చినట్టయింది. అలాగే, కరోనా మొదటి వేవ్ నాటితో పోలిస్తే ఇప్పుడు చికిత్సలో అనుభవం, కనీసం 7 టీకాలు వచ్చాయి. అప్పట్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నీ కరోనా బహిర్గతం చేయడంతో, ప్రభుత్వాల తప్పనిసరి కృషితో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వసతులు, వ్యవస్థ మునుపటి కన్నా గణనీయంగా మెరుగయ్యాయి. అందుకే, ఇప్పుడు అతిగా ఆందోళన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. చైనా దెబ్బకు మళ్ళీ టెస్టులు పెరిగే ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య కన్నా ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను కీలకమైన లెక్కగా పరిగణించాలి. అలాగే, పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్పై దృష్టి పెట్టి, వైరస్లో కొత్త ఉత్పరివర్తనాలు దేశంలోకి వస్తున్నాయేమో ఓ కంట కనిపెట్టడం, వస్తే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడమే అతి ముఖ్యం. కోవిడ్ కథ కంచికి చేరలేదు... ఇప్పుడప్పుడే చేరే అవకాశమూ లేదు. కరోనా వైరస్లో ఎప్పుడు ఏ కొత్త వేరియంట్ వస్తుందో ఏ శాస్త్రవేత్తలూ చెప్పలేరు కాబట్టి ఓ మాదిరి నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్లు వస్తూ, పోతూ ఉండవచ్చు. కాబట్టి ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స చేయించుకుంటూ, ప్రాథమికమైన ముందు జాగ్రత్తలతో కోవిడ్ అనారోగ్యం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. చైనాలో ఇప్పుడు కాకరేపుతున్న బీఎఫ్.7 ఒమిక్రాన్ ఉప–వేరియంట్ ఉద్ధృతి కొద్దివారాల్లో ముగిసిపోతుందని అంచనా. అలా చైనాలోని తాజా కరోనా వేవ్ ముగిసిపోతే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సామాన్య జలుబు, జ్వరం దశకు వస్తుందని శాస్త్రవేత్తల ఆశాభావం. కరోనాతో సహజీవనం తప్పదన్న మాటలను ఒకప్పుడు వెటకారం చేసినా, అది అనివార్యమని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ సుదీర్ఘకాల సహజీవనంలో ప్రపంచంలో ఏ మూల ఎప్పు డైనా కొత్త కేసులు వెల్లువెత్తవచ్చు. తాజా వేవ్లు విరుచుకుపడవచ్చు. ఆ ముప్పును గమనంలో ఉంచుకొని, ముందుకు సాగాలి. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ తగు సంసిద్ధతతో ఉండడమే ప్రస్తుత కర్తవ్యం. అంతేతప్ప, పొరుగునున్న మరో దేశంలో కరోనా వేవ్ వచ్చిందని వార్త వచ్చినప్పుడల్లా బెంబేలెత్తిపోతే ఉపయోగం లేదు. శాస్త్రీయ ధోరణితో కరోనాపై చర్యలు ముఖ్యం. వెరసి వ్యూహాల పునఃసమీక్షా సమయం ఇది. కేంద్రం ఎప్పటికప్పుడు చైనాలో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. పుకార్లు వ్యాపించకుండా ప్రజలకు సమాచారం అందిస్తూ, చైతన్యం తేవాలి. ప్రపంచానికి కరోనా పరిచయమై సరిగ్గా మూడేళ్ళయింది. ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న కరోనా వ్యూహాలను ఇప్పుడు ఆగి, పరిశీలించుకోవాలి. గత అనుభవాల ఆధారంగా శాస్త్రీయంగా, సాక్ష్యాధారాలపై ఆధారపడి చర్యలు చేపట్టాలి. తాజా పరిస్థితులకు తగ్గట్టు సాక్ష్యాధారాలపై ఆధారపడ్డ కరోనా పోరాట ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేసుకోవాలి. పరిశోధన, అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి టీకాలు సహా ఆరోగ్యరంగంలో బలోపేతం కావాలి. గత మూడేళ్ళుగా పాలకులు పక్కనబెట్టిన టీబీ సహా ఇతర వ్యాధుల నియంత్రణపైనా చర్యలకు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలేమో కరోనాపై స్వీయ నియంత్రణతో మాస్క్ ధారణ సహా జాగ్రత్తలను పాటించాలి. అప్రమత్తత వల్ల ఎప్పుడూ ఎంతో కొంత లాభమే. ఎంతైనా మన జాగ్రత్తే మనకు రక్ష కదా! -
భారత్కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త.. ఆ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకొచ్చిన ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. అయితే, ‘ఎయిర్ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్లో ఉండాలని తెలిపింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్, ఎన్ని డోసులు, ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలనూ ‘ఎయిర్ సువిధ’ పోర్టల్లోని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరచాల్సి ఉండగా.. తాజాగా ఆ నిబంధనను భారత్ ఎత్తివేసింది. ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాతే భారత్కు రావడం మంచిదని పేర్కొంది. డీ బోర్డింగ్ సమయంలోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్కు వెళ్లాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Viral Video: ఘోస్ట్ పేషెంట్తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు -
అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?...
ఖట్మండు: నేపాల్లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొనడంతో.. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఓ రివ్యూ సమావేశం కోసం సెక్రెటేరియట్కు వెళ్తున్న మంత్రి విడదల రజిని.. ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందితో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను మంత్రి విడదల రజిని ఆదేశించారు. చదవండి: సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్రావు -
కరోనా అలర్ట్: నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్లో కొత్త వేరియెంట్ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్డౌన్, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్ఫెక్షన్ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్లెన్స్ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది. -
ఒమిక్రాన్పై కేంద్రం హెచ్చరికలు.. వారం రోజుల్లోనే..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ను సాధారణ జలుబుగా భావించవద్దని కేంద్రం హెచ్చరించింది. కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కేవలం వారం రోజుల్లోనే 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. అయితే.. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అటు.. కరోనా బాధితుల డిశ్చార్జ్ పాలసీని సవరించినట్లు చెప్పిన అగర్వాల్.. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను ఏడు రోజుల్లో డిశ్చార్జ్ చేయాలన్నారు. వీరికి మళ్లీ వైరస్ నిర్థారణ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. మరోవైపు థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ను బఫర్ స్టాక్లో ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్లను పటిష్ట పర్చాలని సూచించింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. -
Fact Check: కేంద్రం ఒక్కొక్కరికి రూ.5వేల కోవిడ్-19 ఫండ్ను అందిస్తుందా?
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం కోవిడ్ ఫండ్ను విడుదల చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరికి ఒక్కొక్కరికి కేంద్ర ఆరోగ్య శాఖ రూ.5 వేలు అందిస్తుంది. అందుకే కేంద్రం ఇచ్చే కోవిడ్ ఫండ్ పొందాలనుకుంటే వ్యక్తిగత వివరాలు వెల్లడించాలంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. एक फर्जी मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार के हेल्थ मंत्रालय द्वारा कोरोना फंड के तहत ₹5000 की धनराशि प्रदान की जा रही है।#PIBFactcheck ▶️ ऐसे फर्जी संदेशों को फॉरवर्ड न करें। ▶️ इस तरह की संदिग्ध वेबसाइट पर अपनी किसी भी तरह की निजी जानकारी साझा न करें। pic.twitter.com/qiAbnHlJLi — PIB Fact Check (@PIBFactCheck) January 11, 2022 అయితే దీనిపై కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఇది స్కామ్ అని. అలాంటి ఆఫర్/స్కీమ్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పీఐబీ అధికారిక ట్విట్టర్ అకౌంట్నుంచి ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి మెసేజ్లను నమ్మొద్దని, దాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. వైరల్ అవుతున్న లింక్లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ఇక జనవరి 15, 2022 వరకు మాత్రమే కేంద్రం కోవిడ్ ఫండ్ ఇస్తుందని మెసేజ్లో ఉందని, ఇది కూడా ఫేక్ ఇన్మర్మేషన్ అని కొట్టి పారేసింది. ఇలాంటి ప్రమాదకరమైన మెసేజ్లను ఎవరూ పట్టించుకోవద్దని,వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరింది. చదవండి: విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్మాల్యా? -
15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!
Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్లైన్, హెల్త్కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు. పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి. చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..
న్యూఢిల్లీ, బెంగుళూరు: అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భారత్లోకి వచ్చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు, బెంగళూరుకి చెందిన 46 ఏళ్ల వయసున్న వైద్యుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా ఇన్సాకాగ్ నెట్వర్క్ జన్యు విశ్లేషణల్లో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్ని కలుసుకున్న వారిలో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి ఐసోలేషన్లో ఉంచారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చేసిందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కోవిడ్ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఒమిక్రాన్పై ఎవరూ ఆందోళన చెందవద్దు. కానీ కరోనా నిబంధనలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటివన్నీ చేస్తే ఒమిక్రాన్ సహా ఏ కరోనా వేరియెంట్నైనా ఎదుర్కోగలం’ అని లవ్ అగర్వాల్ చెప్పారు. డెల్టా కంటే ఈ వేరియెంట్ ప్రమాదకరమైనదా? కాదా? అన్నది ఇంత త్వరగా చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ– పీసీఆర్ పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పిలుపునిచ్చారు. మరోవైపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్బందీగా స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అధికారుల్ని ఆదేశించారు. బూస్టర్ డోస్లపై అధ్యయనం ఒమిక్రాన్ రాకతో భారత్కు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ బూస్టర్ డోసులపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ బూస్టర్ డోసులు ఇవ్వడంపై శాస్త్రీయపరమైన కారణాలను విశ్లేషిస్తున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త వేరియెంట్ను ఎదుర్కోవడంలోనూ వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. భారత్ దగ్గర టీకా డోసులు సమృద్ధిగా ఉండడం అదృష్టమని చెప్పారు. అందరూ టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు. దేశ జనాభాలోని వయోజనుల్లో 40 శాతం మంది కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే, 84.3% మంది ఒక్క డోసు తీసుకున్నారని చెప్పారు. -
ఆర్థిక శాఖతో పాటు హరీష్రావుకు మరో కీలక శాఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైద్యారోగ్య శాఖను సీఎం తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల పలు సభల్లో మాట్లాడుతూ ‘మున్ముందు హరీశ్రావుకు కూడా నాకు జరిగిన విధంగానే జరుగుతుంది’ అని ప్రచారం చేశారు. కాగా, ఈ ఆరోపణలను అబద్ధం చేస్తూ హరీశ్రావుకు కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగానికి కొత్తరూపునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో.. వైద్యారోగ్య శాఖను హరీశ్రావుకు అదనపు బాధ్యతగా అప్పగించడం గమనార్హం. చదవండి: (కేసీఆర్కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా..) -
92 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోస్ల సంఖ్య
దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా జరుగుతున్న కోవిడ్–19 టీకా కార్యక్రమం 92 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో ఇచ్చిన 59,48,360 డోసులతో కలిపి, మొత్తం 92,17,65,405 డోస్లను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు. అంతేగాక గత 24 గంటల్లో 24,770 మంది రోగులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,31,75,656 కు పెరిగింది. పెరిగిన రికవరీ.. అదే సమయంలో దేశవ్యాప్త రికవరీ రేటు 97.94 శాతానికి చేరింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన నియంత్రణ చర్యల కారణంగా వరుసగా 101వ రోజు కూడా 50వేల కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులను గుర్తించారు. మరోవైపు దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,687కు చేరింది. ఇది 203 రోజుల కనిష్ట స్థాయి అని కేంద్రం ప్రకటించింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలను చేపడుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,09,825 పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.68 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించారు. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 37 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 120 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
కరోనా కొత్త కేసులు 46,164
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో మరో 46,164 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. దీంతో, మొత్తం కేసులు 3,25,58,530కు చేరుకున్నాయని వెల్లడించింది. అదే సమయంలో, 607 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 4,36,365కు పెరిగిందని తెలిపింది. యాక్టివ్ కేసులు కూడా 3,33,725కు పెరిగాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.03%గా ఉన్నాయని పేర్కొంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.63%గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 51,31,29,378 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.58% కాగా, ఇది గడిచిన 31 రోజులుగా మారలేదని వెల్లడించింది. అదేవిధంగా, వీక్లీ పాజిటివిటీ రేటు గత 62 రోజులుగా ఎలాంటి మార్పులేకుండా 2.02%గానే ఉంటోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 60.38 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. కేరళలో ప్రమాదఘంటికలు కేరళలో కరోనా తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు నిర్ధారణయ్యాయి. దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 66% ఒక్క కేరళ నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో కేరళలోనివే 58.4% ఉన్నాయి. దీంతో, గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ రాష్ట్ర అధికారులతో మీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. వైరస్ వ్యాప్తి, కరోనా కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహం, మౌలిక వసతులపై చర్చించి, అవసరమైన సూచనలు చేసినట్లు హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కేరళను సందర్శించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రంలో ఆరోగ్య వసతుల మెరుగుకు రూ.267 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో 20 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసుల సరఫరా వచ్చే సెప్టెంబర్లో 20 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) గురువారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎస్ఐఐ ఆగస్టులో 12 కోట్ల డోసుల కోవిడ్ టీకా అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో సెప్టెంబర్ నెలలో సంస్థ 20 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలదని సంస్థ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. -
దేశంలో కొత్తగా 40,120 కరోనా కేసులు.. మరణాలు 585
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 585 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3,85,227 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 52.95 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
స్కూళ్లు తెరవడంపై నిర్ణయం రాష్ట్రాలదే: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూత పడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్లను తెరవాలా వద్దా అనే అంశంపై అన్ని వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణల హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లు తెరవాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. చాలా మంది ఉపాధ్యాయులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్నారని..టీకాలు వేగవంతం చేయడం పూర్తిగా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం ఉపాధ్యాయులు కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది జనాభాలో కేవలం 9.54 కోట్ల మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూళ్ల టీచర్ల టీకా శాతం, ప్రస్తుత పరిస్థితిపై సీబీఎస్ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది. -
గర్భిణులకు వ్యాక్సినేషన్పై గైడ్లైన్స్
న్యూఢిల్లీ: గర్భిణులు టీకాలు వేయించుకోవడంపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. టీకా వల్ల ప్రయోజనాలు వివరించడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గర్భిణులకు వివరించాలంటూ ఫ్రంట్లైన్ వర్కర్లకు గైడ్లైన్స్ను కేంద్ర ఆరోగ్య శాఖ తయారు చేసింది. గర్భిణుల్లో 90 శాతంమందికి కోవిడ్ సోకినా ఆస్పత్రి పాలుకాకుండానే నయమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని కేసుల్లో మాత్రం ఒక్కమారుగా ఆరోగ్యం క్షీణించడం, పిండంపై ప్రభావం చూపడం వంటి దుష్పరిణామాలున్నాయని కేంద్రం తెలిపింది. అందువల్ల వీరు సైతం కరోనా టీకా తీసుకోవాలని సూచించింది. గర్భం వల్ల కరోనా రిస్కు పెరగదని స్పష్టం చేసింది. గర్భందాల్చిన వారిలో 35ఏళ్ల పైబడినవారు, బీపీ, ఒబేసిటీ వంటి సమస్యలున్నవారికి కరోనా వల్ల రిస్కు అధికమని తెలిపింది. కోవిడ్ సోకిన స్త్రీలకు జన్మించిన 95 శాతం మంది శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ప్రసవానికి ముందు కోవిడ్ సోకినట్లయితే ప్రసవానంతరం తొందరగా టీకా తీసుకోవాలని సూచించింది. చదవండి: కరోనా వ్యాక్సిన్ బదులు కుక్క కాటు టీకా Covid 19 థర్డ్ వేవ్ ప్రిపరేషన్: కేంద్రం కీలక నిర్ణయం -
AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 12వ విడత ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. బాధితులను గుర్తించి సత్వరమే చికిత్స అందించేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి ఫీవర్ సర్వే చేస్తున్నామని, 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటున్నారని చెప్పారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ చేపట్టిన 11 విడతల జ్వర బాధితుల గుర్తింపు సర్వేలో 2,72,240 మందిని గుర్తించి శాంపిళ్లు పరీక్షించగా 33,262 మంది కరోనా పాజిటివ్గా తేలినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయని, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఏపీలో టెస్టులు నిర్వహించామన్నారు. మిలియన్ జనాభాకు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా 2.67 లక్షల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. 1,09,69,000 డోసుల పంపిణీ.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని సింఘాల్ తెలిపారు. ఒక డోసు తీసుకున్నవారు 58 లక్షల మంది ఉండగా 25,87,000 మంది రెండు డోసులు పూర్తైన వారు ఉన్నట్లు చెప్పారు. పలు కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో ఇంకా 16,54,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోటా కింద జూన్ నెల వరకూ 51,40,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 104 కాల్ సెంటర్కు ఫోన్ కాల్స్ కూడా తగ్గుతున్నాయని తెలిపారు. 104 కాల్ సెంటర్ ద్వారా సేవలు అందించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ 5,012 మంది వైద్యులు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో స్పెషలిస్టులు 951 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం రోజువారీ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా గత 24 గంటల్లో 497 మెట్రిక్ టన్నులను డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 114 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు సరిపడా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయన్నారు. చదవండి: నేడు ఢిల్లీకి సీఎం జగన్ -
టెస్టులు, వ్యాక్సిన్లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్ ప్రకటించారు. చదవండి: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ -
హోటళ్ల వ్యాక్సినేషన్ ప్యాకేజీలు.. కేంద్రం కన్నెర
కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్ ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ పేరిట స్పెషల్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది. న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్, వ్యాక్సినేషన్ గైడ్లెన్స్ కూడిన లేఖల్ని శనివారం పంపించారు. #Unite2FightCorona Health Ministry writes to States/UTs on some private hospitals giving package for #COVID19 Vaccination in collaboration with some hotels. Says it is against the guidelines issued for the National Covid Vaccination Program. pic.twitter.com/qum9SqOJtW — Ministry of Health (@MoHFW_INDIA) May 29, 2021 ఈమధ్య కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్, బెడ్, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఎక్కడెక్కడంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, వర్క్ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, గ్రూప్ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ఆర్డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్లలో, పంచాయితీ భవన్లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో టెంపరరీ బేస్ మీద వ్యాక్సిన్ అందించాలని కేంద్రం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది. -
24 గంటల్లో తెలంగాణలో 5,559 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో 8,061 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,13,225 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 71,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బెలెటిన్ విడుదల చేసింది. -
కరోనా: కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన దాని కన్నా చాలా ముందే కోవిడ్ కేసుల్లో పెరుగుదల నిలిచిపోయిందని, రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపింది. తెలంగాణ, ఢిల్లీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, పంజాబ్ సహా 13 రాష్ట్రాల్లో రోజువారీగా వస్తున్న కొత్త కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోం దని సోమవారం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కానీ, బిహార్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్ల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 24న కొత్తగా 25,294 కేసులు నమోదవగా, మే 2న 24,253 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. చత్తీస్గఢ్లో ఏప్రిల్ 29న కొత్తగా 15,583 కేసులు నమోదు కాగా, మే 2వ తేదీన 14,087 కేసులు నమోదయ్యాయన్నారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో కేసులు నమోదవు తున్నాయన్నారు. తెలంగాణలోని నిర్మల్ సహా ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. అయితే, ఈ గణాంకాల ఆధారంగా ముందే ఒక నిర్ణయానికి రాలేమన్నారు. రాష్ట్రాలవారీగా క్షేత్రస్థాయిలో కేసుల నియంత్రణ కు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పశ్చిమబెంగా ల్, కర్నాటక, కేరళ తదితర 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయన్నారు. 7 రాష్ట్రాల్లో యాభై వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులున్నా యని తెలిపారు. అస్సాం, బిహార్, హరియాణా, కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్తాన్, పశ్చి మ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందన్నారు. చదవండి: కరోనా టెస్టు చేయలేదని తలుపు విరగ్గొట్టాడు -
లవ్ అగర్వాల్ ప్రెస్ మీట్
-
కబ్జా ఆరోపణలు.. ఈటలకు ఎసరు!
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం శనివారం కొత్త మలుపు తిరిగింది. సీఎం సిఫారసు మేరకు ఈటల నిర్వహిస్తున్న మం త్రిత్వ శాఖ బాధ్యతలను సీఎంకు బదలాయిస్తూ గవర్నర్ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈమేరకు గెజిట్ జారీ చేశారు. దీంతో పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఈటల మిగి లారు.మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీం పేట, అచ్చంపేట గ్రామాల్లో ఈటల అసైన్డ్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో రెండ్రోజు లుగా జరుగుతున్న పరిణామాలు ఈటల మంత్రి పదవిలో కొనసాగడం చుట్టూ తిరుగుతున్నాయి. సీఎస్, విజిలెన్స్ నివేదికలు అందిన తర్వాతే కేబి నెట్ నుంచి ఉద్వాసన పలుకుతారని భావించారు. అయితే విచారణ నివేదికలతో సంబంధం లేకుండానే ఈటల నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను సీఎం తనకు బదలాయించుకోవడంతో టీఆర్ఎస్ అంతర్గత రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ... తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ మంత్రివర్గంలో కొనసాగడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈటలను నేరుగా కేబినెట్ నుంచి తొలగించకుండా ‘రాజీనామా నిర్ణయం’అనే బంతిని ఈటల కోర్టులోకి నెడుతూ శాఖల బదలాయింపు వ్యూహాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెరమీదకు తేచ్చారు. తద్వారా ‘ఆత్మగౌరవం, పనిచేసే స్వేచ్ఛ’వంటి అంశాలను ప్రస్తావిస్తూ సీఎంపై అసంతృప్త గళం విప్పిన ఈటలను మంత్రి పదవిలో కొనసాగే విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య స్థితిలోకి నెట్టారు. శరవేగంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తున్న ఈటల తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి... తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను సీఎం బదిలీ చేసుకోవడంతో భవితవ్యంపై ఈటల మథనం ప్రారంభించారు. శనివారం హైదరాబాద్శివార్లలోని షామీర్పేటలో ఉన్న తన నివాసానికే పరిమితమైన ఈటల.. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ కబ్జా విషయంలో తనపై వస్తున్న ఆరోపణల విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. విచారణ నివేదిక తనకు వ్యతిరేకంగా ఉండబోతోందనే అంచనాకు వచ్చిన ఈటల.. శనివారం మధ్యాహ్నం కేసీఆర్ వ్యవహార శైలిపై తన అసంతృప్తిని తొలిసారిగా బహిరంగంగా వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో సంయమనంతో వ్యవహరిద్దామని ఈటల వారికి నచ్చచెప్పారు. పదవులన్నింటికీ రాజీనామా..? తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను నియోజకవర్గ ప్రజలు, నాయకులతో చర్చించిన తర్వాతే ప్రకటించాలని ఈటల భావిస్తున్నారు. తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని పేర్కొన్న ఈటల.. రాబోయే రోజుల్లో కేవలం మంత్రి పదవికి రాజీనామా చేయాలా... చేస్తే ఎప్పుడు చేయాలి... ఎమ్మెల్యేగా కొనసాగాలా లేక ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలి. కరోనా సమయం కాబట్టి ఎవరూ హైదరాబాద్ రావద్దు. ఇబ్బందులు పడొద్దు’అని విజ్ఞప్తి చేసిన ఈటల.. ఒకట్రెండు రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. విచారణ నివేదిక అందిన తర్వాత చోటుచేసుకొనే పరిణామాల తర్వాతే మలి అడుగు వేయాలనే యోచనలో ఉన్నారు. చదవండి: (డిజైన్డ్ బై, డిక్టేటెడ్ బై సీఎం.. అన్నీ ఆయనే..!) -
భారత్ రికార్డ్: 25 కోట్ల పరీక్షలు, 8.31 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8.31 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో 25 కోట్లపైగా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచంలోనే భారతదేశం టాప్లో నిలుస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం కరోనా రెండో దశలో భాగంగా 8 రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తోందని వివరించింది. పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ పెరుగుతున్న కరోనా కేసులు 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయని, 80.04 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలంగాణ నంబర్ వన్
న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్ వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్ వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్ వృథా వివరాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది. వాస్తవంగా వ్యాక్సిన్ వృథాను పది శాతంలోపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పది శాతానికి కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ 17.6 శాతం వ్యాక్సిన్ వృథా చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ 11.6 శాతం వృథా చేసి రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 9.4 శాతం వృథా చేసి మూడో స్థానంలో ఉంది. కర్నాటక మాత్రం జాతీయ రేటు 6.5 శాతం సమీపంలో 6.9 శాతంగా ఉంది. ఇదే నేపథ్యంలో కరోనా తీవ్రరూపంలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలకు కొన్ని సలహాలు ఇచ్చింది. రాష్ట్రాలకు మొత్తం 7.54 కోట్ల డోస్ల వ్యాక్సిన్ పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 16వ తేదీన భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ఇప్పటివరకు 3.58 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మార్చి 15 వరకు 8 మిలియన్ల డోస్లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొంది. -
కరోనా.. టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం, వారం, పది రోజులుగా తెలంగాణలోనూ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదు కాగా, ఏప్రిల్, మే నుంచి కరోనా విజృంభించింది. ఆగస్టు, సెప్టెంబర్ వరకు రాష్ట్రాన్ని అతలాకు తలం చేసింది. ఇప్పుడూ సరిగ్గా ఏడాది తర్వాత కేసు లు పెరుగుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన పట్టిపీడిస్తోంది. ఆయా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి నిత్యం రాకపోకలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అంతర్గత విమానాల నుంచి ప్రయాణికులు వస్తూపోతుం డటం, కాలేజీలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, హో టళ్లు తెరిచి ఉండటం, బ్రిటన్ స్ట్రెయిన్లు, ఇక్కడి కొత్త స్ట్రెయిన్లు చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో సెకండ్ వేవ్పై అనుమానాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ వేస్తున్నా, కేసులు పెరిగితే పరిస్థితేంటన్న ఆందోళన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలనూ అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాల ని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టాలని కోరింది. రోజూ 50 వేల పరీక్షలు.. ఏడాదిలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మూడు నాలుగు నెలలుగా పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో ప్రజల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం పెరిగిందన్న భావన వైద్య వర్గాల్లో ఉంది. కరోనా సెకండ్ వేవ్ అంటే మనం జాగ్రత్తగా లేకపోవడం వల్ల వైరస్ విస్తరించడమే తప్ప, ప్రత్యేకంగా వేవ్ ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకు కనీసం 50 వేల పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే పరీక్షలు చేసుకోవాలని, యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి, లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. మెడికల్ కాలేజీ భవనాలపై సమీక్ష.. మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులను మంత్రి ఈటల సమీక్షించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంతో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. ఆసుపత్రులను సిద్ధం చేయండి: ఈటల కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపై సూపరింటెండెంట్లతో చర్చించారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేసులు పెరిగితే అన్ని ఆసుపత్రుల్లో చికిత్సల కోసం వార్డులను సిద్ధంగా ఉంచాలని కోరారు. కరోనా పరీక్షలు పెంచాలన్నారు. మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా చూడాలని కోరారు. వైద్యాధికారులు, ప్రజ లు రిలాక్స్ కావొద్దని కోరారు. స్కూళ్ల లో, పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని వైద్య, ఆరోగ్య అధికారులను కోరారు. 102, 104, 108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. -
భారత్లో కొత్తగా 18,599 మందికి కరోనా
న్యూఢిల్లీ : భారత్లో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,853కు పెరిగింది. భారత్లో యాక్టివ్ కేసులు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,08,82,798 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 1,88,747మంది చికిత్ప పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి : (200 మందికి పాజిటివ్; 18 మందికి యూకే స్ట్రెయిన్) (భయం లేకే కోవిడ్ వ్యాప్తి) -
వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్ మాత్రమే
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 432 ప్రభుత్వ, 92 ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఆయా ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్సైట్లో చూడొచ్చని వెల్లడించింది. 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు... డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని చూపించాలని, 60 ఏళ్లు దాటిన వారుకూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుల ఫొటో గుర్తింపు కార్డులను పోర్టల్/యాప్లో అప్లోడ్ చేయాలి.. హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కాగా, ఏపీలో గత 24 గంటల్లో 20,269 మందికి కరోనా పరీక్షలు కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 51 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు 8,82,080 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
వ్యాక్సినేషన్: ఒకటి నుంచి 60 ఏళ్లపైవారికి..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్కు విరుగుడుగా భారతదేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ శరవేగంగా సాగుతోంది. కరోనా వారియర్స్గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవకులుగా ఉన్న అధికార యంత్రాంగానికి ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ వేసిన తెలిసిందే. ఇక మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు రెండు అంతకన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవయస్కులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ వేస్తామని మంత్రి వివరించారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నట్లు, ప్రైవేటు కేంద్రాల్లో వేసుకోవాలని భావించేవారు రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్కు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తుందని చెప్పారు. ఈ రెండో దశలో దాదాపు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ప్రకాశ్ వెల్లడించారు. 60 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మొదటి దశలో 1,07,67,000 మందికి వ్యాక్సినేషన్ వేసిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత వ్యాక్సిన్ అత్యధిక మందికి వేసిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. -
తొలిరోజు ఎంతమంది టీకా వేయించుకున్నారంటే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిరోజు సందర్భంగా 3351 సెషన్లలో ఈ మేరకు జనాభాకు శనివారం టీకాలు వేశారు. 16755 మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. టీకా వేయించుకున్న లక్ష మందికి పైగా ప్రజల్లో ఒక్కరు ఎలాంటి దుష్ప్రభావానికి లోనుకాలేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయగా.. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ను 12 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: పరిహారం చెల్లిస్తాం: భారత్ బయోటెక్) ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. టీకా అభివృద్ధి కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని ఉద్ఘాటించారు. ఇక టీకా వేసుకున్నంత మాత్రాన అజాగ్రత్త తగదని.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించాల్సిదేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్కు సంబంధించి భారత్లో త్వరలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు శనివారం వెల్లడించింది.(చదవండి: వ్యాక్సిన్: డాక్టర్ రెడ్డీస్ కీలక ప్రకటన!) -
దేశంలో ఎన్ని కరోనా స్ట్రెయిన్ కేసులంటే..
న్యూఢిల్లీ: కొత్త రకం కరోనా (స్ట్రెయిన్) కేసులు దేశంలో పెరుగుతున్నాయి. బ్రిటన్లో వ్యాపించిన కొత్తరకం వైరస్ దేశంలో విస్తరిస్తోంది. కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో శనివారానికి 90కి చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ బాధితులందరినీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించింది. ఆ వైరస్ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొత్త రకం వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. వారికి సంబంధించిన వారిని గుర్తించి అప్రమత్తం చేసి వారిని క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్రం రాష్ట్రాల సహకారంతో కొత్త వర్షన్ కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అయితే ఇన్నాళ్ల పాటు బ్రిటన్ (యూకే)కు నిలిపివేసిన విమాన సేవలు శనివారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చిన వారందరూ విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధన రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా మరికొన్ని దేశాల్లో వైరస్ కొత్త రూపంలో వెలుగులోకి వస్తోంది. మొన్న బ్రిటన్, నిన్న దక్షిణాఫ్రికా, నేడు అమెరికాలో కొత్త రకం వైరస్ వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ కొన్ని దేశాల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించే పరిస్థితులు వచ్చాయి. -
కో-విన్ నకిలీ యాప్ల హల్చల్, కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి గాను అతి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ‘కో-విన్’ పేరుతో నకిలీ, అక్రమ యాప్లు యాప్లో స్టోర్లో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని బుధవారం సూచించింది. సదరు యాప్ల మాయలోపడి వ్యక్తిగత డేటాను, ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపింది. అలాంటి యాప్లను డౌన్లోడ్ చేయవద్దని తీవ్రంగా హెచ్చరించింది. (వ్యాక్సిన్ వచ్చేసింది : రిజిస్ట్రేషన్ ఎలా?) వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం ప్రభుత్వం కోవిన్ పేరుతో సరికొత్త యాప్ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్లాట్ఫారమ్కు సరిపోలిన నకిలీ యాప్లతో అక్రమార్కులు అప్పుడే తమ పని మొదలు పెట్టేశారన్న మాట. కోవిన్ పేరుతో ప్లే స్టోర్లో ఇప్పటికే 3 యాప్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ కో-విన్ యాప్ ను అధికారికంగా ఆవిష్కరించినపుడు, విస్తృత సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. కాగా సీరం రూపొందిస్తున్న కోవీషీల్డ్, భారత్బయోటెక్ ఉత్పత్తి చేస్తున కోవాగ్జిన్ వ్యాక్సీన్ల దేశంలో అత్యవసర వినియోగానికి గాను ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. అయితే తొలి దశలో ఫ్రంట్లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ కోవిన్ను ప్రవేశపెట్టింది. అలాగే ఈ టీకా ప్రక్రియ కోసం ఫ్రంట్లైన్ సిబ్బంది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సామాన్య ప్రజానీకానికి ఈ యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. Some apps named "#CoWIN" apparently created by unscrupulous elements to sound similar to upcoming official platform of Government, are on Appstores. DO NOT download or share personal information on these. #MoHFW Official platform will be adequately publicised on its launch. — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2021 -
గుడ్న్యూస్: ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాక్సినేషన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు గాను ఇప్పటికే 29 వేల కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా నాలుగు డిపోలు.. 37 రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. -
రేపట్నుంచి యూకేలో ఫైజర్ టీకా
లండన్: బ్రిటన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒక భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆస్పత్రుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఫైజర్ వ్యాక్సిన్ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్కాక్ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇళ్లల్లోనే ఉండే వయో వృద్ధులకు, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పై బడిన వారికి, వారి సంరక్షకులకి మొట్ట మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు. ప్రజలందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్తో అతలాకుతలం అవుతున్న యూకే గతవారంలోనే అమెరికాకి చెందిన ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. 6.7కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ తొలి విడతగా 2 కోట్ల మందికి టీకా డోసుల్ని ఇవ్వనుంది. ఇందు కోసం 4 కోట్ల టీకా డోసులకి ఆర్డర్ చేసింది. బెల్జియం నుంచి ఇప్పటికే 8 లక్షల డోసులు జాతీయ ఆరోగ్య కేంద్రాలకి చేరుకున్నాయి. రాణి దంపతులకు వ్యాక్సినేషన్! బ్రిటన్ రాణి ఎలిజెబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు త్వరలో ఫైజర్ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. వయసుని దృష్టిలో ఉంచుకొని వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తారని ది మెయిల్ పత్రిక వెల్లడించింది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజల్లో నమ్మకం పెంచేందుకు రాణి దంపతులతో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా టీకా తీసుకోనున్నారు. అయితే బకింగ్çహామ్ ప్యాలె స్ టీకా అంశంలో ఇంకా స్పందించాల్సి ఉంది. చైనా సన్నాహాలు చైనా కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. 140 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం సవాలేనని అధికారులు చెప్పారు. చైనాలో మొత్తం అయిదు వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో సినోఫార్మ్ కంపెనీ టీకా వినియోగం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ను ఇస్తుందో అధికారికంగా వెల్లడించలేదు. -
కరోనా: దేశంలో రికవరీ రేటు 93.69 శాతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో కొంత తగ్గుదల నమోదవుతోంది. గురువారం 45,882 కేసులు, శుక్రవారం 46,232 కేసులు నమోదవగా.. శనివారం 45,209 పాజటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807 కు చేరింది. కరోనాకు చికిత్స పొందుత్నువారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 43,493 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,21,617 కు చేరింది. 4,40,962 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీ రేటు 93.69 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4.85 శాతం యాక్టివ్ కేసులున్నాయని, మరణాల రేటు 1.46 శాతంగా ఉందని బులెటిన్లో వెల్లడించింది. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్న్యూస్) -
భారత్: 85 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,674 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల్లో మరో 559 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,26,121 కు చేరింది. తాజా కేసులతో భారత్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,07,754 కి చేరగా... 5,12,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 49,082 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో.. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,68,968 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ రోగుల రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగిందిని తెలిపింది. భారత్లో కోవిడ్ మరణాల రేటు 1.48 శాతంగా ఉందని.. దానిని ఒక శాతానికి తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివిటీ రేటును 5 శాతానికి పరిమితం అయ్యేలా పనిచేస్తున్నామని బులెటిన్లో పేర్కొంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 6.03 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. శీతాకాలం కావడంతో కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఒక్కరోజే 53 వేల మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 53,920 కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,19,887 కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 92.42 శాతంగా ఉందని వెల్లడించింది. అదే సమయంలో మరణాల రేటు1.48 శాతంగా ఉందని శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం భారత్లో 5,16,632 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11,13,209 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,62,081 కు చేరింది. కోవిడ్ బారినపడ్డవారిలో మరో 577 మంది మృతి చెందడంతో.. ఆ మొత్తం సంఖ్య 1,25,562 కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,65,42,304 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) పేర్కొంది. -
కరోనా అప్డేట్ : 80 లక్షలకు చేరువైన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికి 80 లక్షల మార్క్కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1,20,000కు పెరిగింది. 43,893 తాజా పాటిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 79,90,322కు ఎగబాకింది. ఇక తాజాగా వైరస్ కారణంగా బుధవారం 508 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల్లో 79 శాతం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కోవిడ్-19 మరణాలు లేని మిజోరంలో తొలిసారిగా వైరస్ బారినపడి 62 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు పెరుగుతున్నా ప్రతి పదిలక్షల జనాభాలో వైరస్ మరణాలు ప్రపంచంలోనే భారత్లో అతితక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. చదవండి : భారత్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే! కోవిడ్ మరణాల్లో ప్రపంచ సగటు 148 కాగా, భారత్లో ఇది కేవలం 87కే పరిమితమవడం ఊరట కలిగిస్తోంది. భారత్లో రోజురోజుకూ కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 43,893 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 58,439 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. -
దేశంలో 78 లక్షలు దాటిన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 53,370 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71 శాతం ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,13,82,564. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 6,80,680 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్ అయనవారి సంఖ్య 70,16,046గా ఉంది. (చదవండి: మన ‘చేతుల్లోనే’.. మన ఆరోగ్యం) భారత్లో అంతంత మాత్రమే దేశంలో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్దగా ఫలితం లేదని బ్రిటీష్ మెడికల్ జర్నల్ తెలిపింది. ఏప్రిల్, మే మాసాల్లో భారత్లో ప్లాస్మా చికిత్సలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వెల్లడించింది. -
ఫిబ్రవరి నాటికి అదుపులోకి కరోనా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కేవలం 40,000 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేసుల మోడల్ను అనుసరించి శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్తల నుంచి ఈ అంచనాకు వచ్చిందని చెప్పారు. మూడు నాలుగు నెలల్లో కరోనా వైరస్ తీరు మార్చుకుని ఫిబ్రవరి నాటికి భారత్లో బలహీనపడుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఇక వ్యాక్సినేషన్ పద్ధతులు, సిబ్బందికి శిక్షణ, వ్యాక్సిన్ సరఫరాకు రవాణా ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కోవిడ్-19పై నిపుణుల కమిటీ చీఫ్ పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత మూడు వారాలుగా తాజా కేసులు, మరణాలు తగ్గాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ ఇటీవల పేర్కొన్నారు. అయితే శీతాకాలంలో కరోనా వైరస్ మరోసారి తీవ్రరూపు దాల్చే అవకాశాలు లేకపోలేదని ఆయన హెచ్చరించారు. చదవండి : భారత్లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు -
భారత్లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో అంతకంతకూ అధికమవుతున్న కరోనా వైరస్ గడిచిన 24 గంటల్లో 55,722 పాజిటివ్ కేసులు నమోదవడంతో 75 లక్షల మార్కుని దాటింది. వైరస్ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,14,610 కు చేరింది. దేశ వ్యాప్తంగా మరో 66,399 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 10.23 శాతం యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించికంది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,59,876 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976 కు చేరిందని పేర్కొంది. ఇక 83,87,799 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 75,50,273 కేసులతో భారత్ రెండో స్థానంలో, 52, 35,344 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో అత్యధికంగా 2,24,730 మంది కోవిడ్ బారినపడి మరణించారు. -
కోవిడ్-19 : మృతుల్లో 45 శాతం వారే!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో మరణాల ముప్పు వృద్ధులకే అధికంగా ఉంటుందన్న అంచనాలు సరైనవి కావని, 60 సంవత్సరాల లోపు వయసున్న వారికీ కోవిడ్-19తో ముప్పు అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా విశ్లేషణలు స్పష్టం చేశాయి. భారత్లో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 45 శాతం మంది 60 సంవత్సరాలలోపు వారేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్తో మరణించిన వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే అధికంగా ఉందని ఈ విశ్లేషణ వెల్లడించింది. 44-60 ఏళ్ల వయసు వారిలో మరణాల సంఖ్య 35 శాతం కాగా, 26-44 వయసు వారిలో మరణాల సంఖ్య 10 శాతంగా ఉందని పేర్కొంది. 60 సంవత్సరాలు పైబడిన వారిలో కరోనా మరణాల రేటు 53 శాతంగా నమోదైంది. ఇక 17 సంవత్సరాల లోపు యువతలో కరోనా మరణాలు కేవలం 1 శాతం ఉండగా, 18-25 సంవత్సరాల వయసు వారిలోనూ మరణాల రేటు కూడా 1 శాతంగా నమోదైంది. వయో వృద్ధులతో పాటు పలు వ్యాధులతో బాధపడే వారికి కరోనా వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 44-60 సంవత్సరాల వయసు వారిలో కరోనా మరణాలు ఆందోళనకరమని, తాము యువకులం కావడంతో తమకు వైరస్ సోకదని, వైరస్ సోకినా తాము కోలుకోగలమని భావిస్తారని, అలాంటి అపోహలు సరైందికాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. ఇక పలు వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్-19తో ముప్పు అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 45-60 ఏళ్ల వయసు వారిలో వివిధ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలు 13.9 శాతంగా నమోదయ్యాయి. ఎలాంటి ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల సంఖ్య 1.5 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇతర వ్యాధులతో చోటుచేసుకున్న మరణాలు 24.6 శాతం కాగా, ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల రేటు 4.8 శాతంగా ఉంది. 45 ఏళ్ల లోపు వారిలో ఇతర వ్యాధులతో బాధపడుతూ 8.8 శాతం మరణించగా, ఇతర వ్యాధులు లేనివారిలో మరణాల రేటు కేవలం 0.2 శాతంగా ఉంది. గుండె జబ్బులు, ప్రధాన అవయవాల మార్పిడి జరిగిన వారు, క్యాన్సర్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల రేటు 1.53 శాతంగా ఉందని ఆయన వివరించారు. చదవండి : ‘కో ఇన్ఫెక్షన్’పై జర జాగ్రత్త! -
కోవిడ్-19 : వ్యాక్సిన్ రాకపై స్పష్టత!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన వ్యూహాలను నిపుణుల బృందాలు రూపొందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రపంచం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రుల బృందం భేటీలో మంత్రి భారత్లో వ్యాక్సిన్ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి : షాకింగ్ : ఆ వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత వ్యాక్సిన్పై డబ్ల్యూహెచ్ఓ అంచనా ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమవుతుందని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 కరోనా వైరస్ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా వాటిలో 10 వ్యాక్సిన్లు కీలక మూడవ దశలో ఉన్నాయని వీటి భద్రత, సామర్ధ్యం మనకు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు. ఈ వ్యాక్సిన్లు కీలక దశలను దాటుకుని తగినంత డేటాతో రెగ్యులేటర్ల అనుమతి పొందే ప్రక్రియ ముగియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. -
ఒక్కరోజే 55,342 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వైరస్ విజృంభిస్తోంది. గచిచిన 24 గంటల్లో 55,342 పాజిటివ్ కేసులు నమోదవంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కు చేరింది. తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనా కారణంగా 706 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య1,09,856 కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71,760 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 62,27,296 మంది కోవిడ్ నుంచి కోలుకోగా ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.36 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.53 శాతానికి తగ్గిందని పేర్కొంది. -
కోవిడ్-19 : వ్యాక్సిన్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. సండే సంవాద్లో తన ఫాలోయర్లతో ప్రతి వారం జరిపే సంప్రదింపుల్లో భాగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భారత్లో ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు తొలి, మలి, మూడవ దశ పరీక్షలు జరిపే దశలో ఉన్నాయని, ఈ పరీక్షల ఫలితాలు వ్యాక్సిన్ వ్యూహాన్ని నిర్ధారించడంలో ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. వైరస్ సోకే ముప్పున్న వ్యక్తులతో పాటు వైరస్ కారణంగా మరణించే అవకాశాలు అధికంగా ఉన్న గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి తెలిపారు. చదవండి : 70 శాతం మందికి వ్యాక్సిన్ అందేది అప్పుడే! వ్యాక్సిన్ల అందుబాటు ఆధారంగా పలు కోవిడ్-19 వ్యాక్సిన్లను సమీకరించే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సీఎస్ఐఆర్-ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఫెలుదా పేపర్ స్ర్టిప్ పరీక్షను మరికొద్ది వారాల్లో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కోవిడ్-19ను గుర్తించడంలో దీనికి 98 శాతం కచ్చితత్వం ఉన్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఇక రానున్న పండగ సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని, ఇది వైరస్ వ్యాప్తిని పెంచుతుందని మంత్రి హెచ్చరించారు. -
కరోనా కట్టడి : కేంద్ర మంత్రి కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న పండుగ సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. భగవంతుడి పట్ల, మతం పట్ల మీ విశ్వాసం నిరూపించుకునేందుకు పెద్దసంఖ్యలో ఒకేచోట గుమికూడాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో మనం ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు లక్ష్యంపైనే గురిపెట్టాలని, ఈ వైరస్ను తుదముట్టించి మానవత్వాన్ని కాపాడటమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. ఇదే మన మతమని, ప్రపంచ అభిమతమూ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ రీతిలో స్పందించాలని అన్నారు. ప్రార్థనలు చేసేందుకు మీరు విధిగా ఆలయాలు, మసీదులు సందర్శించాలని ఏ దేవుడూ, మతం చెప్పలేదని పేర్కొన్నారు. పండుగలు జరుపుకునేందుకు మన జీవితాలను పణంగా పెడతామా అని మంత్రి ప్రశ్నించారు. ‘ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోంది..భారత్ ఈ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తోంది..ఈ పోరాటంలో జన్ ఆందోళన్కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చార’ని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం నిర్ధేశించిన భౌతిక దూరం నిబంధలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 70 లక్షలు దాటాయి. 60 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వైరస్ విజృంభణ, 70 లక్షలు దాటిన కేసులు -
వైరస్ విజృంభణ, 70 లక్షలు దాటిన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గచిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 74,383 పాజిటివ్ కేసులు నమోదవంతో.. మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 918 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,08,334 కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,154 మంది వైరస్ రోగులు కోలుకున్నారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 60,77,976. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,496. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.17 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు12.30 శాతం ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.54 శాతానికి తగ్గిందని పేర్కొంది. శనివారం ఒక్కరోజే 10,78,544 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి 8,68,77,242 నమూనాలు పరీక్షించామని తెలిపింది. -
వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా..
సాక్షి, హైదరాబాద్ : కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆరోగ్యశాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. (కోవిడ్ వేళ ప్రతి ఇల్లూ ఆయుర్వేద కేంద్రమే ) పరిస్థితి అదుపులోనే ఉంది : కేటీఆర్ ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలితమే అని తెలిపారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పనిచేసిందని ప్రశంసించిన మంత్రి ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈసారి సీజనల్ వ్యాధులు కూడా తగ్గాయని మాతా, శిశు మరణాల రేటు సైతం తగ్గిందని తెలిపారు. వివిధ రకాలైన వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందన్నారు. (ప్రాణం పోసిన ఎక్మో..) -
కరోనా : ఆ ఐదు రాష్ర్టాల్లో అధికం
న్యూఢిల్లీ : భారత్లో గత మూడు వారాలుగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రధానంగా ఐదు రాష్ర్టాల్లో మాత్రం కేసులు పెరిగాయి. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్4 వరకు దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత 56% నుంచి 37% కి పడిపోయింది. అయితే కేరళ, ఛత్తీస్గడ్, ఉత్తరాఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో మాత్రం గత మూడు వారాలుగా కరోనా తీవ్రత పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. అత్యధికంగా కేరళలో కరోనా తీవ్రత 112% కి పెరగగా, ఛత్తీస్గడ్లో 93%, , ఉత్తరాఖండ్లో 61%, ఒడిశా, మధ్యప్రదేశ్లలో 54% అధికంగా కోవిడ్ కేసులు నమోదైనట్లు గణాంకాల్లో తేలింది. (వారికి సింగపూర్ బంపర్ ఆఫర్) గత మూడు వారాల్లో అత్యల్పంగా బీహార్లో కరోనా తీవ్రత 19%కి పడిపోయింది. తమిళనాడు 23%, గుజరాత్ 26% వృద్ధిరేటును నమోదు చేసుకుంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో ముందజలో ఉన్న మహారాష్ర్టలో కరోనా కేసులు 36% కి పెరగగా, కర్ణాటకలో 39%కి పెరిగింది. ఇక తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 27%, కరోనా కేసులు పెరిగినట్లు డేటాలో వెల్లడైంది. భారత్లో కరోనా కేసులు నమోదవుతున్నా అదే స్థాయిలో రికవరీ రేటు సైతం పెరుగుతుండటం ఊరట కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 6.6 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదవగా, 102,685 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్వో) -
కోవిడ్-19 : జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆదివారం వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సేకరిస్తుందని, వ్యాక్సిన్ను సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఏయే గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందచేయాలనే వివరాలతో ప్రాధాన్యతా గ్రూప్లను పేర్కొంటూ ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని చెప్పారు. వ్యాక్సిన్ సేకరణను కేంద్రకృతంగా చేపట్టి ప్రతి కన్సైన్మెంట్ను రియల్టైంలో ట్రాక్ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందచేస్తామని డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ప్రక్రియలో నిమగ్నమైన ఇతరులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ను వేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ సమంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, భారత వ్యాక్సిన్ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భారత్లో పలు వ్యాక్సిన్లు కీలక దశ పరీక్షలకు చేరుకోవడంతో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. చదవండి : ‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’ -
అలా చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతాం!
సాక్షి, హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణలకు సిద్ధం కావాలని, కాలానుగుణంగా మార్పులు చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతామని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ అయ్యాక మీ సేవలు ప్రజలకు అందకపోతే కష్టపడి చదువుకుని ఏం లాభమని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తున్న డాక్టర్, నర్సు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీ ఓరియంటెడ్గా, పీపుల్ ఓరియంటెడ్గా, కమిట్మెంట్తో పని చేయాలన్నారు. సోమవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నూతన వైద్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు, లాంటి జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయో 'డిసీజ్ మాపింగ్' చేయాలి. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్స్, మందులు ఉండేలా చూడాలి. మందులు - ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టర్శరే కేర్ ఆసుపత్రుల వరకు.. అన్ని చోట్లా అందుబాటులో ఉన్న మందులు ఎన్ని.. అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అనే వివరాలు కంప్యూటరీకరణ చెయ్యాలి. ప్రతి మందుకు లెక్క ఉండాలి. పీహెచ్సీలో అనవసర మందులు ఉంచవద్దు. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేయాలి. వైద్య చరిత్రలో మొదటి సారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపించి డబ్బులు వెనక్కి తీసుకున్నాము. ప్రపంచంలో ఉన్న మంచి వైద్య విధానాలను తెలుసుకొని మన దగ్గర అమలు చేయాలి. మంచి హెల్త్ కేర్ సిస్టమ్లు ఏమున్నాయి, వాటిని మన దగ్గర అమలు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి, వాటిని ఏవిధంగా అధిగమించాలి అనే సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. మన నెట్ వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పెద్దది. కాబట్టి రెఫరల్ సిస్టమ్ను మొదలు పెట్టండి. ఆశా వర్కర్స్ పేషంట్లను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలి. ( మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా ) బాధ్యత పెరగాలి - మార్పు రావాలి. ప్రతి హాస్పిటల్లో రిసెప్షన్ ఉండాలి. వారు పేషంట్లను గైడ్ చేసే విధంగా ఉండాలి. ప్రతి పేషంట్ ఆరోగ్య పరిస్థితి అతనికి, అతని బంధువులకు ఎప్పటికప్పుడు అందజేయాలి. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో, ఆసుపత్రిలో ఏం జరుగుతుందో హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండి చూడగలిగే విధంగా చేయాలి. చిన్న చిన్న పథకాలు పెద్ద మార్పు తీసుకు వస్తాయి. కేసీఆర్ కిట్ పథకం వల్ల 50 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం వల్ల చిన్న వయసులో పెళ్లిళ్లు, చిన్నవయసులో గర్భాలు, నెలలు తక్కువగా పిల్లలు పుట్టడం ఆగిపోయాయి. 18 సంవత్సరాలు నిండితేనే కళ్యాణ లక్ష్మి పథకం అమలు అవుతుంది. కాబట్టి ఇవ్వన్నీ ఆగి పోయాయి. ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా ప్రపంచంతో పోటీ పడలేము. చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఒక సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు వస్తాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. -
పీఎం కేర్స్ నిధి : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు. పీఎం-కేర్స్ ఫండ్ నుండి 893.93 కోట్ల రూపాయలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందినట్టు లోక్సభలో ప్రకటించారు. 50 వేల వెంటిలేటర్ల తయారీకి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆదివారం కరోనాపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. కరోనా కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది వలస కార్మికుల పునరావాసం కోసం పీఎం కేర్స్ నిధులు కేటాయించాలని కూడా రంజన్ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రణాళికను అమలు చేసి ఉండి ఉంటే, ప్రజలు కష్టాలను, మహమ్మారి తీవ్రతను నివారించ గలిగేవారమన్నారు. అంతేకాదు దేశంలో కోవిడ్-19 మరణాలపై సరైన సమాచారం లేదని కూడా రంజన్ చౌదరి విమర్శించారు. కాగా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫండ్ను మార్చి 27న ప్రకటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ .3,076 కోట్లు వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉండగా, మరో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు అవసరంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఆడిట్ను డిమాండ్ చేస్తోంది. -
కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది. (చదవండి: గ్యాంగ్స్టర్ దూబే ఆత్మ : ప్రతీకారం తప్పదు) వైరస్ బాధితుల్లో సోమవారం ఒక్కరోజే 82,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39,42,360. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. భారత్లో కరోనా రోగుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 19.84 శాతంగా ఉందని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 5,94,29,115 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొంది. (చదవండి: హీరో విశాల్ తండ్రి ఫిట్నెస్ చూస్తే షాకే!) -
కోలుకున్నా... కొన్ని సమస్యలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్ట్ కోవిడ్ ఫాలోఅప్పై ఆదివారం మార్గదర్శకాలు జారీచేసింది. కోలుకున్న వారిలో కొంత మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపింది. కొందరు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. తీవ్రమైన కరోనా తరువాత కోలుకున్న కొందరిలో అలసట, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటున్నాయి. ఇవి కేవలం ఫాలోఅప్ ప్రొటోకాల్స్ మాత్రమేనని, చికిత్స లేదా నివారణ కాదని స్పష్టం చేసింది. ఇవీ మార్గదర్శకాలు... మాస్క్ని తప్పనిసరిగా వాడాలి. చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్ మెడిసిన్ని వాడాలి. ఆరోగ్యం బావుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి. దశల వారీగా ఆఫీసు పనుల్లో చేరాలి. వైద్యులు సూచించిన విధంగా ప్రతీ రోజూ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. వైద్యుడు చెబితేనే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ప్రతీరోజూ ఉదయం లేదా సాయంత్రం వీలైనమేర నడవాలి. సరిపోయినంత పోషకాహారం తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తగినంత నిద్ర, విశ్రాంతి తప్పనిసరి. అధిక జ్వరం, శ్వాససంబంధ సమస్యలు, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటే ముందుగానే అప్రమత్తం అవ్వాలి. కోలుకున్న వారం తరువాత తమ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడటం మంచిది. హోం ఐసోలేషన్లో ఉన్నవారు ఏదైనా ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి క్రిటికల్ సపోర్ట్ అవసరం. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఇతరత్రా అనారోగ్యాలకు ఇప్పటికే మందులు వాడేట్లయితే వాటిని యథావిధిగా తీసుకోవాలి. ఇంట్లో స్వీయ ఆరోగ్య పర్యవేక్షణ తప్పనిసరి. అందుకోసం శరీర ఉష్ణోగ్రత చూసుకునేలా థర్మామీటర్ ఉండాలి. రక్తపోటు, డయాబెటీస్ పరీక్షించుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ చూసుకోవాలి. నిరంతరం పొడి దగ్గు లేదా గొంతు నొప్పి ఉంటే ఆవిరిపట్టాలి. గార్లింగ్ చేయాలి. ఆవిరి పట్టే నీటిలో అవసరమైన సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి. వైద్యుడి సలహా మేరకు దగ్గు మందులు వాడాలి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, ఆక్సిజన్ స్థాయులు 95 శాతం కంటే తక్కువైతే, ఛాతి నొప్పి, బలహీనంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. కమ్యూనిటీ స్థాయిలో జాగ్రత్తలు... అవగాహన లేకుండా అనవసరంగా మందులు వాడకూడదు. దీంతో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం పొంచి ఉంది. డాక్టర్ల సూచన మేరకు రోగనిరోధక శక్తిని పెంచే కింది ఆయుష్ మందులను వాడొచ్చు. ఆయుష్ క్వాత్ (150 మి.లీ; 1 కప్పు) ప్రతీ రోజూ సంషమణి వతి రోజుకు రెండుసార్లు 500 మి.గ్రా. (రోజుకు 1 గ్రాము) లేదా గిలోయ్ పౌడర్ 1 –3 గ్రాముల గోరు వెచ్చని నీటితో 15 రోజులు అశ్వగంధ 500 మి.గ్రా. రోజుకు రెండుసార్లు (రోజుకు 1 గ్రాము) లేదా అశ్వగంధ పౌడర్ 1–3 గ్రాములు రోజుకు రెండుసార్లు 15 రోజులు. ఆమ్లా ప్రతిరోజూ/ఆమ్లా పౌడర్ 1–3 గ్రాములు ప్రతిరోజూ ములేతి పౌడర్ (పొడి దగ్గు ఉంటే) 1– 3 గ్రాములు గోరు వెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ పసుపు వేసిన వెచ్చని పాలు (ఉదయం లేదా సాయంత్రం) తాగాలి. పసుపు, ఉప్పుతో గార్లింగ్ చేయాలి. చ్యవన్ప్రాశ్ను ఉదయం (1 టీస్పూన్లో పూర్తిగా) గోరు వెచ్చని నీరు లేదా పాలతో వాడొచ్చని ఆయుష్ మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. అంతేకాదు క్లినికల్ ప్రాక్టీస్లో చ్యవన్ప్రాశ్ రికవరీ అనంతర కాలంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు. -
కరోనా: భారీ రికవరీ, అంతకుమించి కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కేసుల నమోదు కూడా అదే స్థాయిలో ఉధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో అత్యధికంగా 97,570 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 36 లక్షల మంది కోలుకున్నారని తెలిపింది. ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. (చదవండి: కరోనా వైరస్ వ్యాక్సిన్ జెట్) -
ఊరట : 1.7 శాతానికి తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5000లోపు కోవిడ్-19 కేసులున్నాయని, లక్షద్వీప్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని వెల్లడించారు. దేశంలో 62 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. 70 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతితక్కువగా భారత్లో ప్రతి పదిలక్షల మందిలో 3102 కోవిడ్-19 కేసులే వెలుగుచూశాయని చెప్పారు. రష్యా కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రభుత్వం పరిశీలిస్తోందని భారత్లో తయారీ, మూడో దశ పరీక్షల కోసం రష్యా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. చదవండి : మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా? -
కరోనా: రెండో స్థానానికి ఎగబాకిన భారత్
న్యూఢిల్లీ: వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులతో భారత్ బ్రెజిల్ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్ రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు చేరింది. భారత్లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.70 శాతంగా ఉందని వెల్లడించింది. (చదవండి: కేరళ కేబినెట్లో మొట్టమొదటి కరోనా కేసు) -
77.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రికార్డుస్ధాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నా మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 73,642 మంది కోవిడ్-19 రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 32,00,000 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 77.32 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు కోవిడ్-19 మరణాల రేటు 1.72 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొంది. కోవిడ్-19 నుంచి కోలుకునే రోగుల సంఖ్య రోజూ పెరుగుతోందని, గత రెండురోజులుగా రోజుకు 70,000 మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా టెస్టులను ముమ్మరం చేయడంతో ప్రాథమిక దశలోనే కోవిడ్-19ను గుర్తించి చికిత్స అందించడం ద్వారానే సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 90632 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 1065 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వ్యాక్సిన్ పంపిణీ ఇలా.. -
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. కొత్తగా 86,432 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31,07,223. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 0.5 శాతం మంది పేషంట్లు మాత్రమే వెంటిలేటర్ ద్వారా, 2 శాతం మంది ఐసీయూలో, 3.5 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, 63,89,057 కరోనా కేసులతో అమెరికా, 40,91,801 కేసులతో బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 40,23,179 కేసులతో భారత్ మూడో స్థానంలో ఉంది. కేసులు నమోదవుతున్న తీరును బట్టి చూస్తే నేడో రేపో భారత్ బ్రెజిల్ను దాటేసి రెండో స్థానానికి చేరుకుంటుంది. (చదవండి: సెకండ్ వేవ్ మొదలైంది.. ఇప్పుడప్పుడే అంతం కాదు!) -
బ్రెజిల్ను దాటేసే దిశగా భారత్ పరుగు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుల రికార్డులు నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్ను మరో మెట్టు ఎక్కించే దిశగా సాగుతోంది. దేశంలో కొత్తగా రికార్డు స్థాయిలో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,748 కు చేరింది. భారీ స్థాయిలో కేసుల నమోదును బట్టి చూస్తే రేపటికల్లా బ్రెజిల్ను దాటేసి భారత్ రెండోస్థానానికి ఎగబాకడం ఖాయం. 40,46,150 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 63,35,244 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 1,096 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 68,472 కు చేరింది. కోవిడ్ బారినుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 8,31,124 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,69,765 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు 4,66,79,185 నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. కాగా, బుధవారం ఒక్కరోజే దేశంలో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కరోజే ఇన్నేసి కేసులు నమోదైన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. (చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐకి మరో సవాల్) -
ఆగని విజృంభణ ఒక్కరోజులోనే 78,357 కేసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్పై పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 78,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. కోవిడ్ రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉందని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) -
భారత్: 69 వేలకు పైగా కేసులు 819 మరణాలు
న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్లో రోజూ 70 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకరం. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటం సానుకూల అంశం. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్ కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. కరోనా రోగుల్లో కొత్తగా 65,081 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,85,996. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.77 శాతంగా ఉందని వెల్లడించింది. ఇదిలాఉండగా... 62 లక్షల కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో 39 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. (చదవండి: ఇమ్యూనిటీ ఏమో గాని.. ఇబ్బందులే సుమా! ) -
కరోనా: దేశవ్యాప్తంగా 36 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉందని తెలిపింది. అలాగే నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.60 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.79 శాతానికి తగ్గిందని పేర్కొంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 8,46,278 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపింది. దాంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 4,23,07,914 కు చేరిందని వెల్లడించింది. (చదవండి: ఈ ఏడాది జనగణన లేనట్లే!) -
కరోనా : కొత్తగా 78,761 కేసులు, 948 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. (చదవండి : తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు) కరోనాతో తాజాగా 948 మంది మృతి చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శనివారం ఒక్కరోజే గరిష్టంగా 10,55,027 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. -
కరోనా : ఒక్క రోజులో 1,021 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 76,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,973 చేరింది. గడిచిన 24 గంటల్లో 1,021 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 62,550కు చేరింది. వైరస్బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. (చదవండి : తెలంగాణలో కొత్తగా 2,751 కేసులు, 9 మరణాలు) -
భారత్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 61,529 కు చేరింది. గురువారం ఒక్కరోజే 60,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 25,83,948 మంది కరోనా పేషంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్లో 7,42,023 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.90 శాతంగా ఉందని, మొత్తం నమోదైన కేసులలో 1.82 శాతానికి మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా గురువారం 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,94,77,848 చేరిందని వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 కోట్ల మంది కోవిడ్బారిన పడగా 8.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: ‘ఇంటి పనే’ ఇద్దాం!) -
కరోనా: ఒక్కరోజే 1059 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు చేరింది. వైరస్బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. (చదవండి: ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్) -
కరోనా వైరస్ : 1.58 శాతానికి తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిలీ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గకపోయినా మరణాల రేటు తగ్గడం, కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్లో కరోనా వైరస్ మరణాల రేటు 1.58 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6400 మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 22 శాతమే యాక్టివ్ కేసులున్నాయని, రికవరీ రేటు 75 శాతం దాటిందని ఆయన వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో కేవలం 2.7శాతం మందే ఆక్సిజన్ సపోర్ట్తో ఉన్నారని, 1.29 శాతం మంది రోగులు ఐసీయూలో ఉండగా, 0.29 శాతం మంది వెంటిలేటర్పై ఉన్నారని భూషణ్ వెల్లడించారు. ఇక భారత్లో మూడు కోవిడ్-19 వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ రెండో దశ(బీ), మూడో దశ పరీక్షల్లో ఉండగా, భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా వ్యాక్సిన్లు తొలి దశ పరీక్షలను పూర్తిచేశాయని తెలిపారు. బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించని వ్యక్తులే భారత్లో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 3.4 రెట్లు అధికంగా ఉందని అన్నారు. ఒక్కరోజులోనే 66,500 మంది కోవిడ్-19 రోగులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 24.04 లక్షలకు ఎగబాకిందని చెప్పారు. దీంతో రికవరీ రేటు 75.92 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికవరీ రేటు 25 రోజుల్లోనే నూరు శాతం పైగా పెరిగిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. మరోవైపు అన్లాక్ 4.0లో భాగంగా ఈ ఏడాది మార్చి నుంచి నిలిచిపోయిన మెట్రో రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే స్కూళ్లు, కాలేజీలు సహా విద్యా సంస్ధలను ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదు. చదవండి : కోవిడ్-19 షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేం! -
ఒక్కరోజే 61 వేల కేసులు, 836 మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరింది. తాజాగా 836 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కరోనా బాధితుల్లో రికవరీ రేటు 75.27 శాతంగా ఉందని తెలిపింది. (చదవండి: 2020 ఆగష్టు నాటికి వంతెన రెడీ)