![New Parliament Inauguration Ceremony Time Table - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/05/27/parlament-new.jpg.webp?itok=yAtvZ6Ku)
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు.
7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
8.30: ప్రధాని మోదీ లోక్సభ చాంబర్లోకి ప్రవేశిస్తారు.
9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్ను లోక్సభ స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు.
9.30: పార్లమెంట్ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు.
11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు.
12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం.
12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు.
12.17: రెండు షార్ట్ ఫిలింలు ప్రదర్శిస్తారు.
12.38: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు.
1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు.
1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం
2.00: అధికారికంగా వేడుకుల ముగింపు
Comments
Please login to add a commentAdd a comment