పోలవరం ప్రాజెక్టుకు కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ లేదు | There is no component wise ceiling for the Polavaram project | Sakshi

పోలవరం ప్రాజెక్టుకు కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ లేదు

Aug 11 2023 3:37 AM | Updated on Aug 11 2023 3:37 AM

There is no component wise ceiling for the Polavaram project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పోలవ­రం ప్రాజెక్టు వ్యయం రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ ఎత్తివేయడా­నికి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ పేర్కొందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. అంచనా వ్యయం పెరు­గు­దల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీ­ఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిఫారసు మేరకు కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ను సడలించినట్లు చెప్పారు.

ఈమే­రకు ఆయన గురువారం లోక్‌సభ­లో వైఎస్సార్‌సిపీ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. చెల్లింపులకు అర్హమైనప్ప­టికీ కాంపొనెంట్‌వారీ నియంత్రణవల్ల రూ.550.97 కోట్లు అబయె­న్స్‌లో ఉండిపోయా­యని, వాటిని ఇప్పుడు రీయింబర్స్‌ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కృష్ణా ట్రిబ్యునల్‌ –2 గడువు పొడిగింపు
ఏపీ, తెలంగాణల మధ్య నదీ జలాల వివాద పరి­ష్కా­రానికి ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్‌–­2 కాలపరి­మితిని వచ్చే ఏడా­ది మార్చి 31 వరకు పొడిగించి­నట్లు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. ఈ­మేరకు ఆయన వైఎస్సార్‌సీపీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

ఏపీలో 307 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో 355 పబ్లిక్‌ ఈవీ (ఎలక్ట్రికల్‌ వెహి­కల్‌) ఛార్జింగ్‌ పాయింట్లు ఉండగా.. 307 అమలు­లో ఉన్నాయని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వైఎస్సార్‌సీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

గిరిజనుల రక్షణకు చర్యలు
ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో వేలేరు­పా­డు, కుకునూరు, పోలవరం, చింతూరు, ఎటపాక, రంప­చోడవరం మండలా­ల్లోని నదీ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనుల రక్షణకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. గోదావరి ఒడ్డుకు ఎలాంటి విఘాతం కలగకుండా జులై 17న అత్యధికంగా వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు మార్గాని భరత్‌రామ్‌ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

నవంబరు 2024 కల్లా కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి
కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి ప్రాజెక్టు వచ్చే ఏడాది నవంబరుకల్లా పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ..  వైఎస్సార్‌సీపీ సభ్యుడు బాలశౌరి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement