దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర | Uttarakhand Foundation Day Mark The Formation Of The State Of Uttaranchal | Sakshi
Sakshi News home page

దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర

Published Tue, Nov 9 2021 8:55 AM | Last Updated on Tue, Nov 9 2021 10:19 AM

Uttarakhand Foundation Day Mark The Formation Of The State Of Uttaranchal - Sakshi

ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త ఉత్తరాఖండ్‌​ రాష్ట్రంగా ఏర్పడింది. సుదీర్ఘ కాల పోరాటాల కారణంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. పైగా ఈ రాష్ట్రాన్ని "దేవతల భూమి"గా పిలుస్తారు.

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్‌ 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఉత్తరాఖండ్‌వాసులు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ దినోత్సవాన్నిఉత్తరాఖండ్‌ డే  లేదా ఉత్తరాఖండ్‌ ఫౌండేషన్‌ డే లేదా ఉత్తరాఖండ్‌ దివాస్‌గా జరుపుకుంటున్నారు

ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర:
భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో ఆమోదించబడిన తరువాత యునైటెడ్ ప్రావిన్సులు ఉత్తరప్రదేశ్‌గా మారాయి. ఇది ఆ తరువాత భారతదేశ రాష్ట్రంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసుల అంచనాలను అందుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది గానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులకు సరైన జీవనోపాధి అవకాశాలను అందించడం కోసమే  ఉత్తరాఖండ్ క్రాంతి దళం ఏర్పడింది.

అంతేకాదు అక్టోబర్ 2,1994న హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ దళంలోని వ్యక్తులను విజయవంతంగా నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత చివరకు చాలా సుదీర్ఘ కాల పోరాటం తర్వాత ఉత్తరాఖండ్ వంబర్ 9, 2000న ఉత్తరాంచల్‌గా ఏర్పడింది. ఈ మేరకు  ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త  జనవరి1, 2007న ఉత్తరాఖండ్‌గా మారింది.

పైగా 2020 మార్చిలో గైర్‌సైన్‌ని ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా పిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ శీతాకాల రాజధానిగా డెహ్రాడూన్‌ని పిలుస్తారు. ఈ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా "దేవభూమి" అభివర్ణిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు  అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటివి క్షేత్రాలు కొలువుదీరి ఉండటమే. ఈ మేరకు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. పైగా భక్తులు ఈ ఉత్తరాఖండ్‌ యాత్రను చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు.

ఏవిధంగా జరుపకుంటారంటే:
ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  తమ రాష్ట్ర ప్రజల ధైర్యసాహసాలను లేదా వారి ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి వెలికతీసి మంచి అవార్డులతో సత్కరించడం ద్వారా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 2016వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రత్న అవార్డును ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ధైర్యసాహసాలకు చూపిన చాలా మందికి ఈ అవార్డును అందించారు.

2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 2018లో,ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 18వ వార్షిక రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో ఈ వేడుక దాదాపు ఒక వారం పాటు జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో మాత్రం 20వ వార్షిక రాష్ట్ర స్థాపన దినోత్సవ  వేడుకలను కరోనా మహమ్మారికి ముందే ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement