ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే.. | Varanasi Ayodhya Vande Bharat Train To Be Flagged Off By PM Modi Today, Know Its Details Inside - Sakshi
Sakshi News home page

Varanasi Ayodhya Vande Bharat: ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే..

Published Tue, Mar 12 2024 7:47 AM | Last Updated on Tue, Mar 12 2024 10:58 AM

Varanasi Ayodhya Vande Bharat Train to be Flagged Off - Sakshi

అయోధ్యలో నూతన రామాలయం ‍ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు. 

ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్‌’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్‌ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. 

ఈ వందే భారత్ బీహార్‌లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు  వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్‌కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో  చేరుకోగలుగుతారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement