varanasi
-
వారణాసిలో టాలీవుడ్ నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు (ఫోటోలు)
-
వారణాసి : చితా భస్మంతో హోలీ వేడుకలు (చిత్రాలు)
-
‘సహ జీవన’ సంబంధాలకు తగు పరిష్కారం కనుగొనాలి
ప్రయాగ్రాజ్: సమాజం ఆమోదించకున్నా నేటి యువత సహ జీవన సంబంధాలకు మొగ్గు చూపుతోందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో నైతిక విలువలను కాపాడేందుకు తగు పరిష్కారం లేదా నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళతో శారీరక సంబంధం కొనసాగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారణాసి వాసి ఆకాశ్ కేసరి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహ జీవనం వైపు యువతీయువకులు ఆకర్షితులవుతున్నారు. కొన్నాళ్లు కలిసున్నాక ఇష్టం లేకుంటే అతడు లేక ఆమె చాలా సులువుగా ఈ బంధం నుంచి బయటపడేందుకు అవకాశముంది. అందుకే, ఇలాంటి బంధాలకు యువత తొందరగా లొంగిపోతోంది. అందుకే, సమాజంలో నైతిక విలువలను పరిరక్షించేందుకు సహ జీవన సంబంధాలకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన సమయమిదే’అని పేర్కొన్నారు. ఓ మహిళతో ఆకాశ్ కేసరి ఆరేళ్లపాటు సహజీవనం చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడంటూ బాధిత మహిళ సార్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ మహిళ మేజర్ అనీ, అంగీకారంతోనే ఆమె సహజీవనం చేసిందని కేసరి లాయర్ వాదించారు. ఆమెకు కేసరి అబార్షన్ చేయించలేదని, పెళ్లి చేసుకుంటానని అతడు మాట కూడా ఇవ్వలేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసరికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు హారతులతో కూడా మార్పులు చేసింది.జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్(Kashi Vishwanath Dham)లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి, శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.మహాకుంభమేళా.. మహాశివరాత్రి(Mahashivratri)(ఫిబ్రవరి 26)తో ముగియనుంది. ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి 11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది. మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.ఇది కూడా చదవండి: కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత? -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్కీ బాత్లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
మహిళ బర్త్డే కేక్ కటింగ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024 -
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్సైట్ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
బెయిల్పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా మహా హారతి (ఫొటోలు)
-
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు
వారణాసి: ఈ ఏడాది దీపావళి తిధిపై ఉన్న సందేహాలను తొలగిస్తూ, కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్కు చెందిన పండితులు స్పష్టతనిచ్చారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, పలువురు రెండు తేదీలు సూచిస్తున్నారని అన్నారు. కాశీ పండితులు దీపావళి తేదీపై స్పష్టతనిచ్చారని అన్నారు.అక్టోబరు 31న దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ ఒకటిన సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి అమావాస్య ఉంటుంది.ధర్మసింధు, నిర్మాణ సింధుల ప్రకారం రాత్రి అమావాస్య ఉన్నరోజున అంటే అక్టోబర్ 31 రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజలు చేసుకోవాలి. అలాగే దీపోత్సవాన్ని నిర్వహించుకోవాలి. అక్టోబరు 29న ధన్తేరస్, నరక చతుర్దశిని అక్టోబర్ 30 న చేసుకోవాలని అశోక్ ద్వివేది తెలిపారు. కాశీకి చెందిన అన్ని పంచాంగాల ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న దీపావళి వేడుకలు చేసుకోవాలి.ఇది కూడా చదవండి: ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్! -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం
గోరఖ్పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. శనివారం దీన్దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్మెంట్స్లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Independence Day: త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi— Prashant rai (@prashantrai280) August 15, 2024 -
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్ను నమో ఘాట్కు తీసుకువచ్చి, తరువాత రామ్నగర్లోని మల్టీమోడల్ టెర్మినల్కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్యార్డ్లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్నగర్ మల్టీ మోడల్ టెర్మినల్లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్ను ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
గ్రాండ్ వెడ్డింగ్ : పవిత్ర కాశీ నగరంపై నీతా అంబానీ ప్రత్యేక వీడియో, వైరల్
లవ్బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ పవిత్ర వారణాసి నగర గొప్పదనాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్ఎంఏసీసీని స్థాపించిన తమ దార్శనికతకు అనుగుణంగా, తమ కుటుంబంలోని వివాహ వేడుకలకు ముందు పవిత్ర నగరమైన వారణాసికి నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అరుదైన రంగత్ స్వదేశీ బనారసీ చీరలో హుందాగా కనిపించారు.~ Auspicious Beginnings: An Ode to Kashi ~ pic.twitter.com/GXVcIXIeBh— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 12, 2024కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తల్లి, నీతా అంబానీ వారణాసిని సందర్శించి వివాహ తొలి ఆహ్వానాన్ని కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. -
నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం వచ్చే నెల జూలై 12న ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మొదటి ఆహ్వాన లేఖను కాశీ విశ్వేశ్వరునికి అందించి, అక్కడే కొద్దిసేపు గడిపారు. అక్కడ తనకు ఇష్టమైన వారణాసి చాట్ ఆస్వాదించి తర్వాత అక్కడ పేరుగాంచిన లక్క బుటీ బనారసీ చీరలను భారీగా కొనుగోలు చేశారు. వారణాసి ఈ చీరలకు పెట్టింది పేరు కూడా. అక్కడ చేనేత కార్మకుల చేతి నుంచి జాలువారే ఈ చీరల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!నీతా రామ్నగర్ జిల్లాలోని విజయ్ మౌర్య ఇంటిని సందర్శించి ..అక్కడ మరీ కొందరూ బనారసీ కళాకారులను తన హోటల్కి ఆహ్వానించారు. అంతేగాదు తమ వద్ద పెద్ద సంఖ్యలో చీరలు కొనుగోలు చేసినట్లు వస్త్రాల్లో పీహెచ్డీ చేసిన బనారసీ చీరల తయారుదారు అంజికా కుష్వాహా వెల్లడించారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే..లక్క బుటీ బనారసీ చీరల చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది వారణాసి సాంస్కృతిక వారసత్వంలో లోతుగా ముడిపడి ఉన్న చేనేత చీర. ఇక్కడ ఉపయోగించే నేత సాంకేతికత తరతరాల నైపుణ్యం కలిగిన కళాకారుల ద్వారా అందిపుచ్చుకున్న కళా నైపుణ్యం. ఈ చీరలు సాంప్రదాయకంగా స్వచ్ఛమైన పట్టు దారాలను ఉపయోగించి చేతిలో నేసినవి. దీనిపైన ఉండే డిజైన్లు జరీతో రూపొందించినవి. ఈ చీరలోని లక్కబుటి అనే పదం అర్థం ఏంటంటే..చిన్నవైన సున్నితమైన అంశాలను పొందుపరిచేలా ఈ చీరను తీర్చిదిద్దుతారు. బట్టలో చిక్కగా అల్లినవి, మొఘల్ డిజైన్లతో ఆకృతులు రూపొందిస్తారు. ఈ డిజైన్లు కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉండే క్లిష్టమైన పూల నమూనా, ఆకులను కలిగి ఉంటాయి. కాలక్రమేణ బనారసీ చీరలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడవి వివిధ డిజైన్ అంశాలను కలిగి ఉన్నాయి. ఎక్కువగా బ్రోకేడ్ వర్క్, ఎబ్రాయిడరీ వంటి రకరకాల స్టైల్స్లో అందుబాటులో ఉన్నాయి.अनंत की शादी से पहले नीता अंबानी ने की बनारसी साड़ियों की शॉपिंग◆ नीता अंबानी ने कई साड़ियां पसंद कीं#NitaAmbani #AnantAmbani #ViralVideo pic.twitter.com/rSHYHSWmQI— News24 (@news24tvchannel) June 27, 2024 (చదవండి: నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో) -
నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024 కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్లో చాట్ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట. దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి -
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గం అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
గంగమ్మ దత్తత తీసుకుంది
వారణాసి: గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లే కనపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాక మోదీ తొలిసారిగా మంగళవారం వారణాసిలో పర్యటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత రూ.20,000 కోట్లను 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మెహందీగంజ్లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్లో మాట్లాడుతూ ‘వారణాసి ప్రజలు మూడోసారి నన్ను ఎంపీగానే కాదు ప్రధానిగానూ ఎన్నుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇదివరకెప్పుడూ చూడని తీర్పునిచ్చారు.చరిత్ర సృష్టించారు’ అని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం రైతులకు, పేదలకు సంబంధించినదని అన్నారు. వికసిత్ భారత్కు.. రైతులు, మహిళలు, యువత, పేదలు గట్టి మూలస్తంభాలుగా తాను పరిగణిస్తానన్నారు. ’విశ్వనాథుడు, గంగా మాత ఆశీస్సులు, కాశీ ప్రజల ఆపార ప్రేమతో మూడోసారి దేశానికి ప్రధాన సేవకుడిని అయ్యే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడోసారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకొని కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.ఇప్పుడు గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్లే కనపడుతోంది. నేనిక్కడి వాడిని అయిపోయాను’ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఎన్నికకావడం అరుదని, భారత్ ప్రజలు దీన్ని చేసి చూపించారని ప్రధాని అన్నారు. భారత్లో 60 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందన్నారు. ‘యువత ఆకాంక్షలు, ప్రజల కలలు ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మరో అవకాశం రావడం ఘన విజయం. ప్రజల విశ్వాసానికి ప్రతీక’ అని మోదీ అన్నారు.ప్రతి డైనింగ్ టేబుల్పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ రైతులనుద్దేశించి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్ గురించి ఆలోచించాలి. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఎదగాలి. బనారస్ లంగ్డా మామిడి, జౌన్పూర్ రాడిష్ రకం, గాజిపూర్ లేడీ ఫింగర్ రకం.. తదితరాలు నేడు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి చొరవతో, జిల్లా స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల హబ్ల ఏర్పాటుతో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్లో భారత్ను మనమిప్పుడు కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’ అని మోదీ పేర్కొన్నారు. -
రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
వారణాసి: పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని.. వారణాసి కేంద్రంగా ఈ హామీని అమలు చేశారు.ఏడాదికి మూడు దశల్లో రూ.6 వేల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.20 వేల కోట్ల సాయం ఈ పథకం ద్వారా అందనుంది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. -
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
ప్రియాంక పోటీచేస్తే ప్రధాని ఓడేవారు
రాయ్బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్లో ఎన్డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు. అవధ్ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంకఅమేథీ, రాయ్బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్కేకాదు యావత్భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఈనెల 18న వారణాసికి మోదీ.. రైతుల సదస్సుకు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరగబోయే 'కిసాన్ సమ్మేళన్'లో (రైతుల సదస్సు) మోదీ ప్రసంగించనున్నారు. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ.. వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.మోదీ పర్యటనపై స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వారణాసిలోని రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గులాబ్బాగ్లోని పార్టీ కార్యాలయంలో మహానగర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.వారణాసిలో ఒకరోజు పర్యటన సందర్భంగా దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని, అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కాశీకి చెందిన బీజేపీ అధికారి దిలీప్ పటేల్ తెలిపారు. వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలందరికి పిలుపునిచ్చారు. రైతు సదస్సుకు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్పై 1.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరుగుతున్న 57 లోక్సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్ సీట్లపై ఫోకస్... వారణాసి... మోదీ మేజిక్ కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ విజయం సాధించారు.హమీర్పూర్.. అనురాగ్ విన్నింగ్ షాట్!ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్కుమార్ ధుమాల్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనసాగిస్తున్నారు. రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్ నుంచి సత్పాల్ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్పూర్ లోక్సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.మండీ... కింగ్ వర్సెస్ క్వీన్ ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ గెలిచి కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్ లోకల్ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.డైమండ్ హార్బర్... అభిషేక్ హవా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్కు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్ హ్యాట్రిక్ కొడతారా, డైమండ్ హార్బర్పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.పట్నా సాహిబ్... రవిశంకర్కు సవాల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్ షాట్గన్ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అవిజిత్ నుంచి రవిశంకర్ ప్రసాద్కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్ లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాంగ్రెస్తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపే చివరి విడత పోలింగ్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రముఖుల స్థానాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. -
ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు
ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్ మీద బాంబ్ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024 -
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!
ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్... గోరఖ్పూర్... భోజ్పురీ వార్ సుప్రసిద్ధ గోరఖ్నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్పురి నటుడు రవికిషన్ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్ ఫైట్ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్గంజ్, గోరఖ్పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్గంజ్ (ఎస్సీ)– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు
ఈరోజు (గురువారం) బుద్ధ పూర్ణిమ. ఈ సందర్భంగా వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్లలో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees take holy dip in Haridwar on the occasion of Buddha Purnima. pic.twitter.com/iV42mC9UfV— ANI (@ANI) May 23, 2024భక్తులకు భద్రత కల్పించేందుకు వివిధ గంగా ఘాట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. యూపీలోని వారణాసిలోని అన్ని ఘాట్లు భక్తులతో నిండిపోయాయి.మనదేశంలో బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మనిషికి మోక్షం లభిస్తుందని చెబుతారు.#WATCH | Prayagraj, UP: Devotees take holy dip and offer prayers at the confluence of River Ganga and River Yamuna on the occasion of Buddha Purnima. pic.twitter.com/pA7OGIg057— ANI (@ANI) May 23, 2024ఇంతేకాకుండా ఈ రోజున స్నానం చేయడం వల్ల మనిషి మనసు, శరీరం రెండూ పవిత్రంగా మారుతాయని నమ్ముతారు. ఈ రోజున గంగాస్నానం చేసి, పూర్వీకులకు తర్పణం పెడితే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అంటారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. గౌతమ బుద్ధుడిని విష్ణువుకు తొమ్మదవ అవతారంగా భావిస్తారు.#WATCH | Varanasi, UP: Devotees take holy dip in Ganga River on the occasion of Buddha Purnima. pic.twitter.com/FQ0lQ76Mwu— ANI (@ANI) May 23, 2024 -
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
వారణాసిలో వార్ వన్ సైడే
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశలో జూన్ 1న పోలింగ్ జరుగనున్న వారణాసిలో వార్ వన్ సైడే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం ప్రధాని మోదీకే పడటం ఖాయమన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసిలో మోదీ విజయం ఖాయమని, అయితే దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. తెలుగు ఓటర్ల పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని శ్రీరామ తారక ఆంధ్రాఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వి.వి.సుందర శాస్త్రిని కోరారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత పాల్గొన్నారు. -
ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
దేశంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు ఎండ వేడిమి జనాలకు చెమటలు పట్టిస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మోదీ కూలర్కు డిమాండ్ ఏర్పడింది.వారణాసిలోకి చెందిన ఎలక్ట్రీషియన్ రాకేష్ గుప్తాకు ‘మోదీ కూలర్’ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో అతను వివిధ పరికరాలతో మోదీ కూలర్ తయారుచేసి షాపు ముందు ఉంచాడు. దీనిని చూసిన వినియోగదారులు మోదీ కూలర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాను రూపొందించిన కూలర్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాకేష్ గుప్తా తెలిపారు. ఈ కూలర్ కోసం ఎవరైనా ఆర్డర్ ఇస్తే మూడు నాలుగు రోజుల్లో తయారు చేసి, వారికి అందజేస్తున్నానని ఆయన తెలిపారు.వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో చివరి దశలో అంటే జూన్ ఒకటిన పోలిగ్ జరగనుంది. ఈ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోదీ సహా మొత్తం ఏడుగురు ప్రధాన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ఎన్నికల బరిలో ఉన్నారు. -
మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..
-
మోదీపై పోటీ: రామ్కుమార్ ప్రత్యేకత ఏంటంటే..
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో ఓ వృద్ధుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు రామ్కుమార్ వైద్య. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా ఇందర్ఘడ్ వాసి. చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటాడు. మోదీపై పోటీతో మాత్రమే కాదు.. నామినేషన్ టైంలోనూ ఆయన వార్తల్లోకి ఎక్కారు. వారణాసిలో పోటీ కోసం రూ.25,000 రూపాయి నాణేలు డిపాజిట్ చేసి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చురాన్ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి వాటినే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని చూసి వాళ్లు కంగు తిన్నారు. కిందామీదా పడి నాణేలను లెక్కించారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు వైద్య 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వారణాసి వచ్చాడు. ఆయనకు ప్రతిపాదకులుగా వారణాసిలోని కొందరు ఆటోడ్రైవర్లు సంతకాలు చేశారు. ఎన్నికల బరిలో దిగడం ఆయనకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం బరిలో దిగుతున్న పార్లమెంట్ స్థానాన్ని మార్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకే తాను అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. ప్రధాని అయినా సరే, మోదీకి గట్టి పోటీ ఇస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తుండటం విశేషం. మిమిక్రీ సంచలనం, ప్రముఖ హాస్య కళాకారుడు శ్యామ్ రంగీలా కూడా వారణాసిలో మోదీపై ఇండిపెండెంట్గా బరిలో దిగడం తెలిసిందే. కానీ ఆయన నామినేషన్ బుధవారం తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పట్లాగే అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. వారణాసిలో జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
కాశీగా పేరొందిన వారణాసి మహా శివుని ఆవాసమని అంటారు. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఈ నగరంలో నిరంతరం శివనామస్మరణ మారుమోగుతుంటుంది. మోక్షదాయినిగా భావించే గంగా నది ఒడ్డున నిర్మించిన మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్తో సహా 80 ఘాట్లు ఇక్కడున్నాయి.అయితే వారణాసికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. ఈ నగరం గత పదేళ్లుగా భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం. వారణాసి లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ప్రధాని మోదీ మరోమారు ఇక్కడి నుంచే తన నామినేషన్ దాఖలు చేశారు. 2014లో తొలిసారిగా ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రధాని మోదీ గంగానదికి తల వంచి నమస్కరించారు. తనకు కాశీతో గాఢమైన అనుబంధం ఉందని, ఈ నగరాన్ని తన తల్లిలా భావిస్తానని, గంగామాత తనను ఇక్కడికి పిలిచిందని ప్రధాని మోదీ చెబుతుంటారు.2014లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై 371,784 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు నరేంద్ర మోదీకి 581,022 ఓట్లు రాగా, అరవింద్ కేజ్రీవాల్కి 209,238 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. అజయ్రాయ్ ఇప్పుడు తిరిగి వారణాసి లోక్సభకు పోటీ చేస్తున్నారు.ఠాకూర్ రఘునాథ్ సింగ్ వారణాసి నుంచి ఎంపికైన తొలి ఎంపీ. ఆయన 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 1957, 1962లో కూడా ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన సత్యనారాయణ సింగ్ ఈ స్థానంలో గెలిచారు. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన రాజారాం శాస్త్రి, 1977లో జనతా పార్టీకి చెందిన చంద్రశేఖర్, 1980, 1984లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలపతి త్రిపాఠి, 1989లో జనతాదళ్కు చెందిన అనిల్ శాస్త్రి ఈ స్థానం నుంచి గెలిచి ఎంపీలు అయ్యారు.భారతీయ జనతా పార్టీ 1991, 1996, 1998, 1999 సంవత్సరాల్లో వరుసగా నాలుగు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2004లో ఈ సీటును కాంగ్రెస్ గెలుపొందగా, 2009 నుంచి 2019 వరకు బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. 2009లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఎంపీ అయ్యారు. -
నామినేషన్కు ముందు వారణాసిలో పీఎం మోదీ ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)
-
2019లో ప్రధాని మోదీకి ఎదురు నిలిచి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ప్రధాని అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులతో తలపడ్డారు.నాడు ప్రధాని మోదీతో పోటీపడిన 25 మంది అభ్యర్థుల్లో 22 మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. నాడు సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్కు ఒక లక్షా 95 వేల 159 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో ఇవి 18.40 శాతం. మూడో స్థానంలో కాంగ్రెస్కు చెందిన అజయ్రాయ్కు 14.38శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఖాతాలో లక్షా 52 వేల 548 ఓట్లు పడ్డాయి.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి 4 లక్షల 79 వేల 505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో తొలిసారిగా వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాడు కాంగ్రెస్ తరఫున అజయ్రాయ్, సమాజ్వాదీ పార్టీ నుంచి కైలాష్ చౌరాసియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అజయ్ రాయ్కు 75 వేల 614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియాకు 45 వేల 291 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన విజయ్ ప్రకాశ్ జైస్వాల్కు 60 వేల 579 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచి రెండు లక్షల, తొమ్మిది వేల 238 ఓట్లు దక్కించుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీకి ఐదు లక్షల ఒక వేయి 22 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 56.37 శాతం. నాడు మోదీ మూడు లక్షల 71 వేల 784 ఓట్ల తేడాతో విజయం సాధించారు.నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ గత విజయాలను అధిగమిస్తారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ మరోసారి అజయ్ రాయ్కు అవకాశం కల్పించగా, ఆయనకు సమాజ్వాదీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. -
వారణాసిలో ఏ వర్గంవారు ఎందరు? బీజేపీ ఎన్నిసార్లు గెలిచింది?
యూపీలోని వారణాసి లోక్సభ ఎన్నికల పోరులో మరోసారి బరిలోకి దిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ స్థానం నుంచి నేడు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల విజయాల కంటే ఈసారి మోదీ భారీ విజయాన్ని నమోదు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారణాసిలో ఏ వర్గంవారు అధిక సంఖ్యలో ఉన్నారు? ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ఏ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది?దేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన వారణాసి లోక్సభ స్థానం ఐదు అసెంబ్లీ స్థానాల కలయిక. అవి వారణాసి సౌత్ సిటీ, వారణాసి నార్త్, వారణాసి కాంట్, రోహనియా, సేవాపురి. 1957 నుంచి ఈ సీటును బీజేపీ ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు దక్కించుకున్నాయి. 1991 నుంచి 2003 మధ్యకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సీటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతికి చిక్కింది. 2009 నుంచి ఈ సీటును బీజేపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది.వారణాసి నియోజక వర్గంలో మొత్తం 19.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 లక్షల 65 వేల 485 మంది పురుషులు, 8 లక్షల 97 వేల 328 మంది మహిళలు. వారణాసిలో 135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 52 వేల 174 మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వారణాసి లోక్సభ స్థానంలో మొత్తం జనాభాలో 75 శాతం మంది హిందువులు, 20 శాతం ముస్లింలు. మిగిలిన ఐదు శాతం జనాభాలో ఇతర మతాలకు చెందిన వారున్నారు. ఈ నియోజకవర్గంలో 65 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో, 35 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 10.01 శాతం గిరిజనులు , 0.7 శాతం దళిత తరగతికి చెందినవారున్నారు.ఈ నియోజక వర్గంలో గరిష్టంగా రెండు లక్షల మంది ఓటర్లు కుర్మీ సామాజికవర్గానికి చెందినవారున్నారు. వీరు రోహనియా, సేవాపురి ప్రాంతాలలో ఉన్నారు. ఈ స్థానంలో రెండు లక్షల మంది వైశ్య ఓటర్లు కూడా ఉన్నారు. వారు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నారు. కుర్మీ, వైశ్య వర్గం తర్వాత బ్రాహ్మణ, భూమిహార్ ఓటర్లు కూడా వారణాసిలో అత్యధికులు ఉన్నారు. ఈ సీటుపై ఎన్నికల విజయ పతాకాన్ని ఎగురవేసే శక్తి యాదవ, ముస్లిం వర్గాల ఓట్లకు కూడా ఉంది. ఈ స్థానంలో యాదవ సామాజికవర్గానికి లక్ష ఓట్లు ఉన్నాయి. యాదవ ఓటర్లు కాకుండా ఈ స్థానంలో మొత్తం మూడు లక్షల మంది ఓటర్లు ఓబీసీ వర్గానికి చెందినవారున్నారు. -
Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎంలకు ఆహా్వనాలు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి (ఉత్తరప్రదేశ్), నితీశ్ కుమార్ (బిహార్), పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్గఢ్ ), ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హరియాణా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర) ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. -
Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు! రాజస్తాన్లోని శ్రీగంగానగర్కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్కు దాదాపు కోటిమంది సబ్స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు... ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇటీవల సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...? నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి? 2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. వారణాసిలో ప్రచారమెలా ఉంది? బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు. మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా? కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి. ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా? తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచార స్పీడ్ పెంచుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము సైతం అంటూ.. ప్రధాని పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘ నేను వారణాసి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు. ఎప్పుడైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారు’’ అని శ్యామ్ రంగీలా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా సంతోషంగా ఉంది. నేను నా వీడియోల ద్వారా నామినేషన్కు సంబంధించిన విషయాలు పంచుకుంటా’’ అని అన్నారు.वाराणसी से चुनाव लड़ने के ऐलान के बाद आप सबसे मिल रहे प्रेम से मैं उत्साहित हूँ, वाराणसी पहुँचने और नामांकन और चुनाव लड़ने को लेकर जल्द ही वीडियो के माध्यम से अपने विचार आप सबके सामने रखूँगावन्दे मातरम् - जय हिन्द #ShyamRangeelaforVaranasi #election— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024 ‘‘2014లో నేను ప్రధాని మోదీ ఫాలోవర్ను.నేను మోదీకి మద్దతుగా వీడియోలు చేశాను. అదేవిధంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశాను. ఆ సమయంలోనే మరో 70 ఏళ్లు బీజేపీ ఓటు వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. నేను ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ఎంపీగా పోటీ చేస్తున్నా. నేను వారం రోజుల్లో వారణాసికి వేళ్లి నామినేషన్ ఫైల్ చేస్తాను’’ అని కమెడియన్ శ్యామ్ రంగీలా తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్రాయ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
వారణాసిలో మోదీ ప్రత్యర్థి.. ఎవరీ 'అథర్ జమాల్ లారీ'?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి 'అథర్ జమాల్ లారీ'ని రంగంలోకి దించారు. ఇంతకీ అథర్ జమాల్ లారీ ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. వారణాసిలో జూన్ 1న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వారణాసి నరేంద్ర మోదీకి కంచుకోట. ఇప్పటికే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోమారు వారణాసి నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అథర్ జమాల్ లారీ (Athar Jamal Lari) ఎవరు? అథర్ జమాల్ లారీ వారణాసికి చెందిన స్థానిక వ్యక్తి. ఈయన 1980 నుంచి రాజీకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్న అథర్ జమాల్.. ఇంతకు ముందు జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, అప్నా దళ్, క్వామీ ఏక్తా దళ్తో సహా అనేక రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. లారీ గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండుసార్లు లోక్సభ ఎన్నికల్లో విఫలమయ్యారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి అథర్ జమాల్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1984లో మొదటిసారి యూపీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యామ్లాల్ యాదవ్ విజయం సాధించగా.. లారీ 50329 ఓట్లను పొందారు. 2004 లోక్సభ ఎన్నికలలో వారణాసిలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పుడు కూడా గెలువలేకపోయారు. 93228 ఓట్లతో మూడోస్ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా ఈ స్థానంలో గెలుపొందారు. 1991, 1993లో జనతాదళ్ టిక్కెట్పై వారణాసి కాంట్ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లారీ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి మద్దతు ఆశించి వారణాసి స్థానంలో లారీని బీఎస్పీ రంగంలోకి దింపిందని పలువురు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇదే అంచనాలతో మాయావతి 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషిపై.. ముఖ్తార్ అన్సారీని రంగంలోకి దించారు. కానీ గెలుపొందలేకపోయారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు ఎవరివనేది తెలుస్తుంది. Uttar Pradesh: BSP announced the names of 11 more candidates for Lok Sabha elections The Mainpuri Lok Sabha ticket has been changed and given to Shiv Prasad Yadav. Athar Jamal Lari has been fielded from Varanasi against PM Modi. pic.twitter.com/qSGERi22ik — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2024 -
ప్రధాని మోదీపై పోటీకి దిగిన హేమాంగీ సఖి ఎవరు?
వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీకి దిగడంతో అతని ప్రత్యర్థులెవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖిల భారత హిందూ మహాసభ టిక్కెట్పై మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా నిలిచారు. అఖిల భారత హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ యూనిట్ రాష్ట్రంలోని 20 లోక్సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీనిలో భాగంగా వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ఎన్నికల బరిలోకి దిగారు. హేమాంగీ సఖి తాను ట్రాన్స్జెండర్ల హక్కుల సాధన కోసం ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీలలో ట్రాన్స్జెండర్లకు సీట్లు కేటాయించాలని హేమాంగీ సఖి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన హేమాంగీ సఖి.. నేటికీ ట్రాన్జెండర్లు భిక్షాటన చేయడం ద్వారా పొట్టపోసుకుంటున్నారని, ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదని వాపోయారు. తాను కాశీలోని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. హేమాంగీ సఖి భాగవత కథను పంజాబీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ మొదలైన భాషలలో వివరిస్తారు. భారతదేశంతో పాటు బ్యాంకాక్, సింగపూర్, మారిషస్ మొదలైన దేశాలలో హేమాంగీ సఖి భాగవత కథను వినిపించారు. ట్రాన్స్జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి తల్లి పంజాబీ. తండ్రి గుజరాతీ. హేమాంగీ సఖి తన బాల్యాన్ని మహారాష్ట్రలో గడిపారు. తల్లిదండ్రులు మరణించాక హేమాంగీ సఖి బృందావనం చేరుకుని, అక్కడ పలు గ్రంథాలను అధ్యయనం చేశారు. కాగా వారణాసి లోక్సభ స్థానానికి ఏడో దశలో అంటే చివరి దశలో ఓటింగ్ జరగనుంది. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. -
Kashi Vishwanath Temple: వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్కోడ్గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్కోడ్ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. -
ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్జెండర్ గురించి తెలుసా?
లక్నో: ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 20 లోక్సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గీతా బోధకురాలు హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019లో పట్టాభిషేకం 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. -
Priyanka Singh: బటర్ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్ది ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
ప్రధాని మోదీ ప్రత్యర్థి రాయ్ బలాబలాలేమిటి?
2024 లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్రాయ్ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. వారణాసి నుంచి తనకు అవకాశం కల్పించినందుకు రాయ్ కాంగ్రెస్ హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుండి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014లో అజయ్రాయ్కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై 5,05,408 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ 1,52,548 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన 5,22,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అజయ్ రాయ్ 1996, 2002, 2007లలో వారణాసిలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో బీజేపీని వీడిన అజయ్ రాయ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉపఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2012లో వారణాసిలోని పింద్రా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అప్పుడు కూడా గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2017, 2022లో వారణాసిలోని పింద్రా స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే ఈ రెండు సార్లూ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అజయ్ రాయ్ ఘాజీపూర్ జిల్లాకు చెందిన భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారణాసిలో స్థిరపడ్డారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ నుండి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వారణాసి నుంచి లోక్సభ టిక్కెట్ రాలేదనే కారణంతో అజయ్ రాయ్ బీజేపీని వీడారు. అయితే ఆయనకు బీజేపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. అజయ్ రాయ్పై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పూర్వాంచల్లోని పేరుమోసిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, అతని అనుచరులు 1994లో అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ను కాల్చి చంపారు. అప్పటి నుంచి అజయ్రాయ్, అన్సారీ కుటుంబీకుల మధ్య శత్రుత్వం కొనసాగుతోందని అంటారు. -
ప్రధాని మోదీ దత్తత గ్రామం ఇప్పుడెలావుంది?
కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నాడు ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద ఎంపీలంతా తమ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ యూపీలోని సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలోగల జయపూర్ గ్రామాన్ని పదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ పదేళ్లలో ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో ఇక్కడ బ్యాంకులు, రోడ్లు ఉండేవి కావని, ఇప్పుడు గ్రామంలో కాంక్రీట్ రోడ్లు కూడా ఏర్పడ్డాయని, బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయని అన్నారు. గ్రామంలో జల్ నిగం ఏర్పాటైన తర్వాత ఇంటింటికి పైపులైన్ ద్వారా నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని, ఉజ్వల పథకం కింద పలువురు లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లు పొందారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. గ్రామానికి చెందిన మరో యువకుడు అరుణ్కుమార్ మాట్లాడుతూ జయపూర్ గ్రామంలో రెండు బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసు తెరుచుకున్నాయన్నారు. రోడ్ల నిర్మాణం, నీటి వసతి ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు నోచుకున్నాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలని అన్నారు. గ్రామానికి చెందిన మహిళ ధర్మశీల మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తమకు ఉపాధి అవకాశాలు వచ్చాయని, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతున్నామన్నారు. ఇంతకు ముందు గ్రామ శివార్లలోని బావి నుంచి నీటిని తెచ్చుకునేవారమని, ఇప్పుడు ఇంట్లోనే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాని మోదీ దత్తత తీసుకున్న ఈ జయపూర్ గ్రామ జనాభా సుమారు 3,100. ఈ గ్రామంలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉన్నారు. వారణాసి రైల్వే స్టేషన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు. ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వందే భారత్ బీహార్లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో చేరుకోగలుగుతారు. -
Lok Sabha elections 2024: వారణాసి నుంచే... మళ్లీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ లోక్సభ సమర శంఖం పూరించింది. విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో ఉండగానే, ఎన్నికల షెడ్యూలైనా రాకముందే ఏకంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది! ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేయనున్నారు. ఈసారి మరింత బంపర్ మెజారిటీతో ఆయన ఘనవిజయం సాధిస్తారని తావ్డే ధీమా వెలిబుచ్చారు. పలు రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోయి ఎన్డీఏ కూటమిని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా జాబితాను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ఇక గుజరాత్లోని గాం«దీనగర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, రాజస్థాన్లోని కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బరిలో దిగుతున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో 2019లో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాం«దీని మట్టికరిపించి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అప్పట్లో రెండుచోట్ల పోటీ చేసిన రాహుల్ వాయనాడ్ నుంచి నెగ్గారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. మన్సుఖ్ మాండవీయ (పోరుబందర్), భూపీందర్ యాదవ్ (ఆళ్వార్), శర్బానంద సోనోవాల్ (దిబ్రూగఢ్), గజేంద్రసింగ్ షెకావత్ (జోధ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్), కిరణ్ రిజిజు (అరుణాచల్ వెస్ట్), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), అర్జున్ ముండా (కుంతీ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ) తదితరులు వీరిలో ఉన్నారు. టికెట్ దక్కిన మంత్రుల్లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు కావడం విశేషం. తొలి జాబితాలోనే ఏకంగా మూడో వంతుకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీజేపీ దూకుడు కనబరచడమే గాక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీలో నలుగురి మార్పు దేశ రాజధాని ఢిల్లీని ఈసారి బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్కడి ఏడు లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈసారి కూడా ఏ అవకాశమూ ఇవ్వొద్దని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో భాగంగా ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఏకంగా నాలుగింట సిట్టింగులను పక్కన పెట్టడం విశేషం! వారిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పరేశ్ వర్మతో పాటు బీఎస్పీ ఎంపీపై మతపరమైన వ్యాఖ్యలతో పెను వివాదానికి తెర తీసిన రమేశ్ బిధూరి ఉన్నారు. మనోజ్ తివారీ మాత్రమే ఈశాన్య ఢిల్లీ నుంచి మళ్లీ బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి లేఖి బదులుగా దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాసురీ పోటీ చేయనుండటం విశేషం. ఇక భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్లకు మొండిచేయి చూపారు. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ దక్కింది. మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీకి కూడా టికెట్ దక్కలేదు. పుష్కలంగా గ్లామర్ సినీ నటులకు తొలి జాబితాలో బాగానే చోటు దక్కింది. భోజ్పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ పశి్చమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి బరిలో దిగుతున్నారు. సిట్టింగులు హేమమాలిని (మథుర), రవికిషన్, మహేశ్శర్మ, బఘేల్, సాక్షి మహారాజ్కు చాన్స్ దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలు బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ విదిశ స్థానం నుంచి లోక్సభ బరిలో దిగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘనవిజయం సాధించినా అధినాయకత్వం ఆయన్ను సీఎంగా కొనసాగించలేదు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్దేవ్ త్రిపుర వెస్ట్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఖేరి నుంచి మళ్లీ అవకాశమివ్వడం విశేషం. ఆయన కుమారుడు ఆశిష్పై 2021లో యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కారు పోనిచ్చి నలుగురిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపణలున్నాయి. యూపీ నుంచి 51 మంది బీజేపీకి అత్యంతకీలకమైన ఉత్తరప్రదేశ్కు తొలి జాబితాలో అగ్రతాంబూలం దక్కింది. 195లో యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గింది. మధ్యప్రదేశ్లో 24, పశి్చమ బెంగాల్లో 20, గుజరాత్, రాజస్తాన్ల నుంచి 15 చొప్పున, కేరళ నుంచి 12, అసోం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి 11 చొప్పున, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్ప్రదేశ్, జమ్మూ కశీ్మర్ నుంచి రెండేసి సీట్లతో పాటు గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ స్థానాలకు కూడా అభ్యర్థుల వెల్లడి జరిగింది. 195 మందిలో 28 మంది మహిళలు, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు స్థానం లభించింది. 47 స్థానాల్లో 50 ఏళ్ల లోపువారికి అవకాశం కల్పించారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... తొలి జాబితా రూపకల్పన కోసం బీజేపీ భారీ కసరత్తే చేసింది. ప్రకటనకు ముందు గురువారం రాత్రి పొద్దుపోయేదాకా మోదీ సారథ్యంలో అగ్ర నాయకత్వం సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపింది. సిట్టింగుల పనితీరుపై నిశిత పరిశీలన, కొంతకాలంగా జరిపిన పలు లోతైన సర్వేలతో పాటు నమో యాప్ తదితర వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన 195 స్థానాల్లో 155 చోట్ల 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఆ 155 మంది సిట్టింగుల్లో ఏకంగా 20 శాతం మందికి ఈసారి టికెట్లివ్వకపోవడం విశేషం! ఈసారి లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
లక్నో: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్లోని వ్యాస్ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇదీ చదవండి.. యోగి బాటలో థామి సర్కారు -
PM Narendra Modi: ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు. అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు. నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు. ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్ విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీపై వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
లక్నో: వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు. ‘వాళ్లు నరేంద్ర మోదీని దశాబ్దాలుగా దూషిస్తున్నారు. కానీ ప్రస్తుతం వాళ్లు తమ అసహనాన్ని ప్రజల మీద చూపిస్తున్నారు. వాళ్లు కనీసం తెలివి లేకుండా ఉత్తరప్రదేశ్ యువతను మద్యం బానిసలు అంటూ నిందిస్తున్నారు. వారణాసి యువతపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న సమయంలో వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ‘ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు(రాహుల్ గాంధీ) యూపీ యువతను మద్యం బానిసలు అన్నారు. ఇదేం భాష. ఇండియా కూటమి యూపీ యువతను అవమానించిన తీరును ఎవరూ మర్చిపోరు. వారసత్వంగా వచ్చి ఆ వ్యక్తి(రాహుల్ గాంధీ) దేశంలోని సామాన్య ప్రజలకు ప్రమాదకారి. తెలివిలేనివారు మాత్రమే నా వారణాసి యువతను మద్యం బానిసలు అని పిలుస్తారు. ...వాళ్లు కేవలం తమను పొగిడే వాళ్లనే ఇష్టపడతారు. రామ మందిరం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి యూపీ ప్రజలను ఇష్టపడటం లేదు. నాకు అస్సలు అర్థం కావటం లేదు.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాముడిపై అంత ద్వేషం పెంచుకుంటుందో?. వాళ్లు తమ కుటుంబం, ఓటు బ్యాంకును తప్ప ఏమి చూడరు’అని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
టార్గెట్ రాహుల్.. సోనియాకు స్మృతి ఇరానీ చురకలు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం తన మాజీ నియోజకవర్గం అమేథీలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాత్రిపూట మద్యం సేవించే వారితో ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు నృత్యం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులు కనిపించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి వెళ్లిన తనకు రాత్రిపూట వాయిద్యాలు మోగించడం.. మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానని అన్నారు. అయితే రామ మందిరంలో ప్రధాని మోదీ, అంబానీ, అదానీలతోపాటు భారతదేశంలోని కోటీశ్వరులందరు ఉంటారు కానీ ఒక్క వెనుకబడిన లేదా దళిత వ్యక్తి కూడా కనిపించడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్పై రాహుల్గాంధీ మనసులో ఎంత విషం ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. వాయనాడ్లోనూ ఉత్తరప్రదేశ్ ఓటర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అయోధ్య రామాలయంలో జరిగే 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమానికి ఆహ్వానాన్నిఆయన తిరస్కరించారని,, నేడు వారణాసి ఉత్తరప్రదేశ్ యువత గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ఢిల్లీ, పుణెలో రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది? కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని కానీ ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. తన కొడుకును మంచిగా పెంచలేకపోతే కనీసం అతన్ని పిచ్చిపిచ్చిగా మాట్లాడకుండా ఉండమని చెప్పాలంటూ సోనియాగాంధీకి చురకలంటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా, కేరళలోని వయనాడ్లో గెలిచారు. -
జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య వారణాసిలో పర్యటించనున్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి దోహదపడే అమూల్ ప్లాంట్కు ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 23న ఆయన ప్రారంభించనున్నారు. వారణాసిలోని కార్ఖియాగావ్లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రధాని మోదీ ఎన్నికల సైరన్ మోగించనున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనం తరలివస్తారని అంచనా. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశ్వనాథ ఆలయంలో బాబా భోలేనాథ్ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్లోని నేలమాళిగను పూజల కోసం తెరిచారు. అప్పటి నుంచి సామాన్య భక్తుల దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. -
కాశీలో హిందువుగా మారిన రష్యన్ మహిళ
విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు. వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు. అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు. -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ
ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి.. ఆరోజున ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అలాగే గోవర్ధన్లో సంత్ రివిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కాశీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పంచగంగా ఘాట్ వద్దనున్న బిందుమాధవ్ ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నాయి. శైవ-వైష్ణవ ఐక్యతకు పునాదిగా నిలిచే ఈ ఆలయం విస్తరణ, అభివృద్ధి దిశగా ప్రధాని యోచిస్తున్నారని సమాచారం. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
Gyanvapi: జ్ఞానవాపిలో 30 ఏళ్ల తర్వాత మొదలైన పూజలు
-
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్ఫారమ్ కింద, ప్లాట్ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్ఫారమ్కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్ఫారమ్కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
జ్ఞానవాపి కేసులో హిందువులకు అతిపెద్ద విజయం
-
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. 'జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసేందుకు హిందు పక్షం వారికి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగా ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణ మోహన్ పాండ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జ్ఞానవాపిలోను నేలమాళిగ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించింది.' అని హిందువుల తరుపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్మెంట్కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఇటీవల నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు? -
హిందువులకు అప్పగించండి: వీహెచ్పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు!
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెన్ట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ‘ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది. ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి’అని నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాసి మసీదు సముదాయాన్ని హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావ డం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
దేశవ్యాపంగా సంక్రాంతి సందడి
ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 వారణాసిలోని గంగా ఘాట్కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు. #WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. #WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9 — ANI (@ANI) January 15, 2024 ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 -
వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం
నూతన సంవత్సరం(2024)తొలి రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలోని వృద్ధులకు నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం తరపున ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్లోనూ వృద్ధులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లే పథకాన్ని ప్రారంభించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు తీర్థయాత్ర పథకాన్ని ప్రారంభించిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. వృద్ధులు బస్సులు, రైళ్ల ద్వారా ఉచితంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు తాజాగా పంజాబ్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం భగవంత్ మాన్ యాత్రికుల కోసం చార్టర్డ్ విమానాలను బుక్ చేశారు. ఫలితంగా ఆర్థిక స్థోమత లేని వృద్ధులు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి పాట్నా సాహిబ్, వారణాసి, నాందేడ్ సాహిబ్లను సందర్శించే అవకాశం కలిగింది. -
కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు. మెటల్ క్రాఫ్ట్లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు -
జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు
ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్పై దాఖలైన పిటిషన్కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
Narendra Modi: బానిస మనస్తత్వం నుంచి విముక్తి
వారణాసి: బానిస మనస్తత్వం నుంచి భారత్ విముక్తిని ప్రకటించుకుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బానిసత్వంలో మగ్గుతున్న సమయంలో కుట్రదారులు మన దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయతి్నంచారని, మన సాంస్కృతిక చిహా్నలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ చిహా్నలను పునర్నిర్మించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్ను ప్రధాని మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారని చెప్పారు. ఇలాంటి ఆలోచనా విధానం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిందన్నారు. దీనివల్ల దేశం ఆత్మన్యూనత భావంలోకి జారిపోయిందని, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం పట్ల గరి్వంచడం కూడా మర్చిపోయిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాల తర్వాత కాలచక్రం మరోసారి తిరగబడిందని, బానిస మనస్తత్వం నుంచి విముక్తిని ఎర్రకోటపై నుంచి భారత్ ప్రకటించుకుందని స్పష్టం చేశారు. సోమనాథ్ నుంచి ప్రారంభించిన కార్యాచరణ ఇప్పుడొక ఉద్యమంగా మారిందని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్, మహాకాళ్ మహాలోక్ క్షేత్రాల అభివృద్ధే అందుకు నిదర్శనమని వివరించారు. బుద్ధా సర్క్యూట్ను గొప్పగా అభివృద్ధి చేశామని, బుద్ధుడు ధ్యానం చేసుకున్న క్షేత్రాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్శిస్తున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామ్ సర్క్యూట్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరికొన్ని వారాల్లో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ‘వికసిత్’లో పాల్గొనండి... మౌలిక సదుపాయాల లేమి మన ఆధ్యాతి్మక యాత్రకు పెద్ద అవరోధంగా మారుతోందని, ఆ పరిస్థితిని మార్చేస్తున్నామని మోదీ వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆధ్యాతి్మక గురువులు, మత పెద్దలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడంతస్తుల స్వర్వేద్ మహామందిర్ కేంద్రంలో ఏకకాలంలో 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. స్వరవేద శ్లోకాలను ఇక్కడి గోడలపై అందంగా చెక్కారు. నాలుగు కులాల సాధికారతే లక్ష్యం యువత, పేదలు, రైతులు, మహిళలనే నాలుగు కులాలు సంపూర్ణ సాధికారత సాధించాలన్నదే తన లక్ష్యమని మోదీ అన్నారు. సోమవారం వారణాసిలో ఆయన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రూ.19,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశ ప్రజలకు మోదీ 9 వినతులు 1. ప్రతి నీటి బొట్టును ఆదా చేయండి. జల సంరక్షణ విషయంలో ప్రజలను చైతన్యవంతులుగా మార్చండి 2. గ్రామాలకు వెళ్లండి. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచండి. 3. పరిశుభ్రతలో మీ ప్రాంతాన్ని నంబర్ వన్గా మార్చడానికి కృషి చేయండి. 4. స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించండి. 5. ఎంత ఎక్కువ వీలైతే అంతగా సొంత ఊరును సందర్శించండి. దేశమంతటా తిరగండి. మన దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోండి. 6. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రైతులను ప్రోత్సహించండి. 7. నిత్యం తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలను ఒక భాగంగా మార్చుకోండి. 8. జీవితంలో ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. 9. కనీసం ఒక పేద కుటుంబానికి అండగా నిలవండి. -
అతి పెద్ద ధ్యాన మందిరం ప్రారంభించిన ప్రధాని
వారణాసి:దేశంలోనే అతిపెద్ద ధాన్య మందిరం స్వర్వేద్ మహా ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో ప్రారంభించారు. ఈ మెడిటేషన్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఖ్యాతికెక్కింది. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఏడు అంతస్తుల్లో స్వర్వేద్ మహా ధాన్య మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని చెప్పారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమ వారాల్లో వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. #WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1 — ANI (@ANI) December 18, 2023 ఇదీచదవండి..‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్కమ్ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
Namo Ghat: కాశీ తమిళ సంగమం ప్రారంభం
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని నమో ఘాట్లో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1,400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మది, సింధూ, కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు. వారణాసితోపాటు ప్రయాగ్రాజ్, అయోధ్యను వారు సందర్శిస్తారు. తమిళనాడు, కాశీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంగమాన్ని మరింత బలోపేతం చేయడమే కాశీ తమిళ సంగమం ప్రధాన లక్ష్యం. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు అందులో పాలుపంచుకుంటున్నాయి. వారణాసి–కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఆయన సోమవారం వారణాసిలో రూ.19,155 కోట్లకు పైగా విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రోడ్లు, వంతెనలు, ఆరోగ్యం, విద్య, పోలీసు సంక్షేమం, స్మార్ట్ సిటీ, పట్టణాభివృద్ధి, రైల్వే, ఎయిర్పోర్టు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అంబులెన్స్కు దారిచ్చిన మోదీ కాన్వాయ్ వారణాసిలో ఆదివారం ప్రధాని మోదీ వాహనశ్రేణి ఓ అంబులెన్స్కు దారి ఇచి్చంది. నాదేసర్ ప్రాంతంలోని కట్టింగ్ మెమోరియల్ స్కూల్ వైపు మోదీ కాన్వాయ్ దూసుకెళ్తుండగా దాని వెనుకే హరన్ మోగిస్తూ అంబులెన్స్ వచి్చంది. దారి కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన మోదీ కాన్వాయ్లోని వాహనాలు వేగం తగ్గించుకొని కాస్త పక్కకు వెళ్లాయి. వాటిని దాటుకొని అంబులెన్స్ ముందుకెళ్లిపోయింది. -
నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు! -
Dev Diwali 2023: కాశీలో వైభవంగా దేవ్ దీపావళి.. (ఫొటోలు)
-
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
Najma Parveen: మోదీపై పీహెచ్డీ
నరేంద్ర మోదీ గుజరాత్ సి.ఎం. అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కాని వారిలో ముస్లిం స్కాలర్లు... అందునా మహిళా ముస్లిం స్కాలర్లు దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్డీ చేసిన మొదటి మహిళా స్కాలర్గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. చేనేత కుటుంబంలో పుట్టి నజ్మా పర్వీన్ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కాని వారు ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించింది పర్వీన్. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్.యు.)లో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పీహెచ్డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం ‘నరేంద్రమోడీస్ పొలిటికల్ లీడర్షిప్: యాన్ అనలిటికల్ స్టడీ’. నజ్మా పర్వీన్ తన పీహెచ్డీకి ఈ అంశం తీసుకున్నాక ‘నాక్కూడా భవిష్యత్తులో రాజకీయ నేత కావాలని ఉంది. అందుకే నేను భారతీయ ఆవామ్ ΄ార్టీనీ స్థాపించాను కూడా. ఆ ΄ార్టీని ఎలా రూపుదిద్దాలి అనుకున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద దృష్టి మళ్లింది. ఆయన రాజకీయాలలో ధ్రువతార వంటి వారు. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగింది. ట్రిపుల్ తలాక్ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదటగా శుభాకాంక్షలు తెలియచేశాను’ అని తెలిపింది నజ్మా. పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్ చదువుకు ‘విశాల్ భారత్ సంస్థాన్’ స్థాపించిన ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ సహకరిస్తే బి.హెచ్.యు. ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ గైడ్గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకుని 20 హిందీ, 79 ఇంగ్లిష్ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పీహెచ్డీని పూర్తి చేసింది. -
పీఎం మోదీపై పీహెచ్డీ.. నజ్మా పర్వీన్కు డాక్టరేట్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలలో ప్రముఖునిగా గుర్తింపు పొందారు. మోదీని ఆదర్శంగా తీసుకునేవారు మన దేశాలో చాలామంది ఉన్నారు. వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ ప్రధాని మోదీపై డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. ప్రధాని మోదీపై పీహెచ్డీ పూర్తి చేసిన తొలి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్ నిలిచారు. ప్రధాని మోదీ రాజకీయ జీవితానికి నజ్మా ప్రభావితురాలయ్యారు. నజ్మా మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద ‘నరేంద్ర మోదీ రాజకీయ నాయకత్వం - ఒక విశ్లేషణాత్మక అధ్యయనం’ పేరిట 2014లో దీనిని ప్రారంభించానని, 2023 నవంబరు ఒకటి నాటికి ఇది పూర్తయిందని తెలిపారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఈ పరిశోధన పని పూర్తయిందన్నారు. తన పరిశోధనలో ప్రధానంగా ఐదు అధ్యాయాలు ఉన్నాయన్నారు. అవి అధికారం నుండి విముక్తి, కాంగ్రెస్ వంశ పాలన, ప్రధాని మోదీ రాజకీయ జీవితం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ప్రతిపక్షాల ఆరోపణలు-విమర్శల కాలం, ప్రజలు- మీడియా మద్దతు అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం తనను అమితంగా ఆకట్టుకున్నదని, దేశానికి జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోదీ కనిపించారని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంకా ముప్పు తప్పలేదు:నేపాల్కు శాస్త్రవేత్తల హెచ్చరిక! -
జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే పూర్తి
లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తైంది. అయితే.. నివేదికను సమర్పించేందుకు ఏఎస్ఐ గడువు కోరడంతో నవంబర్ 17వ తేదీదాకా వారణాసి కోర్టు సమయం ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ జిల్లా న్యాయమూర్తి కే విశ్వేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్దం చేసేందుకు టైం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5వ తేదీన జ్ఞానవాపి సర్వే కోసం నాలుగు వారాల గడువు ఇచ్చిన వారణాసి కోర్టు.. తర్వాత ఎలాంటి గడువు ఉండబోదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు -
జయకు పాస్పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది. The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V — IndiaToday (@IndiaToday) September 23, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితున్ని ఘాజీపూర్కు చెందిన కృష్ణ కుమార్గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది. ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే -
వారణాసి క్రికెట్ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
Varanasi International Cricket Stadium Foundation Ceremony Highlights: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు కూడా హాజరయ్యారు. #WATCH | PM Modi lays the foundation stone of an international cricket stadium in Uttar Pradesh's Varanasi pic.twitter.com/5sAh2wZ5eA — ANI (@ANI) September 23, 2023 సంతోషంగా ఉంది: యూపీ సీఎం కాగా సుమారు రూ. 451 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్టేడియం నిర్మాణం.. 2025, డిసెంబరు నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఇక శంకుస్థాపన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీ సహా క్రికెట్ ప్రముఖులకు క్రీడా ఔత్సాహికుల అందరి తరఫున తాను స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. బీసీసీఐ, మోదీజీకి ధన్యవాదాలు అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్ సిటీ మిషన్ కింద స్టేడియం నిర్మాణం చేపట్టారని.. ఉత్తరప్రదేశ్లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి పేర్కొన్నారు. బీసీసీఐ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. యూపీతో పాటు బిహార్లో గల వర్ధమాన క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చిన బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోదీకి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Varanasi, UP: "PM Modi is laying the foundation stone for International Cricket Stadium Varanasi by the Board of Control for Cricket in India (BCCI) in Uttar Pradesh for the first time. I welcome PM Modi on behalf of every sports enthusiast in the state," says Uttar… pic.twitter.com/CL4xhbPXZG — ANI (@ANI) September 23, 2023 ఆ మహదేవుడికే అంకితం: ప్రధాని మోదీ వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం. కాశీలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. #WATCH | This stadium in the city of 'Mahadev' will be dedicated to 'Mahadev' himself. The sportspersons here will benefit from the construction of an international stadium in Kashi. This stadium will become the star of Purvanchal region: PM Modi on the foundation stone laying of… pic.twitter.com/bgh8bErN2l — ANI (@ANI) September 23, 2023 #WATCH | Asian Games will begin from today. I send my good wishes to all the athletes participating in the Games: PM Modi in Varanasi pic.twitter.com/hXzePvaRPM — ANI (@ANI) September 23, 2023 శివతత్వం ఉట్టిపడేలా చారిత్రాత్మక నగరంలో నిర్మించతలపెట్టిన వారణాసి క్రికెట్ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా.. ప్రేక్షకులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా రూపొందించనున్నారు. సీటింగ్ ప్లేస్ పైకప్పు అర్ధచంద్రాకారం, ఫ్లడ్లైట్లు త్రిశూలం, ఓవైపు ఎంట్రన్స్ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. సుమారు 30 వేల మంది సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్న ఈ స్టేడియం కోసం యూపీ ప్రభుత్వం సుమారు 121 కోట్లు వెచ్చించి భూమి సేకరించినట్లు సమాచారం. ఇందులో ఏడు పిచ్లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శుబ్మన్ గిల్ అరుదైన ఘనత.. సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు! -
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. శంకుస్ధాపన చేయనున్న మోదీ
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో సరికొత్త క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(సెప్టెంబర్ 23) శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వారణాసికి మోదీ చేరుకోనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మోదీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్సర్కార్ హాజరుకానున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జైషా సహా కీలక వ్యక్తులు కూడా పాల్గొనున్నారు. ఈ స్టేడియాన్ని సుమారు రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 121 కోట్లు వెచ్చించగా.. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ రూ. 330 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ వారణాసి స్టేడియంలో అడుగడుగునా శివతత్వం ప్రతిబింబించేలా రూపుదిద్దనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ మొత్తాన్ని అర్థం చంద్రాకారంలో నిర్మించనున్నారు. అదే విధంగా స్టేడియం ఫ్లెడ్ లైట్లు త్రిశూలం ఆకారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టేడియం ఎంట్రీని ఢమరుకం ఆకారంలో తయారు చేయనున్నారు. అంతేకాకుండా మొత్తం 31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేబోయే ఈ స్టేడియంలో.. ఏడు పిచ్లను సిద్దం చేయనున్నారు. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చోని వీక్షించేలా ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేడియం పూర్తి కానుంది. ఇక ఈ స్టేడియం నమూనాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: #Suryakumar Yadav: "సూర్య" గ్రహణం వీడింది.. 590 రోజుల తర్వాత తొలి హాఫ్ సెంచరీ Renders of the upcoming Cricket Stadium in Varanasi, Uttar Pradesh. PM Narendra Modi will lay the foundation on 23rd September. pic.twitter.com/GLTTM6kgZw — Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2023 -
వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పూర్తి వివరాలు
-
గంగా తీరం వద్ద ఉన్న వారణాసి శివాలయంలో వింత విషయాలు
-
వారణాసిలోని ఈ దేవాలయాలను తప్పక సందర్శించండి
-
కాశీలో ఈ వివరాలు ఇస్తే చాలు..!
-
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాలు..!
-
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
కోర్టు ఆవల రాజీ ఒప్పందం కుదుర్చుకోండి
వారణాసి(యూపీ): వారణాసిలోని జ్ఞానవాపి మసీదును గతంలో ఆలయం ఉన్న ప్రదేశంపై నిర్మించారా? అన్న దానిని తేల్చే విషయంలో న్యాయస్థానంలో నలుగుతున్న అంశాన్ని కోర్టు ఆవల రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ పిలుపునిచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే కొనసాగుతున్న ఈ తరుణంలో సనాతన సంఘ్ చీఫ్ జితేంద్ర ఇలా బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ఈ లేఖ తమకు అందిందని దీనిపై అంతర్గత సమావేశంలో చర్చిస్తామని ఇంతెజామియా మస్జిద్ కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ యాసిన్ చెప్పారు. -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ సర్వేకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సర్వే కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది జ్ఞానవాపి మసీదు కమిటీ. ఒకవైపు సర్వే ఇవాళ మొదలుకాగా.. మరోవైపు మసీద్ కమిటీకి సుప్రీంలో చుక్కెదురుకావడం గమనార్హం. అయితే శుక్రవారం ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్ను తిరస్కరించింది. ఈ సర్వే ద్వారా చరిత్ర పునరావృతం అవుతుందని.. గాయాలు తిరిగి తెరపైకి వస్తాయని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. ఈ వాదనలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. మనం ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ASI Survey నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషనర్కు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో జ్ఞానవాపిలో చేసే సర్వే నాన్-ఇన్వాసివ్ మెథడ్(పరికరాల్లాంటివేం ఉపయోగించకుండా) చేయాలని, ఎలాంటి డ్యామేజ్ జరగొద్దంటూ పురావస్తు శాఖను ఆదేశించింది సుప్రీం. అందుకు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంగీకరించారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించి.. ఆ నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలంటూ జులై 21వ తేదీన వారణాసి(యూపీ) జిల్లా కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)ను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఈ సర్వే జరుగుతోంది. సర్వే కోసం ఏఎస్ఐకి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. -
జ్ఞానవాపీ మసీదులో సర్వేకు ఓకే
ప్రయాగ్రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆవరణలో ఏఎస్ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. -
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు
అలహాబాద్: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం #WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09 — ANI (@ANI) August 3, 2023 -
జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు
ఢిల్లీ/లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీద్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురాతత్వ సర్వేక్షణ) సర్వేపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులపాటు (బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా) సర్వేను నిలిపివేయాలని ఏఎస్ఐను ఆదేశించింది. సోమవారం ఉదయం ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇంతకు ముందే స్పష్టం చేశారు. దీంతో పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించగా.. 40 మంది ఏఎస్ఐ అధికారులు వాళ్లను అనుసరిస్తూ లోనికి వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. సీల్ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. ఒకవైపు సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్ఐను ఆపేయాలని ఆదేశించింది. వాజుఖానాలో ఆకారం బయటపడడం.. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖను శుక్రవారం ఆదేశించింది. దీంతో.. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్ఐ తన నివేదికను అందించాల్సి ఉంది. #WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023 ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్లోని వాజుఖానాలో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్కు అనుమతించింది. ► అయితే ఈ ఏడాది మే 19వ తేదీన.. జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ► మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. హిందూ మహిళల పిటిషన్ ఆధారంగా.. జులై 21వ తేదీన జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. ► తాజాగా.. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. దీంతో ఇవాళ్టి సుప్రీం విచారణపైనా ఉత్కంఠ నెలకొంది. ► సుప్రీంకోర్టులో ముస్లిం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముస్లింల పిటిషన్పై సీజేఐ ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ► సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. 1500వ సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉంది. ఈ విషయంలో అంత తొందర ఎందుకు?. దీనిపై స్టేటస్ కో ఆర్ఢర్ ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. దీనికి జూలై 26న విచారణ జరుగునున్నట్టు కోర్టుకు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. Gyanvapi case | Supreme Court says no ASI survey of Gyanvapi mosque complex till 5 pm, July 26th. High Court order shall not be enforced till 26th July. In the meantime, the mosque committee shall move High Court. pic.twitter.com/MMm9Xw1W3Q — ANI (@ANI) July 24, 2023 ► ఈ సందర్భంగా ధర్మాసనం.. జూలై 28వ తేదీ శుక్రవారం వరకు యథాతథ స్థితి ఉంటుందని స్టేట్కో ఇవ్వగలరా అని సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. ఇక, యూపీ ప్రభుత్వం హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేదా ఆక్రమణ జరగడం లేదన్నారు. ఈ క్రమంలో జూలై 26 వరకు అక్కడ ఎలాంటి సర్వేలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5గంటల వరకు సర్వే ఆపాలని ఆదేశించింది. -
ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టుకు జ్ఞానవాపి మసీదు కమిటీ
న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. ఇప్పటికే జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసింది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. -
సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!
యాంకర్ విష్ణు ప్రియ పరిచయం అక్కర్లేని పేరు. ఫోక్ సాంగ్స్ చేస్తూ యువతను అలరిస్తోంది. మానస్తో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. బుల్లితెరపైనా ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఎప్పుడు వెకేషన్ అంటూ బీచ్లు తిరిగే విష్ణుప్రియ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టింది. సమంతను ఫాలో అవుతూ ఆలయాలను సందరిస్తోంది. తాజాగా తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఈషా ఫౌండేషన్లో ఎక్కువగా కనిపించే విష్ణు ప్రియ.. ఇటీవలే నాసిక్ కూడా వెళ్లింది. తాజాగా వారణాసిలో కనిపించింది. (ఇది చదవండి: నా సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారంటే: కాజల్ అగర్వాల్) యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణుప్రియ ప్రత్యేకంగా కనిపించింది. మెడలో దండ వేసుకుని పూర్తి సమంతను గుర్తుకు తెచ్చింది. ఇటీవలే సమంత ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో అచ్చం అలాగే కనిపించింది. అంతే కాకుండా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఫోటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది. రీసెంట్గా విష్ణు ప్రియ ఓ వెబ్ సిరీస్లో నటించింది. జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్గా చేసిన దయాలో విష్ణుప్రియ ఓ జర్నలిస్ట్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) -
జ్ఞాణవాపి మసీదులో సర్వేకి కోర్టు అనుమతి.. కానీ..
ఢిల్లీ: జ్ఞాణవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారాణాసి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు ఆశ్రయించారు. అయితే.. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథునికి ఎదురుగా ఉన్న జ్ఞాణవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం ఆనవాళ్లను కలిగి ఉందని నలుగురు మహిళలు ఈ ఏడాది మే నెలలో కోర్టు మెట్లెక్కారు. మసీదు ప్రాంగణంలో స్వయంభు జ్యోతిర్లింగం ఉండేదని, ముస్లిం పాలకుల దండయాత్రలో ధ్వంసమైందని వారి పిటిషన్దారులు పేర్కొన్నారు. అయితే.. మసీదు కమిటీ వీరి వాదనలను ఖండించింది. ఏఎస్ఐ సర్వే మసీదు నిర్మాణాలను దెబ్బతీస్తుందని అన్నారు. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రఫిక్ సర్వేలో కనుగొన్నామని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకాకుండా సైంటిఫిక్ సర్వేని విభేదించింది. వజుఖానాని సీలింగ్ చేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? -
పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ
పచ్చని సంసారానికి గ్రీన్ ఆర్మీ కావాలి అంటున్నారు వారణాసిలోని కుషియారి గ్రామ వాసులు. ఈగ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువ.నిరుపేదలు కావడంతో విద్యాగంధం ఉన్న వాళ్లు తక్కువ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. చాలా కుటుంబాల్లో పెద్దరికం వహించాల్సిన భర్తలు తాగుడు, మత్తుపదార్థాలకు బానిసలై భార్యలను కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగితే తన్ని తరిమేయడం సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా భర్తల తీరుతో విసిగిపోయిన గ్రామ మహిళలకు రవి మిశ్రా అనే టీచర్ చుక్కానిలా దారిచూపుతున్నాడు. భర్త బాధితురాలైన ఆశాదేవిని కలిసిన మిశ్రా సమస్యలు ఆమె ఒక్కదానికే కాదు, ఆమె ఇరుగు పోరుగు వారి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని తెలుసుకున్నాడు. మీరంతా కలసికట్టుగా ఉంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదని చెప్పి, ఆశాదేవితోపాటు మరికొంతమంది మహిళలను కూడగట్టుకుని 2014లో ‘గ్రీన్ఆర్మీ’నిప్రారంభించారు. వ్యసనాలకు బానిసలైన భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సరైన దారిలో నడిపించడమే ఈ ఆర్మీ ముఖ్య ఉద్దేశ్యం. ఆర్మీలోని సభ్యులు పచ్చని రంగు చీర కట్టుకుని, కర్రలు పట్టుకుని ఎవరైనా ఇంట్లో భర్తలు తాగి గొడవచేస్తుంటే వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొస్తారు. లిక్కర్, మత్తుపదార్థాలకు బానిసలైన వారికి రకరకాలుగా కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనుషులుగా మార్చడానికి కృషిచేస్తోంది. భర్తలతోపాటు.. గ్రామాభివృద్ధికి ప్రస్తుతం ఈ ఆర్మీలో 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్మీ చేస్తోన్న కార్యకలాపాలు చూసిన ఎంతోమంది ఇతర గ్రామాల్లో గులాబీ గ్యాంగ్ వంటి రకరకాల పేర్లతో ఆర్మీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మహిళలు తమను తాము రక్షించుకొనేందుకు ఆత్మరక్షణ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వారణాసి, మీర్జాపూర్ జిల్లాల్లోని చాలామంది మహిళలు ఈ ఆర్మీ ద్వారా భర్తలను మార్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మూర్ఖపు భర్తలను మార్చడంతోపాటు, గృహహింస, వరకట్నం, మూఢాచారాలు నిర్మూలించేందుకు ఆర్మీలు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్మీల వల్ల కుటుంబ పరిస్థితులు మెరుగుపడడమేగాక, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ‘‘నా పేరు ఆశాదేవి. పద్నాలుగేళ్లకే పెళ్లి అయ్యింది. ఐదుగురు పిల్లలు. నా భర్త ఎప్పుడూ కొట్టేవాడు. గర్భవతినని కూడా చూడకుండా హింసించేవాడు. పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. కానీ ఆయన మాత్రం తాగడం మానలేదు. నన్ను కొట్టడం ఆపలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు రాత్రులకు నిద్రపట్టేది కాదు. మూలుగుతూ పడుకున్న నన్ను మళ్లీ మళ్లీ కొట్టేవాడు. చలికాలం ఇంటి బయటకు నెట్టేసేవాడు. బాధలు తట్టుకోలేక చచ్చిపోదామని నిప్పు అంటించుకున్నాను.కానీ వేరేవాళ్లు కాపాడడంతోప్రాణాలు రవి మిశ్రా హోప్ వెల్ఫేర్ ట్రస్ట్వాళ్లతో కలసి మా గ్రామానికి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి, పిల్లలు స్కూలుకు కూడా వెళ్లడంలేదని తెలుసుకున్నారు. నేను నా బాధల గురించి వివరించాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్తో ఆయన తాగడం మానేశాడు. ఎనిమిదేళ్లుగా మంచి వ్యక్తిగా మారి, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. ఆ తరువాతే నాలాంటి మహిళలను ఆదుకునేందుకు మిశ్రా తో కలిసి గ్రీన్ ఆర్మీని ఏర్పాటు చేశాము.’’ ఆశా దేవి లాంటి వందలమంది మహిళలు గ్రీన్ ఆర్మీ ద్వారా సంసారాలను చక్కబెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. -
‘వందే భారత్’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే..
వారణాసి నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని టూండలా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జలేసర్-పోరా మధ్య రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేమీ మొదటిది కాదు.. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా వెళుతోంది. ఈ సమయంలో ఆ యువకుడు పట్టాలు దాటుతుండగా, అటువైపుగా వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ యువకుడిని ఢీకొంది. సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. కాగా వందే భారత్ ఎక్సెప్రెస్ కారణంగా గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఇదేమీ మొదటిది కాదు. పలుమార్లు ట్రాక్పైకి పశువులు వచ్చిన కారణంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. అలాగే ఈ రైలు వేగం కారణంగా రైలును ఢీకొనడంతో పలు పశువులు మృతి చెందాయి. ఐదు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను స్వాగతించిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను స్వాగతించారు. భోపాల్లో ఈ రైళ్లకు పచ్చజెండా చూపారు. వీటిలో మొదటి రైలు కమలాపతి- జబల్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్. రెండవ వందేభారత్ ఖజురహో నుంచి భోపాల్ మధ్య ఇండోర్ మీదుగా నడవనుంది. ఇదేవిధంగా గోవాలోని మడ్గావ్ నుంచి ముంబైకి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు మొదలయ్యాయి. నాల్గవ వందేభారత్ ధార్వాడ- బెంగళూరు మధ్య నడవనుంది. ఇది కూడా చదవండి: బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’ -
కాశీకి వెళ్తున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడం ఖాయం..!
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలోని పలు రోడ్లు, భవనాల పేర్లు త్వరలోనే మారిపోనున్నాయి. ఆయా ప్రాంతాలు నూతన పేర్లతో, పలు హంగులు సంతరించుకోనున్నాయి. నగరంలోని గిరిజాఘర్ రహదారికి భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు పెట్టనున్నారు. ఫాత్మాన్ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డుగా మారనుంది. మక్బుల్ ఆలం రోడ్డు.. బిర్హా గాయకుడు పద్మశ్రీ హీరాలాల్ యాదవ్ రోడ్డుగా మారనుంది. వారణాసి మేయర్ అశోక్ తివారి ఈ మార్పులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కాశీ నగరం ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా పేరొందిందని అశోక్ తివారి పేర్కొన్నారు. ఇక్కడి ప్రాచీనత, ఆధ్మాత్మికత, కళలు, సాహిత్యం, సంప్రాదాయం మానవాళికి మార్గదర్శక మన్నారు. నగరంలోని పలు రహదారులు, భవనాల పేర్లను మార్చేందుకు యోగి సర్కారు నడుంబిగించిందన్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన నగరపాలక సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. స్థానికతను ప్రతిబింబించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు. నగరంలోని భోజుబీర్ మార్గానికి రాజర్షి ఉదయ్ ప్రతాప్ జూదేవ్, పాండేయ్పూర్-ఆజమ్గఢ్ రహదారికి మున్షీ ప్రేమ్చంద్ పేర్లు పెట్టేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. నగరంలోని పలు వార్డుల పేర్లు కూడా మారనున్నాయన్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..! -
Adipurush controversy: అయోధ్యలో ‘ఆది పురుష్’ సెగలు.. శ్రీరామ సేన సారధ్యంలో..
హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా విడుదల కాగానే.. ఆ సినిమాపై విమర్శల దాడి మొదలయ్యింది. ఈ చిత్రంపై ఆధ్యాత్మిక ప్రాంతాలుగా పేరుగాంచిన వారణాసి మొదలుకొని హరిద్వార్ వరకూ కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ‘ఆది పురుష్’పై జనాగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలోని శ్రీరామ సేన కార్యకర్తలు ‘ఆది పురుష్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపిస్తూ, ఆయా థియేటర్లను మూసివేయిస్తున్నారు. రూ. 500 కోట్ల బారీ బడ్జెట్తో నిర్మితమైన ‘ఆది పురుష్’పై మొదలైన ఆందోళనలు ఇప్పట్లో ఆగేలా లేవు. దేశవ్యాపంగా ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.ఇదే కోవలో రామజన్మభూమి అయిన అయోధ్యలో ‘ఆది పురుష్’పై ఆందోళనలు మిన్నంటాయి. ఈ ప్రాంతానికి చెందిన హిందూ సంస్థలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మూసివేయిస్తున్నాయి. శ్రీరామ సేన కార్యకర్తలు ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రదర్శనలను మధ్యలోనే నిలిపివేయిస్తున్నారు. థియేటర్లలోకి చొరబడిన శ్రీరామ సేన కార్యకర్తలు కాషాయ జండాలు ప్రదర్శిస్తూ, ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోలీసుల సమక్షంలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు దినే సింగ్ మాట్లాడుతూ ‘అసంబద్ధమైన సినిమా రూపొందించారు. మన సంస్కృతిని కించపరిచారు. దీనిని అయోధ్యలో ప్రదర్శించబోనీయం. ‘ఆది పురుష్’ సినిమాను అయోధ్యలో ఎట్టిపరిస్థితిలోనూ ఆడబోనీయం’ అని స్పష్టం చేశారు. వారణాసి మొదలు హరిద్వార్ వరకూ.. ‘ఆది పురుష్’ సినిమాపై వారణాసి మొదలు అయోధ్య వరకూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. అఖిల భారతీయ సంత్ సమితి ప్రతినిధి జితేంద్రానంద మాట్లాడుతూ ఈ సినిమాలోని డైలాగులు స్వామీజీలకే అర్థం కావడంలేదని, సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలను వక్రీకరించారన్నారు. హరిద్వార్లోనూ ‘ఆది పురుష్’ సినిమాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి హిందూ సంఘాలు ఈ సినిమాను చూడొద్దంటూ ప్రేక్షకులను కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సినిమాపై తాత్కాలికంగానైనా నిషేధం విధించాలని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్’పై అఖిల భారత హిందూ సభ విమర్శల బాణం! -
అందరికీ నాణ్యమైన డేటా
న్యూఢిల్లీ: నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ఒక ముఖ్యమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్మెంట్ మోడల్ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు. కాశీని సందర్శించండి ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. -
వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్న జీ20 ప్రతినిధులు..
వారణాసిలో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠంలో జూన్ 11 నుంచి 12 వరకు జీ20 గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జీ20 ప్రతినిధులతో కలసి ఆదివారం వారణాసిలో జరిగే గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ మేరకు జీ20 ప్రతినిధులు వారణాసిలో దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతికి హాజరయ్యి సందడి చేశారు. ఆదివారం కాశీ విద్యాపీఠంలో జరగుతున్న 20 సదస్సుకు సుమారు 200 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఆదివారం ప్రారంభమైన ఈ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ..45 ఏళ్ల కెరియర్లో ఫిజీ, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీని ఆహ్వానించిన విధంగా మరో ప్రధానిని స్వాగతించడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ జీ20 అభివృద్ధి మంత్రి వర్గ సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిని అడ్డుకునే ఖరీదైన ట్రేడ్ ఆఫ్లను నివారించడం తోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజేస్) చేరుకునేలా అభివృద్ధి, పర్యావరణం, వాతావరణం ఎజెండాల మధ్య సమన్వయాలను సమిష్టిగా పెంపొందించేందుకు ఒక అవకాశంగా ఉంటుందని విదేశాంగ మంత్రి వెల్లడించారు. జనవరిలో భారత్ ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ తదనంతరం వారణాసిలో జీ20 అభివృద్ధి మంత్రుల సమావేశం జరగడం గమనార్హం. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు యూఎన్ శిఖరాగ్ర సమావేశంలోని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీఎస్)కి దోహదం చేస్తాయని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రపంచంలో పురాతన నగరాలలో ఒకటైన వారణాసిలోని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రతినిధులకు తెలియజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను, టూర్లను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ జీ20 గ్లోబల్ సదస్సులో రెండ ప్రధాన సెషన్లు ఉంటాయి. ఒకటి బహుపాక్షికత(ఎస్డీజీల దిశగా పురోగతిని వేగవంతం చేయడం), రెండు గ్రీన్ డెవలప్మెంట్(పర్వావరణ జీవన శైలి). #WATCH | EAM Dr S Jaishankar and G20 delegates attend Ganga aarti in Varanasi, Uttar Pradesh pic.twitter.com/toh2WVOL29 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 11, 2023 (చదవండి: అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా) -
దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్
వారణాసి: ఈ ఏడాది జీ-20 సమావేశం మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11(ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు వారణాసిలో జీ-20 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీ-20 సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్ ఓ దళిత వ్యక్తి(బీజేపీ బూత్ అధ్యక్షుడు) ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారు. మంత్రి రాకకోసం ఒకరోజు ముందు నుంచే ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సుజాత చెప్పారు.'మా కుటుంబమంతా ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఇళ్లు శుభ్రం చేసి కచోరి,ఆలూ పన్నీర్ వండిపెట్టాము. కేంద్ర మంత్రి మా ఇంట్లో తినడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని ఆమె అన్నారు. తమ లాంటి పేదవాళ్ల ఇంట్లో కేంద్ర మంత్రి వచ్చి తినడం చాలా ఆనందాన్ని కలిగించిందని సుజాత మామయ్య చెప్పారు. తిన్న అనంతరం భోజనం చాలా బాగుందని జైశంకర్ చెప్పారు. ఆహార భద్రత,ధాన్యం, ఫర్టిలైజర్స్, చిరుధాన్యాల గురించే ఈ రోజు సమావేశంలో చర్చ జరగనుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి:భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా.. -
Gyanvapi Case: వారణాసిలోనే జ్ఞానవాపి కేసు..ఆ వ్యాజ్యం చెల్లుతుంది.!
జ్ఞానవాపి కేసులో ముస్లీం కమిటికి చుక్కెదురైంది. మసీదు కమిటీ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను బుధవారం అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో హిందూ మహిళలు వేసిన వ్యాజ్యం చెల్లుబాటవుతుందని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది కోర్టు. అలాగే స్థానిక వారణాసిలోనే కేసు కొనసాగేలా అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హిందు మహిళల బృందానికి భారీ ఊరట లభించినట్లయ్యింది. వారణాసిలో జ్ఙానవాపి మసీదులో పూజలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ మహిళల బృందం లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ కేసు తెరపైకి వచ్చి గణనీయమైన వివాదాస్పదానికి దారితీసింది. ఈ వివాదం ఏప్రిల్ 2021 నుంచి కోర్టులోనే ఉంది. వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు నిర్వహణను సమర్థించారు. ఇదిలా ఉండగా, అంజుమన్ ఇంతేజామియా మసీదు(ఏఐఎం) కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్ వక్ఫ్ చట్టం ప్రకారం ఈ కేసును నిర్వహించడం సాధ్యం కాదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 23, 2022న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా, హిందూ మహిళల పిటిషన్పై వారణాసి కోర్టు మసీదు సముదాయంపై సమగ్ర సర్వే నిర్వహించాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది కూడా. (చదవండి: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు స్టే)) -
వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు. పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి. చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు -
పెళ్లిచేసుకోబోతున్న కలెక్టర్లు.. ఇద్దరికీ రెండో వివాహమే..
కటక్: వారిద్దరూ కలెక్టర్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పడంతో వారు కూడా పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో, త్వరలో ఇద్దరు కలెక్టర్లు పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. వారిద్దరూ ఎవరంటే.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్. వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరోవైపు.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచిసింగ్ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్థలు కారణంగా ఇటీవలే విడిపోయారు. ఇక, 2011 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సమర్థ్ వర్మ గతంలో కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్, బిఎంసి కమిషనర్, రాయగడ పిడిడిఐ మరియు సంబల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేశారు. అదేవిధంగా, రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ గతంలో నువాపా జిల్లా కలెక్టర్గా మరియు రూర్కెలాలో అదనపు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బీజేపీ మంత్రి సాహాసం -
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం
ఏ సిగ్నల్ దగ్గరో, లేదా దారిమధ్యలోనో దీనంగా కనిపించిన బిచ్చగాళ్లకు తోచినంత సాయం చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం వల్ల కాస్త పుణ్యం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు చంద్ర మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ‘‘దానం చేయవద్దు పెట్టుబడి పెట్టండి’’అనే నినాదంతో అద్భుతాలు సృష్టించారు. ఈ పిలుపు వెనుక ఉన్న సాహసం, ఆయన సాధించిన విజయం గురించి తెలిస్తే.. మీరు కూడా ఔరా అంటారు..! బెగ్గర్స్ కార్పొరేషన్: చంద్ర మిశ్రా జర్నలిస్టు,సామాజిక కార్యకర్త, చంద్ర మిశ్రా బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పెట్టుబడి పెడితే, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వొచ్చని బాగా నమ్మారు. బిచ్చగాళ్లకు భిక్ష కాదు పెట్టాల్సింది.. కాసింత చేయూత, తగినంత పెట్టుబడి ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అసంఘటిత రంగానికి చెందిన వేలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోవడం, వారణాసిలో గుడి దగ్గర వేలాంది మంది బెగ్గర్స్ను చూసిన చలించిపోయిన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పేదరికంతో బిచ్చగాళ్లుగా మారిన వారికి దానం పరిష్కారం కాదనీ, ప్రాథమిక మార్పు తీసుకొచ్చేలా సాయం చేయడమే ఏకైక పరిష్కారమని నమ్మారు. అలా అనేక ప్రయోగాల తర్వాత, చంద్ర అధికారికంగా ఆగస్టు 2021లో బెగ్గర్స్ కార్పొరేషన్ను రిజిస్టర్ చేసారు. రూ.10 నుంచి రూ.10వేలు దాకా తోచినంత పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తామని, దీని ద్వారా గ యాచకుల జీవితాల్లో మార్పువస్తుందని ప్రకటించారు. బిచ్చగాళ్లకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే చంద్ర లక్ష్యం. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన నిరుద్యోగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్బుక్ సర్వే నిర్వహించి వారణాసిలో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా సమీప ప్రాంతాల నుండి దాదాపు 27వేల మంది చేరడంతో ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఉత్సాహం చూపించిన వారికి బ్యాగుల తయారీవంటి నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించడం మొదలైంది. దీంతో పలువురు బిచ్చగాళ్ళు కార్పొరేషన్లో చేరిక పెరిగింది. శిక్షణ తరువాత రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అలా ఇంతింతై..అన్నట్టుగా సాగుతోంది బెగ్గర్స్ కార్పొరేషన్. 2021-22లో రూ. 5.7 లక్షలతో మొదలైన పెట్టుబడి, 2022-23లో 10 రెట్లు పెరిగింది. ఇపుడు రూ. 10 కోట్ల పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయంపై పలువురి ప్రశంసలు దక్కాయి. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా? ) #BeggarsCorporation is raising ₹ 10 cr #investment, not #donation. Indians donate ₹ 103 lakh cr p/a. If only 700 donors invest ₹ 1.5 lac each on one beggar, we don't need #VentureCapital to create 1st #beggingfree city of India. Don't donate, invest.https://t.co/TkwiATIS8k — Beggars Corporation (@BeggarsCorp) April 13, 2023 వ్యవస్థాపకులుగా 14 కుటుంబాలు ఫలితంగా ఇప్పటికే 14 పేద కుటుంబాల జీవనోపాధి కల్పించారు. తద్వారా ప్రారంభ పెట్టుబడిదారుల డబ్బును ఆరు నెలల్లోపు తిరిగి ఇచ్చేయడమేకాదు, 16.5 శాతం లాభాన్ని ఆర్జించారు. దీంతో తన భాగస్వాములైన బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర థాపాతో కలిసి, మిశ్రా ఆగస్ట్ 2022లో బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారి పోయింది. 14 యాచక కుటుంబాలు వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నాయి. ఇందులో పన్నెండు కుటుంబాలు చక్కటి సంచులను తయారు చేస్తాయి. మరో రెండు కుటుంబాలు వారు దేవాలయాల సమీపంలో దుకాణాల్లో పువ్వులు, పూజా సామగ్రి ఇతర వస్తువులను విక్రయిస్తారు. If you think #beggars can't work, please watch this video. Today for the first time she came with her child. I motivated her to work. With 15 minutes of guidance, she started stitching. What if she gets skill training under Learn & Earn? @narendramodi @blsanthosh @MSDESkillIndia pic.twitter.com/KHm3jVNugr — Chandra Mishra (@employonomics) December 29, 2021 కార్పొరేషన్లో చేరింది ఒక మహిళ కావడం విశేషం. భర్త వేరొకరిని పెళ్లిచేసుకుని బాధిత మహిళను ఇంటినుంచి తరిమిమేయడంతో 12 ఏళ్ల కొడుకుతో పాటు, కాశీ ఘాట్ వద్ద భిక్షాటన చేసేది. ఆమెను కలిసి పనినేర్చుకోమన్నపుడు వెనకడుగు వేసింది. మిషన్ను పాడు చేస్తానేమోనని భయపడింది. చివరికి 15 నిమిషాల్లో ఆమె నేర్చుకొంది. కుట్టుపని శిక్షణలో పదును తేలడం బెగ్గర్స్ కార్పొరేషన్కు మరింత ప్రోత్సహాన్నిచ్చిందనీ, వారికి చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చాలనే నమ్మకాన్ని తమలో పెంచిందని చంద్ర చెబుతారు. ‘‘వారి జీవితాలను మార్చడంలో ఎంతవరకు విజయం సాధించానో ఖచ్చితంగా తెలియదు, కానీ బనారస్ బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా నేను మారును. నేను ఒక మాధ్యమం మాత్రమే. నిజానికి నేను యూపీకి చెందిన వాడ్నికాను. వారణాసి ప్రజలతో నాకు సంబంధం లేదు. కానీ వృద్ధి సమానంగా ఉండాలని ఈ ఉద్యమం నాకు నేర్పింది. మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించే వరకు రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. బిచ్చగాళ్లు పారిశ్రామికవేత్తలు కాగలిగితే, నిరుద్యోగం అనేదే ఉండదు’ అంటారు చంద్ర. విరాళాలకు బదులుగా పెట్టుబడులను ప్రోత్సహించాం తద్వారా బిచ్చగాళ్ళు వ్యవస్థాపకులుగా మారారు. ఈ రకమైన చర్య ప్రపంచంలోనే మొదటిది, ఏకైక చొరవ అని ఆయన పేర్కొన్నారు. అవార్డులు, రివార్డులు ♦ఈ మిషన్లో ఒక్కో బిచ్చగాడికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. వీటిలో రూ. 50వేల మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తి సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఖర్చు చేస్తారు. ♦ దీంతోపాటు వారణాసి ఘాట్ల వద్ద అడుక్కునే పిల్లలకు సహాయం చేయడానికి మిశ్రా స్కూల్ ఆఫ్ లైఫ్ను కూడా స్థాపించారు. బెగ్గర్స్ కార్పొరేషన్ చంద్ర మిశ్రాకు 100 ఇన్నోవేటివ్ స్టార్టప్లలో స్థానం సంపాదించిపెట్టింది. తరువాత టాప్ 16 మైండ్ఫుల్ స్టార్టప్లలో చేరారు. ♦ ప్రారంభంలో 57 మంది తన ప్రచారానికి నిధులు సమకూర్చారు . వారి డబ్బుతో, మిశ్రా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని ఏర్పాటు చేశారు. ♦ బెగ్గర్స్ కార్పొరేషన్స్ అనేక అవార్డులను కూడా అందుకుంది. స్టార్టప్ ఇండియా సహకారంతో లెమన్ ఐడియాస్ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్ గ్లోబల్ స్టార్టప్ కాంటెస్ట్లో ఇది బెస్ట్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువనటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే మరో నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భోజ్పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు. కొన్ని గంటల ముందే సాంగ్ రిలీజ్ ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. తరచుగా ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్స్టాగ్రామ్లో రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్లలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria) -
రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
-
మహా శివరాత్రికి కాశీలో ఏపీ మంత్రి రోజా
-
RK Roja: కాశీలో ఏపీ మంత్రి రోజా
సాక్షి, వారణాసి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై.. కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చదవండి: సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు -
22 ఏళ్ల కిషన్ పన్పాలియా.. 24 ఏళ్ల రితికా పాండే! వీళ్లిద్దరూ అద్భుతం..
ఇరవై రెండు సంవత్సరాల వయసులో... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్కు బిజినెస్ హెడ్గా పనిచేస్తున్నాడు కిషన్ పన్పాలియా. ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆర్టిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రితిక పాండే. ఈ ఇద్దరు తాజాగా... ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ 2023 జాబితాలో చోటు సంపాదించారు... చిన్న వయసులోనే మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్ ‘పెప్పర్ కంటెంట్’కు బిజినెస్ హెడ్గా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కిషన్ పన్పాలియా ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... ‘ఇండియా కాటన్ సిటీ’గా పేరుగాంచిన మహారాష్ట్రలోని అకోల. కిషన్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ‘పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఎందుకు? నేను సంపాదించలేనా!’ అని ఆలోచించి రంగంలోకి దిగాడు. తన ఐడియా చెప్పి స్నేహితులు బంధువులను ఒప్పించాడు. అందరూ కలిసి స్క్రాప్ కొని అమ్మడం మొదలు పెట్టారు. పాకెట్ చాలనంత మనీ వచ్చి చేరింది! కట్ చేస్తే... బిట్స్ పిలానిలో చదువుకునే రోజుల్లో కిషన్కు మంచి గుర్తింపు ఉండేది. దీనికి కారణం కాలేజీ ఈవెంట్ కోసం లక్షా పాతికవేల స్పాన్సర్షిప్ను సంపాదించడం. నిజానికి కాలేజి ఈవెంట్కు పాతికవేలకు మించి స్పాన్సర్షిప్ వచ్చేది కాదు. మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తన సీనియర్స్ అనిరుద్ సింగ్లా, రిషబ్ శేఖర్లు ‘పెప్పర్ కంటెంట్’ పేరుతో కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. కిషన్ను కూడా తమతో కలుపుకున్నారు. మొదటిసారిగా ఆటోమోటివ్ పార్ట్స్ డీలర్ నుంచి ‘కూల్ కంటెంట్’ ఆఫర్ వచ్చింది. రాసే వారి కోసం చూశారు. పదానికి పదిహేను పైసలు అంటే ఎవరు మాత్రం వస్తారు! దీంతో తప్పనిసరి పరిస్థితులలో తామే కంటెంట్ పనిలోకి దిగారు. పదిరోజుల్లో 300 పీస్లు రాశారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ‘పెప్పర్ కంటెంట్’ 2,500 మంది కస్టమర్లతో, 1.2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్తో పనిచేసింది. మన దేశంలో లార్జెస్ట్ ఫ్రీలాన్స్ క్రియేటర్స్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. బిజినెస్ సెన్స్, రెవెన్యూ మేనేజ్మెంట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్న కిషన్ను తన ‘సక్సెస్ మంత్రా’ గురించి అడిగితే– ‘నిరంతర సాధన’ అంటాడు. వారణాసిలో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి వారణాసిలో పుట్టిన రితిక పాండే ముంబై రావడానికి ముందు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో పెరిగింది. శ్రిష్టి మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. వేల్స్ (యూకే)లోని ఒక సిటీలో కొంతకాలం పురాణాలు, సైన్స్–ఫిక్షన్ ఆధారంగా కళాసాధన ప్రారంభించింది. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత హిమాచల్ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది. ప్రకృతి ప్రపంచంతో స్నేహం చేసింది. తనలో సృజనాత్మకమైన కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంది. థీమ్ ఏమిటంటే ‘విశ్వవిద్యాలయాలు, గొప్ప పుస్తకాల నుంచి మాత్రమే కాదు ప్రకృతి ప్రపంచం నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్లాను. ఇది నిరంతరమైన ప్రయాణం. నిరంతర సాధన. ఆర్టిస్ట్లు నేర్చుకోవడానికి ప్రకృతిలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి’ అంటుంది రితిక. రితిక వర్ణచిత్రాలలో మనుషులు కనిపిస్తారు. మొక్కలు, జంతువులు కనిపిస్తాయి. స్థూలంగా చెప్పాలంటే హ్యూమన్, నాన్–హ్యూమన్కు సంబంధించి రిలేషన్ అనే థీమ్ కనిపిస్తుంది. ‘గ్రోస్వెనర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన రితిక ఆర్ట్వర్క్ సోలో షోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతోమంది ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్స్ ఆసక్తి ప్రదర్శించారు’ అంటున్నారు లండన్లోని గ్రోస్వెనర్ గ్యాలరీ డైరెక్టర్ చార్లెస్ మూర్. చదవండి: తీరిన కోరిక: ప్రతి పైసా కూడగట్టి విమానం ఎక్కారు -
వారణాసిలో సీఎన్జీ బోట్లు
వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్కు బదులు సీఎన్జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు. మరో 2వేల బోట్లను సీఎన్జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు. -
భారత పర్యాటకంలో కొత్త యుగం ఆరంభం: ప్రధాన మోదీ
వారణాసి: అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’కు ఆయన శుక్రవారం వర్చువల్గా జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. నమామి గంగా, అర్థ్ గంగా.. ‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’ అని మోదీ అన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ను ప్రారంభించిన మోదీ..
ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అస్సాంలోని దిబ్రూగర్ వద్ద తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్ లో 52 మంది స్విస్ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000- 50,000 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగానే వారణాసిలో టెంట్ సిటీకి మోదీ శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు రూ.1000 కోట్ల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ను ప్రారంభించారు. క్రూయిజ్ ప్రత్యేకతలు.. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్లో 18 సూట్స్ ఉన్నాయి. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్లో పట్నా, జార్ఖండ్లో సాహిబ్గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్కతాకి 35వ రోజున బంగ్లాదేశ్లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్కి చేరుకుంటుంది. చదవండి: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు -
గంగా నదిలో హైలెస్సా..
ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగావిలాస్ అని పిలిచే ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి. భారత్ ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యాన వనాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు. ఈ నెల 13, శుక్రవారం నాడు ఈ నౌక ప్రయాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకా ప్రయాణం విశేషాలేంటో తెలుసుకుందాం. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్లో 18 సూట్స్ ఉన్నాయి. ► గంగావిలాస్ మొదటి జర్నీ కోసం 32 మంది న్యూజిలాండ్ పర్యాటకులు ఏకంగా నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ► ఇందులో ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రోజుకి రూ.25,000 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అంటే మొత్తం ప్రయాణానికి 12 లక్షల 50 వేలు ఖర్చు అవుతుంది. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్లో పట్నా, జార్ఖండ్లో సాహిబ్గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్కతాకి 35వ రోజున బంగ్లాదేశ్లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్కి చేరుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్ వీడియో: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
-
షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
లఖ్నవూ: అప్పటి వరకు అందిరితో సంతోషంగా గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తోన్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో వెలుగు చూసింది. ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల వ్యక్తి నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఆ వ్యక్తి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాధితుడు మనోజ్ విశ్వకర్మగా గుర్తించారు. పిల్పాని కాత్రా ప్రాంతంలో వివాహ వేడుకలో పాల్గొన్నాడు మనోజ్. తన కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించటంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. मातम में बदलीं खुशियां! डांस करते हुए अचानक शख्स गिर पड़ा। हार्ट अटैक से मौत हो गई। पिछले कुछ समय से अक्सर अचानक हार्ट अटैक की वजह से मौत की खबरें देखने को मिल रही हैं।#viralvideo #Kashi #Varanasi pic.twitter.com/u2pgatY2mc — Chandani Sahu (@Chandanijk) November 29, 2022 ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాశీలో నేటి నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న పురాతన సంస్కృతి, శతాబ్ధాల జ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ‘సంగమం’ భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుక అని అన్నారు. మన దేశంలోని నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ-తమిళనాడు సంగమం, గంగా యమునా సంగమం లాగే పవిత్రమైనదని తెలిపారు. కాశీ.. భారత దేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని అయితే తమిళనాడు.. దేశ పురాతన చరిత్రను కలిగి ఉందని వ్యాఖ్యినించారు. చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు.. కథలేమైనా ఉంటే ఆ డైరెక్టర్కి చెప్పండి.. సినిమా తీస్తారు! ఇక కాశీలో 30 రోజుల పాటు తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళ వంటకాలు యూపీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. తమిళ సంగీతం కాశీలో మారుమోగనుంది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు. In Varanasi, addressing the 'Kashi-Tamil Sangamam.' It is a wonderful confluence of India's culture and heritage. https://t.co/ZX3WRhrxm9 — Narendra Modi (@narendramodi) November 19, 2022 -
జ్ఞానవాపీ కేసులో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన సుప్రీంకోర్టు
-
Gyanavapi Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే సందర్భంగా జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మే17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మసీదులో శివలింగాన్ని గుర్తించిన వాఘూఖానా ప్రాంతాన్ని సీజ్ చేయాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. చదవండి: (Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్) -
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు
లక్నో: జ్ఞాన్వాపీ కేసులో హిందువుల పిటిషన్ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్ను తిరస్కరించింది. జ్ఞాన్వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట -
‘వందే భారత్’కు ఏమైంది?.. వరుసగా మూడో రోజూ..!
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోయింది. తాజాగా మరో వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడి మొరాయించింది. శనివారం న్యూఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన ఎక్స్ప్రెస్ రైలులో ట్రాక్షన్ మోటార్ జామ్ అయి మధ్యలోనే ఆగిపోయింది. ‘వారణాసి వందే భారత్(ట్రైన్ నంబర్ 22436) కోచ్ సీ8లోని ట్రాక్షన్ మోటార్ వీల్ బేరింగ్ విఫలమైంది. దీంతో ధన్కౌర్, వెయిర్ స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయి అధికారులు. దీంతో రైల్లోనే ఉన్నసాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్ప్రెస్ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్ప్రెస్లో గమ్యస్థానానికి చేర్చాం. సమస్య తలెత్తిన బోగీని నిర్వహణ డిపోకి తీసుకెళ్లి తనిఖీ చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ’ అని రైల్వే శాఖ వెల్లడించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి శతాబ్ది ట్రైన్లోకి మారుతున్న ప్రయాణికులు మరోవైపు.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడో రోజు. గత గురువారం ముంబయి- గాంధీనగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు.. అహ్మదాబాద్ సమీపంలోని వట్వా రైల్వేస్టేష వద్ద గేదెలను ఢీ కొట్టింది. దీంతో రైలు ముందు భాగం ఊడిపోయింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబయికి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆనంద్ స్టేషను సమీపంలో ఆవును ఢీకొట్టింది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది. ఇదీ చదవండి: వందే భారత్ రైలు ఘటన.. గేదెల యజమానులపై కేసు -
‘జ్ఞానవాపి’ కేసు విచారణ వాయిదా
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్–డేటింగ్ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై లిఖితపూర్వకంగా స్పందించాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి సూచించింది. మసీదు కాంప్లెక్స్లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని, ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని విన్నవిస్తూ హిందూ మహిళ ఒకరు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ) ఆర్డర్ 26 రూల్ 10 కింద ఈ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేయడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని కోర్టును కోరామని పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్ -
పోలీసుల చెంతకి ‘దెయ్యం’ వీడియోలు.. ఎఫ్ఐఆర్ నమోదు
వైరల్: దెయ్యాల భయంతో ఆ ప్రాంతంలో స్థానికులు మాత్రం రాత్రిపూట వణికిపోతున్నారు. ఈ మేరకు వీడియోలు సైతం వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. వారణాసి(యూపీ) వీడీఏ కాలనీలోని బడీ గబీ దగ్గర తెల్ల ముసుగులో ఆకారాలు బిల్డింగ్ల మీద సంచరిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అలా మూడు వీడియోలు రావడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా పోలీసుల దాకా వెళ్లాయి. దీంతో ఆగంతకుల పనిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. వారణాసిలో అలాంటి ఘటనలేం జరగలేదని, అవసరమైన ప్రచారంతో ఆందోళన కలిగించొద్దని వీడియోలను వైరల్ చేస్తున్న వాళ్లను కోరారు డీసీపీ. बनारस में छतों पर एक सफेद कपड़ा पहने भूत के चलने का वीडियो तेजी से वायरल हो रहा है, चश्मदीदों ने पुलिस से जांच की मांग की है... pic.twitter.com/e8KqvvYIr0 — Banarasians (@banarasians) September 22, 2022