Prime Minister
-
Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.జవహర్లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది. నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్ప్రెస్ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
'మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపింది'.. ప్రధానికి హీరో రిప్లై!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ పీఎంవో నుంచి వచ్చిన లేఖపై స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపిందని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాతృమూర్తి సరోజా సంజీవ్ (86) కన్నుమూసింది. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ కూడా వచ్చింది. తాజాగా ఆ లేఖకు హీరో సుదీప్ రిప్లై ఇచ్చారు. Honarable @PMOIndia @narendramodi ji, I am writing to sincerely thank you for this compassionate condolence letter. Your thoughtful words provide a source of comfort during this profoundly difficult time.Your empathy has touched my heart deeply, and I am truly grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024 -
నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను కొందరు చంపాలని చూస్తున్నారని, భద్రత పెంచాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సహా మోదీ కూడా తనకు శత్రువులే అని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా..మీరు (చంపాలనుకున్నవారు) చస్తే నరకానికి పోతారు’అంటూ వ్యాఖ్యానించారు. పలు విషయాలపై తాను కేసులు వేస్తూ పోరాడుతున్నానని, ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్ సహా.. బీజేపీ,ఆర్ఎస్ఎస్, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది గ్రూప్–1 అభ్యర్థులపై పోలీ సులు దాడులు చేయడం అమానుషమన్నారు. -
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్గా చేరింది. యాక్టివిస్ట్గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
‘ప్రపంచ డిమాండ్ను తీర్చే భారత్’
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్ను భారత్ తీరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విభాగంలో భారత్లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.‘సమీప భవిష్యత్తులో భారత కంపెనీలకు సెమీకండక్టర్ల కొరత తీరనుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఏర్పడే డిమాండ్ భర్తీ చేసే సత్తా భారత్కు ఉంది. విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇన్ని విధాలా సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలో దాదాపు 85,000 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్ అండ్ డీ నిపుణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిప్ల తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నాం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువవుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.సెమీకండక్టర్ తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్గా మర్చే లక్ష్యంతో ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ను 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి ఆవిష్కరణల గురించి తెలియజేస్తారు. దాంతో స్థానికంగా చిప్ల తయారీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.భారత సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 23.2 బిలియన్ డాలర్ల(రూ.1.93 లక్షల కోట్లు) విలువను కలిగి ఉంది. 2028 నాటికి ఇది దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విభాగం 17.10% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్కు చుక్కెదురు!దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐదు కంపెనీలకు వీటి తయారీ కోసం కేంద్రం అనుమతులు జారీ చేసింది. అందులో టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్, మైక్రాన్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సీజీ పవర్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కేన్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీలున్నాయి. -
హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!
హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..ఆమె పేరు పేటోంగ్టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు. ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!) -
భారత్కు మలేషియా ప్రధాని.. పీఎం మోదీతో భేటీ
భారత్- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.ప్రధాని హోదాలో ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు. #WATCH | Prime Minister of Malaysia Dato’ Seri Anwar bin Ibrahim arrives in New Delhi on a three-day state visit to India He was received by MoS V Somanna pic.twitter.com/rfXPn48Zph— ANI (@ANI) August 19, 2024 -
పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 21 పోలాండ్లో పర్యటించనున్నారు. ఆగష్టు 23న యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు.కాగా భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్లో ప్రధాని తొలి పర్యటన ఇది. గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన నెల రోజుల తర్వాత మోదీ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు.2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించారు. అయితే భారతదేశం వంటి స్నేహపూర్వక దేశాలు దానితో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. -
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
-
కోట్లకు పడగలెత్తిన బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి సేవకుడు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచలనంగా మారింది. ఆ సేవకుని ఆస్తుల విలువ దాదాపు రూ.284 కోట్లని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. గతంలో ఆ సేవకుడు ప్రధాని హసీనా భవనానికి వచ్చే అతిథులకు నీరు, టీ, స్నాక్స్ అందించేవాడని సమాచారం.ఢాకా ట్రిబ్యూన్ తెలియజేసిన వివరాల ప్రకారం ఆ సేవకుడని పేరు జహంగీర్ ఆలం. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. పీఎం షేక్ హసీనా కార్యాలయంతోపాటు ఆమె ఇంట్లో పనిచేసే సమయంలో ఆయన పలువురి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ పనులు ఇప్పిస్తానంటూ చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఆ సేవకుడు ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణాలు సాగించేవాడని తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పీఎం హసీనా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా జహంగీర్ అమెరికాకు వెళ్లపోయాడని తెలుస్తోంది.బంగ్లాదేశ్కు చెందిన మాజీ ఆర్మీ చీఫ్, పోలీసు అధికారి, పన్ను విభాగపు అధికారి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రధాని షేక్ హసీనా ఇంటిలో పనిచేసిన మాజీ సేవకుని బాగోతం కూడా బయట పడింది. కాగా ప్రధాని షేక్ హసీనాకు కోట్లకు పడగలెత్తిన సేవకుని గురించి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బంగ్లాదేశీయుడు ఇంత సంపదను కూడబెట్టడానికి చాలా ఏళ్లు పడుతుందని, అతని విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో తలసరి ఆదాయం రూ. 2.11 లక్షలుగా ఉంది.ఈ ఉదంతంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికార ప్రతినిధి వహిదుజ్జామాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటిలోని పనివానికే భారీ ఆస్తులు ఉన్నప్పుడు యజమాని ఆస్తి ఎంతో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ఆ సేవకుడిని ఇంకా అరెస్టు చేయలేయకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ అజీజ్ అహ్మద్పై కూడా అవినీతి ఆరోపణలు రాగా, సంబంధిత అధికారులు అజీజ్కు ఆస్తులను జప్తు చేశారు. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. -
విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’
ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం పార్లమెంట్లో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు అవిశాస్వ తీర్మానాలను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్టకగా.. చివరిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.అయితే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఓలీని తదుపరి ప్రధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్లమెంట్లో నేపాలీ కాంగ్రెస్కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువగా ఉంది. -
Video: 14 ఏళ్లు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత సైకిల్పై ఇంటికి!
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి పనులు చేసినా.. గర్వం, అహంకారం దరిచేరకుండా నిరాడంబరంగా ఉండాలనేది దీని సారంశం. కొందరికి డబ్బు, అధికారం అందగానే గొప్పగా జీవిస్తుంటారు.. కానీ మరికొందరు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్గానే జీవిస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచారు. డచ్ ప్రధాని మార్క్ రుట్టే..ఇటీవల జరిగిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి రుట్టే సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.రుట్టే సైకిల్పై వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన సైకిల్పై అధ్యక్ష భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్’ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్పై వచ్చి తన నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయన.అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయడం ఆ దేశ ఆచారమని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతులతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారో, అలాగే వెళ్లిపోవడం అక్కడ జరుగుతుందట. ఇక ఇక 14 ఏళ్లు నెదర్లాండ్స్ ప్రధానిగా సేవలు అందించిన మార్క్ రుట్టే.. వచ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నారు.After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister's Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024 -
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్గంజ్లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
మూడోసారి ప్రధానిగా మోదీ..కాళ్ల బేరానికొచ్చిన చైనా?!
భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. కేంద్రంలో మూడోవిడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. వాస్తవాధీనరేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా అక్రమిత టిబెట్లోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది.దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ తెలిపారు.ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని,తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్లోని చైనా రాయబార కార్యలయం ఎక్స్ వేదికగా స్పందించింది. మూడో విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా,భారత్లు పొరుగు దేశాలు. సంబంధిత సరిహద్దు సమస్యలను సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు దేశాల్లో అభివృద్ది,శాంతికి అనుకూలంగా ఉన్నాం.భారత్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్లో పేర్కొంది. -
మోదీ మూడోసారి ప్రధాని కాగానే..
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన వెంటనే జార్ఖండ్లోని గుమ్లాకు చెందిన వ్యక్తి తన అవతారాన్ని మార్చుకున్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పొడవాటి, జుట్టు గడ్డంను కత్తిరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..జార్ఖండ్లోని గుమ్లాలో గల సిసాయి బ్లాక్లో నివసిస్తున్న ముఖేష్ శ్రీవాస్తవ డేవిడ్ ప్రధాని మోదీకి వీరాభిమాని. దీంతో ఆయన పలు సందర్భాల్లో మోదీ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాకనే తన జుట్టు, గడ్డం కత్తిరించుకుంటానని ప్రకటించాడు. మోదీ మూడోమారు ప్రధానిగా ఎంపికకాని పక్షంలో తన జీవితాంతం ఇలా గడ్డంతోనే ఉంటానని చెప్పాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల ముందు ప్రమాణం కూడా చేశాడు.నాటి సందర్భం గురించి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఒక రోజు తాను మార్కెట్లో ఉన్నప్పుడు, 2024లో నరేంద్ర మోదీ మరోమారు ప్రధాని కాలేరని ప్రతిపక్షానికి చెందిన కొందరు స్నేహితులు అన్నారని, అప్పుడు తాను వారితో మోదీ మూడోసారి ప్రధాని కాకపోతే తాను జీవితాంతం షేవింగ్ చేసుకోనని ప్రమాణం చేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తన కల నెరవేరిందని, మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఇప్పుడు తాను క్షవరం చేయించుకుంటానని డేవిడ్ తెలిపాడు. -
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవరికి ఏ పదవులు?
Updateప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్కు చెందిన జేడీయూకి రెండు శాఖలు లభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ సీనియర్ నేతలు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్లను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా.. రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ నాథ్ ఠాగూర్ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరించనున్నాయనే అంశంపై సర్వత్రా చర్చనీయాంగా మారింది. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీలక పదవులు కోరుతూ తమతమ డిమాండ్లను మోదీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ తనవద్దనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి పదవులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్నట్లు సమాచారం.ఇక శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 242 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్డీయేలో భాగమైన టీడీపీి 16 స్థానాలు, నితీష్కుమార్కు చెందిన జేడీయూ 14, ఏక్నాథ్ షిండే నేత!త్వంలోని శివసేన 7, లోక్జనశక్తి రామ్ విలాస్ 3 చోట్ల విజయం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది. -
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్ఖడ్తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
‘లోక్సభ’లో ఓడినా... ప్రధానులైన నేతలు వీరే!
దేశంలోని ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే పలు విచిత్ర ఉదంతాలు మనకు కనిపిస్తాయి. వీటిలోని కొన్నింటిని విన్నప్పుడు మనకు ఒక పట్టాన నమ్మాలని అనిపించదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే నాటి ఎన్నికల్లో దిగ్గజనేతలైన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి, నరసింహారావు ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తదుపరి 12 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో దేశానికి ప్రధానులుగా మారడం విచిత్రం. చంద్రశేఖర్ జనతా పార్టీ నుంచి నాడు ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ తన సంప్రదాయ స్థానమైన బల్లియా(యూపీ) నుంచి పోటీకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్కు చెందిన జగన్నాథ్ చౌదరి 53,940 ఓట్ల తేడాతో సునాయాసంగా చంద్రశేఖర్ను ఓడించారు. ఆ తర్వాత 1990లో చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1984లొ దక్షిణాదిలో బీజేపీ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీ జంగారెడ్డి 54,198 ఓట్ల తేడాతో నరసింహారావుపై విజయం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత సీ జంగా రెడ్డి. 1991లో నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి 1984 ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో వాజ్పేయి ఓటమి పాలయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996లో దేశానికి ప్రధాని అయ్యారు. -
'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..! మామిడి పండు జ్యూస్ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్షేక్లు, జామ్లు, ఊరగాయలు, ఐస్క్రీమ్లు,డెజర్ట్లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. 'మ్యాంగో మ్యాన్'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్కతాలోని 'హుస్న్ ఎ ఆరా' అనే మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వేరియంట్ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్పూర్కు చెందిన ఆశోక్ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి అని పేరు దక్కించుకుంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. (చదవండి: కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!) -
1966 to 1977: ఇందిరమ్మ శకం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది. పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్సభ కాలం వేదికగా నిలిచింది. ఇందిరాగమనం... పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. 361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది. చైనా, పాక్తో యుద్ధాలు నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది. భారత్లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు. సిరా చుక్కకు నాంది ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది. మూడో లోక్సభ కాలంలో ముఖ్య పరిణామాలు ► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి ► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం ► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం ► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం ► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం మూడో లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 494) పార్టీ సీట్లు కాంగ్రెస్ 361 సీపీఐ 29 స్వతంత్ర పార్టీ 18 ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 భారతీయ జన సంఘ్ 14 ఇతరులు 40 స్వతంత్రులు 20 – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ మరోమారు ప్రధాని కావాలంటూ ప్రార్థనలు!
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో శ్రీరాముడు కొలువైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని భగవంతుణ్ణి వేడుకుంటూ యాగాలు, ప్రార్థనలు ప్రారంభించారు. బాబ్రీ మసీదు కేసు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ ఖురాన్ పఠించి, ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని కావాలని వేడుకున్నారు. అలాగే జగద్గురు పరమహంస ఆచార్య.. మోదీ కోసం ప్రార్థనలు చేశారు. అయోధ్య మతపరమైన నగరమని, ఇక్కడి ప్రజల ప్రార్థనలు దేవతలు తప్పకుండా వింటారని, ఇక్కడ ఏ పూజ చేసినా, ప్రార్థించినా దైవం స్వీకరిస్తాడని ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. అయోధ్యలోని తపస్వి కంటోన్మెంట్కు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ పాలన దేశానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలన్నారు. -
PM Narendra Modi: అవినీతిపరులు ఒక్కటవుతున్నారు
జమూయి/కూచ్బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు. గురువారం బిహార్లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్లోని కూచ్బెహార్లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. -
ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్లెన్స్ అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోదనకు గాను ‘ప్రైమ్ మినిస్టర్ ఎక్స్లెన్స్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ), బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’పై ప్రశంసలు కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్పీలు, ట్యాబ్ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ట్యాబ్ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, స్విఫ్ట్చాట్ యాప్, బైజూస్ కంటెంట్ను ఇంజినీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటున్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. తరగతులను బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్ఈ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్, హెచ్ఎంలు ఉన్నారు. -
జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్డేట్స్ ప్రధాని మోదీ కామెంట్స్.. భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుంది. మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చాను. వందల కోట్ల రూపాయలు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తున్నాం. తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసే లేదిప్పుడు. తెలంగాణాతో పాటు, దేశం మొత్తం మళ్ళీ బీజేపీ కావాలని కోరుతోంది. సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలి. అందుకే బీజేపీకే ఓటు వేయాలి. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని!. నేను భారతమాత పూజారిని. ఇండియన్ అలయెన్స్కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలి. చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర. శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదు, వారిని తుదముట్టించాలి. తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తెలంగాణా ఏటీఎం కార్డులా మారింది. తెలంగాణాను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవ్. ఆ రెండు పార్టీలు మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయి. మోదీ తెలంగాణా ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడు.. తెలంగాణాను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడని. కాంగ్రెస్ కాదది స్కాంగ్రెస్. ఢిల్లీలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్ఎస్ ఏం చేసిందో చూశారు. కాబట్టి ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులు. మీరెన్ని సీట్లలో తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణాలో అంత అభివృద్ధి జరుగుతుంది. వికసత్ తెలంగాణా కావాలంటే బీజేపీని అత్యంత మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపించాలి కిషన్రెడ్డి ప్రసంగం.. మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు ఆర్టికల్ 370 నుంచి మొదలుపెడితే.. రామమందిర నిర్మాణం వరకు సుస్థిర పాలన రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు, పసుపు బోర్డు, గ్రామపంచాయతీ నిధులివ్వడం.. వీటన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎంత అంకితభావంతో చేస్తుందో చూస్తున్నాం సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది కాళేశ్వరం, లిక్కర్, దళితబంధు, భూ కేటాయింపుల పేరిట దోపిడీలకు పాల్పడింది కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంతో తెలంగాణా రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది కుక్క తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుతుంది ఆరు గ్యారంటీలని చెప్పి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడవసరమా..? అందుకే మళ్లీ మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముంది. జగిత్యాల: అర్వింద్ కామెంట్స్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి జగిత్యాలలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్రెడ్డి జగిత్యాల బీజేపీ సభకు వర్షం ముప్పు? సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి జగిత్యాల బయల్దేరిన ప్రధాని మోదీ జగిత్యాలలో కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభ సభలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ పాల్గొననున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్న ప్రధాని. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ఎయిర్పోర్ట్కు చేరుకుని.. ప్రత్యేక హెలికాఫ్టర్లో జగిత్యాల వెళ్తారు. నిన్నసాయంత్రం ఏపీ చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బసచేశారు. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్ను ఆదేశించారు. -
ప్రధాని రోడ్ షోకు అనుమతి నిరాకరణ
చెన్నై: లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీలు సైతం అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల పర్యటన చేపట్టిన మోదీ.. వచ్చేవారం మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు. మార్చి 18న ప్రధాని కోయంబత్తూర్లో 3.6 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు లక్షమంది పాల్గొనే అవకాశముందని తెలిపింది. అయితే కోయంబత్తూర్లో నిర్వహించే ప్రధాని రోడ్షోకు రాష్ట్ర పోలీసులు అనుమతివ్వలేదు. భద్రతాపరమైన కారణాలు, ప్రజలకు అసౌకర్యం, ముఖ్యంగా విద్యార్ధులకు ఇబ్బంది తదితర కారణాల దృష్ట్రా జిల్లా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే రోడ్షో కోసం బీజేపీ ఎంచుకున్న మార్గం మత ఘర్షణలు చెలరేగేందుకు అవకాశాలున్న ప్రాంతమని పోలీసులు పేర్కొన్నారు. కాగా మోదీ రోడ్ షో చేసే కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురంలో 1998లో వరస పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడ మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీలు, సంఘాలకు రోడ్షోలకు అనుమతి ఇవ్వడం లేదు. చదవండి: కేరళలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ -
ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ నెల 15న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ..మల్కాజ్గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలదళం..ప్రచారపర్వంలోకి జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్షా నగరంలో పర్యటించగా..పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి రాష్ట్రానికి వస్తుండడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్షోలు నిర్వహిస్తోంది. మల్కాజ్గిరిలో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. పీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు 5 కి.మీ. మేర పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 121, 121 (ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ► రేపు సాయంత్రం 4.55కి బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్న ప్రధాని ► సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు. ► 6.40 గంటలకు రాజ్ భవన్ చేరుకోనున్న ప్రధాని.. రాజ్భవన్లో బస. ► ఈ నెల 16న ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని ► 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ వెళ్లనున్న మోదీ ► 11.45 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ►ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గా వెళ్లనున్న ప్రధాని. -
ఈసీల నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్చంద్ర పాండే రిటైర్ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, లోక్సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్ అరుణ్గోయెల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదీ చదవండి.. ఈసీ కసరత్తులు చివరికి ఎల్లుండే షెడ్యూల్ -
కమెడియన్ శ్రద్ధా జైన్పై ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రద్ధగా నవ్విస్తుంది! శ్రద్ధా జైన్.‘శ్రద్ధా జైన్ తెలుసా?’ అని అడిగితే – ‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ– ‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే ‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే. బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ అలియాస్ ‘అయ్యో శ్రద్ధా’ ‘ఇంటర్నెట్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల ‘నేషనల్ క్రియేటర్స్’ అవార్డ్ అందుకుంది హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది శ్రద్ధా జైన్. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. 2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్కు సంబంధించి ఫేస్బుక్ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్ డైరెక్టర్గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది... ‘కంటెంట్లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్ఫ్లూయెన్సర్ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్ క్యారెక్టర్ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. మొదట్లో రియల్ ఎస్టేట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ. ఏ బ్రాండ్ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్ చేయడం నుంచి స్క్రీన్ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్ పట్టదు. కాన్సెప్ట్ డిస్కషన్ మీటింగ్ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఫిక్స్డ్ స్టైల్కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ‘ఫిక్స్డ్ స్టైల్’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. రేడియా జాకీ, డ్యాన్స్ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్... ఇలా శ్రద్ధా జైన్ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్ జీ’ సినిమాతో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్ ఫిల్మ్లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’ అంటున్న శ్రద్ధ పోస్ట్–గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి టైమ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది -
హైతీ ప్రధాని రాజీనామా
పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
HAITI: హైతీ ప్రధాని రాజీనామా
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: హైతీ ప్రధాని ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకుగాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతం చేయాలని అమెరికా కూడా ఇప్పటికే కోరింది. హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో తొలుత శాంతి భద్రతలు పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
10 ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!
దేశంలోని ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు. ‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. 10 రైళ్ల వివరాలు ఇవే.. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సికింద్రాబాద్-విశాఖపట్నం మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై) పాట్నా- లక్నో న్యూ జల్పాయిగురి-పాట్నా పూరీ-విశాఖపట్నం లక్నో – డెహ్రాడూన్ కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రాంచీ-వారణాసి ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. Honourable PM @narendramodi ji virtually flags off Second Vande Bharat Express between Secunderabad & Visakhapatnam, facilitating swift connectivity between #Telangana & #AndhraPradesh.#VandebharatExpress #ModiKiGuarantee pic.twitter.com/t8nDqOlqzi — Dr K Laxman (Modi Ka Parivar) (@drlaxmanbjp) March 12, 2024 ప్రారంభించిన కిషన్రెడ్డి సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. Live: Flagging off 4th Vande Bharat Train From Telangana, Secunderabad - Visakhapatnam (Train Number 20707), Secunderabad Railway Station. https://t.co/wkmmWP0wth — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024 మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు అహ్మదాబాద్లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్లలో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi offers floral tributes to Mahatma Gandhi at Mahatma Gandhi Ashram at Sabarmati, in Ahmedabad, Gujarat. He will inaugurate Kochrab Ashram and launch the Master plan of Gandhi Ashram Memorial here. pic.twitter.com/x95WUUF7Tt — ANI (@ANI) March 12, 2024 -
ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు. ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వందే భారత్ బీహార్లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో చేరుకోగలుగుతారు. -
నేడు భారీ సొరంగాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం 13 వేల అడుగుల ఎత్తులో నిర్మితమయ్యింది. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. భారత్ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం. దీనితో పాటు ఇటానగర్లో 20కి పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తేజ్పూర్ చేరుకున్న ప్రధానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కజిరంగా నేషనల్ పార్క్కు ప్రధాని చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి అనంతరం (ఈరోజు)శనివారం ఉదయం కజిరంగా అభయారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని ఇటానగర్కు వెళతారు. ప్రముఖ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని శనివారం హోలోంగథర్లో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీనికి 'శౌర్య విగ్రహం' అని పేరు పెట్టారు. జోర్హాట్లోని మెలాంగ్ మెటెల్లి పొతార్లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అసోంలో రూ. 768 కోట్ల వ్యయంతో డిగ్బోయ్ రిఫైనరీ విస్తరణ కోసం గౌహతిలో ఐఓసీఎల్కు చెందిన బెత్కుచి టెర్మినల్ను ప్రధాని ప్రారంభించనున్నారు. -
పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత షెహబాజ్ షరీఫ్.. మొదటి సారి ప్రధాని అయ్యారు. షెహబాజ్షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్ల సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక.. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి.. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ను ప్రకటించింది. తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా గెలుపొందారు. -
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM — ANI (@ANI) February 25, 2024 దీనికి ముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi performs pooja and darshan at Beyt Dwarka temple. pic.twitter.com/U2gZUVB3k4 — ANI (@ANI) February 25, 2024 -
నేడు లారా థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం!
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశ స్టేషన్ను దాదాపు రూ.15,800 కోట్లతో అభివృద్ధి చేశామని, రెండో దశ ప్రాజెక్టుకు రూ.15,530 కోట్ల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుండి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా ఛత్తీస్గఢ్లో రూ.600 కోట్ల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్లోని రాజ్కోట్లో తొలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఐదు ఎయిమ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్లు ఉన్నాయి. -
18 ఏళ్ల నిరీక్షణకు తెర.. కల్కి ధామ్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
‘తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని’ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని మోదీ పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో పది గర్భాలయాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు. #WATCH | At the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal, Uttar Pradesh CM Yogi Adityanath says, "In the last 10 years, we have seen a new Bharat... The country is moving ahead on the path of development in the new Bharat..." pic.twitter.com/fjSfnwyLpa — ANI (@ANI) February 19, 2024 -
నేడు కల్కిధామ్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్లో నిర్మితం కానున్న కల్కి ధామ్కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖలో తెలియజేసింది. -
పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం
లిస్బన్: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది. ఇదీ చదవండి.. థాయ్ మాజీ ప్రధానికి పెరోల్ -
Prime Minister Narendra Modi: విష వలయంలో కాంగ్రెస్
జైపూర్/రేవాడీ: కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అంటే... ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు. తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. -
తెలంగాణకు విద్యుత్.. ఎన్టీపీసీ నోఖ్రా ప్రాజెక్ట్ నేడు జాతికి అంకితం
న్యూఢిల్లీ: రాజస్తాన్లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్టీపీసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. -
జంటగా చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..!
వృద్ధాప్యంలోకి వచ్చాక..భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ముందు చనిపోవడం సహజం. మిగిలిని వారు ఆ విరహాన్ని తట్టుకోవడం కూడా అసాధ్యమే. చాలామటుకు ఆ బెంగతో మిగిలినవారు మహా అయితే ఆరు నెలలు లేదా ఏడాదిలోపు చనిపోవడం జరుగుతుంది. అయితే కొందరూ మరణంలోకూడా జంటగా కలిసే చనిపోవాలనుకుంటారు. అలాంటి అవకాశం అందరికీ రాదు కూడా. బహుశా అందువల్లే వృధాప్యంలో ఉన్న వాళ్లను ఒంటరిగా వదిలేయరేమో!. కానీ ఇక్కడొక వ్యక్తి ఓ దేశానికి ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వృధాప్యంలోకి చేరిన అతను మరణంలో కూడా భార్యని విడిచిపెట్టకూడదనుకున్నాడు. అందుకోసం వాళ్లేం ఏం చేశారో వింటే..కన్నీళ్లు ఆగవు.! వివరాల్లోకెళ్తే..డ్రైస్ వాన్ అగ్ట్ అనే వ్యక్తి నెదర్లాండ్ మాజీ ప్రధాని. అతను ప్రధానిగా 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు. ఆయనకు యూజీనీ అనే భార్య ఉంది. ప్రస్తుతం అగ్ట్కి 93 ఏళ్లు కాగా, అతడి భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయసు ఉంటుంది. ఇరువురు వృధాప్యంలోకి చేరిపోయారు. అయితే డ్రైస్కి 2019 నుంచి బ్రెయిన్ హేమరేజ్తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి అతను మంచం మీదే ఉన్నాడు. ఇక అతని భార్య కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు, పైగా ఇరువురిలో ఎవరూ ముందు చనిపోయినా తట్టుకునే లేదు. దీంతో ఇరువురు జంటగా మరణించాలనే ఉద్దేశ్యంతో ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. అలా ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు. వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు. ఇదిలా ఉండగా, నెదర్లాండ్లో "ద్వంద అనాయాస" లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్ను తీసుకును చనిపోలానుకోనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇలానే 2021లో 13 జంటలు, 2022లో ఏకంగా 29 జంటలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. నిజానికి దీన్ని ఇంగ్లీష్లో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని అంటారు. అయితే నెదర్లాండ్ దేశంలో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్ దేశం 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. దీన్ని ఆరు షరతులతో అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్ను ఇస్తారు. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
లంచ్ విత్ మోదీ!
న్యూఢిల్లీ: సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పార్లమెంట్లో వాడీవేడి చర్చలతో అలసి మధ్యాహ్నం భోజనానికి సిద్ధమవుతున్న పలువురు విపక్ష ఎంపీలకు హఠాత్తుగా పిలుపు వచి్చంది. ప్రధాని మోదీ కలవాలనుకుంటున్నారని దాని సారాంశం. అంతా లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా పార్లమెంట్ క్యాంటిన్ వద్ద దిగి విజిటర్స్ లాంజ్లో వేచి చూస్తున్నారు. ‘‘పదండి. మీకో శిక్ష విధిస్తాను’ అని చమత్కరిస్తూ వారందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు. 45 నిమిషాలపాటు కబుర్లు చెప్పుకున్నారు. వారిలో బీజేపీ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు కె.రామ్మోహన్ నాయుడు (టీడీపీ), సస్మిత్ పాత్రా (బీజేడీ), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), రితేశ్ పాండే (బీఎస్పీ) ఉన్నారు. నిద్ర ఎప్పుడు లేస్తారు? ఆహార అలవాట్లు మొదలుకుని అంతర్జాతీయ వ్యవహారాలదాకా అన్ని అంశాలు అక్కడ చర్చకొచ్చాయి. రోజూ ఎన్నింటికి నిద్ర లేస్తారు బిజీ షెడ్యూల్ను ఎలా అలసిపోకుండా నిర్వహిస్తారు వంటి ఎంపీల ప్రశ్నలకు మోదీ సరదాగా సమాధానాలిచ్చారు. ‘‘నేనెప్పుడూ ప్రధానిని అన్న మూడ్లో ఉండను. మంచి ఆహారం తినాలనే మూడ్లోనూ ఉంటాను’’ అని చమత్కరించారు. కిచిడీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. ఒకే రోజులో వేర్వేరు రాష్ట్రాల పర్యటనలు, విదేశీ ప్రయాణాలు, గుజరాత్ గురించి పట్టింపుల వంటివెన్నో విషయాలు చర్చకొచ్చాయని ఒక ఎంపీ వెల్లడించారు. ప్రాణహాని ఉందంటూ ఎస్పీజీ హెచ్చరించినా 2015లో పాకిస్థాన్కు వెళ్లి నాటి పీఎం నవాజ్ షరీఫ్ను ఎందుకు కలవాల్సి వచ్చిందో మోదీ వివరించారు. అందరూ అన్నం, పప్పు, కిచిడీ తిన్నాక రాగి లడ్డూ రుచిచూశారు. తామంతా కూర్చున్నది మోదీతోనేనా అనే అనుమానం ఒక్కసారిగా కల్గిందని ఒక ఎంపీ చెప్పారు. ‘‘ ప్రధానితో కలిసి భోజనం చేయడం అరుదైన అనుభవం. మేం చకచక ప్రశ్నలు అడుగుతుంటే ఆయన టకటక సమాధానాలిస్తున్నారు’’ అని మరో ఎంపీ చెప్పారు. ఇదీ చదవండి.. తాతకు భారతరత్న.. మనవడు ఎన్డీఏ కూటమిలో చేరిక -
అప్పుడు రాముడు.. ఇప్పుడు ప్రధానిగా.. అందరి కళ్లు అతనిపైనే!
బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'ఆర్టికల్ 370'. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ రద్దు అంశమే తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో యామి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముని పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ఆయన కనిపించారు. చాలా మంది అభిమానులు ట్రైలర్లో ప్రధాని మోడీగా కనిపించిన అరుణ్ గోవిల్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో కనిపించిన కిరణ్ కర్మాకర్ని నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. #ArunGovil as Modi Ji in Upcoming movie #Article370 #YamiGautam पहचान गए तो एक लाइक तो बनता है pic.twitter.com/A4mfbLCF6r — 📍 (@ghatnachakr) February 8, 2024 Symbolism galore. Arun Govil who played Lord Ram playing PM Modi. Trailer looks quite amazing. Looks like a high octane action drama. If things work out can be a great hit. Yami is too good an actress. #Article370 https://t.co/n9pUvpyXYn — Ujjawal Pratap Singh (@pratap_pablo) February 8, 2024 -
ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్
పాక్లో నేడు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) (పీఎంఎల్ (ఎన్)) చీఫ్ షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని షరీఫ్ లాహోర్లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో షరీఫ్ మాట్లాడుతూ తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటింగ్కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తాత్కాలిక కేంద్ర సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్లోని ఎన్-46లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కాగా బుధవారం బలూచిస్థాన్ ప్రావిన్స్లోని పిషిన్, ఖిలా సైఫుల్లాలో జరిగిన జంట ఉగ్రదాడుల్లో పలువురు మరణించారు. వందలమంది గాయపడ్డారు. -
భారత్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారా?
రేపు అంటే 2024, ఫిబ్రవరి ఒకటిన దేశ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశంలో బడ్జెట్ చరిత్ర 180 సంవత్సరాల పురాతనమైనది. బ్రిటీష్ వారి కాలం నుంచి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఒకరు భారత బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భముంది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. 1946 ఫిబ్రవరి 2న పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ భారతదేశ బడ్జెట్ను సమర్పించారు. నిజానికి ఆ సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో లియాఖత్ అలీఖాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ బడ్జెట్ను భారత్, పాకిస్తాన్ విభజనకు ముందు ప్రవేశపెట్టారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తదనంతర కాలంలో లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధాని అయ్యారు. మహ్మద్ అలీ జిన్నాకు సన్నిహితుడైన లియాఖత్ అలీఖాన్ ఈ బడ్జెట్ను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (నేటి పార్లమెంట్ హౌస్)లో సమర్పించారు. చరిత్రలో నేటికీ ఈ బడ్జెట్ను ‘పేదవారి’ బడ్జెట్గా పిలుస్తుంటారు. ఈ బడ్జెట్పై దేశంలోని పారిశ్రామికవేత్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు చాలా కఠినంగా ఉంచారు. దీని కారణంగా వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై ప్రతి లక్ష రూపాయల లాభంపై 25 శాతం పన్ను విధించాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అంతేకాదు కార్పొరేట్ ట్యాక్స్ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత లియాఖత్ అలీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ బడ్జెట్ను ప్రజలు హిందూ వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణించారు. వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఇంత పన్ను విధించారని ఆరోపించారు. హిందూ వ్యాపారులంటే లియాఖత్కు నచ్చరని, అందుకే వారిని దెబ్బతీసేందుకు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారనే విమర్శలు వచ్చాయి. భారత్-పాక్ విభజన తరువాత అలీ ఖాన్ పాకిస్తాన్ మొదటి ప్రధాని అయ్యారు. అతను అక్కడ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేదు. 1951లో లియాఖత్ అలీని కాల్చి చంపారు. -
ఆయిల్, గ్యాస్ కంపెనీల చీఫ్లతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం దేశ, విదేశీ ఆయిల్, గ్యాస్ కంపెనీల చీఫ్లతో భేటీ కానున్నారు. గోవాలో ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు నిర్వహించే ఇండియా ఎనర్జీ వీక్లో భాగంగా ఈ సమావేశం చోటుచేసుకోనుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధాని దృష్టి సారించనున్నారు. ఈ విషయాన్ని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి ప్రకటించారు. ఆయిల్ అండ్ గ్యాస్కు సంబంధించి గతంలో సీఈఆర్ఏ ఇండియా వీక్ పేరిట నిర్వహించే కార్యక్రమం ఇప్పుడు ఇండియా ఎనర్జీ వీక్ పేరుతో జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హౌతి మిలిటెంట్లు ఎర్ర సుమద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న తరుణంలో ఈ ఏడాది సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో మాదిరే ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈవోలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇండియా–యూఎస్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్టేబుల్ సమావేశం కూడా జరగనుంది. ఎర్ర సముద్రం సంక్షోభం మన చమురు సరఫరాలకు విఘాతం కలిగించకపోయినా, దారి మళ్లింపు వల్ల రవాణా వ్యయం పెరిగినట్టు పురి చెప్పారు. మొత్తం మీద సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తున్నట్టు తెలిపారు. -
‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’
లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు. నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు. చదవండి: బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు. 1943, జూలై 4న సింగపూర్లోని క్యాథే భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు. -
ప్రధానికి టాలీవుడ్ స్టార్ హీరో రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు, అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందిచారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. https://t.co/w9Kk48BQVJ — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 20, 2024 -
రైతు మల్లికార్జున్ యువతకు ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ/ చొప్పదండి: ఉన్నత విద్య అభ్యసించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినా.. దానిని వదులుకొని స్వగ్రామంలో పర్యా వరణహిత పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు మల్లికార్జున్ రెడ్డి యువతకు ఆదర్శప్రాయుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వ్యవ సాయంలో ఉన్న విస్తృత అవకాశాలకు వీరు బలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో మార్గదర్శకంగా నిలవాలన్నారు. విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధా ని మోదీ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదా రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్ప దండి మండలం పెద్దకూర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జున్రెడ్డి, ఆయన ఇద్దరి కుమార్తె లతోనూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ.. తాను మంచి రైతు గా ఎదగడానికి విద్య ఎంతో సహాయపడిందన్నారు. పశుపోషణ, ఉద్యానవనాల సాగుతోపాటు ప్రకృతి సేద్యం, ఔషధ మొక్కల పెంపకం చేపట్టా నని వివరించారు. సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సమీకృత, పర్యావరణహిత వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న తన ఆదాయం రూ.12 లక్షలకు పెరిగిందని తెలిపారు. రైతులకు స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విద్యావంతులైన యువత వ్యవసాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మల్లికార్జున్ చేస్తు న్న సమీకృత వ్యవసాయంపై విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సెమినార్లలో అవగాహన కల్పించాల న్నారు. వ్యవసాయంలో భర్తకు చేదోడుగా నిలిచిన సంధ్య వంటివారు భారత నారీ శక్తులని అభివర్ణించారు. వ్యవసాయంలో ఉన్న అవకాశాలకు మీరే బలమైన ఉదాహరణ అన్నారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో ఆదర్శంగా నిలవాల ని.. విద్యార్థులను, యువతను కలసి వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతు లకు కల్పిస్తున్న పలు పథకాలను ప్రధాని వివరించారు. వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వేస్తున్న వడ్డీ వివరాలను ప్రధాని అడగడంతో.. సాలీనా ఏడు శాతం వేస్తున్నారని మల్లికార్జున్ చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాని ఆ వడ్డీ మూడు శాత మేనని, మళ్లీ బ్యాంకులో సంప్రదించి తెలుసుకో వాలని సూచించారు. కాగా.. చొప్పదండి మార్కెట్ యార్డు నుంచి మల్లికార్జున్రెడ్డి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చది విన మల్లి కార్జున్రెడ్డి గతంలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆయన తోపాటు సతీమణి సంధ్య ఇద్దరూ తమ ఉద్యోగాలను వదిలేసి స్వగ్రామానికి వచ్చారు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవనాల సాగు, పశు పోషణ చేపట్టారు. సమీకృత వ్యవసాయం, ప్రకృతి సేద్యంపై ప్రచారం చేయడంతోపాటు సమీప ప్రాంతాల్లో రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐకార్ సంస్థ అందించిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు పొందారు. ఎంతో ఆనందంగా ఉంది.. ప్రధానితో మాట్లాడే అవకాశం రావడం మరిచిపోలేనిది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి తగిన గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలిసివస్తున్నాయి. గతంలో నాకు కూడా ఈ పథకాలు తెలియవు. నేను సాయిల్ హెల్త్కార్డు తీసుకోవడం ద్వారా.. నా పొలానికి భూసార పరీక్ష చేయించా. అనువైన పంటలు వేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం పొందుతున్నాను. పీఎం కృషి సంచాయి యోజన కార్డు, పీఎం కిసాన్ క్రెడిట్కార్డు ఎంతో ఉపయోగపడ్డాయి. నేచర్ ఫార్మింగ్ పథకం లబ్ధి కూడా పొందాను. – రైతు మల్లికార్జున్రెడ్డి ప్రధాని ప్రశంసలను మర్చిపోలేను నేను ఎంబీఏ చేసి.. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశాను. మా ఆయన ప్రకృతి వ్యవసాయం చేయాలని సంకల్పించడంతో.. స్వగ్రామానికి తిరిగి వచ్చాం. సేంద్రియ వ్యవసాయంతోపాటు హార్టికల్చర్, పశువుల పెంపకం, వంటివి చేపట్టి ఆదాయం పొందుతున్నాం. ప్రధాని నన్ను ఉద్దేశించి నారీశక్తి అని ప్రశంసించడం మర్చిపోలేని గుర్తింపు. మా ఇద్దరు పిల్లలు కూడా స్వగ్రామంలోనే చదువుకుంటూ మాకు సహకరిస్తున్నారు. – సంధ్య, మల్లికార్జున్రెడ్డి సతీమణి -
'నా సామిరంగ'.. దెబ్బకు టికెట్స్ క్యాన్సిల్ చేశా: నాగార్జున కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' అంటూ వచ్చేశాడు కింగ్ నాగార్జున. నాగార్జున, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కింగ్ నాగార్జున్ మాల్దీవుస్ అంశంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం. కాగా.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున) నాగార్జున మాట్లాడుతూ..'అటు బిగ్బాస్తో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా 75 రోజుల పాటు షూటింగ్తో ఉన్నా. ఫెస్టివల్ తర్వాత 17,18 తేదీల్లో మాల్దీవుస్ వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్. కానీ మన ప్రధాని మోదీపై వాళ్లు చేసిన కామెంట్స్ను చూసి నేను టికెట్స్ క్యాన్సిల్ చేశా. అంతే కానీ.. నేను భయంతో టికెట్స్ రద్దు చేసుకోలేదు. వాళ్లు చేసింది కరెక్ట్ కాదు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు లీడర్గా ఉన్నా మన ప్రధాని పట్ల వారు వ్యవహరించిన తీరు సరైంది కాదు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మన ఇప్పటి నుంచి లక్షద్వీప్లోని బంగారం ఐల్యాండ్స్కు వెళ్దాం' అంటూ నవ్వుతూ అన్నారు. కాగా.. నా సామిరంగ అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్ , రుక్సార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతమందించారు. -
France PM Gabriel Attal: ఒక ‘గే’ ఫ్రాన్స్కు ప్రధానిగా ఎలా ఎదిగారు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. గాబ్రియేల్ అటల్కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు. గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్తో సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు. అటల్ పారిస్లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్లో పీజీ పట్టా పొందారు. అటల్ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది. -
నేటి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్’
గాంధీనగర్/అహ్మదాబాద్: 10వ ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్–హోరా్ట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో సంబంధాలపై చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోదీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రాత, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మారి్టన్, సుజుకీ మోటార్ కార్పొరేసన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ తదితరులు వీరిలో ఉన్నారు. గాంధీనగర్లో ‘వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో–2024’ను మోదీ ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. -
ఫ్రాన్సు ప్రధానిగా గాబ్రియెల్ అట్టల్
పారిస్: ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్క్ డైన 34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీ య ఒతిళ్లు ఎదురవుతు న్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మా క్రాన్ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమ వారం రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అట్టల్ను నియమిస్తున్నట్లు మంగళవారం మాక్రాన్ ప్రకటించారు. మంత్రి వర్గంలో కొందరు కీలక మంత్రులు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ం ప్రతినిధిగా, విద్యాశాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గాబ్రియెల్ అట్టల్ ప్రధాని పదవి చేపట్టడం ఆసక్తికరంగా మారింది. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్ మొట్టమొదటి ప్రధాని అట్టల్ కావడం గమనార్హం. బోర్న్ మంత్రి వర్గంలో అట్టల్ అత్యధిక ప్రజాదరణ కలిగిన మంత్రిగా ఓపీనియన్ పోల్స్లో వెల్లడైంది. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
పాక్లో సత్తా చాటుతున్న మహిళా నేతలు వీరే!
పాకిస్తాన్లో 2024 ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ఖాన్ నామినేషన్పై ఓ వైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ ఎన్నికల రంగంలోకి దిగడం కూడా ఉత్కంఠ రేపుతోంది. పురుషాధిక్య పాకిస్తాన్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొందరు మహిళా నేతలు కూడా ఉన్నారు. వారెవరో.. వారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం. మరియమ్ నవాజ్: పాకిస్తాన్ రాజకీయాల్లో అగ్రశ్రేణి మహిళా రాజకీయ నేతలలో మరియమ్ నవాజ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుల్సూమ్ నవాజ్ల కుమార్తె. ఆమె తన తండ్రితో పాటు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయలా మాలిక్: ఇమ్రాన్ ఖాన్ ప్రచార నిర్వాహకురాలు ఆయలా. ఈమె మామ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సర్దార్ ఫరూక్ అహ్మద్ ఖాన్ లెఘారీ. ఆయలా సోదరి సుమైరా మాలిక్ కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అలీజ్ ఇక్బాల్: పాకిస్తాన్ మాజీ ఎంపీ అలీజ్ ఇక్బాల్ హైదర్ అక్కడి ప్రముఖ మహిళా నేతల్లో ఒకరు. అలీజ్ తండ్రి ఇక్బాల్ హైదర్ చట్టసభ సభ్యుడు. అలీజ్.. బిలావల్ భుట్టో జర్దారీకి ప్రతినిధిగా కూడా ఉన్నారు. షాజియా మేరీ: పాక్ మహిళా నేతలలో షాజియా మేరీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. షాజియా మేరీ సింధీ బలూచ్ పాకిస్తాన్ రాజకీయనేత. ఆమె 2002లో సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హీనా రబ్బానీ ఖర్: పాక్కు చెందిన మహిళా నేత హీనా రబ్బానీ ఖర్ తన ప్రత్యేక ప్రసంగాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీనా రబ్బానీ ఖర్ 2011- 2013 మధ్య కాలంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. కష్మలా తారిక్: కష్మలా తారిక్ పాక్లో మహిళల రక్షణకు పాటుపడుతున్నారు. ఆమె 2018 నుండి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కష్మలా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు. షర్మిలా ఫారూఖీ పాక్ రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన మహిళా నేతగా షర్మిలా ఫారూఖీ పేరొందారు. ప్రస్తుతం షర్మిల పాకిస్తాన్లోని సింధ్ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు. మార్వి మెమన్: మార్వి మెమన్ ప్రస్తుతం బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగానూ పేరొందారు. హీనా పర్వేజ్ బట్ హీనా పర్వేజ్ బట్ తరచూ ప్రజల మధ్య తిరుగుతూ ఉత్తమ నేతగా పేరు తెచ్చుకున్నారు. హీనా.. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్మెడల్ సాధించారు. సుమైరా మాలిక్ మానవ హక్కుల కార్యకర్తగా సుమైరా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పాక్ మహిళల అభిమానాన్ని సుమైరా చూరగొన్నారు. -
రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి
తిరుచిరాపల్లి/లక్షద్వీప్: రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్ర ప్రభుత్వం విశ్వసించే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆయన మంగళవారం తమిళనాడులో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర విమానయానం, ఓడ రేవులు, రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహాయ వాయువు, అణు శక్తి, ఉన్నత విద్యకు సంబంధించిన రూ.20,140 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలుత భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400సార్లు పర్యటించారని చెప్పారు. తమిళనాడు అభివృద్ధితో ఇండియా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అభివృద్ధికి కీలక మార్గమని అన్నారు. దీనివల్ల కీలక రంగాల్లో పెట్టుబడులు, తద్వారా వ్యాపారం, వాణిజ్యం పెరుగుతాయని, ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువతకు ఇది మంచి సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. లక్షద్వీప్లో మోదీ.. రూ1.1,50 కోట్లకుపైగా విలువైన పలు జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ మంగళవారం లక్షద్వీప్కు చేరుకున్నారు. అగత్తీ ఎయిర్పోర్టు వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. లక్షద్వీప్లో గత పదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
లవ్ గురూగా మారిన పాక్ ప్రధాని!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ లవ్ గురూ!గా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహమాడవచ్చని సమాధానమిచ్చారు. న్యూఇయర్ సందర్భంగా మాట్లాడిన వీడియో సందేశంలో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ వ్యక్తి పాక్ ప్రధాని అన్వర్-ఉల్-హక్-కాకర్ను అడగగా.. 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానమిచ్చారు. డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏమి చేయాలి అనే మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ.. తన జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మందిని ఆకట్టుకున్నానని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. 'అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.' అని కాకర్ స్పందించారు. సరైన అత్తగారు లేకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంక్షోభ నిర్వహణ కోర్సులో చేరాలని ఫన్నీగా చెప్పారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్ను ఎంపిక చేశారు. పాక్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఇదీ చదవండి: వన్ ఉమన్ షో! -
ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించింది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఈ ఏడాది(2023)లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం, జీ-20 విజయవంతంపై ప్రజలు ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాది(2023) దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మోదీ తెలిపారు. ఆయన దేశ ప్రజలకు కొత్త ఏడాది(2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత్ దేశం సాధించిన పలు ఘనతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం భారత్లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 2024లో సైతం ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మనమేంటో నిరూపించామని, శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణమని తెలిపారు. ‘నాటు...నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని, ఎలిఫెంట్ విస్పరర్సకు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని ఆనందం వ్యక్తం చేశారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామని మోదీ అన్నారు. ఇది చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్లో 111 పతకాలతో సత్తా చాటామని పేర్కొన్నారు. అలాగే వన్డే ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచిందని అభిప్రాయపడ్డారు. అండర్-19 టీ20 ప్రపంచ కప్లో మహిళల జట్ట విజయం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్వించేలా చేశాయని తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్కు భారత క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతంగా నిర్వహించామని, ‘మేరీ మాటీ-మేరా దేశ్’వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశంలో 70 వేలకు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని, ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్గా మారిందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని మోదీ అన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటెంట్ల సంఖ్య పెరిగిందని దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. చదవండి: New Year 2024: భారత్లో ఐదుసార్లు నూతన సంవత్సర వేడుకలు -
అయోధ్య పర్యటనలో మోదీ.. ప్రధానికి సాదర స్వాగతం (ఫొటోలు)
-
2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు. మే 19.. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. జూన్ 20.. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్ను సందర్శించారు. జూన్ 22.. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు. జూలై 13.. బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో చర్చలు జరిపారు. ఆగస్టు 22.. జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన. సెప్టెంబర్ 6.. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు. నవంబర్ 30.. ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ... -
ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై చర్చించిన్నారు. పాలమూరు-డిండి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపించారు. కాగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి వీరిద్దరు నేతులు దేశ ప్రధానిని కలుస్తున్నారు. కాగా ఆరున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా.. ఈ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణను ఆదుకునేందుకు తగిన ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్, భట్టిలు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కె.సి.వేణుగోపాల్తో పాటు వీలును బట్టి రాహుల్గాందీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి -
Birthday Special: ‘వాజపేయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు?
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: గుడ్బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ.. -
20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్కర్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ధన్కర్ స్వయంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్కర్ వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కాగా మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కకర్ మిమిక్రీ చేశారు. పార్లమెంట్ మెట్ల వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన ధన్కర్.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్’ వివాదం పార్లమెంట్ను కుదిపేస్తోంది. పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి. Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty… — Vice President of India (@VPIndia) December 20, 2023 -
ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్తోనే ఆపార్టీలు పార్లమెంట్ సెషన్ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు -
ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్కమ్ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
చిన్న నగరాలే కీలకం
న్యూఢిల్లీ: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు. మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం.