కలకలం రేపిన ‘ గోనెసంచి మూట’ | - | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ‘ గోనెసంచి మూట’

Published Thu, Jun 22 2023 7:52 AM | Last Updated on Thu, Jun 22 2023 8:29 AM

- - Sakshi

నిజామాబాద్: మండల కేంద్రం శివారులోని చెరువు సమీపంలో గోనె సంచి మూట బుధవారం కలకలం రేపింది. మూటలో మృతదేహం ఉందని అనుమానించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి హుటాహూటిన చేరుకున్నారు. గోనె సంచి మూటను తెరువగా అందులో కుక్క మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఇలా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement