మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

Published Mon, Mar 3 2025 1:18 AM | Last Updated on Mon, Mar 3 2025 1:19 AM

మద్యానికి  బానిసై ఒకరి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

పిట్లం: మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల ముందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలంలోని కోమటి చెరువు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోమటి చెరువు తండాకు చెందిన రమావత్‌ అనిల్‌ (22) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంమీద విరక్తితో శనివారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి తులసిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement