డాక్యుమెంట్‌కో ధర.. వసూళ్లకు దళారి | - | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్‌కో ధర.. వసూళ్లకు దళారి

Published Tue, Mar 4 2025 2:22 AM | Last Updated on Tue, Mar 4 2025 2:22 AM

డాక్యుమెంట్‌కో ధర.. వసూళ్లకు దళారి

డాక్యుమెంట్‌కో ధర.. వసూళ్లకు దళారి

కాసులు కురిపిస్తున్న రిజిస్ట్రేషన్లు

ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన డీఆర్‌..

ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లు

ఖలీల్‌వాడి: డాక్యుమెంట్‌ను బట్టి ధర.. డబ్బులు వసూలు చేసేందుకు దళారి.. ఇదీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న ట్రెండ్‌. రిజిస్ట్రేషన్‌ అంటేనే కాసుల పంట అనే స్థాయికి పరిస్థితి చేరింది. చిన్నచిన్న తప్పులను కప్పిపుచ్చి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకునేందుకు ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు ఖర్చుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాసుల పంట పండుతోంది.

ఇళ్లు, ఇంటిస్థలాలకు రిజిస్ట్రేషన్లు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం తహ సీల్‌ కార్యాలయాల్లో చేస్తుండగా, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు డీటీసీపీ అప్రూవల్‌, నాలా కన్వర్షన్‌ తప్పనిసరిగా ఉండాలి. వాటికే రిజిస్ట్రేషన్‌ చేయా ల్సి ఉంటుంది. అలాకాకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయభూములు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా మార్చి స్థానిక డాక్యుమెంట్‌ రైటర్లు లేదా రిజిస్ట్రేషన్‌ అధికారులతో ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ లకు డాక్యుమెంట్‌ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. పాత ఇళ్లకు జీపీలు, కార్పొరేషన్‌, మున్సిపాలిటీల నుంచి ఓనర్‌ షిప్‌ సర్టిఫికెట్‌ తీసు కుని చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు బతికి ఉంటే వాటికి సంబంధించిన వివరాలు పెట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డెత్‌ సర్టిఫికెట్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ జతచేసి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. లేనిపక్షంలో ఆ ఇంట్లోని పెద్ద ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సబ్‌ రిజిస్ట్రార్లు నిర్ణయించిన ప్రకారం డబ్బులు చెల్లిస్తే ఓకే.. లేదంటే కొర్రీలు పెడతారు.

వసూళ్లు ఇలా..

సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వచ్చిన డ్యాకుమెంట్‌ను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఆ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా లేదా దళారి ద్వారా తీసుకుంటారు. డ్యాకుమెంట్‌ రైటర్ల వద్ద సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రతి శనివారం రిజిస్ట్రేషన్లకు సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటారనే ప్రచారం ఉంది.

జిల్లాలో ఏసీబీకి చిక్కినవారు..

ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్‌(డీఆర్‌)తోపాటు ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్‌లు ఏసీబీకి చిక్కారు. 2016లో నిజామాబాద్‌ రిజిస్ట్రర్‌ మోహన్‌ ఏసీబీకి చిక్కగా ఆ తరువాత సబ్‌రిజిస్ట్రార్‌లు సతీశ్‌, శ్రీనాథ్‌, శ్రీధర్‌, ఆనంద్‌ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా నిజామాబాద్‌ అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రర్‌–2 శ్రీరామరాజు ఏసీబీకి చిక్కారు.

ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌, స్వీపర్‌

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యా లయంలోని అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు, స్వీపర్‌ రంగ్‌సింగ్‌ వెంకట్రావులు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే లంచం ఇచ్చిన బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం బాధితుడు సోమవారం ఉదయం 11.50 గంటలకు సబ్‌రిజిస్ట్రార్‌ చెన్నమాధవేణి శ్రీరామరాజు వద్దకు వెళ్లగా నే డాక్యుమెంట్‌ను కౌంటర్‌లో, లంచం డబ్బులు స్వీపర్‌ రంగ్‌సింగ్‌ వెంకట్రావుకు ఇవ్వాలని చెప్పా రు. బాధితుడు డాక్యుమెంట్లను కౌంటర్‌లో ఇచ్చి అనంతరం స్వీపర్‌ వెంకట్రావును కలిశారు. బాధితుడిని స్వీపర్‌ వెంకట్రావు కార్యాలయ అధికారులు భోజనం చేసే గదిలోకి తీసుకువెళ్లి రూ.10 వేలు తీసుకుని జేబులో పెట్టుకొగానే అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు డబ్బులు డిమాండ్‌ చేయడంతో కెమికల్‌ పూసిన రూ.10 వేలు ఇచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. స్వీపర్‌ వెంకట్రావును పట్టుకున్న అనంతరం విచారణ జరిపి సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇద్దరిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కాగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరా మరాజు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల సందర్భంగా కార్యాలయంలో రెండుగంటల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వెయిటింగ్‌ హాల్‌ నుంచే సబ్‌రిజిస్ట్రార్‌–1 రిజిస్ట్రేషన్లు చేశారు.

శ్రీరామరాజు ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నుంచి నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. మొదట్లో డాక్యుమెంట్‌ రైటర్లతో వివాదం జరిగింది. రిజిస్ట్రే షన్‌లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత నవంబర్‌లో డాక్యు మెంట్‌ రైటర్లు ధర్నా చేశారు. గతంలో రామరాజు నిర్మల్‌ జిల్లా భైంసాలో పని చేస్తున్న సమయంలో ఇల్లీగల్‌ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్‌ చేశారనే ఆరోపణలు ఆదిలాబాద్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. అక్కడ రామరాజును సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement