కలిసికట్టుగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పోరాటం

Apr 12 2025 2:15 AM | Updated on Apr 12 2025 2:15 AM

కలిసి

కలిసికట్టుగా పోరాటం

విద్యార్థి సంఘాలు,

పూర్వ విద్యార్థుల డిమాండ్‌

త్వరలో కార్యాచరణ

‘సాక్షి’ చర్చాగోష్టిలో

ముక్తకంఠంతో వెల్లడి

తెయూలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందే

తెయూ(డిచ్‌పల్లి)/నిజామాబాద్‌ అర్బన్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. తెయూలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం జి ల్లా కేంద్రంలోని కార్యాలయంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్టిలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వర్సిటీ పూర్వ విద్యార్థులు పా ల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి యూనివర్సిటీ సాధించుకున్నామని పే ర్కొన్నారు. జిల్లా ప్రజలు, విద్యార్థుల మనోభావాలను గుర్తించి దివంగత సీఎం, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాష్ట్రం పేరుతో తెలంగాణ యూనివర్సిటీ మంజూరు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే ఓయూ, కేయూ తర్వాత మూడో అతిపెద్ద యూనివర్సిటీ తెయూ అని, 577 ఎకరాల సువిశాల ప్రాంగణం వర్సిటీ సొంతమన్నారు. తెయూ ఏర్పడి 18ఏళ్లు గడిచినా జిల్లా ప్రజాప్రతినిధుల అసమర్థతతోనే ఇంతవరకు ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు అంశాన్ని ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. వర్సిటీలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసే వరకు విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి కలసికట్టుగా పోరాడాలని, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు.

కలిసికట్టుగా పోరాటం1
1/1

కలిసికట్టుగా పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement