గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు | Harishrao Tweet On Congress Government Guarantees Cheating | Sakshi
Sakshi News home page

గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు

Published Sun, Oct 6 2024 1:42 PM | Last Updated on Sun, Oct 6 2024 3:16 PM

Harishrao Tweet On Congress Government Guarantees Cheating

సాక్షి,హైదరాబాద్‌:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి  కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్‌6) ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన ఒక పోస్టు చేశారు.

‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్‌ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.

ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్‌-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్‌రావు యువతకు పిలుపునిచ్చారు. 

ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్‌ కాదు.. లూఠిఫికేషన్‌: కేటీఆర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement