guarantees
-
ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఎనిమిది రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది. ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి, మనీశ్ సిసోడియా తదితరుల సమక్షంలో పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ రెండో మేనిఫెస్టోను సోమవారం ‘కేజ్రీవాల్ గ్యారంటీ’పేరిట విడుదల చేశారు. ‘‘బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు. మేం మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు కచ్చి-తంగా అమలు చేస్తాం. ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదు’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ 15 గ్యారంటీలు ఇవే.. → వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి → మహిళా సమ్మాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రూ.2,100 నగదు జమ → సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స → తప్పుడు నీటి బిల్లుల మాఫీ → 24 గంటలు తాగు నీటి సరఫరా → యూరప్తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు → యమునా నదిని శుభ్రం చేయడం → డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్షిప్ పథకం → విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ → పూజారి–గ్రంథి సమ్మాన్ యోజన కింద హిందూ ఆలయాల్లో అర్చకులు, గురుద్వారాల్లో గ్రంథీలకు జీతభత్యాల కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు → సొంతిళ్లవారితోపాటే అద్దెకు ఉంటున్న వారికీ ఉచిత విద్యుత్, నీరు → మురుగు నీటిపైపులైన్ల మరమ్మతు, ముగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం → అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డుల జారీ → ఆటో, టాక్సీ, ఇ–రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్ → రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు -
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది
-
కాంగ్రెస్ తరఫున నేను హామీ ఇస్తున్నా
-
ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది
-
సీఎం రేవంత్ మహారాష్ట్రలో చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.రేవంత్రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్ -
కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బడ్జెట్ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?చదవండి: కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: మోదీ ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరనీయులైన ఖర్గే గారు..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN— KTR (@KTRBRS) November 1, 2024 -
ఆచరణసాధ్యమైన హామీలే ఇవ్వాలి
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విచ్చల విడిగా ప్రకటిస్తున్న గ్యారంటీలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. నోటితో నమలగలిగే దాని కంటే ఎక్కువ మింగేయకూడదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి సరితూగేలా ఉండాలని స్పష్టంచేశారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని తేల్చిచెప్పారు. కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న ‘శక్తి’ పథకాన్ని పునఃసమీక్షించాలని భావిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ... రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హామీలు ఇచ్చే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక బాధ్యత అనేది ఉండాలన్నారు. భవిష్యత్ తరాలు నష్టపోతాయి ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చారు. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్రలోనూ ఐదు గ్యారంటీలు ఇచ్చారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు వార్తాపత్రికలు చదవడం లేదనిపిస్తోంది. కానీ, నేను చదువుతున్నా. అందుకే ఈ విషయం చెబుతున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గ్యారంటీల పేరిట హామీలు ఇవ్వొద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సలహా ఇస్తున్నా. దానికి బదులు రాష్ట్ర బడ్జెట్కు సరిపోయే హామీలే ఇవ్వండి. రాష్ట్రం దివాలా తీసే గ్యారంటీలు వద్దు. ఇష్టానుసారంగా గ్యారంటీలు ఇచ్చేస్తే రేపు రోడ్లు వేయడానికి కూడా డబ్బులు ఉండవు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ప్రభుత్వం మరో పదేళ్లు ఎన్నో ఇక్కట్లు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఖర్గే చేసిన ఘాటైన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. శక్తి పథకాన్ని కేవలం పునఃసమీక్ష చేస్తామని మాత్రమే డి.కె.శివకుమార్ చెప్పారని, రద్దు చేస్తామని అనలేదని వివరించారు. దీనిపై ఖర్గే బదులిస్తూ.. డి.కె.శికుమార్ మాట్లాడింది ఏదైనప్పటికీ బీజేపీ విమర్శలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చారని తప్పుపట్టారు. వక్రీకరించారు: డి.కె.శక్తి పథకంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని డి.కె.శివకుమార్ చెప్పారు. పథకాన్ని రద్దు చేస్తా మని తాము ప్రకటించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బస్సుల్లో ప్రయా ణానికి స్వచ్ఛందంగా చార్జీలు చెల్లించడానికి మహిళల్లో ఒక వర్గం సిద్ధంగా ఉందని మాత్రమే తాను అన్నానని ఉద్ఘాటించారు. చార్జీలు చెల్లించడానికి కొందరు మహిళలు ముందుకొచ్చినప్పటికీ తీసు కోవడానికి కండక్టర్లు భయపడుతున్నారని తాను చెప్పానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. శక్తి పథకాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. భావోద్వేగాలతో ఆడుకుంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే విపక్షాల పని అని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వ గ్యారంటీల మోడల్ను చూసి గర్వపడు తున్నామని డి.కె.శివకుమార్ చెప్పారు. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి. -
ఉచిత హామీలపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్ -
సర్కార్పై సమరానికి సై!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై సమరానికి ‘కమల దళం’సై అంటోంది. ఆరు గ్యారంటీలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీసేందుకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు ప్రారంభించగా.. విస్తృతస్థాయిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పోరాటాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.హైడ్రా, మూసీ అంశాలపై..‘హైడ్రా’ కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో క్షేత్రస్థాయిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ‘హైడ్రా’ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా 2, 3 రోజుల్లో కార్యాచరణను ఖరారు చేయాలని.. ఇందిరాపార్కు వద్ద ధర్నా, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం ద్వారా పేదల పక్షాన బీజేపీ నిలుస్తోందనే భరోసాను కల్పించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ చేపట్టిన 24 గంటల రైతుదీక్షకు మంచి స్పందన వచ్చిందని.. దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొనడంతో వారి మధ్య సమన్వయం పెరిగిందని అంటున్నారు. ఇది కలసివచ్చే అంశమని చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల సమస్యలు, పెండింగ్ బిల్లులపై నిరసనలు, ఆందోళనలను ప్రారంభించినా.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, పంచాయతీలు, మండలాల్లో నిధుల లేమి తదితర అంశాలపై భారీగా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.‘కొత్త’ కాంబినేషన్తో ముందుకు!బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఇతర నాయకులు ఓ టీమ్గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస కార్యక్రమాలు చేపడుతుండటం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ ఇద్దరు నేతలు పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారా? అనే చర్చ సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు చొరవగా> అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య సమన్వయం, సయోధ్య సాధించడంలో విజయం సాధించారని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కూడా విజయవంతం కావడం ‘కొత్త’ కాంబినేషన్కు మరింత కలసి వచ్చిందని అంటున్నారు. దీనిని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు.. హైడ్రాతో పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో నిధుల లేమి, సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారని పేర్కొంటున్నారు.దూకుడు పెంచిన నేతలు..జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జిగా బిజీగా ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఇటీవల ‘హైడ్రా’, మూసీ కూల్చివేతలపై తీవ్రంగా స్పందించారు. పేదల జోలికొస్తే కాంగ్రెస్ సర్కార్ పతనాన్ని శాసిస్తామంటూ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలతో అందరి దృష్టిని ఆకర్షించారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోని చెరువుల పరిధిలో పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చడంపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో బాధిత ప్రజలను కలసి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో తమ సొంత డబ్బులతో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదంటూ మాజీ సర్పంచ్లు చేస్తున్న ఆందోళనకు ఈటల మద్దతిచ్చారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది. నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
ఇమామ్, మౌజన్లకు వేతనాలేవి బాబూ!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా ఒక్కటీ అమలు చేయలేదు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచుతానని హామీ ఇచ్చి, అసలు ఉన్న వేతనాన్ని కూడా నిలిపివేయడం ముస్లిం మైనార్టీలను నివ్వెరపరుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గౌరవ వేతనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారని, ఆయన సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే ఆరు నెలల గౌరవ వేతనం కలిపి మొత్తం రూ.45 కోట్లకు పైగా అందించి ఉండేవారని రాష్ట్రంలోని ఇమామ్లు, మౌజన్లు చెబుతున్నారు. ఇదే కాదు.. ఆదాయం లేని మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తానని బాబు ఇచ్చిన హామీ కూడా నీటి మాటే అయ్యింది. రాష్ట్రంలోని ఆదాయం లేని 6 వేల మసీదులకు నెలకు రూ.5 వేలు నిర్వహణ సాయం అందించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు, విజయవాడ వద్ద హజ్ హౌస్ నిర్మాణం, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం, ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం వంటి హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయకుండా మోసకారితనాన్ని ప్రదర్శిస్తున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. 2014లో ముస్లిం మైనార్టీలను మోసగించిన బాబు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించి, నిలువునా మోసగించారని ముస్లిం సంఘాలు మండిపడితున్నాయి. రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేకంగా వడ్డీలేని ఇస్లాం బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తానని నాడు హామీ ఇచ్చి, ఐదేళ్లపాటు దాని ఊసే ఎత్తలేదు. ఈ ఎన్నికల్లోను అదే హామీ ఇచ్చి, మరోసారి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్హౌస్లు నిరి్మస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని, వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి, పరిరక్షిస్తామని చెప్పి, ఒక్కటీ అమలు చేయలేదు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధికి రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి, అరకొరగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.జగన్ పాలనలోనే ముస్లింలకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు చెల్లించింది. ముస్లిం మైనార్టీలకు వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిని కల్పించారు. చంద్రబాబు గత పాలనలో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, అనేక మంది ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెట్టి అన్యాయంగా వేధించారు. ముస్లిం యువతపై నాటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన దేశంద్రోహం వంటి అక్రమ కేసులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా నవరత్నాలతోపాటు అనేక రకాల పథకాల ద్వారా అండగా నిలిచింది. ముస్లిం మైనార్టీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందించింది. ఐదేళ్ల కాలంలో కేవలం వైఎస్సార్ చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించింది. ప్రతి నెలా ఒకటో తేదీన సాయమందించాలి మసీదుల నిర్వహణకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందిస్తానని, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడిచినా హమీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీన మసీదుల నిర్వహణకు, ఇమామ్, మౌజన్లకు ఆర్థిక సాయం అందించాలి. –షేక్ నూరుల్లా హజరత్, ఉప్పలమర్రి మసీద్ ఇమామ్, నెల్లూరు జిల్లాఇమామ్లకు గౌరవ వేతనం పెంచి అందించాలి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇమామ్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేలు నుంచి రూ.10 వేలకు, మౌజన్ల వేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, అందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం రూ.300.68 కోట్లు, కోవిడ్ ప్రత్యేక సాయం రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.400.68 కోట్లు అందించి భరోసా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కనీసం వేతనం కూడా ఇవ్వడంలేదు. ముస్లిం సమాజానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ -
మనోడే.. విమానంలో తిప్పేద్దాం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ను నియమించుకోవచ్చు. సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి అడుగులోనూ మోసం: వైఎస్ జగన్
మళ్లీ మన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినీ మోసం చేయలేదు. ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ ఐదేళ్లలో వేధింపులకు గురి చేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అటువంటి కష్టాలు నేను చూశాను. కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుతురు కచ్చితంగా వస్తుంది. రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఇది çసృష్టి సహజం. అలాగే ఈ ఐదేళ్లు కూడా ముగుస్తాయి. మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. మన ప్రభుత్వంలో మళ్లీ మీరు, నేను ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితుల్లో ఉంటాం. ఇది కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోండి. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసమే కన్పిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిలో ఏవీ అమలు చేయకుండా, ఏవేవో కారణాలు చెబుతూ సాకులు చూపుతున్నారని ఎత్తి చూపారు. అది చంద్రబాబు నైజమని, మోసం చేయడం ఆయనకు ఎప్పుడూ అలవాటేనని గుర్తు చేశారు. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబు, టీడీపీ అలవాటు పడ్డారని.. అదే మనం విలువలు, విశ్వసనీయత మీదే రాజకీయాలు చేస్తున్నామని.. అందుకే మనకు తప్పక మంచి రోజులు వస్తాయని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉద్భోదించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తొలుత మాడుగుల, ఆ తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం ఎంతగా ఉన్నప్పటికీ సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి, మాట తప్పకుండా అమలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పని చేశామన్నారు.‘కోవిడ్ మహమ్మారి రెండేళ్లు రాష్ట్రాన్ని పీడించినా, పథకాలు దాటేయాలని ఆలోచించలేదు. క్యాలెండర్ ప్రకటించి అన్నీ అమలు చేశాం. అలా అన్నీ చేశాం కాబట్టే.. ఇవాళ్టికి కూడా మన పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త తలెత్తుకుని ధైర్యంగా ప్రతి గ్రామానికీ పోగలుగుతాడు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. ఆ ధైర్యం చంద్రబాబులో, ఆయన పార్టీలో కనిపించదు. ఎందుకంటే, ఓట్లు అడిగేటప్పుడు నీకు రూ.15 వేలు, నీకు రూ.18 వేలు సంతోషమా? అంటూ ప్రచారం చేశారు. యువకులు కనిపిస్తే.. నీకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా ఎవరు కనిపిస్తే వారికి వాగ్దానాలు చేశారు’ అని చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్ బాగానే చూసుకున్నాడు. జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా.. జగన్ పలావు పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కాస్తో కూస్తో మోసపోయి అటు వైపు వెళ్లారు. కేవలం రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంటికే వచ్చే పెన్షన్ విధానం పోయింది. ఇంటికే వచ్చే రేషన్ విధానం పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా పోయింది. శాంతి భద్రతలు నీరుగారిపోయాయి. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు. చేసిన మంచి ఎక్కడికీ పోదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు పలావు లేదు. బిర్యానీ లేదు. పస్తులుండాల్సిన పరిస్థితి.జగన్ ఉండి ఉంటే..ఇప్పుడు అదే జగన్ ఉండి ఉంటే.. ఈ పాటికి రైతు భరోసా అందేది. ఆ డబ్బులతో రైతులందరూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లులకు అమ్మ ఒడి అందేది. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపించేది. వారికి సున్నా వడ్డీ ప్రయోజనం అంది ఉండేది. విద్యాదీవెన కింద ప్రతి పిల్లాడికి మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందేది. వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవి. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఇప్పటికే జమ అయి ఉండేది. ఇంకా రైతులకు ఉచిత పంటల బీమా అమలై ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రీమియం కట్టడం లేదు. గతంలో ఏప్రిల్, మేలో ప్రీమియం కట్టేవాళ్లం. జూన్లో వ్యవసాయ పనులు మొదలయ్యేసరికి ఇన్సూ్యరెన్స్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. అవేవీ ఇవ్వకుండా చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రెండు నెలల్లోనే కనిపిస్తున్నాయి.విద్యా వ్యవస్థ దారుణం ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పీరియడ్ తీసేశారు. పిల్లలందరూ గొప్పగా ఇంగ్లిష్ చదువుకుని ఏకంగా ప్రపంచంతో పోటీ పడేలా చదువుకుంటున్న పరిస్థితులను.. కూటమి ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఉంది. విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం. ట్యాబ్లు ఇస్తారన్న నమ్మకం లేదు. గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. మార్చిలో ఎన్నికల కోడ్ రావడంతో.. బిల్లులు ఆపాల్సి వచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, ఇంటికే అందే డెలివరీ మెకానిజమ్తో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏకంగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. -
స్వర్ణముఖిలో దోపిడీకి ‘సూపర్ సిక్స్’
ఎన్నికల ముందు టీడీపీ చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలును అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసింది. కానీ, రూ.కోట్లు కూడబెట్టుకునేందుకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక ‘సూపర్ సిక్స్’ను తయారు చేసుకున్నారు. అదేమిటనుకుంటున్నారా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివర్తి నాని కనుసన్నల్లో ఆయన అనుచరులు స్వర్ణముఖి నదిలో చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లి, కొటాల, మిట్టపాళెం, శానంబట్ల, తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి, తనపల్లి ప్రాంతాల్లో ఆరు రీచ్లు అనధికారికంగా ఏర్పాటుచేశారు.రాత్రింబవళ్లు యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్లు, పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుచానూరు వద్ద పంట పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం వల్ల వర్షాకాలంలో తమ గ్రామాలను వరద ముంచెత్తుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు–పాడిపేట గ్రామాల మధ్య స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలను శుక్రవారం పాడిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రావడంతో నాని అనుచరులు ఇసుక ట్రాక్టర్లను తీసుకుని వెళ్లిపోయారు. – సాక్షి టాస్్కఫోర్స్ -
వలంటీర్ల వ్యవస్థకు ఉరి!
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికెట్ వరకు వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఆ వ్యవస్థపై కక్ష సాధిస్తోంది. ప్రజల మనసు గెలిచిన వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి కుటిల పన్నాగం పన్నిన చంద్రబాబు.. తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆ ప్రజల నుంచి వారికి సంబంధాలు లేకుండా చేయాలని నిర్ణయించారు.వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలుచంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024 ఇప్పటికే రెండు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధుల నుంచి వారిని తొలగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన రూ. 10 వేతనం పెంపు ఊసేలేదు. తాజాగా, వారి వాట్సాప్ గ్రూపులన్నింటినీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే.. ఈ చిన్న వేతన జీవులపై చంద్రబాబు సర్కార్ ఎంత కక్షగట్టిందో అర్థమవుతుంది. అధికారంలోకి రాకముందు నుంచే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఒక్కో పావు కదుపుతూ వస్తున్న చంద్రబాబు.. తానిచ్చిన ఎన్నికల హామీలనే విస్మరిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం రోజునే చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వలంటీర్ల వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల ముందు ఆయన హామీలు ఇచ్చి ఆనక మోసం చేస్తాడు అనడానికి వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయాలనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు వలంటీర్ల విషయంలో సెలవు దినం రోజే నిర్ణయం తీసుకుని భారీ మోసానికి పాల్పడటం చూస్తే.. ఇది ఆయన నైజానికి పరాకాష్టగా భావించవచ్చు.హామీలు నెరవేర్చమనడమే పాపమా? ఎన్నికల్లో ఇచి్చన, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చమని అడగడమే వలంటీర్ల విషయంలో పాపమైంది. వలంటీర్లను ఎవరినీ తొలగించబోమని, పైగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వారి వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే అధికారం చేపట్టాక వారిని పింఛన్ విధుల నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ ఇచ్చి న మేరకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. దీంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి..ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు. కాగా, ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్కార్డులను తిరిగి అందజేయలేదు. -
రామయ్యా.. హామీల మాటేమిటయ్యా.!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ⇒ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు..? సిలిండర్ల ధర జగన్ పెంచారు. ఇప్పుడు కొనలేకపోతున్నాం. ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పొయ్యల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకు లు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా ముంచేశారు. రైతుల్ని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోనే రూ. 20వేల పెట్టుబడి సా యం అందిస్తాం. ⇒ సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు రూ. 20వేలు అందజేస్తాం. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి అవసరమైన బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం.అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం.⇒ ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఫ్రీ చేసి, ఆడప డుచులు ఎక్కడ తిరగాలన్నా పైసా ఖర్చు లేకుండా చేస్తాం. ⇒చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు... నలుగురుంటే రూ.60వేలు.. ఇంకా ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15వేలు చొప్పున మీ అకౌంట్లో వేయడానికి చంద్రబాబు నిర్ణయించారు.ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవి. ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటిపోయింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పైగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు.ధరలు తగ్గించారా?వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఽనిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు. పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నా ఆ ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు. గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్పైనే వేసి ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారు.కోటలు దాటే మాటలుకేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలే దాటడం లేదని జిల్లా వాసులంటున్నారు. మత్స్యకారుల వేట విరామం సమయం దాటిపోయి చాలా రోజులైంది. మధ్యలో వర్షాలు కూడా వచ్చి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇస్తామన్న రూ.20 వేలు ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ సగానికి వచ్చేసింది. ఉడుపులు అయిపోయాయి. కానీ, వారికింతవరకు పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయమే కాదు ప్రభుత్వం విధిగా అందించాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం కన్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని నేటికీ ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఇవే కాదు మహిళలకు ప్రతి నెలా రూ. 1500, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు...అవి ఇచ్చేలోపు నెలకి రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా మర్చిపోయారు. 50 ఏళ్ల పింఛన్ ఇవ్వడం మాట దేవుడెరుగు.. ఉన్నవి తీసేస్తున్నారు.కొత్తవేవీ..?తాను ఎంపీగా ఎన్నికయ్యాకే జిల్లాలో రైల్వే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, దేశ వ్యాప్తంగా ఏం జరిగాయో అవే జరిగాయే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యతతో జరిగినవేవి లేవు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగాయి. అవన్నీ ఎంపీల వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటే.. ఇక్కడ అదనంగా చేసిందేంటో చెప్పడానికి లేవు. కేంద్రమంత్రిగా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేమైనా వస్తాయేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ ఒక్కటంటే ఒక్కటీ జిల్లాకు ప్రత్యేక కేటాయింపు లేదు. -
హామీలిచ్చాం కానీ.. ఖజానా ఖాళీ
సాక్షి, నంద్యాల, పెద్దదోర్నాల, సాక్షి, పుట్టపర్తి/ మడకశిర: సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్లామని, ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో శ్రీశైలం డ్యామ్ 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే నిండిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్, ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయని చెప్పారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు– మన సంపద కార్యక్రమం, శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సున్నిపెంటలోని యువత న్యూయార్క్లో ఉద్యోగం సంపాదించేలా స్కిల్స్ డెవలప్ చేస్తామన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని రాయలసీమకు తరలించి సీమలోని జలాశయాలన్నింటినీ నింపుతామన్నారు. రానున్న ఐదేళ్లలో కరువు అనే మాట వినపడకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మల్లన్న సాక్షిగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.సీమకు పరిశ్రమలు తెస్తాంరాయలసీమలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరూ 25 మందిని వృద్ధిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందన్నారు. నాకు సంపద సృష్టించడం తెలుసు.. దాన్ని పేదలకు పంచడమూ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీశైలం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా సహకారం అందిస్తామన్నారు. కేంద్రంతో చర్చించి సిద్ధేశ్వరం వద్ద ఐకానిక్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు విమర్శించారు. తమ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.69 వేల కోట్లను కేటాయిస్తే గత ప్రభుత్వం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. హంద్రీనీవాకు తాము రూ.5,520 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. గాలేరు నగరికి తాము రూ.2,050 కోట్లు వ్యయం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.448 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు.రాళ్లపల్లి, రత్నగిరిలో రిజర్వాయర్లు..శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో రామన్న అనే పింఛన్దారుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు రూ.4 వేలు ఫించన్ అందించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామన్నకు భూమితో పాటు పిల్లలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వితంతువు ఓబుళమ్మకు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టు రైతు రంగనాథ్ మల్బరీ ప్లాంటేషన్, రేషం షెడ్ను పరిశీలించారు. గ్రామంలోని కరియమ్మదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హంద్రీనీవాలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్.అనంతపురం వద్ద 1,600 ఎకరాలలో ఇండస్ట్రియల్ క్లస్టర్, వక్క రైతుల కోసం మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మడకశిరలో రూ.60 కోట్లతో రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. మడకశిరను రెవెన్యూ డివిజన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పుట్టపర్తి నుంచి వచ్చే జాతీయ రహదారి 7ని 44వ జాతీయ రహదారికి అనుసంధానం చేసి పెనుకొండ, గుడిబండ, మడకశిర, అమరాపురంను అనుసంధానం చేస్తామని చెప్పారు. సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం చంద్రబాబు గుండుమల ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన గుండుమల వచ్చారు. అనంతరం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.ప్రయాణికులకు అవస్థలుసీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి సున్నిపెంట చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దాదాపు రూ.12 కోట్లతో స్వామి, అమ్మవార్లకు బహూకరించిన బంగారు రథాన్ని పరిశీలించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని మ్యాప్లను పరిశీలించారు. జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడకు 50 కి.మీ. దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో భక్తులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మండల కేంద్రంలో కాకుండా మార్గం మధ్యలో బసులను నిలిపివేయడంతో చిన్న పిల్లలతో కలసి ప్రయాణిస్తున్న వారు ఇబ్బంది పడ్డారు. గేట్లు తెరవడంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు బయల్దేరిన వారికి నిరాశ ఎదురైంది. కొన్ని బస్సులు శ్రీశైలం చేరుకుని మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరాల్సి ఉంది. దోర్నాలలోనే ఇంత అలస్యమైతే తాము తిరిగి ఎప్పుడు వెళ్లాలని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం సామాజిక సమతుల్యాన్ని పాటిస్తుందన్నారు. -
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.అబద్ధాలు బయట పడకూడదనే.. » పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. » పూర్తి బడ్జెట్ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా? » దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? » మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా? » తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా? » 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? » రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హామీని అమలుచేయకుండా మోసం చేస్తారా? » 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? » రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పుడు లెక్కలు చెప్పారు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. -
అసలు అప్పెంత? బాబు బొంకెంత?
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే. గవర్నర్తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీతో తప్పులు చెప్పించిన సీఎం చంద్రబాబును మందలించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాస్తా. 2019 మే 30 నాటికి మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని స్వయంగా చంద్రబాబు గెజిట్ ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12 నాటికి ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. నాడు రూ.వంద కోట్లే ఉన్నా రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు రూ.7–8 వేల కోట్ల నిధులున్నా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నది బాబు భయం. హామీల అమలుకు నిధులు కేటాయించకుండా తప్పించుకునేందుకే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదుఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ప్రకటించి మరీ డీబీటీ ద్వారా అర్హులందరికీ కులమతాలు, పారీ్టలు, ప్రాంతాలు చూడకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా వివక్ష లేకుండా అందించాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఇచ్చాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి బటన్ నొక్కి అందచేశాం. మరి మీరిచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలను ఉదహరిస్తూ అప్పులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలు రంగు తెలిసిపోతుందనే భయంతో.. గత 52 రోజులుగా రాష్ట్రం పురోగమిస్తోందో తిరోగమిస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అణిచివేసే పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే.. పూర్తి స్థాయి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ధైర్యం లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే మోసపూరిత హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, హామీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 ప్రకారం రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పు ఎంత? లాంటి అంశాలు వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నది చంద్రబాబు భయం. అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. వంచన.. దగా.. మోసమే చంద్రబాబు విధానంచంద్రబాబు మోడస్ ఆపరండీ ఏమిటంటే.. వంచన, గోబెల్స్ ప్రచారం! ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయాలనుకున్నా... హామీల అమలుపై తప్పించుకోవాలన్నా దాన్ని అమలు చేస్తారు. ముందుగా ఒక కథ సిద్ధం చేసి తాను చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిపై చర్చలు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అందరితో అవే మాటలు మాట్లాడిస్తారు. టీవీ చర్చల్లో అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మనుషులే. చివరికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు హామీలను అమలు చేసే పరిస్థితి లేదని తీర్మానం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. వేరు పడినప్పుడు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడూ ఇదే కథ! ఎన్నికల్లో హామీలు ఇచి్చనప్పుడు.. వాటిని ఎగ్గొట్టేటప్పుడు కూడా ఇదే విధానం! ఇప్పుడు మొదటి కథగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి రాష్ట్రం నిజంగా ఆర్ధికంగా ధ్వంసమైందా? లేదా అన్నది ఒక్కసారి గమనిద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాటిపై అందరూ ఆలోచించాలి. ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే మా హయాంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ను ప్రశంసించింది. ఎఫ్ఆర్బీఎం అనుమతించిన దానికంటే తక్కువ అప్పు తీసుకున్నారని అభినందించింది. నేరుగా నగదు బదిలీ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే దీనికి కారణం. ‘క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్’ అని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది. ధర్మం వైపు నిలవండి..చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జూన్ 12వతేదీకి రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.5,655 కోట్లు వచ్చాయి. రెండోసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటా డబ్బులు జమయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి కనీసం రూ.7–8 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. అంత డబ్బు ఉన్నా డ్రామాలాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన అంశాలను.. వాస్తవపత్రం పేరుతో నేను చెప్పిన వాటిని ఒక్కసారి బేరీజు వేసి పరిశీలించండి. మీరంతా ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. విపత్తులోనూ ఆచితూచి అప్పులు» కోవిడ్ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గణనీయంగా తగ్గింది. » కేంద్ర పన్నుల వసూళ్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019–20లో –3.38% తగ్గాయి. 2020–21లో ఆ పెరుగుదల 0.85 శాతం మాత్రమే ఉంది. » సాధారణంగా ఏటా కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లలో పెరుగుదల 18 నుంచి 19 శాతం ఉంటుంది. » కోవిడ్తో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా కూడా బాగా తగ్గింది. » కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని జీఎస్డీపీ నిష్పత్తిలో తీసుకుంటే చంద్రబాబు హయాంలో 3.72 శాతం వస్తే మా హయాంలో కోవిడ్ కారణంగా 2.92 శాతానికి పడిపోయింది. » కోవిడ్ వల్ల మనకు బాగా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు.. ప్రతి రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే అవకాశం కల్పించినా చంద్రబాబు హయాంతో పోలిస్తే తక్కువే తీసుకున్నాం. » చంద్రబాబు హయాంలో కాంపౌన్డ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబులిటీస్ 21.63 శాతం అయితే మా హయాంలో 12.90 శాతమే ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అప్పులు 18.15 శాతం పెరగ్గా 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో కేవలం 13.80 శాతమే పెరిగాయి. ఎక్కువ అప్పులు చేసిన బాబు గొప్పవాడా? తక్కువ చేసిన మేం ఆర్థిక విధ్వంసకారులమా? ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని దు్రష్ఫచారం చేస్తూనే.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్, సూపర్ టెన్ అంటూ చంద్రబాబు హామీలిచ్చారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రజలు అడుగుతుండటంతో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవు. బడ్జెట్లో చూపించలేక అధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రూ.14 లక్షల కోట్లు కాస్తా రూ.10 లక్షల కోట్లకు తగ్గించారు. పోనీ నిజాలు చెప్పించారా? అంటే అదీ లేదు! » చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.1,18,051 కోట్ల అప్పులు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి రూ.5.18 లక్షల కోట్లకు చేరాయి. » ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.5,744 కోట్లు ఉండగా ఆయన హయాం ముగిసే నాటికి రూ.50 వేల కోట్లకు ఎగబాకాయి. అనంతరం మా హయాం ప్రారంభమయ్యే నాటికి రూ.50 వేల కోట్లతో మొదలైన అప్పులు చివరకు రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి. » ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు.. అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు 2014 జూన్ 2 నాటికి రూ.26 వేల కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి రూ.86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. » మొత్తంగా అప్పులు ఎంత? అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్ 2 నాటికి రూ.1,23,343 కోట్లు ఉంటే ఆయన వైదొలగే నాటికి రూ.4.08 లక్షల కోట్లకు ఎగబాకాయి. » మేం అధికారం చేపట్టే నాటికి రూ.4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి రూ.7.48 లక్షల కోట్ల అప్పులున్నాయి. » చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 21.63 శాతం ఉంటే మా హయాంలో అది 12.93 శాతమే ఉంది. అంటే 21.63 శాతం అప్పులు చేసిన వాడు గొప్పవాడా? ఆరి్థక విధ్వంసకారుడా? 12.93 శాతమే అప్పులు చేసిన మేం ఆర్థికంగా ధ్వంసం చేసినట్లా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. » రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నట్లు రాజ్యసభకు తెలియచేశారు. నేను జూన్ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా. వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లో రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడ నుంచి వచి్చంది ఈ రూ.పది లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగానే చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? -
అబద్ధపు పత్రాలు
శాసనసభలో ఉన్నది రెండు పక్షాలే. ఒకటి అధికారపక్షం.. రెండు ప్రతిపక్షం. కానీ ప్రజల గొంతుక విన్పించకూడదనే లక్ష్యంతో వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రతి పక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుక విన్పించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే పాలక పక్షం సాగిస్తున్న ఆటవిక పాలన, విధ్వంసకాండ గురించి గళమెత్తుతాం. ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్నకుండిపోము. మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం చంద్రబాబునాయుడు శ్వేత పత్రాల పేరుతో డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు వల్లె వస్తూ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలన్నీ తప్పుడు పత్రాలేనని స్పష్టం చేశారు. ఆ శ్వేతపత్రాల్లో తప్పులను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. వాస్తవ పత్రాల(ఫ్యాక్ట్ షీట్స్)ను తాము విడుదల చేస్తున్నామని చెప్పారు. శ్వేతపత్రాల్లో చంద్రబాబు చెప్పిన అంశాలను.. ఫ్యాక్ట్ షీట్స్లో తాము చెబుతున్న వాస్తవాలను పరిశీలించి.. ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలన్నీ అబద్ధపు, తప్పుడు పత్రాలేనని సాక్ష్యాధారాలు, గణాంకాలతో నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పు రూ.14 లక్షల కోట్లని దు్రష్ఫచారం చేసిన చంద్రబాబు.. గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.పది లక్షల కోట్లుగా చూపించారని ఎత్తిచూపారు. వాస్తవానికి రాష్ట్ర అప్పు రూ.7.48 లక్షల కోట్లేనని కాగ్ (కాం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను చూపారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా, తక్కువ అప్పులు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించామని కేంద్ర సామాజిక ఆరి్థక సర్వే ప్రశంసించిందన్నారు. బండారం బయట పడుతుందని నాటకాలు 2019 మే 30 నాటికి తాము అధికారంలోకి వచి్చనప్పుడు రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.వంద కోట్లే ఉన్నాయని టీడీపీ గెజిట్ ఈనాడు కథనాన్ని ప్రచురించిందని వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే 2019–20కి సంబంధించి రూ.2.27 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గుర్తు చేశారు. కానీ జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7–8 వేల కోట్ల నిధులు ఉన్నా, పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని దెప్పి పొడిచారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాల్సి వస్తుందని, నిధులు కేటాయించకపోతే.. హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పుపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది బయట పడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. ఏడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకున్న దాఖలాలు లేవని ఎత్తిచూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే లక్ష్యంతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. 52 రోజులుగా రాష్ట్రంలో సాగుతోన్న నరమేధమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. హామీలన్నీ వెంటనే నిలబెట్టుకున్నాం వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలన్న ధృఢ నిశ్చయంతో ఆనాడు మేము నవరత్నాలు ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక ఇచి్చన హామీలన్నీ అమలు చేశాం. రాష్ట్రంలో ఇప్పటికీ రాజకీయ, ఆరి్థక, సామాజిక స్వాతంత్య్రాన్ని పొందలేక పోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్ట్ల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశాం. గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. మద్యాన్ని తగ్గించి, మాన్పించే విధానాన్ని అమలు చేశాం. పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడుతున్నారని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామని ఏకంగా చట్టాలు చేశాం. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్ద పీట వేస్తూ, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలు తీసుకువచ్చాం. శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీసీ కమిషన్ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పే సామాజిక న్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకువచ్చాం. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కీలక చట్టాలు అసెంబ్లీ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం. అది మా ప్రభుత్వం మాత్రమే చేసింది. అదే రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరో చట్టం చేశాం. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా, వారి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టే విధంగా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేశాం. మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో బెల్టు షాపులు మూయించడమే కాకుండా, అవి శాశ్వతంగా మూతబడాలని, అవి మళ్లీ తెరిచే అవకాశం ఉండకూడదని, 2019 అక్టోబరు 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా ఉచితంగా పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేశాం. అది కూడా అధికారంలోకి వచి్చన కేవలం రెండున్నర నెలల్లోనే. హామీలపై నోరుమెదపని చంద్రబాబు ఇప్పుడు.. ఇచి్చన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తావంటే చంద్రబాబు సరైన సమాధానం చెప్పడు. పోలవరం ఎప్పుడు కడతావంటే.. ఎప్పటికి అవుతుందో తెలియదు అంటాడు. పోనీ అమరావతి అయినా ఎప్పుడు కడతావు అంటే.. నువ్వు చెప్పు అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు.. ఎప్పుడు చేస్తావు అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు.. ఇప్పుడు ఇంతలా అమ్ముతున్నావంటే ఏం.. మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పానా? అంటాడు. మెగా డీఎస్సీ అన్నాడు.. నువ్వు రాకముందే 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. నువ్వు ఇచ్చింది 10 వేల పోస్టులే కదా.. ఇది మెగా ఏంటి? అంటే దానికీ సమాధానం ఉండదు. ఆ రిక్రూట్మెంట్ కూడా వాయిదా వేసుకుంటూ వెళ్లారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని వారిని రోడ్డున పడేశారు. ఇంటింటికీ రేషన్ సప్లైని ఆపేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ కత్తిరింపులు ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు. ఇవన్నీ అడగకూడదని ఇక ఏం చేస్తున్నారు అంటే.. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులకు నష్టం చేకూర్చడం, ఒక భయాన్ని క్రియేట్ చేయడం.. ఇదీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీరు. రివర్స్ టెండరింగ్ కమీషన్లు, దోపిడీకి మారుపేరుగా మారిన పరిస్థితుల్లో ఆ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలోనే సంస్కరణలు చేపట్టాం. ఆ మేరకు జ్యూడిíÙయల్ ప్రివ్యూ యాక్ట్.. చట్టం తీసుకువచ్చాం. టెండరు పనుల ప్రారంభ ప్రక్రియను పూర్తిగా హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంటు ఇస్తూ తద్వారా రూ.720 కోట్ల మేర వారికి ప్రయోజనం కలిగించాం. ఇంకా పంటలకు గిట్టుబాటు ధరలు కలి్పంచడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పవర్పై అన్నీ కోతలే విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే దేశంలో ముందు ఏపీనే కనిపిస్తుందని, ఇక్కడ ఆ రంగంలో అన్ని సంస్కరణలు జరిగాయన్నారు. చంద్రబాబు రాక ముందు 2014–15లో పంపిణీ సంస్థల విద్యుత్ నష్టాలు రూ.6,625.88 కోట్లు ఉంటే.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో.. 2018–19 నాటికి అవి ఏకంగా రూ.28,715 కోట్లకు ఎగబాకాయన్నారు. అంటే 34 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రూ.28,715 కోట్లతో మొదలైన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కొంతే పెరిగి.. 2023–24 నాటికి రూ.29,110 కోట్లకు చేరాయన్నారు. అంటే ఐదేళ్లలో పెరిగిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కేవలం 0.34 శాతమేనని, ఆ మొత్తం రూ.395 కోట్లేనని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో ఆ నష్టాలు ఏకంగా 34 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా ‘సెకీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనిపైనా దు్రష్పచారం ధర్మమేనా.. అని ప్రశ్నించారు. -
కేంద్ర పద్దుపై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2024–25) కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణాలేవైనా గత పదేళ్లుగా తెలంగాణ అవసరాలు, అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందని ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తామని చెపుతున్న తమకు ఏ మేరకు సాయమందుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపి స్తోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐల ఆధునీకర ణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్ బడ్జెట్ (బడ్జెటే తర) రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్ తగ్గింపు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవు తుందని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్ బడ్జెట్ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాయి. ఆ రెండిటిపై గంపెడాశలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దు లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నాయి. వీటిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉంటాయని, ఈ రెండు పద్దుల్లో కేటాయింపులు అటూ ఇటు జరిగితే మొత్తం బడ్జెట్ అంచనాలే తారు మారవుతాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పన్నుల్లో వాటా కింద రూ.26 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయి డ్ పద్దు కింద రూ.21 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రతిపాదించింది. ఇవి రెండూ కలిపి మొత్తం బడ్జెట్లో 17 శాతం కావడం గమనార్హం. కాగా కేంద్ర పన్నుల వాటాలో ఈసారి పెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తు న్నామని, అలాగే గత కొన్నేళ్లుగా ఆశించిన మేర ఇవ్వని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఈసారైనా అవసరం మేరకు కేటా యించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.నికర అప్పు సీలింగ్పై తేల్చండిజాతీయ రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీకి, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఆర్థిక సంఘం సిఫారసుల అమలుకు బడ్జెట్ కేటాయింపు, మహిళా శిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నికర అప్పుపై సీలింగ్ను కూడా బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే వెల్లడించాలని, తద్వారా తాము అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి జీఎస్టీ విధించకూడదని, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికేంద్రాన్ని కోరారు.ఈసారి బడ్జెట్లో తెలంగాణ ఆశిస్తున్నవివే..ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరు ద్ధరణ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, ఆఫ్బడ్జెట్ రుణాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు, సర్చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్కు కొత్త బ్లాక్ల కేటాయింపు, స్మార్ట్ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు. నష్టాలకు తోడు బకాయిలు..!కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపో యింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రూ. 33,712 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని, నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన రూ.19,205 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.17,828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి రూ.5,374 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయని, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద రూ.2,250 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రూ.817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు రూ.723 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తులు, సూచనలపై తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే. -
మోసం చేయడమే కాంగ్రెస్ పని: మాజీ మంత్రి జగదీష్రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని. 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్రెడ్డి అన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసకాండ
సాక్షి, అమరావతి: అలవిగాని హామీలిచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వ చ్చిన చంద్రబాబు నాయుడు.. వాటిని అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలను ప్రోత్సహిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయిస్తూ.. దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారన్నారు. ‘గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికీ విద్యా దీవెన అందించాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన ఇంకా ఇవ్వలేదు. ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోయింది. రెండు త్రైమాసికాల నిధులు పెండింగ్లో ఉన్నాయి. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే ఏప్రిల్లో వసతి దీవెన, రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా డబ్బులు ఇప్పటికే వచ్చి ఉండేవి. ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తోంది. ‘పిల్లలను బడికి పంపితే జగన్ ఒక్కరికే అమ్మ ఒడి కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాడు. అదే నేను అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికి అమ్మ ఒడి ఇస్తాం’ అని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురికి రూ.15 చొప్పున రూ.60 వేలు ఇస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినట్టు 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500 ఇవ్వండని ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ అడుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రకారం 2.10 కోట్ల మందికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో పెన్షన్లు తీసుకుంటున్న వారిని పక్కన పెట్టినా 1.50 కోట్ల మంది మాకు రూ.1,500 ఎప్పుడిస్తావ్ అని నిలదీస్తున్నారు. ప్రతి పిల్లాడు అడుగుతున్నాడు. జగన్ మామ మా అమ్మకు రూ.15 వేలు ఇచ్చేవాడు.. మీరు తల్లికి వందనం ఇస్తాం అన్నారు. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతన్నలు పెట్టుబడి సాయం ఏమైందంటున్నారు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన సున్నా వడ్డీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అక్కచెల్లెమ్మలు అడుగుతున్నారు. కాలేజీల్లో చదివిన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మత్స్యకార భరోసా రూ.20 వేల చొప్పున ఎప్పుడిస్తారని మత్స్యకారులు అడుగుతున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే విధ్వంసం సృష్టిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
హామీల అమలు ఎప్పుడు?
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురుచూస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతోందని.. పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కళ్యాణి ఇంకా ఏమన్నారంటే.. 2014లోనూ ఇలాగే మాటతప్పారు..కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. 2016 నుంచి సున్నా వడ్డీ ఆపేశారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని ఇవ్వలేదు.మహిళల సొంతింటి కల నెరవేరుస్తామని ఆ హామీనీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం మహిళల్లో పెన్షన్దారులను తీసేస్తే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1.72 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వం నిజంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందా, లేదా అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఆయా పథకాల చెల్లింపులేవి?మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్.. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, పెన్షన్లు అన్నీ ఠంచనుగా ప్రకటించిన తేదీనే ఇచ్చారు. చివరలో చేయూత కోసం రూ.4 వేల కోట్లు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆ డబ్బులను మహిళల ఖాతాల్లో వేయనీయకుండా టీడీపీ అడ్డుకుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే డబ్బులు జమై ఉండేవి. ఆ నగదును వెంటనే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేయాలి. మా ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏటా 44.5 లక్షల మంది మహిళలకు ఐదేళ్లలో రూ.25,809 కోట్లు ఇచ్చాం. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దాదాపు రాష్ట్రంలో కోటి మందికి పైగా స్కూలుకు వెళ్తున్న పిల్లలున్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఇవ్వకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి స్కూళ్లు, కళాశాలల ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. అన్నదాతలు అప్పులపాలుజగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున 50 లక్షల మందికి పైచిలుకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు ఏటా రూ.20 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభమైపోయినా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందని దుస్థితి. దీంతో నూటికి రూ.10, రూ.20 వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ప్రతి మహిళకు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం చూస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఇవన్నీ నెరవేర్చడానికి నిర్దేశిత తేదీలు ప్రకటించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశా రు. రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు. -
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. -
‘వీటిని స్టాక్ పెట్టుకోండి’.. కాంగ్రెస్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. బీఆర్ఎస్ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా.. కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు. అందులో... 1. ఇన్వర్టర్. 2. ఛార్జింగ్ బల్బులు. 3. టార్చ్ లైట్లు. 4. కొవ్వొత్తులు. 5. జనరేటర్లు. 6. పవర్ బ్యాంకులను నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. వీటీనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గ్యారంటీల హామీ ఇచ్చి.. వాటీని స్టాక్ పెట్టుకోవల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అందుకే మే 13 లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు.Request all fellow citizens to stock up on the following products Six Guarantees 😄1. Inverter2. Charging bulbs3. Torch lights4. Candles5. Generators6. Power BanksRemember it’s the Congress Govt, Not BRS’Vote wisely on 13th May 🙏#Vote4Car #KCRForTelangana— KTR (@KTRBRS) May 9, 2024 కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రధాని మోదీజీ.. అదానీ, అంబానీ స్కాంగ్రెస్(కాంగ్రెస్)కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే.. ఆయన అభిమాన మిత్రులైన ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. డీమోనిటైజేషన్ వైఫల్యం అని కూడా ఆయన ఒప్పుకుంటారా?’ అని కామెంట్స్ చేశారు. As per PM Modi, if Adani & Ambani have been sending Tempoes full of cash to Scamgress, why did his favourite allies ED, IT & CBI stay mum?Is he also admitting that Demonetisation was a failure ?#JustAsking— KTR (@KTRBRS) May 9, 2024 -
ప్రతి పథకంలో కొండి.. తొండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుండిగల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. ప్రతి పథకంలో కొండి పెట్టడం.. తొండి పెట్టడం.. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని అన్నారు. రైతుబంధు ఆర్థిక సాయం తాము అందరికీ ఇస్తే.. కాంగ్రెస్ వ్యవసాయం చేసిన వారికే ఇస్తామంటోందని చెప్పారు. వరి నాట్లు వేసేటప్పుడు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం.. కోతలు, కల్లాలైనా కూడా ఇవ్వడం లేదన్నారు. వడ్లు కొనడం లేదని, వడ్లకు బోనస్ బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. రూ.రెండు లక్షల రుణమాఫీ జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, పటాన్చెరు, మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని దుండిగల్లో జరిగిన రోడ్ షోల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కింది ‘నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ ఉచితబస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లేదు. పేదల సంక్షేమం కాంగ్రెస్కు పట్టడం లేదు. రైతుబంధు సాయం అందలేదు. ఫ్రీబస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల నోళ్లు కొట్టారు. మేము మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ఇస్తే.. ఇప్పుడు ఆ నీళ్లు మాయమైపోయాయి. మా ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు బ్రహా్మండంగా వచ్చిన కరెంట్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడికి పోయింది? ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇస్తలేరు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను నిలిపివేశారు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. రూ.4 వేల పింఛను ఇస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం హామీ నెరవేర్చామని రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగ సభలో అబద్ధాలు చెప్పారు..’అని కేసీఆర్ విమర్శించారు. ఏ వర్గాన్నీ పట్టించుకోవడం లేదు ‘టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, దానిపై సరైన, గట్టి వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల పోడు భూములకు కూడా రైతుబంధు ఆర్థిక సాయం అందించాం. కానీ ఇప్పుడు రావడం లేదు. నేను 58 ఏండ్లుగా మొత్తుకున్నా ఏ ఒక్క సీఎం కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను పంచాయతీలుగా చేసి నేరుగా నిధులు ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ రాకుండా చేసింది. ఏ ఒక్క వర్గం కోసం కూడా కాంగ్రెస్ పని చేయడం లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోవడానికి ఆ పార్టీ విధానాలే కారణం. కాంగ్రెస్ విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు ఇక్కడి నుంచి తరలిపోతున్నరు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడని స్వయంగా మోదీయే ప్రకటించారు..’అని మాజీ సీఎం చెప్పారు. పాకిస్తాన్ పేరిట బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ‘పాకిస్తాన్తో పంచాయతీ అంటూ బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తోంది. ‘బుట్కంత దేశం పాకిస్తాన్.. జాడిచ్చి కొడితే 25 ఏండ్లు మన దిక్కు చూడదు.. ప్రతిసారి పాకిస్తాన్ అని చెప్పుడు.. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం.. ఓట్లు దండుకోవడం. ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. 150 స్లోగన్లు చెప్పిన మోదీ.. సబ్కా సాత్.. సబ్కా వికాస్ అయిందంటున్నరు.. అది కాలేదు కానీ.. దేశం సత్తెనాస్ అయింది.. మోదీ హయాంలో రూపాయి విలువ ఏ ప్రధాని హయాంలో దిగజారనంతగా పడిపోయింది. పెట్టుబడులు పోయాయి. అంతర్జాతీయంగా భారతదేశ విలువలు మంట గలిసిపోతున్నాయి. విశ్వ గురువుగా ప్రకటించుకున్న మోదీ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్టులపై అమెరికా దేశం సైతం తమ నిరసన తెలిపింది. మోదీ ఎజెండాలో పేదల బాధలుండవు. ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపిన మోదీ.. తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో క్షమాపణలు చెప్పిండు. మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండు? నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండని కేసీఆర్ ప్రశ్నించారు. పైసల కోసం చేరిండా? ఎవరిని ఉద్ధరించేందుకు ఆయన కాంగ్రెస్లో చేరిండో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మెదక్, మల్కాజిగిరి బీ ఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ది మూడో స్థానమే.. ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యువత, మేధావులు ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలే తప్ప.. ఒక ఒరవడిలో పిచ్చిపిచ్చిగా కొట్టుకుని పోవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్కు ఒటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిస్తే పార్లమెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. కృష్ణా, గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లే ప్రయత్నం మోదీ చేస్తు న్నారు. సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ నీళ్లను కాపాడు కోవాలంటే తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలి. అలా అయితే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుందని’ కేసీఆర్ పేర్కొన్నారు. -
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?
సాక్షి యాదాద్రి: ఆరు గ్యారంటీలపై మంత్రులు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని, ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బుధవారం భువనగిరిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్ మాట్లాడారు. ప్రభుత్వంలోని పెద్దలు పాలనను పక్కనబెట్టి బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్రెడ్డి, పట్నం సునీత నాలుగో స్థానంలో ఉంటారని జోస్యం చెప్పారు. పార్టీ మారుతున్న స్వార్థపరులను ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారని హరీశ్రావు చెప్పారు. రాహుల్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనుడీయన భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘనుడని హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్రెడ్డి, ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చారని, కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్కు ఓటేస్తే నష్టపోతామన్న విషయం అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. దేవుడిని అడ్డంపెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందనీ, దేవుడి పేరుతో ఎన్నాళ్లు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందనీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్రమ కేసుల గురించి దిగులు చెందవద్దని, కేసుల పరిష్కారానికి తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని హరీశ్ భరోసానిచ్చారు. కార్యకర్తలంతా కలిసి నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుస్తారని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకునే శ్రద్ధ ఉందా?
సాక్షి, సిద్దిపేట: విపక్షనేతల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే సీఎం, మంత్రులు ఇంతవరకు వెళ్లి చూడలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు సమయం దొరకడం లేదని, కానీ బీఆర్ఎస్ నేతలను తిట్టడం, కేసులు పెట్టడం బిజీగా ఉన్నారని చెప్పారు. మంగళవారం ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ మనుచౌదరికి హరీశ్రావు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం, విద్యుత్ లోపాల వలన రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు కళ్లు తెరిచిందని చెప్పారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా..? భట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. కలిస్తే జోడీ..లేదంటే ఈడీ గజ్వేల్: ‘కలిస్తే జోడీ..లేదంటే ఈడీ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తుండగా, వంద రోజుల పాలనలో కాంగ్రెస్ వైఫ్యలాలను మూటగట్టుకున్నదని..ఈ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరముంది’అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మెదక్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కోసం పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసిన తర్వాతే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రజల తిరస్కరణకు గురైన రఘునందన్రావుకు ప్రజలు ఓటు వేసే అవకాశమే లేదని చెప్పారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే..రూ.100 కోట్ల తన నిధులతో ట్రస్టు స్థాపిస్తానని హామీ ఇచ్చారు. పాల బిల్లులు చెల్లించండి సీఎం రేవంత్కు హరీశ్రావు లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతులకు చెల్లించాల్సిన రూ.80 కోట్ల పాల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు క్రమపద్ధతిలో చెల్లించేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని తన లేఖలో పేర్కొన్నారు. దీంతో 45 రోజులుగా రైతులకు రావాల్సిన రూ.80 కోట్ల మేర పాల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాడి రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు. -
నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తాం: హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా.. రైతులకు అపాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కుందన్నారు. ఆయన సిద్దిపేట కలెక్టరేట్లో మాట్లాడారు. ‘నాడు ఉద్యమాల ద్వారా మెల్కొంది బీఆర్ఎస్. కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న(సోమవారం) నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25 వేల నష్ట పరిహారం అందించాలి.100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారు. డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది. ...బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే.. భారత రైతు సమితి. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కూడవెళ్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి. 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. లో వోల్టేజీ కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ..బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.కాంగ్రెస్ పార్టీ వచ్చినంక నీళ్లు తగ్గినయి, కన్నీళ్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టాలు పట్టవు. రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా?. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంది’ అని హరీశ్రావు అన్నారు. -
ఉచిత కరెంటు.. కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలు ఇవే..
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు ఇవే.. అంతరాయం లేని విద్యుత్ ఉచిత కరెంటు విప్లవాత్మక విద్య యూనివర్సల్ హెల్త్కేర్ రైతులకు గిట్టుబాటు ధరలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా “ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ 25 గ్యారంటీలు
రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన హామీలను ప్రకటించింది. 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు యువత, మహిళలు, రైతులు, కార్మికులకు 25 గ్యారంటీలను ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, అప్రెంటిస్షిప్ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంది. రైతులకు ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇస్తామని, స్టాండింగ్ లోన్ మాఫీ కమిషన్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కార్మికులకు ఉచితంగా రోగ నిర్ధారణలు, మందులు, చికిత్స, ఆపరేషన్లు వంటివి కల్పిస్తామంది. ఉపాధి హామీ, అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల్లో పేర్కొంది. #YuvaNYAY 1. #BhartiBharosa : 30 lakh new central government jobs, according to a jobs calendar 2. #PehliNaukriPakki : One year apprenticeship for all educated youth, at Rs. 1 lakh/year (Rs. 8,500/month) 3. Paper Leak se Mukti: Law to completely end all paper leaks… pic.twitter.com/Pc4OvYgFdG — Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024 -
గ్యారంటీల అమలుకు ‘డిజిటల్ క్యాంపెయిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను ఎన్నోరకాలుగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన ప్రతి హామీ అమలు చేయాల్సిందేనని, ఈ దిశగా ఒత్తిడి చేసేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టిందన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రశి్నస్తున్న తెలంగాణ పోస్టర్, వెబ్సైట్ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం గెలవలేదన్నారు. అనేక తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాల అమలులో చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రకాల గ్యారంటీలంటూ మభ్యపెట్టి ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ దోఖేబాజ్ పార్టీ
హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ దోఖేబాజ్ పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న ఆ పార్టీ.. అధికారంలోకొచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇళ్లకోసం లక్షలాది కుటుంబాలు పదేళ్లుగా అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాహితయాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500, ఆసరా కింద రూ.4 వేలు, రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామంటే ప్రజలు ఓట్లేశారని, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్లరేషన్ కార్డులుంటే.. అందులో 40 లక్షల మందికి మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ను అమలు చేస్తామంటున్నారని, మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లేని భారత్ను ఎవరూ ఊహించుకోవడం లేదని, మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తమకు పోటీయే కాదని, గతంలోకంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని బండి చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
TS: మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్
-
ఇది వాస్తవిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: సామాజిక సమానత్వం తెచ్చే రీతిలోనే బడ్జెట్ రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గురువారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ..అడ్డగోలుగా హామీలిచ్చిన ప్రభుత్వాలు, వాటి అమలుకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియని స్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా, మంజూరులేని పరిస్థితిలో అనేక వర్గాలు ఫలితం పొందలేకపోయారని తెలిపారు. ఇలాంటి పొరపాటుకు తావులేకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించామని చెప్పారు. అందుకే బడ్జెట్ను కుదించాల్సి వచ్చిదని వివరించారు. ప్రవేశపెట్టిన రూ.2,75, 891 బడ్జెట్... ఆదాయం, ఖర్చు కు మధ్య మహా అయితే 6% కన్నా తక్కువ ఉండబోదని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం బడ్జెట్ కేటాయిపులు రూ.14,87,834 కోట్లు అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.12,25,312 కోట్లు అని తెలిపారు. ఆదాయమే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఈ పదేళ్లలో రూ. 2,65,212 కోట్లు కేటాయింపుల్లో ఖర్చు చేయలేదన్నారు. కేంద్రనిధులు తెచ్చేందుకు బీజేపీ సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఆర్థికలోటు అధిగమించేందుకు అప్పులు చేయక తప్పదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని చెప్పారు. -
పరేడ్ గ్రౌండ్ బుక్ చేస్తా.. తిట్టుకోండి
హుజూరాబాద్: ‘ఒకరేమో అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటారు. ఇంకొకరు నన్ను టచ్ కూడా చేయలేవంటారు. అసెంబ్లీ నిర్వహించుకునేది ఒకరినొకరు తిట్టుకోవడానికా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికా? మీరు తిట్టుకోవాలనుకుంటే హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నేనే బుక్ చేస్తా. తిట్టుకుంటారో, కొట్టుకుంటారో అక్కడే తేల్చుకోండి. అసెంబ్లీని మాత్రం ప్రజలకి చ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ‘గావ్ చలో అభియాన్’కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో మంగళవారం రాత్రి బస చేసిన ఆయన బుధవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సర్కారు వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారని, మరి ప్రజలకిచ్చిన ఆరుగ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్కార్డు ప్రాతిపదికన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా అర్హులైన 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారంరోజుల్లో అందరికీ రేషన్కార్డులు మంజూరుచేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కొందరు బీఆర్ఎస్ నేత లు హద్దుమీరి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. -
ఆరు గ్యారంటీలు గారడీ మాటలే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశంలో ఉగ్రవాదాన్ని, అవకతవకలను పెంచి పోషించడమే అవుతుందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్గాంధీ ప్రధాని అయ్యేది లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కూడా లేదని, అవి ఒట్టి గారడీ మాటలేనని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ల సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, నర్సంపేటకు చెందిన రాణా ప్రతాప్రెడ్డి, పలువురు పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. రెండు నెలల్లో పలు రాజకీయ మార్పులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయని, బీజేపీలోకి చేరికలు పెరుగుతాయని కిషన్రెడ్డి చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో కొత్త చరిత్ర లిఖించబోతున్నామని, అందులో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కాబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలిచి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడి, రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేయలేని పనులు, పాలనా సంస్కరణలు, అనేక రకాల చట్టాలు, భారతీయ అధ్యాత్మిక, సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమాలు మోదీ నాయకత్వంలో చేపట్టారని చెప్పారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ మంత్రులు కుంభకోణాలతో కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారం సంపాదించిందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే స్థితిలో ఉందని అన్నారు. -
మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం
సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం కేబినెట్ సబ్కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్కమిటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. రూ.500లకు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుంది? ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఇవ్వాలని, ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొత్తం డేటా ఎంట్రీ రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. ఐదు గ్యారంటీలకు మొత్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఒకే పేరుతో రెండు మూడు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు కొందరు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్కార్డు నంబర్లు లేవని అధికారులు చెప్పారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు సరి చూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్, హోంశాఖ సెక్రటరీ జితేందర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘గ్యారంటీ’గా ముందుకెళ్తున్నాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. యువతలో అపోహలు వద్దు గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బయటపడ్డ కాంగ్రెస్ 7 గ్యారంటీ
-
తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ రేయింబవళ్లు పనిచేసింది: హరీశ్ రావు
-
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?
తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో? చదవండి: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? -
ప్రజల బాగు ప్రతిపక్షాలకు ఇష్టం లేదు
అబ్దుల్లాపూర్మెట్: ప్రజలు బాగుండటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్ఎస్ కోరుకుంటోందని, అలాంటి ఆశలు నిజం కానివ్వబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. అలాంటి పగటి కలలను కనడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28నే ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మా పార్టీలోకి వస్తేనే పథకాలు.. అలాంటి బెదిరింపులు ఉండవు తెలంగాణ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఆరు గ్యారంటీ పథకాల్లో అవకాశం కల్పిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే.. మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వంటిæ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో ఉండవని భట్టి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీస్తో పాటు ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగిస్తామని చెప్పారు. పదేళ్లుగా మగ్గిపోయిన ప్రజలకు ఇప్పుడే ఊపిరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో మగ్గిపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగించిందని విమర్శించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చిందని, ఇప్పుడు అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతిఓజా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు, రాచకొండ సీపీ సుధీర్బాబు పాల్గొన్నారు. -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేటి నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన సదస్సులు
-
నేటి నుంచి వార్డుల్లో ప్రజాపాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని పురపాలికల కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రజల నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కోరోజు ఒక్కో బస్తీ చొప్పున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్లను ఆహ్వానించాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వీటిల్లో పాల్గొననున్నారు. పట్టణాల్లో జరిగే ప్రజాపాలనలో మునిసిపల్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
‘ప్రజాపాలన’లో నిర్లక్ష్యం వద్దు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల 6వరకు అమలు చేయనున్న ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన అమలు విషయంలో నిర్లక్ష్యం వద్దని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు మిగతా శాఖల భాగస్వామ్యంతో పదిరోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. రేపు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తాం.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను శుక్రవారం పరిశీలిస్తామని, వంతెన కుంగిన ఘటనను పరిశీలించి విచారణ చేపట్టి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. -
రేషన్ కార్డులేని కుటుంబాల పరిస్థితి అధోగతేనా?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం (ఆరు గ్యారంటీ) పథకాల అర్హతకు తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డు ప్రామాణికం కానుంది. దారిద్య్ర రేఖకు దిగవనున్న (బీపీఎల్) కుటుంబం గుర్తింపు కార్డుగా రేషన్ కార్డు పని చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం అమలు తలపెట్టనున్న ఆరు గ్యారంటీ పఽథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాల్లో మహా నగారానికి రైతు భరోసా మినహా మిగతా ఐదు పథకాలు వర్తించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రజా పాలనలో భాగంగా వార్డుల వారీగా ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబ పూర్తి వివరాలను తీసుకోనున్నారు. కుటుంబానికి సంబంధించి ఇళ్లు, ఆదాయం, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, రేషన్ కార్డు, ఉద్యోగం ఇతరత్రా అన్ని వివరాలను దరఖాస్తులో స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తుల వెంట తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది. రెండింటిలో ఏది లేకున్నా ఆదిలోనే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. దీంతో పదేళ్ల పాటు కేవలం బియ్యం కార్డుగా పని చేసిన రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా మారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వడపోసి.. ఏరివేసి.. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం మొత్తం రేషన్ కార్డులు 17,21,994 ఉన్నాయి. ఇందులో గత పదేళ్లలో కొత్తగా మంజూరైన కార్డులు 1.21 లక్షలు మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తెల్లరేషన్ కార్డులను ఆహార భద్రత కార్డులుగా మార్పు చేయడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బడిముబ్బడిగా కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత కాలానికి అనర్హుల పేరిట కొన్ని కార్డులను ఏరి వేసి 15,99,639కి పరిమితం చేసింది. దీంతో తిరిగి కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున సుమారు 3.40 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకోగా మూడేళ్ల క్రితం 360 డిగ్రీల స్థాయిలో వడపోసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి కొత్త కార్డులు మంజూరు మంజూరు చేసింది. వైఎస్ హయంలోనే 16.98 లక్షల కార్డులు తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున నిరు పేదలందరికి తెల్లరేషన్ కార్డుల భాగ్యం కలిగింది. అప్పట్లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం మీద తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 16,98,982లకు చేరింది. అప్పట్లో చౌకధరల దుకాణాల ద్వారా అమ్మహస్తం పథకం కింద రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు రూ.1 కిలో బియ్యంతోపాటు కందిపప్పు, చింతపండు, గోధుమలు, గోధుమ పిండి, కారంపొడి, నూనె తదితర సరుకులు పంపిణీ జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డు ఆహార భద్రత కార్డుగా మారి కేవలం బియ్యానికే పరిమితమైంది. ఎదురుచూపుల్లో 10 లక్షల కుటుంబాలు.. మహానగరంలో మరో 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన నగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలు 27.21 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 17.21 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రకటించడంతో తెల్ల రేషన్ కార్డుకు మరింత డిమాండ్ పెరిగింది. కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్యారంటీ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నడంతో రేషన్ కార్డులు లేని కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్యారంటీ పథకాలివే కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కోసం వార్డుల వారీగా ఈ నెల 28 నుంచి ధరఖాస్తులు స్వీకరించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ వర్తించనుంది. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గ. స్థలం అందిస్తారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు నిరుపేదలకు సామాజిక పెన్షన్ నెలకు రూ.4,000 చొప్పున అందిస్తారు. వారికి రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తించనుంది. గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల పరిస్ధితి ఇలా.... జిల్లా పదేళ్ల క్రితం ప్రస్తుతం హైదరాబాద్ 6,91,618 6,39,609 ఉమ్మడి రంగారెడ్డి 10,07,354 10,82,382 -
5 పథకాలు.. 4 నెలలకోసారి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. షెడ్యూల్, నిబంధనలు ►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది) ►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన ►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ ►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్లైన్లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి. ►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. ►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి. ►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్చార్జ్గా నియమించాలి. ►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి. ►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి. ►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. ►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి. ►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. ► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి. ► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు. ► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి. ►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. ►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. ►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే ►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి ►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి ►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి ►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి ► పీహెచ్సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి ►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి ►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్శాఖ ప్రతినిధి ►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.) దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత -
TS: కలెక్టర్లతో భేటీ.. సీఎం కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి ప్రారంభోపన్యాసం చేశారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈనెల 28 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తాం’అని తెలిపారు. ప్రజా పాలనను అందించడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆసక్తి రేపుతున్న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’.. కాసేపట్లో రిలీజ్ -
కేటీఆర్, సిద్ధరామయ్యల ట్వీట్ వార్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్య మంగళవారం ఎక్స్(ట్విటర్)లో మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం. అంత మాత్రానా అన్నీ ఫ్రీగా ఇస్తామా. అయినా మాకూ ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’ అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధారమయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. అయినా ఎన్నికల హామీలిచ్చేటపుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా..కనీసం మీకు నిజమేంటో..నకిలీ, ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు.ఇలాంటి ఫేక్, ఎడిటెడ్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంది. బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది’అని కేటీఆర్కు సిద్ధరామయ్య చురకంటించారు. No money to deliver poll promises/guarantees says Karnataka CM ! Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ? Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq — KTR (@KTRBRS) December 19, 2023 Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections? Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP. If you are… https://t.co/Ey5y9K3fLd — Siddaramaiah (@siddaramaiah) December 19, 2023 ఇదీచదవండి..బస్ భవన్ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం -
Dec15th: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్
మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ తన ఛాంబర్లో మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ హాజరైన మంత్రులు శ్రీధర్బాబు, మల్లు భట్టి విక్రమార్క మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ మల్కాజ్గిరి ఎంపీగా నేను పోటీ చేయను... మా కుటుంబం నుంచి ఇద్దరం ఎమ్మెల్యేలం అయ్యాం ఇక చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది గవర్నర్ స్పీచ్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు కొత్త ప్రభుత్వం చేసే పనిపై స్పష్టత ఇవ్వలేదు మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోంది గత ప్రభుత్వం దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపింది పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవం 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు వృద్ధి చెందాయి ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదం గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డాం గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ దిశానిర్దేశం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ముగిసిన గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తాం తొమ్మిదేళ్లలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా లక్ష్యం తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజా దర్భార్లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది సీఎం రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు ఇది నిజమైన ప్రజా పాలన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తాం మహాలక్ష్మి స్కీమ్లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం కాళోజి కవితతో స్పీచ్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సమావేశమైన ఉభయ సభలు హాజరైన స్పీకర్, శాసన మండలి చైర్మన్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కాసేపట్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై 11.30కు ప్రారంభమవనున్న సభ ప్రసంగం ముగిసిన తర్వాత వాయిదా పడనున్న సభ రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ మీటింగ్ సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయం -
TS:అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని వల్లె వేయిస్తారు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీచదవండి..హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్రెడ్డి: డ్రగ్స్పై వారికి వార్నింగ్ -
TS:రూ.500కే గ్యాస్ సిలిండర్..మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్ సప్లై అధికారులతో ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ‘గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్ తెలిపారు. ఇదీచదవండి..జనార్ధన్ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై -
Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు
అనుప్గఢ్, రాజస్థాన్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. రాజస్థాన్లోని అనుప్గఢ్లో సోమవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ఏడు హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ సామాజిక పథకాలతోపాటు ఆర్థిక సాధికారత దిశగా ఇప్పుడు ప్రకటించిన ఏడు గ్యారంటీలు రాష్ట్రంలో అసమానతలను తొలగించి రాజస్థాన్ను మరింత సంపన్నంగా మారుస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ఖర్గే ప్రకటించిన గ్యారంటీల్లో ప్రధానంగా గృహ లక్ష్మి యోజన హామీ కింద కుటుంబంలో మహిళా పెద్దకు ఏటా రూ. 10వేలు, గౌధన్ పథకం కింద పాడి రైతుల నుంచి కిలోకు రూ.2 చొప్పున చెల్లించి ఆవు పేడ కొనుగోలు, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, టాబ్లెట్ల పంపిణీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం విద్య, రూ.500 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ హామీలను మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అంతకుముందు హనుమాన్గఢ్లో ప్రచార ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ దేశంలో భారీ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలను నిర్మించిన ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను విస్మరించడంపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశంలో పెద్ద డ్యామ్ల నుంచి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల వరకు అన్నింటినీ కాంగ్రెస్సే నిర్మించిందన్నారు. కాంగ్రెస్ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. -
అధికారం కోసం కాంగ్రెస్ వంద అబద్ధాలు
సిద్దిపేటజోన్: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్ తాపత్రయపడుతోందని అన్నారు. మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్ విమర్శించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్భాస్కర్ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
వారి అవినీతి సంపదను ప్రజలకు పంచుతాం
సాక్షి, వరంగల్/ వరంగల్/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.. ఆ ఫలాలు పూర్తిగా ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి పాల్పడ్డారని.. కాంగ్రెస్ వచ్చాక ఆ అవినీతి సంపదను వెలికితీసి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచుతామని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీ హామీలపై తొలి సంతకం లేదా తొలి నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. కేసీఆర్ను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని.. తర్వాత ఢిల్లీలో మోదీని గద్దె దింపుతామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో, వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పర్యటించారు. స్థానికంగా పాదయాత్రలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించి ప్రసంగించారు. వివరాలు రాహుల్ గాంధీ మాటల్లోనే.. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒకే చెట్టు కొమ్మలు. మోదీ వాహనానికి పంక్చరైతే కేసీఆర్ గాలి కొడతారు. కాంగ్రెస్ ధాటికి మోదీ వాహనం పచ్చడైంది. అందుకే పరోక్షంగా కేసీఆర్కు సహకరిస్తున్నారు. పార్లమెంట్లో బిల్లు ఏదైనా బీజేపీ నేతలు కనుసైగ చేస్తే బీఆర్ఎస్ నేతలు తలూపుతారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించడానికి ఎంఐఎంను బీజేపీ వాడుకుంటోంది. గల్లీలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రేమ బీజాలను నాటుతుంది. తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది రాజకీయ బంధం కాదు.. రక్త సంబంధం. ప్రస్తుతం దొరల తెలంగాణ– ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రజల తెలంగాణ కోసం ఈ యుద్ధంలో పోరాడుతోంది. బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రైతులను మోసం చేశారు బీఆర్ఎస్ సర్కారు రైతులను మోసం చేసింది. భూములను క్రమబద్దికరిస్తామని చెప్పి ధరణి పోర్టల్తో 20 లక్షల కుటుంబాల భూమిని గుంజుకున్నారు. రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరందరికీ న్యాయం చేస్తాం. తెలంగాణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ చదువుకున్న బడి, కాలేజీ, యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టించాయని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఐటీ క్యాపిటల్గా మారేందుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మావి ఉత్త మాటలు కాదు: కేసీఆర్, మోదీలు చెప్తున్నట్టుగా మావి ఉత్తుత్తి హామీలు కాదు. ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలుచేసి తీరుతాం. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ వల్ల కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది..’’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. జ్యూస్ తాగి.. చేతి గుర్తుకు ఓటేయాలని.. వరంగల్ తూర్పు సెగ్మెంట్ పరిధిలో పాదయాత్ర చేసిన రాహుల్గాందీ.. జేపీఎన్ రోడ్డులోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద ఆగారు. ప్రూట్ సలాడ్ తిని, జ్యూస్ తాగారు. షాప్ నిర్వాహకుడు పుల్లూరి శ్రీధర్తో కరచాలనం చేసి..హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రగతిభవన్ను ‘ప్రజాపాలనా భవన్’గా మారుస్తాం రాహుల్ గాంధీ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రజల తెలంగాణను నిర్మించేందుకు తమ తో కలిసి రావాలని రాహుల్ గాంధీ పిలుపుని చ్చారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ ట్యాగ్లైన్తో శుక్రవారం ఎక్స్ యాప్లో ట్వీట్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజల తెలంగాణలో స్వర్ణ యుగానికి నాంది పలకనుంది. ప్రగతి భవన్ పేరును ప్రజా పాలనా భవన్గా మారుస్తాం. 24 గంటలపాటు ఆ భవన్ ద్వారాలు తెరిచే ఉంటాయి. సీఎంతోపాటు మంత్రులు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని 72 గంటల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తారు..’’ అని రాహుల్ పేర్కొన్నారు. -
ఆవు పేడ కిలో రెండు రూపాయలకు కొంటాం: రాజస్తాన్ సీఎం
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు, గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ పీసీ పంపిణీ ఇందులో ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వీటిని నెరవేరుస్తామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. పాత పింఛను విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేలా చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే ల్యాప్టాప్ లేదా టాబ్ ఇస్తామన్నారు. ఇవికాకుండా, వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కే అందజేయడం, రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లోని ఒక్కో మహిళకు ఏడాదికి విడతలుగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గెహ్లోత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘దేశంలో ఈడీ వీధి కుక్కల కంటే ఎక్కువగా హడావుడి చేస్తోందని ఒక సీఎం(భూపేష్ బఘేల్) అనాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. అంత మాట అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘దర్యాప్తు విభాగాలు మీకు రాజకీయ ఆయుధాలుగా మారాయి. మోదీజీ, మీకు అర్థం కావడం లేదు. మీకు కౌంట్డౌన్ మొదలయ్యింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై గురువారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. -
ఉమెనిఫెస్టో ప్లీజ్!
హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి. మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాన అవకాశాలు లభించాలి.... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి ‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి. మెరుగైన ప్రజా రవాణా అవసరం ‘ప్రస్తుతం గ్రేటర్లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ ఉద్యోగినులు, కాల్సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు, క్యాబ్లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి. అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం ‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో చేరిన గాజర్ల అశోక్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్ చేరిక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ టికెట్ అశోక్కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆర్థిక అంశాలకు లోబడే హామీలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు లాంటి పథకంపై హామీ ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నేతలకు సూచించినట్లుగా తెలిసింది. ఆర్థిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పురోభివృధ్ధి సాధించేలా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా చెప్పారని సమాచారం. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు గడ్డం వినోద్, ప్రసాద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్కుమార్, గంగారాం, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం చైర్మన్ బెల్లయ్యనాయక్ తదితరులు ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ నెల 26న చేవెళ్ల సభలో ప్రకటించాల్సిన దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలపై గంటన్నర పాటు చర్చించారు. కొందరు నేతలు దళితబంధు వంటి పథకాన్ని ప్రకటించాలని అన్నారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ‘దళితబంధు లాంటి పథకం అమలు సాధ్యాసాధ్యాలు, అవసరమయ్యే నిధులపై లోతుగా చర్చించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్ర మండలం మీది భూములమ్మైనా దళితబంధు అమలు చేస్తామని అంటున్నారు. ఆయన మాటలు పట్టుకొని మనం కూడా చంద్ర మండలం మీద భూములమ్ముతామని ప్రజలకు చెప్పలేం కదా? ఇలాంటి హామీలు ఇచ్చేముందు ఆర్థికపరమైన అంశాలతో పాటు రాష్ట్ర బడ్జెట్ను అధ్యయనం చేయాలి. సాధ్యాసాధ్యాలను పరిశీలించే హామీలివ్వాలి. హామీల ప్రకటన ఎలాంటిదైనా అన్ని వర్గాలు, మేధావులు, సీనియర్లతో చర్చించే చేయాలి తప్ప తొందరపాటుతో కాదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. సీట్లు కాదు..గెలుపు ముఖ్యం కొందరు నేతలు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు సీట్లు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందిస్తూ.. ‘సీట్లు ముఖ్యం కాదు..గెలవడం ముఖ్యం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పనిచేయండి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, గిరిజనులకు పార్టీ పట్ల నమ్మకం పెంచండి..’అని ఖర్గే సూచించినట్లు సమాచారం. పోడు భూములపై హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు, గృహ నిర్మాణాలు వంటి హామీలపై కూడా చర్చించినా, పూర్తి స్థాయి అధ్యయనం చేశాకే వీటిపై తుది ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. ఆర్థిక, సామాజిక అంశాలు పరిగణనలోకి: భట్టి చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై ఖర్గే చర్చించినట్లు భేటీ అనంతరం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ యా వర్గాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపైనా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని అన్నారు. -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్షాపులో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవలేదు.. భవిష్యత్లో కలవబోదు.’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
ఆడబిడ్డల గోడు పట్టదా?
హుస్నాబాద్: ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది. ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్ పెంచుతూ పోయారు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాబితా నుంచి తొలగింపు మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హుస్నాబాద్ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదేం న్యాయం? మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం? – చుంచు రాణి, నిర్వాసితురాలు వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా? గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం. – భూక్య శిరీష, నిర్వాసితురాలు -
యువతకు గుడ్న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..
సాక్షి, న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసింది. పంజాబ్తోపాటు గోవాపైన అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించారు. పార్టీని అధికార, ప్రతిపక్షాల కన్నా బలంగా తయారుచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నికల సందర్భంగా ఇప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. అందులో భాగంగా 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. చదవండి: సజ్జనార్ సారూ మీరు సూపర్.. ‘గోవా యువతకు నా 7 హామీలు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వాటిలో ఎమ్మెల్యే సంబంధికులకు కాదు గోవావాసులకు ఉద్యోగాలు కుటుంబానికో ఉద్యోగం ఉద్యోగం వచ్చేంత వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం గోవావాసులకే కరోనాతో నిరుద్యోగులైన పర్యాటక శాఖకు చెందినవారికి రూ.5 వేల ఆర్థిక సహాయం మైనింగ్ తవ్వకాల నిషేధంతో ప్రభావితులైన వారికి రూ.5 వేల ఆర్థిక సహాయం స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉద్యోగ, ఉపాధిని అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన హామీగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ త్వరలో పర్యటించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో పాలన మాదిరి గోవాలో కూడా సాగిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఢిల్లీ పాలనను గోవాలో పునరావృతం చేస్తామని పేర్కొంటోంది. 40 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో కలిసి ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. My 7 Guarantees for Goa's youth ▪️Jobs for Goans, not just for MLA's relatives ▪️1 Job/family for unemployed ▪️3000/month until then ▪️80% pvt jobs reserved for Goans ▪️5000/month for unemployed in tourism due to COVID ▪️5000/month for mining ban affected ▪️Skill University — Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2021 -
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ వినిపించాలి’
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్కు పంపించిన ఘనత సీఎం జగన్దన్నారు. మాధవి, నందిగం సురేష్లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు. చదవండి: కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి -
‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు. ‘‘ఇప్పటికే దశలు వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పూర్తిగా బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు. మద్యానికి బానిసలయినా కుటుంబంలో పిల్లలు కార్మికులుగా చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుంది.(చదవండి: విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని) సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే. పేదవారి సొంతింటి కలను నెరవేర్చారు. సుమారు 10 కోట్ల రూపాయలతో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తాం. ఇప్పటికే సీఎం జగన్ 95 శాతం హామీలను అమలు చేశారని’’ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.(చదవండి:‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’) -
ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హన్మకొండ: గతంలో వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హన్మకొండ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టకుని వరంగల్కు వస్తున్నారో ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. (వరంగల్లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం) గతంలో గ్రేటర్ వరంగల్కు ప్రతి ఏడాది రూ.300 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారని, కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులే తప్ప, ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. -
మడమ తిప్పని హామీకే..మద్దతు
సాక్షి, బాపట్ల : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలుచేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేక్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్ వల్ల సంకట పరిస్థితులు ఏళ్ళ తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేది నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 15వేలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్లు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంతో కలిగే లాభాలు ప్రభుత్వ హామి ఉంటుంది. సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు పదవీ విరమణ తర్వాత హెల్త్కార్డులు ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు. పెన్షన్కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు సీపీఎస్తో కలిగే నష్టాలు షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు. ఎంచుకున్న ఆన్డ్యూటీ ఫ్లాన్ ఆధారంగా పెన్షన్మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి. ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు. కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో ఆర్టీఐ చట్టం కింద సీపీఎస్ విధానం రద్దు చేసే అధికారం ఎవరిది అని కేంద్రానికి ఒక లేఖ రాశాం. దాని ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశాం. ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానంతో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. – ఆయూబ్, వీఆర్వో ఉద్యోగులను బిచ్చగాళ్లను చేస్తోంది సీపీఎస్ విధానం ఉద్యోగులను పదవీవిరమణ తర్వాత బిచ్చగాళ్లుగా మార్చేవిధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి సీబీఐకి సాధారణ సమ్మతిని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం మన భారతరాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న అర్టికల్ 246(3) ప్రకారం, అర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్వీస్ మాటర్స్కు సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తీర్మానాలు, కమిటీలు, కేంద్రానికి లేఖలు అనే పేరుతో కాలయాపన చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే. – కె. పార్ధసారథి, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి -
బాండ్పేపర్పై హామీలు
కొడిమ్యాల(చొప్పదండి): ఈనెల 22న నిర్వహిం చనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నా రు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్రెడ్డి బాండ్పేపర్పై హామీలను ముద్రించి, పోస్ట్ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే సీపీఎస్ను రద్దుచేపిస్తానని, కాంట్రాక్టు అధ్యాపకులకు హెల్త్కార్డులు మంజూరు చేపిస్తానని, అధ్యాపకులకు ఇంటిస్థలాలు సమకూరుస్తానని బాండ్పై హామీ లు ముద్రించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను 20 సంవత్సరాల భావి ఉద్యోగ జీవితాన్ని వదులుకుని పోటీలోఉన్నానని, దివ్యాంగుడినైనందున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందున బాండ్ద్వారా హామీలను తెలుపుతున్నానని, ఆశీర్వదించాలని కోరుతున్నారు. -
వైఎస్ శకం..విద్యకు నవయుగం
సాక్షి,గుంటూరు : ‘ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. అక్షరజ్ఞానంతో అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజంలో చదువుల విప్లవం రావాలి. కార్పొరేట్ స్థాయి విద్య కార్మికుడి బిడ్డకు కూడా అందాలి. ప్రతిభ ముందు పేదరికం తలవంచాలి. ఇంటికో ఇంజినీర్ తయారవ్వాలి.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలి’.. ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రోసూరుకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మోడల్ స్కూల్ నిర్మాణానికి సంకల్పించారు. ఎందరో విద్యా కుసుమాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2009లో మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 9 బ్యాచ్ల విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందింది. అదే విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందించి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా చదువులు అందించాలన్న కాంక్షతో 2009 లో నిధులు కేటాయించగా 2013 లో భవనాలు పూర్తిచేసుకుని పాఠశాల ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతికి 80 మంది విద్యార్థులు చొప్పున ప్రతిఏటా 650 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. బాలికల హాస్టల్, కస్తూర్బాగాంధీ పాఠశాల ద్వారా ఎంతో పేద బాలికలకు చదువుకోగల్గుతున్నారు. అయితే మొత్తం అభివృద్ధిని నేనే చేశానని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త విద్యాసంస్థను నెలకొల్పకపోగా, రేషనలైజేషన్లో పేరుతో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మూసివేశారు. మాలాంటి పేద విద్యార్థులకు వరం నేను మోడల్ స్కూల్లో ఏడో తరగతి నుంచి చదువుతున్నా. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం. స్థానికంగా కాలేజీ ఉండటం మాలాంటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ కాలేజీలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేం. ఈ ఏడాది నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. – వీ వాణి, సీనియర్ ఇంటర్, ఎంపీసీ నాణ్యమైన విద్య.. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎందరో పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి చదువులకు దగ్గరయ్యారు. విద్యార్థుల మెరిట్ కోసం నిరంతం కృషి చేస్తున్నాం. – ఝాన్సీవాణి, మోడల్స్కూల్ ప్రిన్స్పాల్