
చండీగఢ్: ఇప్పటికే దేశంలో పలుచోట్ల రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో బిఎస్పీ శనివారం ఆనంద్పూర్ సాహిబ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిగా పంజాబ్ యూనిట్ చీఫ్ 'జస్వీర్ సింగ్ గర్హి'ని బరిలోకి దింపింది.
జస్వీర్ సింగ్ గర్హిని బరిలోకి దింపుతున్నట్లు పంజాబ్, హర్యానా, చండీగఢ్ల బీఎస్పీ ఇంచార్జి రణధీర్ సింగ్ బెనివాల్ ప్రకటించారు. దీంతో పార్టీ మొత్తం 13 లోక్సభ స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది.
ఆనంద్పూర్ సాహిబ్ స్థానానికి ప్రస్తుతం చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు గర్హి ఆప్కి చెందిన మల్విందర్ కాంగ్, కాంగ్రెస్కు చెందిన విజయ్ ఇందర్ సింగ్లా, శిరోమణి అకాలీదళ్కు చెందిన ప్రేమ్ సింగ్ చందుమజ్రాతో తలపడనున్నారు. బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment