MP: కమల్‌ నాథ్‌ను తప్పించిన కాంగ్రెస్‌ | Jitu Patwari Replaces Kamal Nath As Madhya Pradesh Congress Chief - Sakshi
Sakshi News home page

కమల్‌ నాథ్‌ తొలగింపు.. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ

Dec 16 2023 8:15 PM | Updated on Dec 16 2023 8:37 PM

Jitu Patwari replaces Kamal Nath as MP Congress Chief - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ను మధ్యప్రదేశ్‌ పార్టీ చీఫ్‌ పదవి నుంచి తొలగిస్తూ.. 

బోఫాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌ నాథ్‌(77)ను తప్పించింది ఆ పార్టీ అధిష్టానం. కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ(50) పేరును ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ప్రకటించారు. జీతూ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, కమల్‌ నాథ్‌ ఇంతకాలం అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారాయన. 

ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కమల్‌ నాథ్‌ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ బాధ్యతల్ని.. మాజీ మంత్రి అయిన జీతూ పట్వారీకి అప్పజెప్పారు.


రాహుల్‌ గాంధీతో జీతూ పట్వారీ (ఫైల్‌ ఫొటో)

జీతూ పట్వారీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో కొత్త రక్తం ఎక్కించే క్రమంలోనే ఓడిపోయినా.. జీతూనే పార్టీ చీఫ్‌గా అధిష్టానం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement