బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ | Kishanreddy Clarity On Brs Merging Into Bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కిషన్‌రెడ్డి క్లారిటీ

Published Sat, Aug 10 2024 11:34 AM | Last Updated on Sat, Aug 10 2024 3:16 PM

Kishanreddy Clarity On Brs Merging Into Bjp

సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై   తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement