kishanreddy
-
కిషన్రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కలిశారు. కిషన్రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడిందని,రాజకీయాల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రివాల్ మారారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కిషన్రెడ్డి శనివారం(ఫిబ్రవరి8) మీడియాతో మాట్లాడారు.‘ప్రజల తీర్పుతో కేజ్రీవాల్ నెత్తికి ఎక్కిన అహంకారం దిగింది. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే రాహుల్,కేసిఆర్,కేజ్రివాల్ ఎవరైనా ఓటమి చెందక తప్పదు. ఢిల్లీలో కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోంది. రాహుల్ నాయకత్వం చేపట్టాక వారికి వచ్చిన ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కించడమే సాధ్యమవుతుంది. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్,డబుల్ డక్ కొట్టింది. ఢిల్లీ తీర్పుతో కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నిందితుడని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చింది.కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం.ఆప్ ఓటమిలో ప్రధాన పాత్ర లిక్కర్ స్కామ్దే.తెలంగాణలో రేవంత్రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారో కేటీఆర్ చెప్పాలి.అన్న హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రివాల్ కలుపు మొక్క’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ చరిత్రాత్మకం: కిషన్రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26పై కిషన్రెడ్డి స్పందించారు. ‘వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ ఇది. వ్యక్తిగత ఇన్కమ్ట్యాక్స్ మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. బడ్జెట్లో అన్ని సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయం’అని ప్రధాని మోదీ అన్నారు.దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇదిరూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకంతెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ.80 వేల వరకు ఆదాగత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదితెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశంకిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి -
ఇక్కడి వాళ్లతో దావోస్లో ఒప్పందాలేంటి?: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది. -
కాంగ్రెస్ పాలనలో స్ట్రీట్ లైట్స్ కూడా వెలగడం లేదు: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం(జనవరి19) కిషన్రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలు చూస్తున్నాం. రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. రెండు పార్టీలు బొమ్మ బొరుసులా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నాయి. నగరంలో వీధి లైట్లు వెలగలేక వెలవెల పోతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా మళ్లించడం ద్వారా లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇచ్చేదిలేదని చెబుతున్నాయి.బీజేపీపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్,కాంగ్రెస్లకు లేదు.తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి ఈ రెండు పార్టీలే కారణం.ఒక్క అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారు.తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు,విష ప్రచారాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది,అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ.రాజ్యాంగంపై అనేక కుట్రలు చేసి,అంబేద్కర్ను ఆనేక రకాలుగా అవహేళన చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ.పంచతీర్థ పేరుతో అంబేద్కర్ను సగౌరవంగా గౌరవించిన పార్టీ బీజేపీ.తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నాం. ఇంటింటికి వెళ్తాం. రాజ్యాంగంపై కాంగ్రెస్ చేసిన అవహేళన చరిత్రను ప్రజలకు తెలియజేస్తాం.రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయట పెడతాం.సేవ్ తెలంగాణ పేరుతో యువత ముందుకు రావాలి’అని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో కాంగ్రెస్కు దిక్కులేదు: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishanreddy) అన్నారు. శుక్రవారం(జనవరి17) కిషన్రెడ్డి హైదరాబాద్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అంశంపై మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్(CongressParty)కు ఢిల్లీలో దిక్కు లేదు..ఢిల్లీ(Delhi) ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతివ్వడం లేదు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి చర్చే ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీ గా ఉంటుంది’అని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి.అదే నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరు నేతల మాటలు హద్దులు మీరుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) భావిస్తుండగా ఆప్ను ఈసారైన ఓడించి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పనిచేస్తోంది.ఢిల్లీలో పేరుకు ముక్కోణపు పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యనే ఉండనుందని తెలుస్తోంది. కేసుల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో కీలక హామీలు -
ఈసారి ప్లాస్టిక్రహిత కుంభమేళా: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం(డిసెంబర్ 15) కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.వేలాది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయనున్నారు.కుంభమేళా జరిగే రోజులను పవిత్ర మైన రోజులుగా హిందువులు భావిస్తారు. ఈసారి ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా జరగనుంది. తెలంగాణ నుంచి వేలాది భక్తులు కుంభమేళాలో పాల్గొననున్నారు’అని కిషన్రెడ్డి చెప్పారు. -
మూసీ నిద్రకు ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా?: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్బెడ్లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్బాబు సూచించారు. -
మూసీ నిద్రలో కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్పేట తులసీరామ్నగర్లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం -
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
‘మహిళల గురించి మాట్లాడటం.. ఆ రెండు పార్టీలకు అలవాటే’
హైదరాబాద్, సాక్షి: కుటుంబాలు, మహిళలు గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అలవాటు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి. ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాప్ చేసి విని బ్లాక్ మెయిల్తో డబ్బులు వసూలు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు విన్నరనీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ఇలాంటి భాషతో తెలంగాణ రాజకీయాలను దిగజార్చూతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి...ఏకపక్షంగా సీఎం రేవంత్రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇదివరకే సీఎంకు లేఖ రాశా. గతంలో కేసీఆర్ కూడా మూసి బ్యూటీఫికేషన్ అంటూ మార్కింగ్ చేశారు. దాన్నే ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకున్నారు. పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసి సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం పెట్టీ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి. డ్రైనేజీ, వరద నీటి డ్రైన్ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి. పేదలకు నిర్మిస్తామన్న ఇళ్లు ఏమైయ్యాయి. హామీలు పక్కదోవ పట్టించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోవలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ దొందూ దొందే. దొంగల పార్టీలు.. దోపిడీ పార్టీలు.హైడ్రా అంటే రేవంత్. రేవంత్ అంటేనే హైడ్రా. హైడ్రాను పుట్టించిన రేవంత్ బాధ్యుడు. ధైర్యం ఉంటే ఫాం హౌజ్లు, బడా బిల్డింగ్లు కట్టిన వాళ్ళవి కుల్చండి. ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు? పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి ఆర్జీ, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్లను కులిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు. కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’ అని కిషన్రెడ్డి అన్నారు.చదవండి: Konda Surekha Controversy: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు -
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్రెడ్డి తెలిపారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్రెడ్డి క్లారిటీ
సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లవి బ్లాక్మెయిల్ పాలిటిక్స్: కిషన్రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తప్పుడు ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో శుక్రవారం(జులై 12) జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘లోక్ సభ ఎన్నికల్లో అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు వందల రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. తెలంగాణను దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి డబ్బులు పంపిస్తోంది. పాంచ్ న్యాయం పేరిట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని మేనిఫెస్టోలో పెట్టారు. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడు లేనంతగా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. పదేళ్ల పాటు అధికారంలో అన్న బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 44 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది.కాంగ్రెస్, బీఆర్ఎస్లది ఒకటే డీఎన్ఏ. నాణేనికి బొమ్మ, బొరుసులలా రెండూ అవినీతి పార్టీలే. మజ్లీస్ పార్టీ నేతలు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు. ఎంఐఎం అధినేత పార్లమెంట్లో జై భారత్ మాతా అనకుండా.. జై పాలస్తీనా అనడం సిగ్గు చేటు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతోంది. నీళ్ళు ఏవో... పాలు ఏవో .. ప్రజలు అర్థం చేసుకోవాలి’అని కిషన్రెడ్డి కోరారు. -
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘సీఎం రేవంత్, కేసిఆర్.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు. రేవంత్, కేసీఆర్ దొందూ దొందే. ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్గాంధీపై కిషన్రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దు: కిషన్రెడ్డి
సాక్షి, మహబూబునగర్: కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ‘ఏప్రిల్ నెలలలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ముందు ప్రపంచ దేశాల అధ్యక్షులు చేతులు కట్టుకొని నిలబడే స్థాయికి వచ్చాము. తొమ్మిదిన్నర సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ. మరీ కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కు రాలేదు. దేశం అంటే అంకితభావంతో పనిచేసే వ్యక్తి మోదీ. 5 వందల సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి గుడి కూల్చి మసీదు కట్టాడు. కానీ నేడు టెంటులో ఉన్న రాముడికి భవ్య మైన మందిరం నిర్మించాడు మోదీ సంకల్పం అదే. ... దేశంలో ఎక్కడ కూడా ఈపాలనలో అల్లర్లు జరిగిన చరిత్ర లేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాదులను చంపిన చరిత్ర మోడీది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీది. ధర్మం వైపు ఉన్న మోదీ కావాలా అధర్మం వైపు ఉన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో అయిన మోదీ చరిష్మా కనిపిస్తుంది. ... దేవరకద్రలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి హామీ ఇస్తున్నా. దేశం లో ప్రజలందరూ మోదీ వైపు ఉన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను కమలంకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యం. రాష్ట్రంలో రాహుల్ టాక్స్ వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసి ఎన్నికలలో ఖర్చు పెట్టాలని దోపిడీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది వారు బీజేపీ వైపు నిలబెడుతారనే నమ్మకం ఉంది’ అని కిషన్రెడ్డి అన్నారు. -
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్రెడ్డి
సాక్షి,నారాయణపేట: మక్తల్లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. హస్తినలో సీఎం రేవంత్ -
TS: కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారు: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి సూట్కేసులు వెళుతున్నాయని చెప్పారు. సనత్నగర్కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానిస్తే మోదీ గౌరవించారని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్ -
సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ కోసం ఎన్హెచ్ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది.. -
‘మోదీ ప్రధాని కాకముందు రాష్ట్రంలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారు’
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో గోకుల్చాట్, దిల్సుఖనగర్, లుంబిని పార్క్లో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్టులు జరిగాయని అన్నారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్లలోకూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయని తెలిపారు. పాకిస్థాన్లో కూర్చొని రిమోట్ నొక్కితే భారత్లో బాంబ్ బ్లాస్టులు జరిగేవని అన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లుపాతుకొని భారత్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని తెలిపారు. మతకలాహాలు ప్రేరేపించి, ఆడీఎక్స్లు పేల్చేవాళ్లని, ఏకే 47లు పంపేవాళ్లని కిషన్రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు, కర్ఫ్యూ లు, ఎకే 47లు, RDXలు లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని గుర్తుచేశారు. భారత్లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదని తెలిపారు. ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్లో నకిలీ కరెన్సీగా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేదన్నారు.ఇవాళ పాకిస్థాన్లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
TS: స్పీడ్ పెంచిన బీజేపీ.. పొలిటికల్ ఇంచార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంఛార్జ్లు వీరే.. ►హైదరాబాద్- రాజసింగ్ ►సికింద్రాబాద్- లక్ష్మణ్ ►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి ►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి ►అదిలాబాద్- పాయాల్ శంకర్ ►పెద్దపల్లి- రామారావు పటేల్ ►కరీంనగర్- ధన్ పాల్ సూర్యనారాయణ ►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి ►జహీరాబాద్- వెంకట రమణ రెడ్డి ►మెదక్- పాల్వాయి హరీష్ ►మహబూబ్ నగర్- రామచందర్ రావు ►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి ►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి ►భువనగిరి - NVSS ప్రభాకర్ ►వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి ►మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు ►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి -
TS: 28న రాష్ట్రానికి అమిత్ షా: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్వేత పత్రం, బీఆర్ఎస్ స్వేద పత్రం రెండూ అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 28న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతోనూ అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. వీరంతా తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు బీజేఎల్పీ నేత ఎంపిక మాత్రం పెండింగ్లోనే ఉంది. ఇదీచదవండి..‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’ -
TS: పార్లమెంట్ ఎన్నికలు..పొత్తులపై కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్సభ ఫలితాలుంటాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదీచదవండి..‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
బీజేపీ ఓట్షేర్పై కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటాం. సమీక్షించుకున్న తర్వాత రాబోయే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగింది’ అని కిషన్రెడ్డి తెలిపారు. ‘ తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీలో గెలిచింది. కాంగ్రెస్లో ఎవరు సీఎం అవుతారో తెలీదు అదో విచిత్రమైన పరిస్థితి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్రెడ్డిని ఓడించి మా అభ్యర్థి గెలిచారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర. వెంకటరమణారెడ్డికి నా అభినందనలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘన విజయంతో ప్రధాని మోదీకి దేశ ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం’ అని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మా మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాం. మా పోరాటం వల్ల కాంగ్రెస్కు లాభం జరిగింది. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తాం. ఢిల్లీ వెళ్లి ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాలపై అధిష్టానానికి వివరిస్తా’ అని కిషన్రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ కోసం ఫామ్హౌజ్కు ఎమ్మెల్యేలు -
సీఎంను ఓడించి చరిత్ర సృష్టిస్తారు! : కిషన్రెడ్డి
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించి కామారెడ్డి ప్రజలు చరిత్ర సృష్టిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం కామారెడ్డిలో పార్టీ నియోజకవర్గ బూత్ విజయ్ అభియాన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కిషన్రెడ్డికి జాతీయ రహదారిపై పొందుర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారినుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని హౌసింగ్బోర్డు, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్రోడ్డు, ఇందిరాచౌక్ మీదుగా రాజారెడ్డి గార్డెన్ వరకు సాగింది. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు చైతన్యశీలురని, బీఆర్ఎస్ నేతలు ఎన్ని కోట్లు కుమ్మరించినా వారిని కొనలేరని పేర్కొన్నారు. కేసీఆర్ను గజ్వేల్ ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే ఆయన వారికి చేసిందేమీ లేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ తెలంగాణలో రోడ్ల గురించి గొప్పగా మాట్లాడారని, ఆ జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల పేరుతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. నా ఆస్తి కార్యకర్తలే.. తన యావదాస్తి బీజేపీ కార్య కర్తలు, ప్రజలేనని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బూత్ విజయ్ అభియాన్లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ కార్యకర్తలు నోట్లు, బీరు, బిర్యానీలకు ఆశపడి వచ్చేవారు కాదన్నారు. తమకు ప్రతి గ్రామంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. బీఆర్ఎస్కు బీజేపీ సత్తా చూపాలనే శుభం ఫంక్షన్ హాల్ ముందు నుంచి ర్యాలీ తీశామన్నారు. కామారెడ్డిలో ధర్మానికి, నీతి, నిజాయితీకి పేరైన బీజేపీకి.. అవినీతి, అధర్మం, అక్రమాలకు మారుపేరైన బీఆర్ఎస్కు మధ్య యుద్ధం జరుగుతోందని, సీఎం కేసీఆర్ను ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. వాళ్లొస్తే పెనంమీంచి పొయ్యిలో పడ్డట్లే.. బీఆర్ఎస్ వాళ్లు బర్రెలు తింటే, కాంగ్రెస్ వాళ్లు ఏనుగులు తినే రకమని, వారికి అధికారం అప్పగిస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని కిషన్రెడ్డి పేర్కొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 365 మంది విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ దని, మలిదశ ఉద్యమంలో 1,200 మందిని పొట్టన పెట్టుకున్నదీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని వంచించిందన్నారు. ఇక్కడా అవే గ్యారంటీలతో వస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారని, వాళ్లు గెలిచినా గతంలోలాగే బీఆర్ఎస్ గూటికి చేరతారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనన్న విషయాన్ని ప్రజలు మరచిపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావలసిందేనని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన సాగుతోందని, రాష్ట్రంలో బీసీ సీఎం నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. బీసీలు బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. 24 గంటలూ అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డితో మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. రాష్ట్రంలో ఏర్పడబో యే బీజేపీ ప్రభుత్వంలో ఆయనను మంత్రిగా నిలబెట్టే బాధ్యత తనదని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు మురళీధర్గౌడ్, మహీపాల్రెడ్డి, నీలం రాజులు, చీకోటి ప్రవీణ్, కుంట లక్ష్మారెడ్డి, విపుల్ జైన్, శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకట్రెడ్డి, నరేందర్, తేలు శ్రీనివాస్ తదిరతులు పాల్గొన్నారు. కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు.. తెలంగాణ వచ్చిన తర్వాత కామారెడ్డికి జరిగిన మేలు ఏమీ లేకపోగా, రైతులు తయారు చేసే బెల్లం మీద ఆంక్షలు పెట్టారని కిషన్రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, డబ్బు, అధికార దుర్వినియోగం, మజ్లిస్ పార్టీల మీదే నమ్మకం ఉందని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న ముఖ్యమంత్రి వందలసార్లు మాట తప్పారన్నారు. ఆయన తల నరుక్కోవడం కాదని, బీఆర్ఎస్ పార్టీ తల నరికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
నిజామాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో
-
‘రేపు ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు’
ఢిల్లీ: రేపు(మంగళవారం) మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డ్లను ప్రధాని ప్రకటించారు. పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతుల డిమాండ్ ఉంది. రేపు మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగింది. ఈ నెల 10వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తారు. అక్టోబర్ 5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయి. జేపీ నడ్డా రానున్న ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేస్తారు.అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన ఉంటుంది’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
రేపు మహబూబ్నగర్లో ప్రధాని మోదీ టూర్
-
TS Election 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ ఆత్మలే..! : మంత్రి కిషన్రెడ్డి
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు. ఆత్మగౌరవం ఉన్నోళ్లు.. బీఆర్ఎస్కు ఓటు వేయరు : ఈటల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, గరికపాటి మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఏనుగుల రాకేశ్రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం.. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
TS Election 2023: అధికారం ఎవరి సొత్తు కాదు! ఒక్క చాన్స్ ఇవ్వండి!
సంగారెడ్డి: జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని, రెండు సార్లు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్టీ విజయ సంకల్ప సభలో కిషన్రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అమ్మిన డబ్బులతో జీతాలిచ్చే పరిస్థితికి చేరిందని విమర్శించారు. రానున్న 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలను పక్కన బెట్టి, దేశం, రాష్ట్రం కోసం పనిచేసే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబమే బాగుపడుతుందని, కాంగ్రెస్కు ఓటేస్తే సోనియా కుటుంబానికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా నిలుపుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రగతిపథంలో నడుతున్నారని కొనియాడారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్: ఈటల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. రైతుబంధు పథకం అర్హులైన రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధు వంటి పథకాన్ని కలెక్టర్లుకు కూడా ఇస్తామన్న కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఈ పథకాన్ని డబ్బులున్న వారికి ఇవ్వబోమని, నిరుపేద దళితులకే అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదన్నారు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం లేదని, కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ వారికి పెద్దపీట వేసిందని వివరించారు. ఈ వర్గాలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పులిమామిడిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవరి సొత్తు కాదని, కొందరు నాయకులు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుంటామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ నాయకులు విజయ్పాల్రెడ్డి, నందీశ్వర్గౌడ్, రాజేశ్వర్రావు దేశ్పాండే, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్గౌడ్, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
భారీ ప్రక్షాళన.. కిషన్రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ బాధ్యతలు?
సాక్షి, ఢిల్లీ: లోక్సభ్ ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం భారీ ప్రక్షాళనకు తెరతీసినట్లే కనబడుతోంది. రెండేళ్ల కిందట మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణంలో 12 మంది సీనియర్ మంత్రులను కేబినెట్ నుంచి తొలగించిన బీజేపీ.. ఈసారి కూడా పలువురు మంత్రులకు ఉద్వాసన చెప్పేందుకు దాదాసు సిద్ధమైనట్లే తెలుస్తోంది. ప్రధానంగా త్వరలో ఎన్నికల జరుగనున్న ఐదు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాలని ప్రణాళిక చేస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు సైతం మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ బీజేపీ పగ్గాలు కిషన్రెడ్డి అప్పచెప్పి.. బండి సంజయ్ను మంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇక ఈటల రాజేందర్కు బీజేపీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. బీజేపీలో సంస్థాగత మార్పులపై అధిష్టానం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే భారీ ప్రక్షాళన దాదాపు ఖాయంగా కనబడుతోంది. చదవండి: ‘పార్టీని ఇలాగేనా నడిపేది.. లేదంటే నాదారి నాదే’ -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హై కమాండ్ పిలుపు
-
కారణం చెప్పకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అన్యాయం : కిషన్ రెడ్డి
-
కేసీఆర్.. ఇప్పుడైనా స్పందించండి: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి లేఖ రాశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ (ఎయిర్ వేస్) అనుసంధానత కోసం అవసరమైన డెవలప్మెంట్ చేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని లేఖలో కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ లేఖలో కేసీఆర్ను కోరారు. ఈ క్రమంలోనే సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని.. దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులున్నాయి. మూడు విమానాశ్రయాల (ఆదిలాబాద్, జక్రాన్పల్లి, వరంగల్) నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ పలుమార్లు లేఖలు రాసినా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా కేసీఆర్కు లేఖ రాసినా స్పందన రాలేదన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి లేఖకు కొనసాగింపుగా.. ఈ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలంటూ.. తాను స్వయంగా కేసీఆర్కు 30 జూలై, 2022న లేఖ రాశానన్నారు. దీనికి కూడా సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవకరద్ర (మహబూబ్ నగర్), మమ్నూరు (వరంగల్), బసంత్ నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే AAI చేపట్టిన OLS సర్వే, సాయిల్ టెస్టింగ్ (భూపరీక్ష), టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి లేఖలో గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇమ్మని అడిగితే ఎటువంటి స్పందన రాకపోగా.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 140 దాటడం, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్రెడ్డి అన్నారు. విమానయాన రంగంలో ఉన్నటువంటి ఈ సానుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగ పరచుకుని.. తెలంగాణలో కూడా విమానాశ్రయాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. ఈ దిశగా సంపూర్ణ సహకారానికి పౌర విమానయాన శాఖ ఇదివరకే సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ లేఖ ద్వారా మరోసారి గుర్తుచేశారు. -
‘సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. -
టీకాల విధానంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం
-
ఆర్ఆర్ఆర్కు కేంద్రం ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ కలసి రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని కోరారు. గడ్కరీతో భేటీ అయిన తర్వాత కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర తెలంగాణకు మణిహారంలా ‘రీజనల్’రోడ్డు ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్తో హైదరాబాద్కు ట్రాఫిక్ తగ్గుతుందని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీలో ఉంటారని చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని.. రాష్ట్రం భూసేకరణ త్వరితగతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారని కిషన్రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుందని, అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. రెండు దశల్లో నిర్మాణ పనులు... సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించిందన్న విషయాన్ని కిషన్రెడ్డి బృందం గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. చౌటుప్పల్–షాద్నగర్ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్ కేటాయించాలని కోరారు. రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయని అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు కారిడార్, పుణే–హైదరాబాద్–విజయవాడ కారిడార్లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్లలోగా ఆర్ఆర్ఆర్ను పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్రెడ్డి తెలిపారు. -
‘ఆరోగ్య సేతు బాడీగార్డ్గా పని చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకితభావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ‘మెడికల్ పోర్టల్’ శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కొన్ని నగరాలల్లో అధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఇందుకు కారణం మర్కజ్ ప్రార్తనలు చేసిన సభ్యులు తెలంగాణతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. 60 శాతం మర్కజ్కు వచ్చిన వారి కేసులే ఉన్నాయిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని ఆయన తెలిపారు. కొన్ని మినహాయింపులు కేంద్రం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేసిందని ఆయన అన్నారు. సింకింద్రాబాద్లో స్థానిక కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా బీజేపీ కార్యకర్తలు పాటిస్తున్నారని మంత్రి కిషన్రెడ్డి అన్నారు. (ఆకలితో ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి) ఆసుపత్రుల్లో ఓపీలను మూసివేశారు. ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని, అలాంటి వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ యాప్లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే, కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని మంత్రి కిషన్రెడ్డి వివరించారు. అది బాడీగార్డులా పని చేస్తుందని ఆయన అన్నారు. పేదలను వైద్యపరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో సేవలందించడానకి సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారని, ఒత్తిడిలో ఉన్నా ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. (సఫాయీ.. ఓ సిపాయి) ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారని, ఏదైనా అనారోగ్యంతో బాధపడితే సంబందిత డాక్టర్లకు ఫోన్ చేసి మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చని, అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్లుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం వృద్దులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలను మంత్రి కోరారు. (అసలు సమస్య ఆ 6%) సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేస్తారని, దివ్యాంగులు, వృద్దులకు ఇంటికే మెడిసిన్ తెచ్చిస్తారని కిషన్రెడడ్డి చెప్పారు. ప్రజలు లాక్డౌన్కు సహకరించడం లేదు, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని కుటుంబ సభ్యలను కాపాడుకోగలమని, కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడుతూ సేవలు అందిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా సామాజిక దూరం పాటించాన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది పేదలు, వృద్దులు, మహిళలు ఏ సేవలు అడిగినా విసుక్కోకుండా సేవ చేయాలన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు మా హెల్ప్ లైన్ నంబర్ 9959261273 లేదా కిషన్రెడ్డి అనే వెబ్సైట్, ఫేస్బుక్, ట్విటర్లో పెట్టిన లిస్ట్ చూసి సంప్రదించాలని ఆయన కోరారు. 180 మంది డాక్టరు ఆయా సమయాల్లో అందుబాటులో ఉంటారని మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్ పాల్గొన్నారు. -
స్థానిక ప్రభుత్వం పరిహారం చెల్లించాలి : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి నియోజక వర్గంలోని మంగరు బస్తీలో ఇటీవల గోడకూలి చనిపోయిన ముగ్గురు చిన్నారుల కుటుంబ సభ్యులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. గోడకూలి ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్ను వెంటనే కూలగొట్టి కొత్తవాటిని నిర్మించాలని తెలిపారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ఇంకా సహాయం అందలేదని, వెంటనే స్థానిక ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సూచించారు. మంగర బస్తీలోని శిథిలావస్థ ఇళ్లను తీసివేసి యుద్ధ ప్రాతిపదికన కొత్త వాటిని నిర్మించాలన్నారు. -
హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
-
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్బ్లాక్ కార్యాలయంలో ఉన్న హోంశాఖ ఆఫీసులో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో సహాయమంత్రిగా నిత్యానంద రాయ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందుకేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు శ్రీపాద యశో నాయక్ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
ఆయుష్మాన్ భారత్తో ప్రజలకు మేలు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం అమల్లోకి తెస్తున్న పథకం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద హెల్త్ స్కీం అని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతున్న తరుణంలో దీంతో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్నారు. ఆరోగ్యశ్రీలో రూ.2 లక్షల వైద్య సహాయమే ఉండగా, ఇందులో రూ.5 లక్షల వైద్య సహాయం అందుతుందని చెప్పారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద ని వార్తలు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం చేపట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. -
ఓయూ అంటే కేసీఆర్కు ఇష్టం లేదు...
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి అన్నారు. గత ఏడాది తిరుపతిలో ఈ సమావేశాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాలకు సంబంధించిన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అన్ని ఏర్పాట్లు చేసి ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇపుడు వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. దేశ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం నిర్ణయం ఉందన్నారు. సీఎం కేసీఆర్కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారంటూ ఇలాంటి సభలు నిర్వహించకపోవడం తెలంగాణకు అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్కు ఇష్టం లేదని, ద్వేషపూరితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్ను కేసీఆర్ వాయిదా వేశారన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యార్థులతో బీజేపీ మాట్లాడుతుందని చెప్పారు. టీఆర్ఎస్ మహా సభలా ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహా సభలులాగా జరిగాయని, ఒక లక్ష్యం లేకుండా నిర్వహించారని కిషన్రెడ్డి విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలుగు మహాసభ పేరుతో సీఎం సొంత భజన చేసుకున్నారని, రాచరికపు పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించిందా అని ప్రశ్నించారు. తెలుగు కళాశాలకు ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని నిలదీశారు. టిఆర్ఎస్ నాయకులను ఏ అర్హతతో ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ వేదిక కింద ఉంటారు.. అసదుద్దీన్ ఒవైసీ వేదిక పైన ఉంటారు.. ఇవి ఏమి తెలుగు మహాసభలోఅర్థం కాలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, మొదటి పొగడ్త కేసీఆర్కు వస్తే రెండో పొగడ్త నిజాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. -
రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
రైతులను ఆదుకోలేమని ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి విమర్శించారు. రైతులను ఆదుకుంటున్నామని పదే పదే చెప్పుకుంటున్నారని, మరి అలాంటప్పుడు ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా సభలో రైతు సమస్యలపై చర్చ జరిపారని విమర్శించారు. తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించుకుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులతో పనులు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి పోచారం ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
నాయినిని మంత్రివర్గం నుంచి తొలగించాలి
-
నాయినిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: కిషన్రెడ్డి
నిజామాబాద్: తెలంగాణపై కేసీఆర్కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ బీజేపీ సభను విచ్ఛిన్న సభగా నాయిని పేర్కొనడం దారుణమన్నారు. సెప్టెంబర్ 17 నాడు జాతీయ జెండా ఎగురవేయడం విచ్ఛిన్నమా అని ప్రశ్నించారు. నిజామాబాద్ సంకల్ప సభలో ఎలా పాల్గొంటారని నాయిని కేంద్ర హోం మంత్రిని ఎలా ప్రశ్నిస్తారన్నారు. కేసీఆర్ మీరు జెండా ఎగురవేస్తారా లేదా లేకపోతే 2019 వరకూ వేచి చూస్తాం.. 2019లో బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేత డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నేత బస్వా లక్ష్మీనర్సయ్యలు ఈ సభలో రాజ్నాథ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రాజ్నాథ్సింగ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిజాం వారసునిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మూర్ఖుడంటూ ఆయన సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడు.. 2019లో బీజేపీదే అధికారం అని అన్నారు. -
వెంకన్న దర్శనానికి వెళుతూ..
నలుగురు హైదరాబాదీల దుర్మరణం చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్: అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని... అటునుంచి వెంకన్న దర్శనం చేసుకుందామని తిరుపతికి బయలుదేరిన నలుగురు నగరవాసులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్కు చెందిన స్నేహితులు హన్మంతరెడ్డి(40), శ్రీనివాస్రెడ్డి (35), కిషన్రెడ్డి (38) వివిధ జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. వీరంతా వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన స్నేహితులు తిరుపాల్రెడ్డి(38), ప్రేమ్సుందర్రెడ్డి(42) ఎల్అండ్టీలో పనిచేస్తున్నారు. మరొకరి పరిస్థితి విషమం... కాగా, బుధవారం రాత్రి స్థానికంగా ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన వీరు... 7.30 ప్రాంతంలో తిరుపతికి బయలుదేరారు. వీరి వద్ద రూ.10 లక్షల అప్పుతీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆచూకీ లభించడంతో అతడి నుంచి బాకీ వసూలు చేసుకుని, అనంతరం తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకుందామని తిరుపతికి కారులో పయనమయ్యారు. కాగా, గురువారం ఉదయం తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. ఐదుగురిలో శ్రీనివాస్రెడ్డి, కిషన్రెడ్డి, ప్రేమ్సుందర్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తిరుపాల్రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. హన్మంతరెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా పాకాల మండలంలోని పెరుమాళ్లగుడి పల్లి వద్ద గురువారం ఉదయం ట్యాంకరు ట్రాలీ బోల్తా పడిన మరో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వీరు కుక్కలపల్లి హరిజనవాడకు చెందిన సుబ్బరాయలు(54), మధుసూధన్(34). -
బానిసలుగా చూస్తుండటం వల్లే..
హైదరాబాద్: హోం గార్డులు తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని , కనీస మర్యాద, వేతనం లేకుండా బానిసలుగా చూస్తుండటం వల్లే వారిప్పుడు తిరగబడుతున్నారని బీజేఎల్పీనేత కిషన్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నదని విమర్శించారు. జీవితాంతం శ్రమించినా పదవీ విరమణ సమయంలో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదన్నారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందన్నారు. పోలీసు వ్యవస్థతో మమేకమై పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలు ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులకు నోటీసులిచ్చి వారిని మరింత క్షోభకు గురిచేయ్యొద్దన్నారు. వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే తానే స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్, ఇద్దరు సీఎం, ఇద్దరు సీఎస్, డీజీపీలకు లేఖలు రాస్తానని తెలిపారు. -
బతుకమ్మ తెలంగాణకు తలమానికం
అంబర్పేట: ఆడబిడ్డల ప్రాముఖ్యతను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ కేంద్రమంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు -
‘భారత్ది దాడి కాదు.. ఆత్మరక్షణ చర్య’
హైదరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) లోని ఉగ్రవాద క్యాంపులపై భారత ఆర్మీ చేసింది ప్రతీకార చర్య కాదని, అది కేవలం ఆత్మరక్షణ చర్యలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పీఓకేలో క్యాంపులు పెట్టడంతోనే మన దేశంపై ఉగ్ర దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. భవిష్యత్లో భారత్పై ఉగ్ర దాడులు జరగకుండా ఆర్మీ ఎదుర్కుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ దాడుల విషయంలోఆర్మీ జనరల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారన్నారు. దేశ రక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్మీ దాడులు అభినందనీయం: బీజేఎల్పీనేత కిషన్రెడ్డి భారత సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం అభినందనీయమని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భారత ఆర్మీ వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఈ దాడుల ద్వారా భారత్ తమ దాయాదిని హెచ్చరించిందని కిషన్ రెడ్డి చెప్పారు. -
చర్చించకుండా కొత్త జిల్లాలను ప్రకటించొద్దు
స్పీకర్నే అవమానించేలా అసెంబ్లీ ప్రోరోగ్: కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసనసభలో చర్చించి, నిర్ణయం తీసుకునే వరకు జిల్లాల విభజనపై తుది ప్రకటనను వాయిదా వేయాలని అసెంబ్లీ బీజేపీ పక్ష నేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా ఆందోళనను విస్మరించి జిల్లాల ఏర్పాటును జరపొద్దని సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ జరిగే విధంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రోరోగ్ చేసిందని దీన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. బీఏసీలో, ఇతర పక్షాలతో చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. స్పీకర్ను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. -
‘కల్వకుర్తి’పై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
కల్వకుర్తి: కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేసే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు సీఎస్ రాజీవ్శర్మ దష్టికి తీసుకెళ్తానని బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్రెడ్డి అన్నారు. కల్వకుర్తి డివిజన్ కోసం వారం రోజులుగా ఆమరణదీక్ష చేపడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి టి.ఆచారికి మంగళవారం పూలమాలలు వేసి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఏడురోజులుగా ఆమరణదీక్ష చేయడం కష్టసాధ్యమని, ఆచారి పోరాట పటిమను అభినందించారు. రెవెన్యూ డివిజన్ చేసేందుకు అన్ని హంగులు ఉన్నాయని, ఏర్పాటుచేయకపోవడం రాజకీయ స్వలాభమే అన్నారు. గిరిజనులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండడంతో పాటు పూర్తిగా వెనుకబడిన ప్రాంతమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాజకీయకోణం, స్వలాభాన్ని ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ విషయంపై కేంద్రమంత్రులతో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు నాగం జనార్ధన్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, కొండన్న, జిల్లా అధ్యక్షుడు రతంగ పాండురెడ్డి, ఆనంద్కుమార్, ఎడ్మ సత్యం, శేఖర్రెడ్డి, రాఘవేందర్గౌడ్, పవన్కుమార్ పాల్గొన్నారు. -
ఎర్రచందనం రక్షణకు చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్రెడ్డి సూచన సాక్షి,తిరుమల: శేషాచలానికి తలమానికమైన ఎర్రచందనం అటవీ సంపదను ఆర్థిక, వాణిజ్య దృష్టితో చూడకుండా వాటి పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి సూచిం చారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన గురువారం రాత్రి తిరుమలకు వచ్చా రు. ఆయన మీడియాతో మాట్లాడారు. అంతరించిపోతున్న వృక్షాల్లో ఎర్రచందనం కూడా ఒకటని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించిందన్నారు. అలాంటి అరుదైన జాతిని భావితరాల కోసం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాంటి వృక్షాల ఎగుమతితో డబ్బులు సంపాదించుకోవాలని భావనతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సరికాదన్నారు. శేషాచలంలోని చెట్లను నరకుండా రాష్ర్ట ప్రభుత్వం మరింత సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటి స్మగ్లింగ్కు పాల్పడే స్మగ్లర్లపై చట్టంలో మార్పులు చేసైనా మరింత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్కు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వీటి రక్షణ చర్యల కోసం శేషాచలంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని కిషన్రెడ్డి గుర్తు చేశారు. ఆయన వెంట టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి కూడా ఉన్నారు. -
అవకాశమిస్తే సమగ్రాభివృద్ధి
* వరంగల్ ఎన్నికలతో మార్పు రావాలి * 2019లో స్వతంత్రంగా పోటీ... మీట్ ది ప్రెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వరంగల్ సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ.43 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో కిషన్రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే పూనకమొస్తుందని, ఏవో హమీలు గుప్పిస్తూ ఎన్నికలయ్యాక మరిచిపోతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,200 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి, హార్టికల్చర్ వర్సిటీ, గిరిజన వర్సిటీ, ఫార్మాసూటికల్ రిసెన్స్ సెంటర్, ఈఎస్ఐ మెడికల్ కళాశాలను తీసుకువచ్చామన్నారు. పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు, విమానాశ్రయ పున రుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, వరంగల్లో టెక్స్టైల్ పార్కుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వివరించారు. అమృత్ పథకం కింద వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ను స్మార్ట్ సిటీగా రెండో జాబితాలో ప్రకటిస్తామన్నారు. -
తప్పనిసరయ్యే టీడీపీతో పొత్తు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ జాతీయ పార్టీ గనుక ఢిల్లీ స్థాయిలో విశాల దృక్పథంతో నిర్ణయాలుంటాయన్నారు. టీడీపీతో కలిసి బల్దియా ఎన్నికల్లో గెలుస్తామని మంగళవారం ‘సాక్షి’ టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చా కార్యక్రమంలో ధీమా వెలిబుచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తెలంగాణలో పర్యటించేందుకు ప్రధాని మోదీ ఆసక్తి చూపుతున్నా టీఆర్ఎస్కే అది ఇష్టం లేదన్నారు. ‘‘త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వమున్నావాళ్లు ఆహ్వానిస్తే ప్రధాని వెళ్లారు. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఆయనను ఇప్పటిదాకా ఒక్క అధికారిక కార్యక్రమానికీ ఆహ్వానించలేదు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి ప్రతినిధి బృందం రావడానికి ఆసక్తి కనబరిచినా టీఆర్ఎస్ నేతలే వద్దన్నారు. తెలంగాణకు నిధుల మంజూరులో కేంద్రం ఎక్కడా వివక్ష చూపలేదు.ఇప్పటికే రూ.లక్ష కోట్లకు పైగా ఇచ్చింది. కానీ దీన్ని ప్రచారం చేసుకోవడంలో మాత్రం బీజేపీ విఫలమైంది’’ అన్నారు. -
'లోకేశ్.. గొడవలు పెట్టేలా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఉండటం టీడీపీకి ఇష్టం లేదా? అని టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ ప్రశ్నించారు. హైదరాబాద్లో గొడవలు జరిగేరీతిలో టీడీపీ నేత లోకేశ్, బీజేపీ నాయకుడు కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండ్డిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ-బీజేపీ నేతలను ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయమై మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను ఎందుకు ప్రతిపక్ష నేతలు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. దిగ్విజయ్సింగ్ ఎక్కడ అడుగుపెడితే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బాల్క సుమన్ అన్నారు. దిగ్విజయ్ పేరును అపజయ్సింగ్గా మార్చాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు. -
2016 పోరాటాల సంవత్సరమే: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకోసం 2016లో పోరాటాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. పార్టీ నేతలు ప్రకాశ్రెడ్డి, ప్రదీప్కుమార్లతో కలసి సోమవారం ఆయన రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలతో కలసి సీఎం కేసీఆర్ను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా, వచ్చే ఏడాదిని పోరాటాల సంవత్సరంగా తాము భావిస్తున్నామని కిషన్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలో శిక్షణకోసం వెళ్తూ హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల పట్టుబడటం దీనికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాదులను ఎంఐఎం పెంచి పోషిస్తున్నదని కిషన్రెడ్డి ఆరోపించారు. కఠినమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల హైదరాబాద్లో శాంతిభద్రతలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
'ఓట్లు వేయకుంటే కళ్లు పోతాయా?'
హన్మకొండ(వరంగల్ జిల్లా): వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే కళ్లు పోతాయని కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి హన్స్రాజ్ అగర్వాల్తో కలిసి హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. శాపనార్థాలకు ఓటర్లు భయపడరని, ఓట్లు పడవని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేస్తే రాష్ట్ర మంత్రులంతా వరంగల్లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు, హామీలు అమలు చేయకుండా కళ్లు పోతాయనడం మూర్ఖత్వం, దుర్మార్గమని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను బెదిరిస్తున్నారని, ఆ సంఘాలను తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. చివరి వరకు పత్తి కొనుగోలు చేస్తే రాజీనామా చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అంటున్నారని.. ఆయనకు పత్తి కోనుగొలు అధికారం లేనప్పుడు రాజీనామా చేయడమెందుకని ప్రశ్నించారు. పత్తి కొనుగోలుకు నయా పైసా ఖర్చు చేయకుండా ఆర్థిక మంత్రిని బలి చేయడం బాగుండదని, అధికారమంతా కేసీఆర్ వద్దే కేంద్రీకృతమై ఉందని అన్నారు. మహారాష్ట్రలో లాగా సీసీఐకి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, చేతగాకపోతే తామే చేస్తామని అన్నారు. పత్తి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల టైంలో ఉంటే బెటర్!
బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిలో ఈ మధ్య వేదాంతధోరణి కనబడుతుండడంపై పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగుతోందట. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనా, తెలంగాణ ఏర్పడ్డాక ఆ పదవిని చేపట్టినందున ఆయనకు మరోసారి ఈ పదవి దక్కే అవకాశాలు కొంతమేరకున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఆయన వ్యతిరేకవర్గం జాతీయస్థాయిలో ఈ పదవి రాకుండా బలంగా పావులు కదుపుతోందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తనకు మరో అవకాశం వచ్చినా రావొచ్చునని, రాకపోయినా వచ్చే ఇబ్బందేమీ లేదన్న విధంగా ఆయన తన సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నారట. మరోసారి ఆయనకు అధ్యక్షపదవి దక్కకపోయినా మాజీ అధ్యక్షుడిగా మాత్రం ఎప్పటికీ మిగిలిపోతారని, ఆ హోదా నుంచి ఆయనను ఎవరూ తప్పించలేరు కదా అని ఆయన అనుకూలవర్గం నేతలు సర్దిచెప్పుకుంటున్నారట. ఇదిలా ఉంటే గతంలో రెండు, మూడుసార్లు బీసీ కార్డుతో అధ్యక్షపదవి కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన ఒక ముఖ్యనే త సైతం ఇప్పుడు ఈ పదవి పట్ల ఏమాత్రం సుముఖత చూపడం లేదట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం తనకు అధ్యక్షపదవి కావాలని సదరు బీసీనేత గట్టిగానే కోరుకుంటుండగా, కిషన్రెడ్డి కూడా ఈసారి అధ్యక్ష పదవి లభించకపోయినా ఎన్నికలకు ముందుమాత్రం ఆయనకే అవకాశం లభించాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారట. అయితే ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన ఒకనేత మాత్రం అధ్యక్షస్థానం కోసం ఢిల్లీస్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి తన ప్రయత్నాల్లో ఆయన విజయవంతం కూడా కావొచ్చునని ఆ పార్టీనేతలే అంగీకరిస్తున్నారట. ఒకసారి ఈ పదవి లభిస్తే రెండోటర్మ్ కూడా ఆయననే కొనసాగిస్తే ఎన్నికలపుడు ఆయనే కొనసాగడం తథ్యమని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెవులు కొరుక్కుంటున్నారట...! -
'ప్రభుత్వానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలి'
వరంగల్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ పట్టణంలో ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సర్కార్ పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ స్థానానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉద్యమాల పునాదులపై నిర్మించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని కాకుండా ఆయన కుటుంబాన్ని బంగారుమయంగా చేసుకుంటున్నారని మంగళవారం ఖమ్మం జిల్లా పర్యటనలో కిషన్రెడ్డి మండిపడ్డ విషయం విదితమే. -
'రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం..'
హైదరాబాద్: గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో మంగళవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించడంపై జాప్యం ఎందుకు జరుగుతుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. -
'రైతులను చూడకుండా.. చైనా వెళతారా'
నిజామాబాద్: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే 100 మంది రైతులు మరణించి, కరువు విలయతాండవం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 17 నెలల్లో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన రైతు మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రైతుల్లో ఆత్మస్తైర్యం నింపకుండా చైనా పర్యటనేంటని మండిపడ్డారు. యుద్ధ ప్రతిపాదికన కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాం పాలన విముక్తి ఉత్సవాలపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు. దేశానికి, రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలు, సంక్షేమ పథకాలపై చర్చిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. -
శ్రీమంతుడికి బీజేపీ అధ్యక్షుడి అభినందనలు
హైదరాబాద్: ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్తో వచ్చిన మూవీ శ్రీమంతుడు. హీరో మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో పాటు ఈ సినిమా పలువురికి ఆదర్శవంతంగా కూడా నిలుస్తోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయాలనే తపన పలువురి మనసులను తాకింది. ప్రస్తుతం శ్రీమంతుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పాలమూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నమహేష్ బాబును ట్విట్టర్ ద్వారా అభినందించారు. Sincere thanks and best wishes srimanthudu mahesh babu for adopting a village in Paalamuru, telangana. #Srimanthudu — G.Kishan Reddy (@kishanreddybjp) August 22, 2015 -
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్: కిషన్రెడ్డి
కాచిగూడ (హైదరాబాద్ సిటీ) : బాలబాలికలకు సహజంగానే సహనం, ఓర్పు ఉంటాయని, ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రీడల్లో రాణించాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ నారాయణగూడ బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ వార్షిక వైఎంసీఏ కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ - 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని వివిధ స్కూల్స్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డి, చెస్, త్రోబాల్, కరాటే తదితర పోటీలలో వందల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చాటనున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు, మామూలు విద్యార్థులకు చాలా వ్యత్యాసాలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో స్నేహ పరిచయాలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఛైర్మన్ ఫిలమెన్ రాజ్కుమార్, ప్రధానకార్యదర్శి బీజే వినయ్స్వరూప్, కోశాధికారి మార్యో, సీనియర్ కార్యదర్శి కిరణ్కుమార్, విజయలక్ష్మీ, బీజేపీ నేతలు ఏ.సూర్యప్రకాష్ సింగ్, జి.సోమేశ్వర్, బిఆర్ రవి తదితులు పాల్గొన్నారు. -
భద్రాచలంలో ప్రముఖులు
భద్రాచలం(ఖమ్మం జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భద్రాచలం వద్ద పుష్కర స్థానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మంగళవారం తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుష్కర స్థానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చినజీయర్స్వామి పాల్గొన్నారు. -
ఆ 500 ఎకరాలు కేసీఆర్ కుటుంబానికా?
-
500 ఎకరాలు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చుకుంటారా?
హైదరాబాద్: ఓయూలో ఒక్క గజం స్థలాన్ని ప్రభుత్వం తీసుకున్నా బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్శిటీ భూమిని లాక్కొంటే అమవీరుల ఆత్మలను అవమానించినట్లే అవుతుందన్నారు. రెచ్చగొట్టడం, కయ్యానికి కాలు దువ్వడం సీఎం కేసీఆర్ కు తగదని హితవు పలికారు. హార్టీ కల్చర్ యూనివర్సిటీకి 500 ఎకరాలు వద్దంటున్న కేసీఆర్... కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగిరే వరకు శ్రమిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. -
వికారుద్దీన్కు భారతరత్నఇవ్వాలా?
-
'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటారా?
హైదరాబాద్: మాజీ ప్రధాని వాజ్ పేయి, సీనియర్ నేత అద్వానీలపై ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. మతోన్మాదాన్ని విరజిమ్మే ఎంఐఎం దిగజారుడు మాటలు మాట్లాడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగవిరుద్ధంగా మాట్లాడిన ఒవైసీ ఎంపీ పదవిని వెంటనే రద్దు చేయాలన్నారు. తీవ్రవాద చర్యలను సమర్థించే మజ్లిస్ పార్టీ.. ఖాసీం రజ్వీ, వికారుద్దీన్లకు భారతరత్న ఇవ్వమంటుందా అని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు విధ్వంస అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీలకు భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం దుర్మార్గమని ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆర్టీసీ సమ్మె నివారణకు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న లక్ష్మణ రేఖను టీఆర్ఎస్ చేరిపేస్తోందని విమర్శించారు . హైకోర్టు విభజన పై గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలు, చీఫ్ జస్టిస్ కూర్చొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
టీఆర్ఎస్ హామీలేమయ్యాయి : కిషన్రెడ్డి
-
మిషన్ గులాభీగా మారిన మిషన్ కాకతీయ
-
కాల్పులపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన వరుస సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు చూపించిన ధైర్యం గొప్పదని, వారికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాద సంస్థలను నియంత్రించడానికి పోలీసుల్లో మరింత స్థైర్యాన్ని పెంచాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ముడిపడి ఉన్న ఈ సంఘటనలపై లోతుగా విచారణ జరగాలన్నారు. ఇందుకు జాతీయ పరిశోధనా సంస్థకు రాష్ట్ర పోలీసులు సహకరించాలని సూచించారు. ఘటనలో సిమి ఉగ్రవాదులు ఉన్నట్టు తేలినా రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
పోలీసులకు ఆధునిక ఆయుధాలనివ్వాలి : కిషన్రెడ్డి
-
కేసీఆర్.. నిజాంకు వారసునివా?: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజరిక వ్యవస్థకు ప్రతినిధిగా, నిజాం నవాబులకు వారసునిగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత ఇద్దరు సీఎంలు, రెండు లోగోలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. సచివాలయాన్ని కూల్చేసి, చాతీ ఆసుపత్రిని అడవుల్లోకి పంపించడం మంచిదికాదన్నారు. ఫాస్ట్ను ఉపసంహరించి మళ్లీ ఫీజుల రీయింబర్స్మెంట్ అనడం కేసీఆర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. -
మినహాయింపు ఇవ్వాల్సిందే
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్రేత రులకు సమగ్ర కుటుంబ సర్వే నుంచి మినహాయింపును ఇచ్చేందుకు కేసీఆర్తో మాట్లాడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధి కోసం ముంబై, శివారు ప్రాంతాలకు వచ్చిన వలస కూలీలు, ఉపాధి కార్మికులు 19న తప్పకుండా సొంత ఊరిలో ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి తెలంగాణ ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఆ రోజు రావడం కుదరకపోతే, పనిచేస్తున్న చోట సెలవు దొరకకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. వలస బిడ్డల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని, వారికి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. దీనిపై కిషన్ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. స్పందించిన ఆయన మహారాష్ట్రతోపాటు తెలంగాణ రాష్ట్రేతర ప్రజలకు మినహాయింపునిచ్చేలా కేసీఆర్తో, సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. ప్రవాస తెలంగాణ ప్రజల కోసం నిబంధనలను సడలించాలని కోరతామని తెలిపారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు తరలి రావాలంటే కష్టమవుతుందని, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇదిలాఉండగా తెలంగాణలోని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడి ప్రజలు టికెట్లను బుక్ చే సుకుంటున్నారు. అయితే రైళ్లతోపాటు బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్లో టికెట్లన్నీ బుక్ అయిపోయానని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారు. -
బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా కిషన్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా పాటు పడతానని చెప్పారు. తెలంగాణ లో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. -
‘సీఎం పనులు సచివాలయం దాటవా’
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెబుతున్న మాటలు సమీక్షలకే పరిమితమయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీ కవిత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు కాని, తమ ఎమ్మెల్యే లక్ష్మణ్ సానియాపై చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా వచ్చేనెలలో రాష్ట్రానికి వస్తున్నారని, పార్టీ బలోపేతానికి రెండురోజుల పాటు భేటీలు నిర్వహించి మార్గదర్శనం చేయనున్నారని కిషన్రెడ్డి తెలిపారు. -
మజ్లిస్తో టీఆర్ఎస్ దోస్తీనా?
తెలంగాణను వ్యతిరేకించిన ఆ పార్టీకి సలాం కొడతారా?: కిషన్రెడ్డి ఆ పార్టీ రజాకార్ల వారసత్వమని మరిచారా? తెలంగాణలో ఖాసీం రజ్వీ అకృత్యాలు గుర్తులేదా..{పజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ బదులు మరేదైనా చారిత్రక గుర్తును వాడాలి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచేలా వ్యవహరించిన మజ్లిస్తో దోస్తీకి ఎందుకు తాపత్రయపడుతున్నారో తెలంగాణ రాష్ర్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నీడలో బలపడేందుకు నిన్నటి వరకు యత్నించిన మజ్లిస్ పార్టీ నేతలపై దేశ ద్రోహం కేసులున్న సంగతి కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. అయినా వారి మద్దతు కోసం వారికి ఎదురేగి మరీ సలాం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖాసిం ర జ్వీ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లెల్లో వందలమంది మహిళలపై అత్యాచారాలు చేసి అడ్డొచ్చిన వారిని ఊచకోత కోసిన రజాకార్ల వారసత్వంగా ఎదిగిన పార్టీ మజ్లిస్ అన్న విషయాన్ని కేసీఆర్ మరిచారా అని ప్రశ్నించారు. తెలంగాణలో సాయుధపోరాటం ఎందుకు వచ్చిందో, నాటి యోధులకు ఎందుకు సమరయోధుల పింఛన్ ఇస్తున్నారో టీఆర్ఎస్ అధినేత గుర్తుచేసుకోవాలన్నారు. కొద్దిసేపు పోలీసులు పట్టించుకోకుంటే భారతీయుల సంగతేంటో చూద్దామంటూ ప్రసంగించి ఒక వర్గం వారిని రెచ్చగొట్టి దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న మజ్లిస్ నేతలకు కేసీఆర్ కుటుంబం సాదరస్వాగతం పలికి ప్రభుత్వానికి మద్దతు కోరటం దారుణమన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని మజ్లిస్ మద్దతుతో ఏర్పాటు చేయటం ఏమాత్రం శుభం కాదన్నారు. హైదరాబాద్లో బలంలేని టీఆర్ఎస్ త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ పది సీట్లు పొందేందుకు మజ్లిస్ దోస్తీకి ఆరాటపడటం అవకాశవాదమన్నారు. చార్మినార్ ఓ మతానికి సంబంధించిందని గతంలో పదేపదే చెప్పిన మజ్లిస్ నేతల ఒత్తిడితో దాని చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో పొందుపరచాలని చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. వాస్తవానికి కూడా చార్మినార్ కట్టడంలో మసీదు ఉన్నందున... అది కాకుండా రాష్ట్ర చరిత్రను ప్రతిబింబించే ఇతర గుర్తులకు ఆ చిహ్నంలో చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విధివిధానాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలి... రాష్ట్రం విడిపోయినప్పుడు ఉద్యోగుల విభజన ఎలా జరగాలన్న అంశంపై రూపొందించిన విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారమే ఇప్పుడు పంపకం జరగాలని కిషన్రెడ్డి అన్నారు. ఈ పంపకం సామరస్యపూర్వకంగా జరిగేలా సహకరించాలే తప్ప రెచ్చగొట్టేలా వ్యవహరించ వద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ నేత విఠల్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించటం అవివేకమన్నారు.