తెలంగాణ‌ను ఏం చేద్దాం అనుకుంటున్న‌వ్ స్వామి?: కేటీఆర్‌ | KTR Criticized Revanth Govt For Registrations fallen In HYD Due To HYDRA | Sakshi
Sakshi News home page

తెలంగాణ‌ను ఏం చేద్దాం అనుకుంటున్న‌వ్ స్వామి?: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌

Published Mon, Oct 7 2024 6:12 PM | Last Updated on Mon, Oct 7 2024 6:41 PM

KTR Criticized Revanth Govt For Registrations fallen In HYD Due To HYDRA

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. తెలంగాణ‌కు గుండెకాయ వంటి హైద‌రాబాద్‌ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌, సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి.. భ‌యాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే  హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని తెలిపారు.

రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement