తెలంగాణ: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే | mla bandla krishna mohan reddy youturn To brs | Sakshi
Sakshi News home page

తెలంగాణ: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే

Published Tue, Jul 30 2024 12:49 PM | Last Updated on Tue, Jul 30 2024 3:59 PM

mla bandla krishna mohan reddy youturn To brs

హైదరాబాద్‌, సాక్షి: కాంగ్రెస్‌ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్‌రెడ్డి షాకిచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. యూటర్న్‌ తీసుకున్నారు. తిరిగి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 

ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్‌ఎస్‌​ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కృష్ణమోహన్‌రెడ్డి. ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల.. ఈ నెల మొదట్లో పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. 

	అలా వెళ్లి, ఇలా వచ్చారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement