ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే | Tanuja Rani Shocking Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే

Jun 3 2025 3:25 AM | Updated on Jun 3 2025 3:25 AM

Tanuja Rani Shocking Comments On Chandrababu

చంద్రబాబు వెన్నుపోటు పాలనను ఎండగడదాం 

4న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయండి 

వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజ రాణి పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూట­మి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలు­పంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 

ోమవా­రం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీ­డి­యాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు జూన్‌ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజ­లంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయా­లని కోరా­రు. సీఎం చంద్రబాబు  సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభు­త్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement