
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. ప్రతి వరిగింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రం లోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు.