రెడ్‌బుక్ పేరుతో ‘ఎల్లో’ అరాచకం: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Tweets On TDP Attacks In AP, More Details Inside | Sakshi

రెడ్‌బుక్ పేరుతో ‘ఎల్లో’ అరాచకం?: ఎంపీ విజయసాయిరెడ్డి

Jul 23 2024 9:40 AM | Updated on Jul 23 2024 10:41 AM

Ysrcp Mp Vijayasai Reddy Tweets On Tdp Attacks

టీడీపీ అరాచకాలపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే,

సాక్షి, ఢిల్లీ: టీడీపీ అరాచకాలపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం?’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.

 

 

‘‘అంతు చూస్తా, పాదాలతో తొక్కేస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము.. నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదు, హోం మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది.. ప్రజలే కాదు.. పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement