
వైవీ సుబ్బారెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, అనకాపల్లి: పవన్లా మాది ప్యాకేజీ పార్టీ కాదంటూ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదని, పేదల పక్షాల నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్కు, ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్సార్సీపీకి చాలా తేడా ఉంది. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
‘‘రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్కు అభివృద్ధి గురించి తెలుస్తుంది. బీసీలకు పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా?. అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
Comments
Please login to add a commentAdd a comment