వాలీబాల్‌ విజేత ప్రకాశం | - | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ విజేత ప్రకాశం

Published Mon, Feb 17 2025 1:30 AM | Last Updated on Mon, Feb 17 2025 1:29 AM

వాలీబ

వాలీబాల్‌ విజేత ప్రకాశం

పురుషుల, మహిళల విభాగాల్లో

ప్రథమస్థానం

ద్వితీయ స్థానంలో తూర్పుగోదావరి, విజయవాడ

ఒంగోలు: మూడురోజుల పాటు ఉత్కంఠగా సాగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ కరవదిలో ఆదివారం ముగిసింది. పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు పురుషుల విభాగం, మహిళల విభాగంలో రాణించి ప్రథమస్థానంలో నిలిచి ప్రకాశం క్రీడా పతాకాన్ని రెపరెపలాడించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరుగుతున్న పోటీలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సాహభరితంగా, ఉత్కంఠగా సాగిన పోటీల్లో ప్రకాశం జట్టు పురుషుల విభాగంలోను, మహిళల విభాగంలోను పైచేయి కనబరిచి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జట్టు ద్వితీయ స్థానంతో నిలిచింది. మహిళల విభాగంలో ఎంవీపీ ట్రస్టు విజయవాడ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో కృష్ణా, వైఎస్సార్‌ కడప జట్టు 3,4 స్థానాలలో నిలవగా, మహిళల విభాగంలో వైఎస్సార్‌ కడప జట్టు తృతీయస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను ప్రముఖులు డాక్టర్‌ శంకరరావు, డాక్టర్‌ మల్లికార్జునరావు, పారిశ్రామిక వేత్త సుబ్బారెడ్డి, అడ్వకేట్‌ శిరిగిరి రంగారావు, బైబిల్‌ మిషన్‌ గుంటూరు గవర్నింగ్‌ బాడీ సభ్యులు ఆర్‌ఎంపీ కుమార్‌, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వాలీబాల్‌ విజేత ప్రకాశం 1
1/1

వాలీబాల్‌ విజేత ప్రకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement