ఉచ్చులు బిగించే వారిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఉచ్చులు బిగించే వారిపై కేసు నమోదు

Published Thu, Feb 20 2025 8:24 AM | Last Updated on Thu, Feb 20 2025 8:24 AM

-

యర్రగొండపాలెం: అడవిలో ఉచ్చులు బిగించి జంతువులను వేటాడే వారిపై ఫారెస్ట్‌ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన మండలంలోని కొలుకుల బీట్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో అడవి పందుల కోసం ఉచ్చు బిగించారు. ఈ ఉచ్చులో చిక్కుకొని చిరుతపులి మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ కేసును ముమ్మరం చేసిన ఫారెస్ట్‌ అధికారులు బుధవారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అనుమానితులైన కొలుకులకు చెందిన ఇద్దరు, చెన్నరాయునిపల్లెకు చెందిన మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. కేసు విచారణ పూర్తయిన అనంతరం ఆ నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేయనున్నట్లు తెలిసింది. అందుకు ఫారెస్ట్‌ అధికారులు స్థానిక సీఐ సీహెచ్‌ ప్రభాకరరావు సహకారాన్ని కోరినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement