సింహ వాహనంపై శ్రీవారు
కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం సింహ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై శ్రీవారిని ఊరేగించారు. ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఉభయదాతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, రమణాచార్యులు, సింహాద్రీచార్యులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించి శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారు హంస వాహనంపై దర్శనమిస్తారని ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment