
ప్రజా ఆశీర్వాద సభకు తరలివస్తున్న ప్రజలు
● ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి.
● జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై హరీశ్రావు అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
● రాఘవాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం నాయకులు జలపందిరితో సభా స్థలికి చేరుకున్నారు.
● మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రజలను లోనికి అనుమతించారు.
● సాయంత్రం 5.45కు సీఎం హెలికాప్టర్లో ప్రజా ఆశీర్వాద సభకు చేరుకున్నారు.
●హెలికాప్టర్ దిగిన కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకగా, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ పర్సన్ విజిత తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు.
● సీఎం ప్రసంగం అనంతరం కేసీఆర్కు
మంత్రి హరీశ్రావు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి, పాదాభివందనం చేశారు.
● 6.34 గంటలకు సభను ముగించుకుని సీఎం సభా ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గంగుండా హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
● ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సభలో నాగలి చూపిస్తున్న రైతు