Sangareddy District News
-
భీఫార్మసీ విద్యార్థిని శివానీ ఆత్మహత్య
సదాశివపేట(సంగారెడ్డి): ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ(17) హైదరాబాద్లో భీఫార్మసీ చదువుతుంది. రెండు నెలల కిందట సదాశివపేటలోని ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్న శివానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతి రాసిన సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ నాకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టం.. నా తల్లిదండ్రుల అనుమతితో నా అవయవాలను దానం చేయాలని కోరుతున్నా.. నేను లేకున్నా నా అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారమోనని నా ఆశ.. నా చావుకు నేనే కారణం.. దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు పనికిరావని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
మనోహరాబాద్(తూప్రాన్): ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్(24) ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల కిందట వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ప్రశాంత్ కుటుంబ సభ్యులతో కలిసి అల్లాపూర్లోని తన అక్క ఇంటికి ఫంక్షన్కు వెళ్లాడు. అక్కడ అందరిని కలిసి తిరిగి ఇంటికొచ్చిన ప్రశాంత్ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన సెల్ఫోన్లో తాను ఎవరినైనా బాధిస్తే క్షమించాలని, అందరినీ వీడి పోతున్నాని మేసేజ్ చేశాడు. ఇది గమనించిన మిత్రులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా సీలింగ్కు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి బాజాలు మోగాల్సిన చోట.. చావు డప్పులు..
పాపన్నపేట(మెదక్)/వట్పల్లి(అందోల్): పెళ్లి వేడుకలు ఆ గ్రామాల్లో విషాదం నింపాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మన్సాన్పల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈఘటనతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 40 రోజుల క్రితం స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఇదే రీతిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే జరిగిన ఘోరాన్ని తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సొంగ రాము పెళ్లి అందోల్కు చెందిన మమతతో గురువారం నార్సింగిలో జరగాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. వధువు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లారితే పెళ్లి అనగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో బంధువులతో కళకళలాడిన ఇళ్లు ఒక్కసారిగా మూగబోయింది. విలపించిన కుటుంబ సభ్యులు బూదమ్మ భర్త కిష్టయ్య గతంలోనే మరణించగా, కొడుకు లక్ష్మీనారాయణ కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. కూతురు వివాహం జరిగింది. తల్లి మరణంతో కొడుకు ఎకాకిగా మారాడు. కాగా జెట్టిగారి సంగమ్మ భర్త గోపాల్ పక్షవాతంతో బాధపడుతున్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు కాగా కొడుకు ఉపాధి వేటలో ఉన్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసే భార్య మరణించడంతో నాకు దిక్కెవ్వరు అంటూ గోపాల్ గుండెలు బాధుకున్నాడు. కాగా రావుగారి ఆగమ్మకు ఒక కూతురు, భర్త మల్లయ్య ఉన్నారు. కూతురు పెళ్లి కాగా మల్లయ్య, భార్య మరణంతో ఏకాకిగా మిగిలిపోయాడు. ఒక్కడినే ఎలా బతికేది అంటూ విలపించాడు. సంగారెడ్డిలో క్షతగాత్రులకు చికిత్స ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 26 మంది గాయపడగా వారందరికీ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి సంగారెడ్డికి తరలించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువ మందికి తలకు గాయాలు కావడంతో స్కానింగ్ కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం! : బీబీ పాటిల్
సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్ ఆరోపించారు. మండల పరిఽధి మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్, శ్రీనివాస్రెడ్డి, మల్లప్ప ఆధ్వర్యంలో బసంత్పూర్, రాజోల, గంగ్వార్, గణేష్పూర్, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 400 కంటే అధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తనకు మరో సారీ అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు సుధీర్ కుమార్ బండారి, జగన్నాథ్, జనార్దన్రెడ్డి, ఓంకార్, మల్లేశం, రాహుల్, సతీష్గుప్త, అరవింద్ చౌహన్ పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’.. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు!
సంగారెడ్డి: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ గౌస్ కథనం మేరకు.. సంగముల రాములు (52)కు కుమారుడు మహేశ్ ఉన్నాడు. అదే గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని తండ్రి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించాడు. ఇది తెలిసిన అమ్మాయి వర్గపు వారు గురువారం రాములు ఇంటికొచ్చి తమ అమ్మాయికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు శుక్రవారం ఉదయం పాడి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ఇవి చదవండి: మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు.. -
బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్ రావు, సంగమేశ్వర్, చిన్న పటేల్, విష్ణువర్థన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, రవీందర్రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! -
తన ఆటో ఎక్కకుండా వేరే ఆటో ఎక్కారని..
సిద్దిపేటకమాన్: తన ఆటోలో ఎక్కకుండా వేరే ఆటోలో ఎక్కారని కోపంతో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొంత మంది విద్యార్థులు పొన్నాలలోని వెంకటసాయి నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లడానికి నవ్య, ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం ఉదయం గ్రామం నుంచి సిద్దిపేట పట్టణానికి వచ్చింది. కళాశాలకు వెళ్లడానికి ముగ్గురూ సిద్దిపేట బస్టాండ్ వద్ద దాసరి శ్రీనివాస్ ఆటోలో ఎక్కారు. అక్కడే ఉన్న ఆటోల అడ్డా వారు విద్యా ర్థినులను ఎందుకు ఎక్కించుకున్నావ్.. చార్జీలు తక్కువ ఎందుకు తీసుకుంటున్నావ్ అని శ్రీనివాస్తో గొడవ పడ్డారు. శ్రీనివాస్ వెళ్తున్న క్రమంలో పట్టణానికి చెందిన మరో ఆటో డ్రైవర్ బర్రెంకల నవీన్ తన ఆటోతో విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నవ్య రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. మరో విద్యార్థిని మౌనిక స్పృహ తప్పి కిందపడిపోయింది. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నవీన్పై చర్యలు తీసుకోవాలని గాయపడిన విద్యార్థిని తండ్రి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
400 ఎంపీ సీట్లు గెలుస్తాం
సంగారెడ్డి : దేశంలో మోదీ హవా కొనసాగుతుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్కు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లోనే కాదు 2029లో సైతం బీజేపీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విద్యావంతులు, మేధావులు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో నిలబడే బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదుల సంరక్షణ చట్టంతో పాటు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు, సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, భగవాన్రావ్ పాటిల్, టీ.సత్యనారాయణ, నవాజ్, సమరసింహారెడ్డి, శ్రీనివాస్, దత్తాత్రి, సురేందర్, రామ్మోహన్, బాలరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రికి ఘన స్వాగతం రామచంద్రాపురం(పటాన్చెరు) : సంగారెడ్డిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్కు సోమవారం రామచంద్రాపురంలో బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజు బీజేపీలో చేరారు. అనంతరం కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ -
పుట్టింటికి ఎందుకొచ్చావని తల్లి మందలించిందని.. కూతురి విషాదం!
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి.. -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
మద్దూరు(హుస్నాబాద్): ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలోని హనుమతండా గ్రామ పరిధిలోని మహారాజ్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్యూనూస్ అహ్మద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భానోతు జబ్బర్ కూతురు జ్యోతి(25)ని సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి మండలంలోని భాపన్భాయి తండాకు చెందిన ధారావత్ నరేశ్తో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. కొద్ది రోజులుగా జ్యోతికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దే ఉంచుకొని హైదరాబాద్లో చికిత్స చేయిస్తున్నారు. జీవితంపై విరక్తి చెందిన జ్యోతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జబ్బర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. మృతురాలికి కూతురు ఉంది. అనారోగ్యంతో వృద్ధుడు రామాయంపేట(మెదక్): ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఝాన్సిలింగాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రె చంద్రయ్య (68) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన చంద్రయ్య రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హత్య చేసి.. ఆపై తగులబెట్టి..
సంగారెడ్డి: మహిళను దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రం సమీపంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం.. రత్నూరు మండలం గోవిందరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే సునీత (45)కు హత్నూర మండలం మధుర గ్రామానికి చెందిన మాదిగ దత్తయ్యతో రెండు నెలల కిందట పరిచయం ఏర్పడింది. వీరు రెండు, మూడు సార్లు మధుర శివారు దత్తాచల క్షేత్రం గుట్టల్లో కలుసుకున్నారు. కలిసిన ప్రతీ సారీ దత్తయ్య రూ.500, రూ.1,000 సునీతకు ఇచ్చేవాడు. డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన దత్తయ్య గత నెల 31వ తేదీన మద్యం మత్తులో సునీత తలపై బండ రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సునీత కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈనెల 2వ తేదీన హత్నూర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వివాహేతర సంబంధంతో డబ్బు ఎక్కువ అడగడం వల్లే హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. -
చెరువు తూములో పడి వ్యక్తి మృతి
సంగారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన వద్ద మల్లేశం (46) పని నిమిత్తం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి వచ్చాడు. పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా సుల్తాన్పూర్ గ్రామ శివారులోని పెద్దచెరువు మైసమ్మ దేవాలయం వద్ద తూము కల్వర్టుపై నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తూములో ప్రమాదవశాత్తు పడి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గోవిందమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. నిద్రపోయి ప్రమాదవశాత్తు పడిపోవడంతో.. -
అప్పులు తీర్చే మార్గం లేక..
రాయపోలు(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోలు మండలం బేగంపేటలో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్కుమార్ కథనం పక్రారం.. గ్రామానికి చెందిన బయ్యారం కృష్ణాగౌడ్ (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు. కిస్తీలు కట్టేందుకు సతమతమవుతున్నాడు కొంతకాలంగా దిగాలుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తూప్రాన్కు వెళ్తున్నట్లు చెప్పి బయటికెళ్లి గడ్డి మందు తాగాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి భార్య వర్షకు అప్పులు తీర్చే మార్గం దొరక్క జీవితంపై విరక్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పాడు. వెంటనే ఇంటికి తిరిగొచ్చి వాంతులు చేసుకుంటే వెంటనే గ్రామస్తుల సహాయంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేక.. మద్యానికి బానిసై గజ్వేల్రూరల్: ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో చోటు చేసుకుంది. గజ్వేల్ ఎస్ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనగామ నర్సింహులు(33) భార్య ఏడాది క్రితం మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక వేదన గురైన అతను మద్యానికి బానిసయ్యాడు. బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం తాగొద్దన్నందుకు..మనోహరాబాద్(తూప్రాన్): మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దీపక్ భారతి (35) తన కుటుంబంతో కలిసి మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో అద్దె కుంటున్నాడు. ఇక్కడే ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు తాగొద్దన్నందుకు గాను మనస్తాపం చెంది బుధవారం అద్దె ఇంట్లో సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పూజ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పెళ్లి కావడం లేదని తనువు చాలించాడునంగునూరు(సిద్దిపేట): పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కోనాయిపల్లికి చెందిన రజినీకర్రెడ్డి (38) హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కావడం లేదని బాధతో మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట గ్రామానికి చేరుకున్న అతడు శివారు ప్రాంతంలోని నిమ్మ బాల్రెడ్డి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అందులో మృతదేహాన్ని గుర్తించిన జిడ్డి ప్రవీణ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు.. గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
అతి వేగమే ప్రమాదానికి కారణమా?
● ఆ సమయంలో 30 మంది ప్రయాణికులు ● 23 మందికి గాయాలు,అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ● రాళ్లకత్వ గ్రామంలో ఘటన ● అతి వేగమే ప్రమాదానికి కారణమా? బస్సు వేగంగా వెళ్తుంది బస్సు రోజూ వేగంగా వెళ్తోంది. ఈ విషయాన్ని చాలాసార్లు ఆర్టీసీ అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. వేగంగా బస్సు వెళ్తుండటాన్ని కళ్లారా చూశా. గ్రామాల నుంచి వెళ్తున్న సమయంలో డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలి. : మల్లేశ్, ప్రత్యక్ష సాక్షి, రాళ్లకత్వ జిన్నారం(పటాన్చెరు): అతివేగానికి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇక్కడి నుంచి ఉదయం 7 గంటలకు 30 మంది ప్రయాణికులతో పటాన్చెరుకు బయలుదేరింది. రాళ్లకత్వ దాటిన తర్వాత వచ్చిన ఒక మలుపు వద్ద బస్సు వేగానికి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. అందులో డ్రైవర్ ఎరుకలి బుచ్చయ్య, కండక్టర్ పోచయ్య, ఇమాంనగర్కు చెందిన చిద్రుప్ప పద్మ, సోలక్పల్లికి చెందిన ఇంద్రేశం అక్షిత్గౌడ్, నల్లగండ్ల సాయి, నల్లగండ్ల సంజన, సికింద్రాబాద్కు చెందిన రాజమన్నోళ్ల లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్చెరులోని ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొంత మందిని ఇంద్రేశంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయారావు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ వేణుకుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం దైవాదీనం, డిపో మేనేజర్ మాధవి, పలువురు రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు. స్టీరింగ్ నట్టు ఊడిపోయింది స్టీరింగ్ నట్టు ఊడిపోవటంతో బస్సు కంట్రోల్ కాలేదు. దీంతో చెట్టుకు ఢీకొంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నా అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తా. : బుచ్చయ్య, డ్రైవర్ -
కొట్టారు.. తిట్టారు!
అనురాగ్ యూనివర్సిటీలో చిన్నకోడూరు విద్యార్థిఆత్మహత్యాయత్నం ● అధ్యాపకుల వేధింపులే కారణమన్న కుటుంబీకులు ● గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యం ● పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోచారం: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో బుధవారం ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అధ్యాపకుల వేధింపుల కారణంగానే విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్రెడ్డి ఇక్కడి అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వచ్చిన మొదటి సెమిస్టర్ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో జ్ఞానేశ్వర్ ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నట్లు తోటి విద్యార్థులు గమనించారు. అందరి ముందు అవమానించడంతో.. ఇదిలా ఉండగా.. హెయిర్ కటింగ్ చేయించుకోలేదని జ్ఞానేశ్వర్ను డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ ట్రైనర్ మంగళవారం అందరి ముందు అవమానించడంతో పాటు కొట్టారు. ఇదే విషయాన్ని జ్ఞానేశ్వర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధను వ్యక్తం చేశాడు. రెండు రోజుల్లో యూనివర్సిటీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడతామని నచ్చచెప్పారు. కానీ.. తనకు జరిగిన అవమానం తట్టుకోలేని జ్ఞానేశ్వర్ బుధవారం మధ్యాహ్నం యూనివర్సిటీలోని సీ బ్లాక్ రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. చికిత్స నిమిత్తం అతడిని యూనివర్సిటీకి చెందిన నీలిమ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి పక్కటెముకలు విరిగినట్లు చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యా యత్నాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిస్థితి విషమించే తరుణంలో సంఘటన గురించి యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రానికే ఆస్పత్రికి చేరుకున్నారు. మొదటి సెమిస్టర్లో ఫెయిల్ అయ్యావని, కళాశాలకు క్రమం తప్పకుండా రావడంలేదని, వచ్చినా ఆలస్యంగా వస్తున్నావని ఏదో ఒక కారణం చూపించి వేధించడంతో జ్ఞానేశ్వర్ తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు జ్ఞానేశ్వర్ బంధువులు ఆరోపించారు. విద్యార్థులను అవమానించి, శారీరకంగా హింసించే హక్కు మీకు ఎవరిచ్చారని అధ్యాపకులను నిలదీశారు. ఆత్మహత్యా యత్నానికి కారకులైన అధ్యాపకులతో పాటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్ఞానేశ్వర్ అన్న సాత్విక్రెడ్డి పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. జ్ఞానేశ్వర్ను తాము కొట్టలేదని డీన్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. హెయిర్ కటింగ్ చేయించుకోమని ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. -
సిరుల వరి
సింగూరు నీటితో ఏటా రెండు పంటలు పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు సాగు నీటితో రైతులు సిరులు పండిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే కాలువల నిర్మాణం పూర్తయి నిరంతరాయంగా నీరు సరఫరా అవుతుండటంతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. పంట ఉత్పత్తులు కూడా పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒకప్పుడు కరెంట్ కోసం, వర్షాల కోసం ఎదురు చూసిన వారు కాలువ నీటితో పంటలు పండిస్తున్నారు. సింగూరు కాలువల ద్వారా ఎడమ కాలువ నుంచి సాగు నీరు సరఫరా అవుతోంది. పుల్కల్, చౌటకూరు, అందోల్ మండలాల రైతులు ఏటా రెండు పంటలను పండిస్తున్నారు. కాలువ పరిధిలోని చెరువులను కూడా నీటితో నింపుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు 40 వేల ఎకరాల్లో వరి చేస్తున్నారు. సంవృద్ధిగా నీరు లభిస్తుండటంతో పాటు ఉత్తర భారత దేశం నుంచి కూలీలు ఇక్కడికి వస్తున్నారు. దీంతో నాట్లు వేసే విషయమై కొరత ఉండదు. రసాయనాలను డ్రోన్ల సహాయంతో పిచికారీ, పంట పూర్తయిన తర్వాత వరి కోత యంత్రాలతో సులువుగా నూర్పిడి చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటుంది. నగదును రైతుల ఖాతాలోనే సకాలంలో జమ చేస్తుండటంతో వరి సాగుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో కొత్తగా రైసు మిల్లులు సైతం వెలిశాయి. -
గుండెపోటుతో 8వ తరగతివిద్యార్థిని కన్నుమూత
సిద్దిపేటఅర్బన్: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అంబటి మహేశ్ కూతురు లాక్షణ్య (13) సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మాత్ర వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు తగ్గింది. అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది. కాసేపటికి బూత్రూంకు వెళ్లింది ఎంతకీ బయటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని, తీవ్రమైన గుండెపోటు రావడంతోనేనని తెలిపారు. -
నేషనల్ హైవే అథార్టీకి బదలాయింపు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్–బీదర్ రోడ్డును రహదారిగా గుర్తించి అప్గ్రేడ్ చేయాలన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 15 రోడ్లలో మొదటి ప్రాధాన్యతగా ఆరు రోడ్లను అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఆరు రోడ్లలో జహీరాబాద్–బీదర్ రహదారి కూడా మొదటి ప్రాధాన్యతలో ఉంది. దీంతో తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. కొన్ని సంవత్సరాలుగా ఊసేలేని ఈ అంశం మరోసారి చర్చకు రావడంతో రోడ్డు విస్తీర్ణంపై స్థానిక ప్రజలు ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, ఉద్గీర్, మహారాష్ట్రంలోని ఉద్గీర్ పట్టణ ప్రజలు హైదరాబాద్కు జహీరాబాద్–బీదర్ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డులో ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. గతంలో ఈ రోడ్డు ఆర్అండ్బీ శాఖ పరిఽధిలో ఉండగా.. దెబ్బతిన్న ప్రతిసారి వెంటనే మరమ్మతులు చేయించేవారు. నేషనల్ హైవే అథార్టీ అధికారులు పట్టించుకోని కారణంగా జహీరాబాద్–బీదర్ రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. నేషనల్ హైవే అథార్టీకి బదలాయింపు జహీరాబాద్–బీదర్ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఉన్న రోడ్డులో నిత్యం రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారిగా గుర్తించారు. ఫోర్లేన్గా విస్తరించేందుకు తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రోడ్డుకు జాతీయరహదారిగా గుర్తించి ఫోర్లేన్గా విస్తరించేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వెంటనే ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్ హైవే అథార్టీకి బదలాయించారు. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డుకు జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయకపోవడంతో విస్తీర్ణం పనుల్లో జాప్యం జరుగుతుంది. వికారాబాద్–తాండూర్, జహీరాబాద్–బీదర్ వరకు గల 154 కి.మీ రోడ్డుకు కేంద్రం అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాలని, తాజాగా మంత్రి కోమటిరెడ్డి వినతిపత్రం ఇవ్వడంతో ప్రజలు ఆశలు చిగురించాయి. మరమ్మతులు చేయించాం జహీరాబాద్–బీదర్ రహదారి తమ పరిధిలో లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలోనే ఈ రోడ్డును ఎన్హెచ్ఏ వారికి బదలాయించాం. రోడ్డు మరమ్మతుల గురించి వారే చూసుకోవాలి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించాం. –నర్సింలు, డీఈఈ, ఆర్అండ్బీ,జహీరాబాద్ -
ఫోన్ మాట్లాడుతూ.. ఐదో అంతస్తుపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
పటాన్చెరు టౌన్: నిర్మాణ దశలో ఉన్న భవనం ఐదో అంతస్తుపై నిలబడి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన గణేష్ బతుకుదెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ కాచిగూడకు వచ్చి పెయింటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల నుంచి రామచంద్రాపురం పరిధిలోని వెలమెల గార్డియన్ స్కూల్ డి– బ్లాక్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పని చేసే చోట ఐదో అంతస్తుపై నుంచి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉసురుతీసిన ఆర్థిక ఇబ్బందులు రామాయంపేట (మెదక్): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన మైసంగల సిద్దరాములు (50) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ విషయమై కుమారుడితో గొడవ పడిన సిద్ధరాములు.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని దామరచెరువు గ్రామశివారులో క్రిమి సంహారక మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. వారు ఘటనా స్థలికి చేరుకొని సిద్దరాములును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి వెల్దుర్తి(తూప్రాన్): ఓ ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మణ్(42) 20 ఏళ్లకు పైగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆటోల్లో ప్రయాణికులు చాలా తక్కువగా రావడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో పెళ్లి చేసుకున్నాడని.. తూప్రాన్: రెండో పెళ్లి చేసుకున్న భర్తపై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివానంద్ కథనం ప్రకారం.. హవేళి ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన షబానా 2019లో తూప్రాన్కు చెందిన ఇమ్రాన్ఖాన్తో వివాహం జరిగింది. వీరికి కూతురు ఉంది. పెళ్లయిన మూడు నెలల నుంచే అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించినా ఇమ్రాన్ కుటుంబంలో మార్పు రాలేదన్నారు. దీంతో 2022లో హవేళి ఘనపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భార్య షబాన ఫిర్యాదు చేసింది. కామారెడ్డి కోర్టులో విడాకులు, మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ లింగారెడ్డిపేటకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య షబాన ఫిర్యాదు చేసింది. -
పెళ్లయి ఏడాది గడవకముందే విషాదం..
వట్పల్లి(అందోల్): పెళ్లయి ఏడాదైనా గడవకముందే ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోజూ అందరినీ పలకరిస్తూ, కలిసిమెలసి ఉండే ఆమెను అంతలోనే మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అందోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మాసానిపల్లికి చెందిన బంటు పవిత్ర (21) ఆదివారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచి, వాకిలి శుభ్రం చేసి వాటర్ హీటర్తో నీటిని వేడి చేసుకుంది. ఆ నీటితో స్నానం చేసి బట్టలు మార్చుకునే సమయంలో విద్యుత్ సరఫరా అవుతున్న హీటర్ తాకింది. దీంతో విద్యుత్ షాక్కు గురైన ఆమె పెద్దగా కేక వేస్తూ కిందపడిపోయింది. పక్కనే మంచంపై నిద్రిస్తున్న భర్త నవీన్ లేచి భార్యను పట్టుకోబోయాడు. అతనికీ షాక్ తగిలినట్లు అనిపించడంతో వెంటనే హీటర్ ప్లగ్ను తొలగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించాడు. దీంతో అక్కడే ఉన్న భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వందలాదిగా బంధువులు పవిత్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి బెడ్పై ఉన్న మృతదేహాన్ని పట్టుకుని తల్లి సుశీల గుండెలు అవిసేలా రోదించింది. ముద్దులు పెడుతూ పవిత్రా.. నువ్వు ఇక లేవా బిడ్డా.. అంటూ ఏడ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు. తహసీల్దార్ కోసం 3గంటలు నిరీక్షణ పవిత్రను ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె చనిపోయినట్లు అరగంటలో డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నవీన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే స్థానికంగా తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో మృతురాలి బంధువులు 3గంటలు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు డీటీ చంద్రశేఖర్, తహసీల్దారు అంటోనీలు వచ్చి పంచనామా చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బిడ్డకు జన్మనిచ్చి మృతి
చేగుంట(తూప్రాన్): డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కావేటి లత(25)కు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆమె పాపకు జన్మనివ్వగా రక్త స్రావం ఎక్కువ కావడంతో లత ప్రాణాపాయస్థితికి చేరుకొంది. దీంతో బంధువులు మెరుగైన వైద్యంకోసం సికింద్రాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే లత మృతి చెందింది. ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం కుమారుడు జన్మించగా శనివారం పాప పుట్టింది. ఆమె మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా గ్రామానికి చెందిన మహిళ ప్రసవం కోసం వెళ్లి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి లత మృతికి కారణమైన తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి
22 యేళ్లుగా పోరాటం పటాన్చెరు (వట్టినాగులపల్లి) నుంచి మెదక్ వరకు 90 కిలో మీటర్ల రైల్వే లైన్ కోసం 22 యేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఈ లైన్కు కోసం రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందజేశాం. 2018లో రైల్వే అధికారులు స్పందించి సర్వే చేసి రూ.1700 కోట్లు అవసరమని అంచనాలు సైతం సిద్ధం చేశారు. కానీ బడ్జెట్లో నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు కేటాయించాలని కోరుతున్నాం. – గంగ జోగినాథ్, జోగిపేట్ ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి ప్రస్తుతం ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఆదాయ పరిమితి ఉంది. దీనిని రూ.10 లక్షల వరకు పెంచాలి. అలాగే స్లాబ్రేట్లను సవరించాలి. 80(సీ) పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు ఉంది. రూ.5 లక్షల వరకు పెంచాలి. గృహ రుణ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంచాలి. – వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్ -
‘టీశాట్–నిపుణ’ లైవ్ టెలీకాన్ఫరెన్స్కు ఎంపిక
ములుగు(గజ్వేల్): స్కూల్ లీడర్షిప్ అకాడమీ– రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో (టీశాట్–నిపుణ) చానల్ ద్వారా నిర్వహిస్తున్న లైవ్ టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ములుగు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.క్రాంతి కుమారి ఎంపికయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు కేంద్రీకృతంగా, వినూత్న పద్ధతిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో క్రాంతి కుమారి ఒకరు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, మండల విద్యాధికారి ఉదయ భాస్కర్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు అభినందించారు. పొలంలోనే రైతు మృతి గజ్వేల్రూరల్: పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోమటిబండలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉబ్బని అశోక్(35)కు భార్య పోచమ్మతోపాటు ఇద్దరు కొడుకులున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న అశోక్ తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సోమవారం తన పొలంలో వరి నాట్లు వేసేందుకు పొలం గట్లను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలానికి చేరుకొని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ● రూ.55 వేలు, బైక్లు స్వాధీనం ● నలుగురు అరెస్ట్, పరారీలో ముగ్గురు సిద్దిపేటఅర్బన్: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి వెల్కటూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారయ్యా రు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,179, మూడు బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించగా వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో వెల్కటూరు గ్రామానికి చెందిన ఆలేటి కృష్ణ, రాచమల్ల కనకయ్య, దుద్దెడ గ్రామానికి చెందిన నర్ర దేశిరెడ్డి, పొన్నాలకు చెందిన లెంకల రవి ఉన్నారు. సిర్సినగండ్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు, కొండపాక గ్రామానికి చెందిన యాదగిరి యాదవ్, మంతూరి మహేశ్ పరారీలో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ జహీరాబాద్ టౌన్: చదువుతోపాటు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరి కృష్ణ అన్నారు. పట్టణంలోని బీసీ వసతి గృహంలో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చట్టా లు తోడ్పడుతాయన్నారు. పోక్సో చట్టం, బా లకార్మిక చట్టం, సమాచార చట్టం, జ్యువైనల్ జస్టీస్ యాక్ట్ తదితర చట్టాలపై వివరించారు. బాల కార్మికులు, బాల వివాహా బాధితులను గుర్తిస్తే తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. సదస్సులో బార్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్కుమార్ సాగర్, న్యాయవాదులు బ్రహ్మనందరెడ్డి, మహేశ్, శేఖర్, జగన్, మహేందర్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, వార్డెన్ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
ఆడుకోవడానికి గేమ్స్ జోన్..
సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్లో రెండు రోబోలను హైదరాబాద్ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్ ఆర్డర్ చేయండి సార్ అని పలుకుతుంది. మనకు నచ్చిన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ఫ్లేట్లో కస్టమర్ కూర్చున్న టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్ అని చెబుతుంది. ఆడుకోవడానికి గేమ్స్ జోన్.. ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్ రెస్టారెంట్ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీకెండ్లో తాకిడి ఎక్కువ.. ఈ రెస్టారెంట్లో ఇతర హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్ చేసిన హోటల్కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్, నాన్వెజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కస్టమర్లు హోటల్కు క్యూ కడుతున్నారు. హోటల్లో కస్టమర్ల వద్దకు ఆహారాన్ని తీసుకొస్తున్న రోబోలు (మైత్రీ) -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వట్పల్లి(అందోల్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్ఐ–2 మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామానికి చెందిన చెప్యాల గోపాల్(38) అప్పులు చేసి ట్రాక్టర్, వరికోత మిషన్ యంత్రాలతోపాటు ఓ కారును కొనుగోలు చేశాడు. అప్పుల భారం రోజు రోజుకూ పెరగడంతో కొంత భూమిని అమ్మినా తీరలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉద యం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నట్లు కనిపించాడు. గోపాల్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో.. పటాన్చెరుటౌన్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కథనం ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కళింగగూడెంకు చెందిన పూజారి రామకృష్ణ(35) బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట పటాన్చెరు మండలం ఇస్నాపూర్కు వచ్చాడు. డీఎన్ కాలనీలో ఉంటూ పాశమైలారం పారిశ్రామిక వాడలోని యూజియా ఫార్మా క్యాంటీన్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నా డు. ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసైన రామకృష్ణ ఇంటికి వెళ్లకుండా, పని చేసే క్యాంటీన్ వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం క్యాంటీన్ స్టోర్ రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా..
రైలు ఢీకొని వ్యక్తి మృతి గజ్వేల్రూరల్: రైలు ఢీకొని మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ శివారు (బేగంపేట పోలీస్స్టేషన్ పరిధి)లో ఆదివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావూ నాయక్, బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖాండ్ రాష్ట్రంలోని సిండేఘా తాలుకా, గిర్ద ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ భారీక్(24) మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ సమీపంలో జరుగుతున్న భూగర్భ సొరంగం పనుల్లోని కూలీలకు వంట చేసేందుకు ఏడాది క్రితం వచ్చాడు. వినికిడి లోపం ఉన్న రాజ్కుమార్ ఆదివారం కాలకృత్యాల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు ప్రమాద విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావూనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని మంజీర నదిలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్సై డి.మహిపాల్ రెడ్డి తెలిపారు. పొడిచన్పల్లి గ్రామ శివారులో సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభించిందన్నారు. చేపల వేటకు వెళ్లి చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతుడు తెల్లటి దోవతి, పసుపు పచ్చ షర్ట్ ధరించి ఉన్నాడని వివరించారు. అనుమానాస్పద స్థితిలో.. రామచంద్రాపురం(పటాన్చెరు): అనుమానస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం భారతీనగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఐజీ కాలనీ గేటు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ని పిలిపించి పరీక్షించగా ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 50 ఏళ్లు నుంచి 60 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వంటిపై పసుపు, నలుపు రంగు షర్టు, గ్రే రంగు ప్యాంట్ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. వ్యవసాయ భూమిలో.. నారాయణఖేడ్: నారాయణఖేడ్– రాయిపల్లి రోడ్డులోని ఖేడ్ మండలం జూకల్ శివారులో అంత్వార్ గ్రామానికి చెందిన పుప్పాల మాణయ్య వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
హుస్నాబాద్: విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్ డిపో వెనుక మారుతి కాలనీకి చెందిన సయ్యద్ సంశీర్కు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సయ్యద్ సాధీక్ అన్వర్ (6) ఇంటిపైన ఇనుప టేపుతో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు ఇంటి వెనుకాల పైనుంచి వెళ్తున్న కరెంట్ వైర్లకు టేపు తాకి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటి పక్కనే తుమ్మ చెట్లు కొడుతుండగా, ఒక్కసారిగా ఇంటి పైనుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే వెళ్లి చూడగా సాధీక్ శరీరం మొత్తం కాలిపోయి మృతి చెందాడు. క్షణాల్లో కుమారుడు విద్యుత్ షాక్కు బలికావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనను తెలుసుకున్న సీఐ కిరణ్, ఎస్సై మహేశ్, కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటిపైన ఆడుకుంటుండగా ఘటన -
కుక్కల దాడిలో 28 గొర్రెల మృతి
బెజ్జంకి(సిద్దిపేట): కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన శశిధర్ హైద్రాబాద్లో నివసిస్తాడు. ముత్తన్నపేటలోని తన వ్యవసాయ భూమిలో గొర్రెల షెడ్డు వేసి కాపరులను పెట్టి సుమారు 170 గొర్రెల పెంపకం చేపట్టాడు. కాపరి రోజులానే శనివారం రాత్రి గొర్రెలను షెడ్డులో ఉంచి ఇంటికెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చేసరికి గొర్లు మృతి చెంది ఉన్నాయి. కుక్కలు దాడి చేయడంతో 28 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు శశిధర్ తెలిపారు. సుమారు రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వాపోయారు. -
సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను సూచించారు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా ప్రాజెక్టులు ప్రశాంత్నగర్(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్లు శుక్రవారం తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపికవ్వగా అందులో రెండు ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయన్నారు. మర్కూక్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ దామరకుంటలో 9 తరగతి చదువుతున్న విద్యార్థిని సుష్మ, సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని స్ప్రింగ్ డల్స్ పాఠశాలలో చదువుతున్న రితేష్ల ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రాణిస్తే, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అవుతారని తెలిపారు. విద్యార్థులను గైడ్ టీచర్లు బ్రహ్మయ్య, కృష్ణకుమార్లను అభినందించారు. బాల నేరస్తులకు న్యాయ సహాయం సిద్దిపేటకమాన్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో శుక్రవారం సిద్దిపేట కోర్టులో సమావేశం నిర్వహించారు. జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించడం, వారికి న్యాయ సహాయం అందించడం అనే అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులో ఉన్న 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న ఖైదీలను గుర్తించి న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. పాన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మద్యం మత్తులో ఆత్మహత్య వెల్దుర్తి(తూప్రాన్): మద్యం మత్తులో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కానికె వెంకటేశ్(45) శుక్రవారం ఉదయం లేవలేదు. ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఉరేసుకొని కనిపించాడు. తాగుడుకు బానిసై మద్యం మత్తులో వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూదన్గౌడ్ వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
నీటి కెనాల్లో పడి కార్మికుడు మృతి
సంగారెడ్డి టౌన్: ప్రమాదవశాత్తు నీటి కెనాల్లో పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఫసల్ వాది గ్రామానికి చెందిన ఖదీర్ (36) గణపతి చక్కెర పరిశ్రమలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పరిశ్రమ ఆవరణలో ఉన్న నీటి కెనాల్ లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిలల్లు ఉన్నారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకుంటామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఎస్సై రాజేశ్ నాయక్ యాజమాన్యం ఉన్నారు. -
కార్మికుల పొట్టను కొడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారుల కొమ్ముకాస్తోందని
జహీరాబాద్ టౌన్: కార్మికుల పొట్టను కొడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారుల కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో శుక్రవారం నిర్వహించిన కార్మిక యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేఏళ్ల నుంచి కార్మిక, రైతాంగ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. కార్మిక చట్టాల రద్దును ఆపాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా ఫిబ్రవరి 16న జరుగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, మహీంద్ర యూనియన్ ప్రధాన కార్య దర్శి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం(పటాన్చెరు): మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను నిరసించాలని, 16న దేశవ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంద్ను ప్రజలంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బీహెచ్ఈఎల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమైన విషయం అని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు పెంటయ్య, బాషా, వీరన్రావు, ప్రభాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌత్ జోన్ యోగా పోటీలకు ఎంపిక
గజ్వేల్రూరల్: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్జోన్ యోగా పోటీలకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పీఈటీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్లో గల పీఎస్ఎన్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఖేలో ఇండియా సౌత్ జోన్ ఉమెన్స్ యోగా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో అంకిత, వైష్ణవి పాల్గొంటారని పేర్కొన్నారు. నాణాలతో త్రివర్ణ పతాకం గజ్వేల్రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు త్రివర్ణ పతాకం ఆకారాన్ని రూపొందించారు. రూ. 33 వేల విలువ చేసే నాణెంలతో 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తేనె టీగల దాడి 15 మందికి గాయాలు చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చెట్టుకింద వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తులు కూర్చున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అక్కడ కూర్చున్నవారు గాయపడ్డారు. ఇదే సమయంలో హాస్టల్ విద్యార్థులు భోజనం ముగించుకొని బయటకు రాగా తేనెటీగల దాడి కి గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్లో పీహెచ్సీ తరలించి వైద్యం అందించారు. ఇందులో నలుగురు విద్యార్థులు, నలుగురు స్థానికు లు ఉన్నారు. నార్సింగి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తేనెటీగల దాడిలో గాయపడి ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులతోపాటు ఇతరులకు వైద్యం అందించామన్నారు. ఆటోను ఢీకొట్టిన బస్సు పటాన్చెరు టౌన్: ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో గురువారం ఉదయం ఓ ట్రావెల్స్కు చెందిన బస్సు ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న తాత్కాలిక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయలు తీసుకెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. డ్రైవర్ సత్యనారాయణకు తీవ్రగాయాలు కావడంతో పటాన్చెరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుస్తీ మే సవాల్
న్యాల్కల్ మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామంలో మైబు సభానీ దర్గా ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీల్లో సుమారు 60 మంది పైల్వాన్లు హాజరయ్యారు. చివరకు మహారాష్ట్రాలోని ఉద్గీర్కు చెందిన కుతూబ్కు మొదటి బహుమతి వరించింది. కుతూబ్కు హద్నూర్ ఎస్ఐ రామానాయుడు వెండి కడియం అందజేశారు. ఇతర విజేతలకు ఎస్ఐతోపాటు గ్రామ పెద్దలు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, శ్రీరామ్ ప్రజా సేనా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, జైనోద్దీన్, షబ్బీర్, అహ్మద్, చాకలి శివకుమార్, శ్రీన్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు. –న్యాల్కల్(జహీరాబాద్ -
అమ్మో.. కోనోకార్పస్
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, పార్క్లలో కోనో కార్పస్ చెట్లు విపరీతంగా నాటడడంతో అవి ఏపుగా పెరిగి ఇప్పుడు ప్రజలకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్ల కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్ల తొలగించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని పలు కాలనీ ప్రజలు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్రోడ్లో కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు కొన్ని చెట్లను నరికించారు. ఇలానే పూర్తి స్థాయిలో పట్టణంలోని అన్ని కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. –సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్,సిద్దిపేట -
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
శ్రీరాముడి పల్లకీపై బూటు
హత్నూర (సంగారెడ్డి): అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా శ్రీరాముని పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శ్రీరాముని పల్లకీ సేవ నిర్వహిస్తుండగా ఓ ఇంటిపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరారు. దీంతో రామభక్తులు కోపోద్రిక్తులయ్యారు. బూటు పడిన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రామభక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలోని పండ్ల దుకాణాన్ని దగ్ధం చేశారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దౌల్తాబాద్ పట్టణమంతా అర్ధరాత్రి వరకు ర్యాలీలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్పీ రూపేష్ కుమార్, పటాన్చెరు డీఎస్పీ, జిన్నారం, సంగారెడ్డి పటాన్చెరు సీఐలు, ఎస్సైలు పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. వారి మాట వినకుండా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి.. చెప్పు విసిరిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బూటు విసిరిన ఇంటిపైన రాళ్లతో దాడికి దిగారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నిరసనకారులు వెనక్కు తగ్గకుండా అర్ధరాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. 108 అంబులెన్స్ రప్పించి భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో బూటు విసిరిన కుటుంబ సభ్యులను భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ప్రయత్నం చేశారు. తహసీల్దార్ సంధ్య, ఆర్డీఓ రవీందర్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎంతటి వారైనా శిక్షిస్తాం : ఎస్పీ పల్లకీ సేవపై బూటు విసిరిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఎస్పీ రూపేష్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని రామ భక్తులకు హామీ ఇచ్చారు. దౌల్తాబాద్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
వలసొచ్చి.. వరి నాట్లు వేసి
దుబ్బాకటౌన్: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు. బెంగాల్కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు. ఇందులో నుంచి బెంగాల్ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది. 1.80 లక్షల ఎకరాల్లో పూర్తి.. జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి నాట్లు పెరిగే అవకాశం.. జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కాషాయ జెండాలకు గిరాకీ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. 500 ఏళ్ల కల సాకారమవుతున్న వేళ రాముడు, హనుమంతుడి బొమ్మలు కలిగి ఉన్న జెండాలను ఇంటిపై ఎగురవేసేందుకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. యువజన సంఘాలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. జెండాల సైజులను బట్టి రూ.50 నుంచి రూ.1000 వరకు లభిస్తున్నాయి. – జహీరాబాద్ టౌన్ -
తెగిన మాంజా కోసం..
గాలిపటం ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారింది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగి గాయాలవుతుంటాయి. అంతేకాకుండా రహదారులపై రాకపోకలు సాగిస్తున్నవారి మెడకు తగిలి గొంతు దగ్గర గాయాలయ్యే ప్రమాదం ఉంది. పతంగులు ఎగురవేసేందుకు నిషేధిత మాంజాను ఉపయోగించకపోవడమే మంచిది. ఎక్కువ మంది పిల్లలు ఈ మాంజానే ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లో విచ్ఛలవిడిగా లభిస్తుంది. సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు. ప్రకటనలు జారీచేసి చేతులు దులుపుకోవడంతో వ్యాపారులు యథేచ్చగా విక్రయిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు ఒక్కోసారి మాంజా తెగి చెట్లు, కరెంటు వైర్లు, భవనాలకు చిక్కుకొని పక్షులకు ప్రాణాంతకంగా మారింది. తెగిన మాంజా కోసం.. విద్యుత్ స్తంభాలకు చిక్కుకున్న తెగిన మాంజా, పతంగులను చేతులు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయకూడదు. విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్ తీగలపై పడిన దారాలు పట్టుకుని లాగకూడదు, ఇలా చేస్తే విద్యుత్ సరఫరా జరుగుతున్న తీగలు ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలబారిన పడకుండా ఉంటారు. తగిన జాగ్రత్తలతో.. పట్టణాలు, గ్రామాల్లో పిల్లలు ఇళ్లపైన పతంగులను ఎగురవేస్తుంటారు. పట్టణాల్లో మైదానాలు దూరంగా ఉంటాయి. దీంతో పిల్లలు భవనాలు ఎక్కి పతంగులు ఎగురవేస్తుంటారు. భవనాలకు పిట్ట గోడలు లేకపోవడం, ఉన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎగురవేసే ఆనందంలో ఇవి చూడరు. దీంతో కిందపడే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని పతంగులను ఎగురవేయాలి. తెగిన గాలిపటం కోసం వెనుకా ముందు చూడకుండా వాటి వెనుక పరుగెత్త కూడదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. గాలిపటాలను ఆరు బయట, మైదాన ప్రాంతాల్లోనే ఎగురవేయాలి. పతంగులను ఎగురవేస్తున్న పిల్లలను పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
సంక్రాంతి సందళ్లు..
సంక్రాంతి సందళ్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి జోరుగా కనిపిస్తోంది. ఆదివారం భోగిని ఘనంగా జరుపుకున్న ప్రజలు నేడు సంక్రాంతి, రేపు కనుమను కూడా ఇదే స్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పట్టణాలతోపాటు మండలాల్లోని గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. ఏ ఇంటి ముందు చూసిన రంగుల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. యువతులు తీరొక్క ముగ్గులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకరించారు. అలాగే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేస్తూ సంబుర పడితున్నారు. మహిళలు ఇళ్లలో పిండి వంటలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పట్టణాల్లోని వ్యాపారులు పండుగకు అవసరమైన సరుకులు విక్రయిస్తుండడంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రంగులు, చెరుకుగడలు, పండ్లు, పూలు, గుమ్మడి కాయలు, అనుపకాయల, శనక్కాయలు, కాయగూరల వ్యాపారాలతో ఆయా పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. పంటలు పొలం నుంచి ఇళ్లకు చేరే సమయం కావడంతో ఈ సంక్రాంతి పర్వదినాన్ని రైతులు, రైతు కూలీలు సంతోషంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం, ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు ప్రాంతాలకు వెళ్లిన వారు.. అలాగే అవసరాల కోసం పల్లెలను వీడి పట్టణాలకు నివాసాలు మార్చిన వారు సైతం సంక్రాంతికి వచ్చేశారు. -
ఉత్సవ కమిటీ ఏర్పడేనా?
గజ్వేల్/జగదేవ్పూర్: జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభమై మార్చి 31వరకు కొనసాగనున్నది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం నెలకొనడం అందోళన కలిగిస్తోంది. జాతర సమయం ముంచుకొస్తుండగా, ఏర్పా ట్లు మాత్రం నామమాత్రంగా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఏర్పడేనా? ఐదేళ్లుగా కొండపోచమ్మకు రెగ్యులర్ పాలకవర్గం ఏర్పాటు చేయడం లేదు. జాతరకు ముందు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ మూడు నెలల పాటు పాలకవర్గం పనిచేసేలా తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రభుత్వం మారడం, జాతర సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ కమిటీని ఏర్పాటు చేస్తారా లేదా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవ కమిటీ ఏర్పాటుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే జాతర ఏర్పాట్లపై ఆలయ ఈఓ మోహన్రెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీరు, ఇతర కనీస వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. యాక్షన్ ప్లాన్ ఏదీ? అప్పటి సీఎం, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ను 2019 మే నెలలో ప్రారంభించిన సందర్భంలో ఆలయం వద్ద నవచండీయాగం నిర్వహించి అమ్మవారిని దర్శించకున్నారు. ఆదే సమయంలో ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో యాక్షన్ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అధికారులు, నేతలు ప్రకటన కూడా చేశారు. ఇదే క్రమంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పలుమార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కోసం స్తపతితో ఆలయ మ్యాప్ వేయించారు. కానీ కార్యాచరణకు అడుగు పడలేదు. అలాగే చెరువు సుందరీకరణకు నోచుకోలేదు. -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని
హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. గురువారం హత్నూర మండలం సిరిపురం, తెల్లరాళ్లలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, బీఆర్ఎస్ పార్టీ వల్ల పదేళ్లపాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అలాగే.. అనారోగ్యానికి గురైన హత్నూర గ్రామ సర్పంచ్ వీరస్వామి గౌడ్ ను వారు పరామర్శించారు. కార్యక్రమంలో పీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అకీమ్, సర్పంచులు వెంకటేశం, ఆంజనేయులు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు..
ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో షుగర్, బీపీ తదితర వాటితో బాధపడుతున్నారు. పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఉచిత యోగాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 421 ఆయుష్ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో యోగా కేంద్రాలను మంజూరు చేసింది. ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా నిర్మించిన యోగా కేంద్రాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. – మెదక్ డెస్క్ -
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్విలాస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో -
జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో
సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇవి చదవండి: బర్త్డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి..
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాగుడుకు బానిసై.. ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి చదవండి: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం! -
తాను చనిపోతూ.. పలువురికి వెలుగునిస్తూ..
రాయికోడ్(అందోల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి బ్రెయిన్ డెడ్తో మృతిచెందాడు. తాను చనిపోతూ అవయవదానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ సంఘటన రోయికోడ్ మండల పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. రాయిపల్లికి చెందిన బి.బీరప్ప (28) ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో ఉద్యోగి. అతను మూడురోజుల క్రితం జహీరాబాద్కు ఓ పని నిమిత్తం బైక్ తీసుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఝరాసంగం మండలం కుడిసంగం సమీపం వద్ద రోడ్డు ప్ర మాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయలైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జహీరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న అపోలోలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై కుటుంబీకులకు అవగాహన కల్పించారు. దీనికి వారు ఒప్పుకోగా బీరప్ప లీవర్, కిడ్నీలను ఇతర పేషంట్లకు అమర్చుతున్నట్లు డాక్టర్లు చెప్పినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. -
TS: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు
జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. కాశీంపూర్కు చెందిన వడ్ల నర్సమ్మ తన కొడుకుతో కలిసి జహీరాబాద్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె బంధువులైన వడ్ల వీరన్న కూతురి పెళ్లి కుదిరింది. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు వెళ్లి ఆ పెళ్లిని ఆపించారు. జహీరాబాద్లో ఉంటున్న నర్సమ్మ ఉద్దేశ పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయించి తన కూతురి పెళ్లిని ఆపించిందని వీరన్న కక్ష పెంచుకున్నాడు. పింఛన్ డబ్బు కోసమని 2016 మార్చి 25న ఆమె జహీరాబాద్ నుంచి కాశీంపూర్కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఇదే అదనుగా భావించి బంధువులైన వడ్ల ప్రభు(40), వడ్ల ప్రశాంత్(19), వడ్ల వెంకట్(19), వడ్ల సంతోష్(19), వడ్ల రేఖ(28), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ(42), వడ్ల శ్రీకాంత్(17)తో కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నర్సమ్మ కుమారుడు వడ్ల పాండు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సదానాగరాజు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితులకు పై శిక్ష విధించింది. జరిమాన చెల్లించడంలో విఫలమైతే ఒక సంవత్సరం సాధారణ శిక్షతో పాటు రూ. 500 జరిమాన చెల్లించాలని న్యాయమూర్తి సుదర్శన్ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన చిరాగ్పల్లి, జహీరాబాద్ పోలీసులను ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు. -
కష్టాల కడలిలో జిల్లా రైతులు
● ఏడాది పొడవునా వెంటాడిన అతివృష్టి ● వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం ● పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేసిన గత ప్రభుత్వం ● రుణమాఫీ, రైతుబంధు రాక అవస్థలు ● కష్టాల కడలిలో జిల్లా రైతులు జిల్లాలో ఈ సంవత్సరం రబీ సీజన్లో 3.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు వివిధ రకాల పంటలను సాగు చేశారు. తీరా పంట చేతికందే ఏప్రిల్ నెలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 12, 265 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటానని, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లాలో రూ.12 కోట్ల 25 లక్షల 86 వేల పంట నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ మొత్తాన్ని బాధిత రైతులకు పరిహారం రూపంలో ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ. 8.86 లక్షలు మాత్రమే ఇచ్చారు. కాని రుణమాఫీ.. జిల్లాలో రూ.లక్షలోపు రుణాలకు 1,50,514 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.912 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 73,026 మంది రైతులకు రూ.366 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ఇంకా 77,488 మంది రైతులకు గాను రూ.546 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.ఈ రుణమాఫీ కోసం నిత్యం బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. దీనికి గాను రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందని రైతుబంధు.. ప్రభుత్వం మారినప్పటికీ ఈ యాసంగి పంట సాగు కోసం రైతు బంధు ఇంకా అందలేదు. జిల్లా వ్యాప్తంగా 3,06,437 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను 2,80,949 మంది రైతులు సాగు చేశారు. వీరికి పాత పద్ధతిన ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.200 కోట్ల 71 లక్షల 74 వేలు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు ఉన్న 1,11,241 మంది రైతులకు కేవలం రూ. 21 కోట్ల 9 లక్షల 81 వేలు జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 90 శాతం నిధులు రావాల్సి ఉంది. ఇప్పటికే సగం మేర వరినాట్లు పూర్తి అయ్యాయి. అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గిన ఆయిల్ పామ్ సాగు జిల్లాలో ఎప్పుడు ఒకే రకమైన వరి పంటనే సాగు చేస్తున్నారని, దీని వల్ల భూసారం దెబ్బతింటుందని, వరికి బదులు అధిక లాభాలు గడించే ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు మంజూరు ఇచ్చింది. ఇందుకోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఆయిల్ పామ్ మొక్కలకు ఎకరాకు రూ. 50 వేలు సబ్సిడీ ప్రకటించారు. 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్లు సంబంధిత ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొన్నారు. -
రైతుబంధు, రైతు బీమా కాస్త ఊరట
● చివరి క్షణంలో మిఛాంగ్ తుపాన్ దెబ్బ ● 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల పంట నష్టం ● పత్తి ధర ఢమాల్, నిండా మునిగిన వరి రైతులు ● గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సాగు ● మొదట్లో అనుకున్న స్థాయిలో వర్షాలు ● రైతుబంధు, రైతు బీమా కాస్త ఊరట సిద్దిపేట జిల్లాలో వానాకాలం సాగులో భాగంగా రైతులు 5,27,906 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 3,66,169 ఎకరాల్లో సాగు చేశారు. ఉద్యాన పంటలు అయిన ఆయిల్పామ్, మల్బరీ, మామిడి, సపోట, బొప్పాయి, టమాట పంటలతోపాటుగా ఇతర నూతన పంటల సాగుకు రైతులు మక్కువ చూపారు. వణికించిన తుపాన్.. జిల్లాలో వానాకాలం పంటలు చేతికందే సమయంలో మిఛాంగ్ తుపాన్ రైతులను బెంబేలెత్తించింది. వరి పంటను కోసి ఆరబెట్టిన ధాన్యం, అదే విధంగా కోత దశలో ఉన్న వరి పంట అధికంగా దెబ్బతింది. 5 రోజులపాటుగా మిఛాంగ్ తుపాన్ జిల్లాను వణికించింది. దీంతో జిల్లాలో 65,056 మంది రైతులకు చెందిన 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల మేర వరితో పాటుగా ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పత్తి రైతు చిత్తు.. జిల్లాలో పత్తి వేసిన రైతులు ధరతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1.08లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా సేకరించే దశలో ధరలు పడిపోయాయి. 2022లో గరిష్ట ధర రూ.9 వేల వరకు పలికింది. 2023లో మాత్రం రూ.6500 మాత్రమే ఉంది. దీంతో పత్తి రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.60 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపారులు ఖరీదు చేశారు. టాప్ గేర్లో టమాట జిల్లాలో టమాట సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం ఆశించిన ధర కంటే అధిక ధర రావడంతో టాప్ గేర్లోకి దూసుకెళ్లారు. జిల్లాలో 700 ఎకరాల్లో టమాటను రైతులు సాగు చేశారు. దీంతో ఎకరకు 18 టన్నుల దిగుబడి వచ్చింది. రెండు నెలలపాటు టమాట ధర రూ.100కు పైగా ఉండడంతో రైతులు తమ కష్టానికి మించి ప్రతిఫలం అందుకున్నారు. ఆదుకుంటున్న రైతుబంధు, రైతుబీమా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సత్ఫలితాలనిచ్చింది. వానాకాలం రైతుబంధుకు గాను 3,19,852 మంది రైతులకు రూ.313.23 కోట్లు అందాయి. కానీ యాసంగి రైతుబంధు ఇప్పటి వరకు 97,777 మంది రైతులకు రూ.20.30 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలో 361 మంది రైతులు మరణించగా వారి కుటుంబీకులకు రూ.18.05 కోట్ల రైతు బీమాను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంట -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
అయోధ్య రామా.. మమ్ము కనుమా
జిన్నారం(పటాన్చెరు) : అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన స్వామివారి అక్షింతలను మండల కేంద్రం జిన్నారంలో మంగళవారం ఊరేగించారు. మండలంలోని 30 గ్రామాలకు చెందిన అక్షింతలతో కూడిన కలశాలను స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ భక్తులు కలషాలను తలపై పెట్టుకుని వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ భోజిరెడ్డి, నిర్వాహకులు రవి, ఆనంద్చారి, రాజేందర్రెడ్డి, కరుణాసాగర్రెడ్డి, బ్రహ్మేందర్, అనిల్రెడ్డి పాల్గొన్నారు. -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
స్పృహతప్పి ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర విషాదం!
రామచంద్రాపురం: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బీహెచ్ఈఎల్ కాలనీలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసముండే మదిహాబేగం (19) ఇంటర్మీడియట్ చదువుతుంది. శనివారం రాత్రి తన నివాసంలో చదువుకుంటూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా.. -
అడవి పందిని ఢీకొట్టిన కారు
కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు అడ్డుగా వచ్చిన అడివి పందిని కారు ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు దులపల్లి చంద్రశేఖర్(26), ఫణీందర్(27), చెన్నకేశవులు, బాల మల్లేశ్, కిషోర్కుమార్ కారులో షిర్డీకి బయల్దేరారు. బాచేపల్లి సమీపంలో అడవి పంది రోడ్డుకు అడ్డు రావడంతో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారు పల్టీలు కొట్టి బోల్తా పడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, దులపల్లి చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురిని చికిత్స నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఫణీందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్హేర్ ఎస్ఐ వెంకటేశం తెలిపారు. -
సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ స్నేహితుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరూ కలిసి సూర్యోదయాన్ని (సన్రైజ్) చూడటానికి వెళ్లి సంతోషంతో తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదం తీరని దు:ఖాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు రామ్మోహన్, వినోద దంపతుల కుమారుడు బానోతు శ్రీరామ్(20) జోగిపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇండస్ట్రియల్ విజిట్ కోసం తోటి విద్యార్థులతో కలిసి నగరానికి వచ్చారు. గురువారం రాత్రి మణికొండలో ఉండే క్లాస్మేట్ దితేష్ ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం సన్రైజ్ (సూర్యోదయం) చూసేందుకు ఖాజాగూడ పెద్ద చెరువు వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం పెద్ద చెరువు నుంచి లింక్ రోడ్డు గుండా కారులో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ వైపు వస్తున్నారు. మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా చెట్టును, తర్వాత బండరాయిని ఢీకొట్టి అవతలి రోడ్డులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న బానోతు శ్రీరామ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవ్ చేస్తున్న చందానగర్లోని గంగారం నివాసి కె.ఉదయ్ సాయి(18), మణికొండకు చెందిన దితేష్(17), రామాయంపేటకు చెందిన వర్షిత్(18), నారాయణఖేడ్కు చెందిన వంశీ(18)కి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ఆస్పత్రికి తరలించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో.. పిల్లి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేయగా.. కారు అదుపు తప్పిందని డ్రైవింగ్ చేసిన ఉదయ్ సాయి చెబుతున్నాడు. శ్రీరామ్ ఎగిరి కారు కింద పడ్డాడని, సీటు బెల్ట్ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని పోలీసులు తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే అదుపుతప్పినట్లు భావిస్తున్నారు. అవతలి వైపు రోడ్డులో కారు పల్టీ కొట్టినప్పుడు అటుగా వాహనదారులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొడుకు ఇక లేడని.. డ్రైవర్ ఉదయ్ సాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని శ్రీరామ్ కుటుంబ సభ్యులు చెబుతుండగా, లైసెన్స్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నాకు ఉంది 20 గుంటల భూమి, కూలి పనులు చేస్తూ రెక్కల కష్టంతో కూతురు హిమశ్రీ బీటెక్ చదివిస్తున్నానని, కొడుకు శ్రీరామ్ను పాలిటెక్నిక్ చదివిస్తున్నానని తండ్రి రామ్మోహన్ కన్నీరు మున్నీరు అయ్యారు. కొడుకు ఇక లేడని జీర్ణించుకోలేక గుండెలవిసేలా విలపించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ మహేశ్, ఎస్ఐ విజయ్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
పాత పద్ధతిలోనే సాయం
జహీరాబాద్: యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు సాయం కోసం జిల్లా రైతాంగం ఎదురు చూస్తోంది. నవంబర్లోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెట్టుబడి సాయం అందించే విషయంలో జాప్యం అవుతూ వస్తోంది. దీంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈనెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం ప్రారంభించింది. అయినా అందరికీ డబ్బులు పడక పోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,16,210 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,14,793 మంది రైతులకు గాను రూ.23.50 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పాత పద్ధతిలోనే సాయం పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో ఎకరాకు రూ.5వేల వంతున రైతులందరి ఖాతాల్లో జమచేసిన విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్కు సైతం రైతుబంధు ఇచ్చే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.7,500 వంతున ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఎకరానికి రూ.5వేల వంతున అందిస్తోంది. పెట్టుబడి కోసం ఇబ్బంది యాసంగిలో పంటలను సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో రైతు బంధు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అప్పులు పుట్టని రైతులు పంటల సాగును ఆలస్యం చేశారు. యాసంగిలో రైతులు ప్రధానంగా ఆలుగడ్డ, గోధుమ, మొక్కజొన్న, చెరకు, ఉల్లిగడ్డ, కూరగాయలను సాగు చేస్తారు. ఆయా పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్: ఆదాయ పన్ను, టీడీఎస్ నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ విభాగం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ కార్యాలయ ఇన్కం టాక్స్ అధికారి మానస్ రంజన్ మెహర మాట్లాడుతూ.. నిర్ణీత సమయంలోగా కరెక్ట్ టీడీఎస్ రిటర్న్ సమర్పించాలని సూచించారు. దాఖలు చేయడంలో ఏవేని సమస్యలు ఉంటే www.tdscpc.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని లాగిన్ అయి క్లారిఫికేషన్ పొందాలని సూచించారు. ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలు, ఫైలింగ్ ఏ విధంగా చేయాలి తదితర అంశాలపై వివరించారు. ఈసందర్భంగా పలువురు డీడీఓల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి కవిత, జిల్లాలోని అన్ని శాఖల డీడీఓలు, హైదరాబాద్ ఇన్కం టాక్స్ కార్యాలయ అధికారి పావల్, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్వేర్ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్వేర్ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా..
మెదక్: ఒకే కడుపున పుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాలిపేట గ్రామానికి చెందిన ముండ్రాతి ఆంజనేయులు (35), సత్యనారాయణ, సిద్దిరాములు ముగ్గురూ అన్నాదమ్ముళ్లు. వీరు ఇప్పటికే తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నారు. ఇందులో సత్యనారాయణకు చెరువు సమీపంలో ఐదెకరాలు రాగా, ఆంజనేయులుకు పోచమ్మ మర్రిచెట్టు సమీపంలో ఐదెకరాలు వచ్చింది. సత్యనారాయణ పొలం వద్ద నీళ్లు సరిగా లేవని, మళ్లీ భూమి పంచుకుందామని ఆంజనేయులుతో అన్నాడు. ఇద్దరం మర్రిచెట్టు దగ్గర ఒక్కొక్కరికి రెండున్నర, చెరువు దగ్గర రెండున్నర చొప్పున తీసుకుందామని గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. సత్యనారాయణ చెప్పినట్లు భూమిని పంచారు. చెరువు దగ్గర ఉన్న బోరును కూడా ఇద్దరూ సమానంగా వాడుకోవాలని గ్రామపెద్దలు చెప్పారు. ఈ క్రమంలో బోరు మాత్రం నేను ఒక్కడినే వాడుకుంటా అని సత్యనారాయణ అన్నాడు. దీనికి అంజనేయులు ఒప్పుకోకపోవడంతో వివాదం మొదలైంది. రోజులాగే బుధవారం ఉదయం నారుమడికి నీరు పెట్టేందుకు ఆంజనేయులు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణ మరో వ్యక్తితో కలిసి ఆంజనేయులుపై దాడి చేసి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళన! పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట ఎస్ఐలు నారాయణ, హరీశ్గౌడ్, మొహినుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవి చదవండి: పాలమూరు యూనివర్సిటీలో దారుణం! డిబార్ చేశారని.. విద్యార్థి? -
వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి! అసలు కారణాలేంటి?
సిద్దిపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండు శ్రీనివాస్(35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న సందర్భంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. పక్కన ఉన్న వారు గొడవను ఆపారు. శ్రీనివాస్ను గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ స్పృహ కోల్పోయి, నోటిలో నుంచి నురగ రావడంతో అదే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానం ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని అతడి భార్య రాధ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గృహిణి మృతి.. అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్కు చెందిన నాచారం మరియమ్మ (41) ఈ నెల 16వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఈనెల 17న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పిల్లికోటాల్ శివారులో గల పిల్లికుంట వద్ద సోమవారం మరియమ్మ చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుంటలో వెతుకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై గాయం ఉండడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ టౌన్ సీఐ తెలిపారు. ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం!
పటాన్చెరు: బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తితోపాటు నాలుగేళ్ల బాలుడు చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబేద్ అలీ బతుకుదెరువు కోసం పటాన్చెరు మండలం ముత్తంగికి వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న వేంకటేశ్వర బ్రిక్స్ కంపెనీలో పని చేసుకుంటూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు పనిచేసే చోట బీహార్కు చెందిన సోనుకుమార్ అలియాస్ మునిలాల్(38) పని చేసుకుంటూ అక్కడే గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సోనుకుమార్, అబేద్ అలీ కుమారుడు రంజన్ అలీ(4)ని తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు దుకాణానికి రోడ్డు దాటి వెళ్లాడు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిరిగి రోడ్డు దాటుతుండగా పటాన్చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై సోనుకుమార్, బాలుడు రంజన్ అలీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు.. -
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు జహీరాబాద్ పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పర్వదినం కోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని అతిపెద్దదైన మెథడిస్టు చర్చిని దీపాలతో అలంకరించారు. క్రైస్తవులంతా ముందస్తు వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీలలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులంతా ఇళ్ల ఎదుట స్టార్ దీపాలను ఏర్పాటు చేశారు. కొత్త బట్టలు, తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లో సందడి నెలకొంది. – జహీరాబాద్ టౌన్ -
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది?
సంగారెడ్డి: హైదరాబాద్కు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో తరచూ మృతదేహాలు లభ్యమవుతున్నాయి. మహిళలు, యువతుల, వ్య క్తుల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మృతదేహం దొరుకుతుండడంతో పోలీసులకు సవాలుగా మారింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్కు సమీపంలో జిన్నారం మండలంలోని బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, జిన్నారంమంగంపేట, సోలక్పల్లి గ్రామాలు, హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, నాగారం, వడ్డెపల్లి, షేర్ఖాన్పల్లి గ్రామాలు, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, మంబాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి తండా గ్రామాలు ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతం వేల హెక్టార్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు ప్రధాన రహదారి ఉంది. ఈ రోడ్డుపై ప్రతీనిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలు, యువతులను హత్యలు చేసి అటవీ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారు. ఇలాంటి కేసులు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది. రెండేళ్ల కిందట నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డబ్బాల్లో తీసుకొచ్చి నల్లవల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. దుండిగల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసి మాదారం అటవీ ప్రాంతంలో పడేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోని ప్రజలు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది. రెండేళ్ల కిందట ఇతర ప్రాంతంలో హత్య చేసిన వ్యక్తిని బొల్లారం సమీపంలోని రింగురోడ్డు ప్రాంతంలో పడేశారు. ఖాజీపల్లి అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. ఆయా అటవీ ప్రాంతాల్లో పలువురు మహిళలు, యువకులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి హత్యలా, ఆత్మహత్యాలా తెలియరాలేదు. మూడు నెలల కిందట ఓ మహిళ మృతదేహాన్ని మంబాపూర్ అటవీ ప్రాంతంలో పడేసి కాల్చి హత్య చేశారు. తాజాగా జిన్నారం మండలంలోని మంగంపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాగారం, రొయ్యపల్లి, నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లోపించిన నిఘా.. ప్రధాన రహదారులపై పోలీసుల నిఘా లోపించింది. నామమాత్రంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి సమయంలో నిఘా లోపించడంతో నిందితులు దర్జాగా వారి పనులు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల పనితీరు కూడా సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తగిన నిఘా, భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీటిని నివారించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కేసులను ఛేదిస్తున్నాం.. హత్య కేసులను ఛేదించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. హత్యలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సీసీ కెమెరాల పనితీరును మరింత మెరగు పర్చేలా చూస్తున్నాం. – వేణుకుమార్, సీఐ జిన్నారం ఇవి కూడా చదవండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ! -
కారును ఓవర్టేక్ చేయబోయి..
పటాన్చెరు టౌన్: లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ రెహమాన్(19), ఖాసీం ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడాది కిందట వచ్చి బొల్లారం పరిధిలోని గాంధీనగర్లో ఉంటున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ పని నిమిత్తం బైక్పై శంకర్పల్లి వైపు బయలుదేరారు. ముత్తంగి సర్వీస్ రోడ్ నుంచి కర్ధనూర్ వైపు వెళ్తుండగా కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: పుట్టపర్తిలో దారణం.. అనుమానంతో భర్త! -
బైక్ను తప్పించబోయి..
బైక్ను తప్పించబోయి.. ● స్తంభాన్ని ఢీకొట్టిన తుఫాన్ వాహనం ● పలువురికి గాయాలు అల్లాదుర్గం(మెదక్): బైక్పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం చిల్వెర గ్రామ శివారులో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చిల్వెర నుంచి అల్లాదుర్గం వైపు బైక్పై వెళ్తున్నాడు. చిల్వెర శివారులోకి రాగానే పోలీసులు ఎదురుగా వస్తుండడంతో ఫైన్ వేస్తారనే భయంతో బైక్ను సడన్గా ఆపాడు. అతడి వెనుక నుంచే అల్లాదుర్గం వస్తున్న తుఫాన్ వాహనం బైక్ను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్లో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బచ్పల్లి గ్రామానికి చెందిన రాములుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
గ్రూపు విభేదాలే కారణమా? ఓటమిపై అధిష్టానం ఆరా..
సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగి అధికారంలోకి వస్తే.. దుబ్బాక నియోజక వర్గంలో మాత్రం పార్టీ ఘోరపరాజయం చవిచూసింది. మొదటి నుంచి గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న దుబ్బాకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని భావించిన అధిష్టానానికి నిరాశే మిగిలింది. గెలుపు కాదు కదా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటమికి నేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలే కారణమా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న దానిపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. టికెట్ దక్కకపోవడంతో.. మొదటి నుంచి దుబ్బాక కాంగ్రెస్లో గ్రూపు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూపు విభేదాలు నెలకొనడంతో ఎన్నిసార్లు అధిష్టానం సమన్వయం కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎన్నికల ముందు దుబ్బాక టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. ఆఖరికి చెరుకు శ్రీనివాస్రెడ్డికే టికెట్ దక్కింది. దీంతో కత్తి కార్తీక ఎన్నికలకు నాలుగురోజుల ముందు బీఆర్ఎస్ చేరి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఇక టికెట్ రాకపోవడంతో శ్రావణ్ కుమార్రెడ్డి దుబ్బాక వైపే చూడకపోవడం తన అనుచరులు సైతం శ్రీనివాస్రెడ్డికి ఎన్నికల్లో సహకరించకపోవడం కనిపించింది. డిపాజిట్ దక్కని పరిస్థితి! దుబ్బాకలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురతుందని అధిష్టానం ధీమాగా ఉండగా నియోజకవర్గంలో సైతం శ్రీనివాస్రెడ్డికి టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలుస్తాడని సర్వేల్లో తేలింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో ఓ దశలో అంతు చిక్కని పరిస్థితి కనబడింది. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం శోచనీయం. చెరుకు శ్రీనివాస్రెడ్డికి కేవలం 25,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కు కావాల్సిన 28,894 ఓట్లకు 3,500 పై చిలుకు ఓట్లు దూరంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దుబ్బాకలో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇవి కూడా చదవండి: సారూ..! మా గ్రామాలకు 'మహాలక్ష్మి' కరుణించేదెలా? -
లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్నగర్లోని నివాస్ టవర్స్ అపార్ట్మెంట్లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్మెంట్ని 4వ అంతస్థుకు వెళ్లాడు. కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం! -
లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్..
పటాన్చెరు టౌన్: ఇన్స్ట్రాగామ్లో ఐఫోన్ కొనేందుకు వెళ్లి సైబర్ వలలో చిక్కుఉని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.6లక్షల 2 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధి బీరంగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగి సెప్టెంబర్ 25వ తేదీన ఇన్స్ట్రాగామ్లో ఐఫోన్ రూ.13 వేలకు వస్తుందని వచ్చిన మెసేజ్ ను చూసి అపరిచిత వ్యక్తిని సంప్రదించాడు. దీంతో ఆ వ్యక్తి ఓ లింకు పంపగా... అందులో తన వివరాలు నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా చేసి తన ఖాతాలో ఉన్న రూ.ఆరు లక్షల రెండు వేలు పోగొట్టుకున్నాడు. అనంతరం మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మంగళవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్.. లోన్ ఇస్తామంటూ వచ్చిన ఫోన్కాల్కు స్పందించిన ఓ గృహిణి రూ.రెండు లక్షల 71 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీన్పూర్కు చెందిన ఓ గృహిణికి నవంబర్ 6వ తేదీన రూ.లక్ష లోన్ ఇస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బాధితురాలు అపరిచిత వ్యక్తి పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసింది. కొద్దిసేపటికి ఆమె ఖాతాలో ఉన్న రూ.రెండు లక్షల 71 వేలు మాయమయ్యాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితురాలు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, మంగళవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫలించిన మంత్రాంగం
● ఆ ఇద్దరినీ విజయానికి చేరువ చేసిన ట్రబుల్షూటర్ ● సంగారెడ్డి, జహీరాబాద్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీశ్రావు ● రెండుచోట్ల సన్నిహితులకు కీలక బాధ్యతలు ● పకడ్బందీ వ్యూహాలను అమలుచేసిన మాజీ మంత్రి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చారు. పకడ్బందీ వ్యూహాలను అమలు చేసి ఆ రెండు చోట్ల బీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేయగలిగారు. హస్తం పార్టీ హవాలోనూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కంటే ఓ సీటు అధికంగా గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకునేలా చేయడంలో హరీశ్రావు సఫలీకృతుడయ్యారు. ఆయన ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలను ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు నాయకులకు కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించినా హరీశ్ వారితో తన వ్యూహాలను తు.చ తప్పకుండా అమలు చేయించారు. తద్వారా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులిద్దరినీ విజయం వైపు నడిపించారు. సంగారెడ్డిలో పక్కా వ్యూహం సంగారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బరిలో ఉండగా, బీఆర్ఎస్ టిక్కెట్టును హరీశ్రావు పట్టుబట్టి చింతా ప్రభాకర్కు ఇప్పించుకున్నా రు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి రెండు నెలల ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించుకుని.. పోలింగ్ ముగిసిసే చివరి నిమిషం వరకు పకడ్బందీగా అమలు చేయించారు. ఆ టిక్కెట్టు ఆశించి భంగపడి అసమ్మతి రాగం వినిపించిన ముఖ్య నాయకులను, చింతా ప్రభాకర్తో అంతర్గత విభేదాలున్న కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను హరీశ్రావు బుజ్జగించి సమన్వయం చేశా రు. తాను స్వయంగా అసమ్మతి నేతల ఇంటికి వెళ్లి అసమ్మతి నేతలను దారికి తెచ్చుకున్నారు. నామినేషన్ సమయానికి ఎక్కడా చిన్న అసంతృప్తులకు కూడా తావులేకుండా క్యాడర్ను ఏకతాటిపై నడిపించారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. అవసరం మేరకు వ్యూహాలను మా ర్చుతూ క్యాడర్ను ముందుకు నడిపించారు. బహి రంగసభలు, రోడ్షోలు, ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. పోలింగ్ రెండు రోజులు ఉండగా సీఎం కేసీఆర్ బహిరంగసభను సంగారెడ్డిలో నిర్వహించేలా హరీశ్రావు కేసీఆర్ ప్రచార షెడ్యుల్ను ఖరారు చేయించారు. అక్క డ పోలింగ్కు రెండు రోజుల ముందు నిర్వహించే పోల్ మేనేజ్మెంట్ కూడా పకడ్బందీగా జరిగింది. ఇలా పోలింగ్కు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా గులాబీ శ్రేణులను నడిపించిన హరీశ్ సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ను విజయ తీరాలకు చేర్చగలిగారు. కర్నాటక ప్రభావం ఉన్నా.. జహీరాబాద్ నియోజకవర్గాన్ని కూడా హరీశ్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గులాబీ పార్టీ అభ్యర్థి మాణిక్రావును గెలిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్కు అక్కడ కీలక బాధ్యతలను అప్పగించి ఆయన ద్వారా ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయించగలిగారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని మొదటి నుంచి అన్ని రాజకీయ వర్గా లు భావించాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు, మైనార్టీలు అధికంగా ఉన్న ఈ స్థానంలో కాంగ్రెస్ సులభంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. సర్వేలు కూడా ఆ స్థానం కాంగ్రెస్దే అన్నట్టు వివరించాయి. అయినప్పటికీ క్యాడర్ ఏమాత్రం నిరాశ చెందనీయకుండా చివరి క్షణం వరకు పోరాటం చేసేలా చేయడంలో హరీశ్రావు సఫలీకృతుడయ్యా రు. పార్టీకి మేలు జరుగుతుందని తెలిస్తే బూత్ స్థాయి కార్యకర్తతో కూడా ఆయన స్వయంగాగానీ, ఫోన్లోగానీ మాట్లాడారు. మైనస్ ఉన్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ వైపు తిప్పగలిగారు. ప్రభావం చూపే సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ను ఆదరించేలా చేశారు. పలు మండలాల్లో విభేదాలతో ఉన్న నేతలను హైదరాబాద్కు పిలిపించుకుని వారిని సమన్వయం చేశారు. జహీరాబాద్లో హరీశ్రావు అన్నీ తానై ఎదురొడ్డి నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావును ముందుకు నడిపించారు. -
మెజారిటీ రాదు.. ఒట్టు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ చాలెంజ్
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు చైర్మన్ జితేందర్గౌడ్తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు. -
భక్తి భావనతోనే మనసుకు ప్రశాంతత
మిరుదొడ్డి(దుబ్బాక): భక్తి భావనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని మాధవానంద సరస్వతీ స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. మిరుదొడ్డి, లక్ష్మీనగర్, ఆరెపల్లి గ్రామాల శివారులో వెలసిన సదానందాశ్రమ 40వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాదుకా పూజలు, పుష్షార్చన, బిల్వపత్ర పూజ, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తి భావన అలవర్చుకుంటేనే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతాయన్నారు. అందరూ భక్తి భావనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. నిత్యం దైవారాధనలు చేసి పుణ్యఫలాలను దక్కించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైదిక నిర్వాహకులు విఠాల రాజపున్నయ్య శర్మ, చంద్ర శేఖర శర్మ, రమేష్ శర్మ, ఆశ్రమ శిష్యబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వార్షికోత్సంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
కేసీఆర్ సన్నిహితుడికి షాక్
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది. జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్లో సైతం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది. ఇక్కడే ప్రచారానికి పరిమితం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్రావు జహీరాబాద్కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లు బీఆర్ఎస్ : 5,30,194 కాంగ్రెస్ : 5,48,348 బీజేపీ : 1,72,575 -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో
హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలదే పై చేయిగా నిలిచింది. ఈసారి పురుషుల కంటే వారే అధికంగా ఓటు వేశారు. అయితే ప్రతీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ పార్టీ గెలుపునకు నాంది పలుకుతుంది. ఈసారి ఇక్కడి ఓటర్లు ఎవరి వైపు నిలిచారో అనేది తెలియాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018 కంటే 2023లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 68.76 శాతం, 2018లో 79.72 శాతం, 2023 ఎన్నికల్లో 80.31 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ప్రతి ఎన్నికల్లో మహిళలదే పై చేయిగా నిలుస్తోంది. మొత్తం ఓటర్లు 18118 కాగా, పోలైన ఓట్లు 14,556, ఇందులో పురుషులు 7232, సీ్త్రలు 7317 మంది ఓటు వేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 బూత్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 13వ బూత్లో 1227 ఓట్లు ఉన్నాయి. మొత్తం పోలైన ఓట్లు 1007, ఇందులో పురుషులు 491, సీ్త్రలు 516 మంది ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. అత్యల్పం 21వ బూత్లో 655 ఓట్లు కాగా, 525 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 244 మంది, సీ్త్రలు 281 మంది ఓటును సద్వినియోగం చేసుకున్నారు. -
అరగంటలో రౌండ్..
జిల్లాలో ముందుగా నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల ఫలి తాలు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. సంగారెడ్డి ఓట్లను 17 రౌండ్లలో లెక్కిస్తారు. ఓట్లు అధికంగా పోలైన పటాన్చెరు నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమవుతుంది. ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో జరుగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుఉంటుంది. అంతటా ఉత్కంఠ.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీల నేతలు తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. దీంతో చివరి రౌండ్ వరకు అభ్యర్థుల ఆధిక్యంపై ఉత్కంఠ కొనసాగే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అరగంటలో రౌండ్.. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్హాల్లోకి అనుమతి ఇస్తారు. ఇందుకోసం వారికి ముందస్తుగా పాసులు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ 8,400 జిల్లాలో మొత్తం 8,400 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నారాయణఖేడ్లో 1,65 2, అందోల్లో 1,445, జహీరాబాద్లో 1,501, సంగారెడ్డిలో 2,737, పటాన్చెరులో 1,065 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఏర్పాట్లు పూర్తి.. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్క సంగారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్ వద్ద ముగ్గురు ఓట్లు లెక్కిస్తారు. అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కౌంటింగ్ హాలులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను అభ్యర్థుల ఏజెంట్లు వీక్షించేలా, వారి సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అధికారులు సిబ్బంది ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు. నియోజకవర్గం పోలింగ్ కౌంటింగ్ మొత్తం కేంద్రాలు టేబుల్స్ రౌండ్లు నారాయణఖేడ్ 296 18 17 అందోల్ 313 18 18 జహీరాబాద్ 314 18 18 సంగారెడ్డి 281 16 18 పటాన్చెరు 405 18 23 -
పర్యావరణ పరిరక్షణకు యువత నడుం
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణసంస్థ ఆధ్వర్యంలో శనివారం ‘వాతావరణ భద్రత– యువత పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు పురుషోత్తంరెడ్డితోపాటు సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, పర్యావరణ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. యువత పర్యావరణ రక్షణకు నాయకత్వం వహిస్తూ, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని.. సమాజంలో సుస్థిర అభివృద్ధికి వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు. సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ రక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యేందుకు యువత కదిలి రావాలని కోరారు. పర్యావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి తదితర ప్రాధాన్యత అంశాలపై దొంతి నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, ఎర్త్సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, ఎన్ఆర్ఐ విజయ్భాస్కర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డి, గౌతమిఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ, అయిష్టర్ సంస్థ అధ్యక్షుడు సునీల్ శింగాడే, పర్యావరణ ప్రచారకర్త సురేశ్, సామాజిక కార్యకర్త రుచిత్ కమల్, వికాస్, వివిధ కళాశాలల ప్రొఫెసర్లు, ఎన్ఎస్ఎస్ ఇన్చార్జిలు, లీప్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నిర్వాహకులు, సీజీఆర్ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. -
నష్టాలు..
కౌడిపల్లి(నర్సాపూర్): వరి కోతలు పూర్తికాగానే రైతులు యాసంగి పనులు మొదలు పెట్టారు. వానాకాలం సీజన్లో కూలీల కొరత కారణంగా హార్వెస్టర్లతో వరి కోతలు కోయడంతో పొలంలో కొయ్యలు మిగిలాయి. పశుసంపద ఉన్న రైతులు గడ్డి సేకరిస్తుండగా.. మిగతా రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నష్టాలే ఎక్కువ. పొలంలో మిగిలిన కొయ్యలను, గడ్డిని కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని కౌడిపల్లి మండలం తునికి వద్ద గల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. ఆయన రైతుల కోసం మరికొన్ని సూచనలు చేశారు. నష్టాలు.. ● వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. ● నేలకు మేలు చేసే క్రిమి కీటకాలు నశించడమే కాక భూసారం తగ్గిపోతుంది. ● నేలలో గడ్డిని కలియ దున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ● భూసారంతోపాటు దిగుబడులు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది. ● వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ● విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ● ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. ● భూమికి పీచు పదార్థంగా ఉపయోపగడే అవశేషాలు కాలిపోతాయి. ● పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. ● పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉన్నది. ● దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కూడా ఒక్కోసారి బొగ్గవుతాయి. ప్రయోజనాలు.. ● వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. ● దుక్కి దున్నే సమయంలో సూపర్ పాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ● ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. ● దున్నడం వల్ల ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది. ● మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది. ● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మదాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. ● నేలలో కరగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ పెరుగుతుంది. ● కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. వరి కొయ్యలకు నిప్పు పెడితే నష్టమే.. మిత్రపురుగులు, సూక్ష్మజీవులు చనిపోయే ప్రమాదం -
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
● పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు.. ● జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం నమోదు ● ఉత్సాహంగా ఓటేసిన యువకులు ● ఉదయం నుంచే బారులు.. ● పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు.. ● ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : బారులు తీరిన ఓటర్లు.. ఉత్సాహంగా ఓటేసిన యువ ఓటర్లు.. తరలివచ్చిన వృద్ధులు, దివ్యాంగులు.. ఓటుహక్కును వినియో గించుకున్న ప్రముఖులు.. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపులు.. పలుచోట్ల కార్యకర్తల మధ్య ఘర్షణలతో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 13.93 లక్షల మంది ఓటర్లు ఉండగా, అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలలోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అందోల్లో అత్యధికంగా 84.76 శాతం నమోదు కాగా, అత్యల్పంగా పటాన్చెరులో 69.80 శాతం నమోదు అయ్యింది. ఓట్లు గల్లంతు.. పలు నియోజకవర్గాల్లో ఓట్లు గల్లంతయ్యాయి. పటాన్చెరు నియోజకవర్గంలో పలుచోట్ల తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల్లో కొందరు ఓట్లు ఉంచి, మరికొందరి ఓట్లు తొలగించారని రామచంద్రాపురంలో ఓటర్లు వాపోయారు. నివాసం ఉండే ప్రాంతాలకు దూరంగా పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ మధ్యలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ పోలింగ్ కేంద్రం, నారాయణఖేడ్లోని జుకల్, హంగుర్గాలో, పటాన్చెరులోని జేపీనగర్, అమీన్పూర్లలో, పుల్కల్ మండలం కోడూర్లో, కంగ్టి మండలం బాన్సువాడ (డీ) కేంద్రంలో, అందోల్ మండలం తాలెల్మలో, ఝరాసంగం మండలం పొట్పల్లిలో ఈవీఎం మొరాయించాయి. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్పేట్లోని 179 బూత్లో వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు.. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. సదాశివపేట్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం చిట్కుల్ వద్ద బీఎస్పీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఓ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మరో పార్టీ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. -
పోలింగ్ విధుల్లో ఏడు వేల మంది..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఈనెల 30వ తేదీన జరుగనుంది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13.93 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 1,609 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 389 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. పోలింగ్ విధుల్లో ఏడు వేల మంది.. జిల్లాలో మొత్తం 7,068 మంది పోలింగ్ విధులను నిర్వహించనున్నారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ ప్రక్రియలో భాగం పంచుకోనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల బృందాల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల విధులను నిర్వహించనున్న అధికారులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. పోలింగ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది బుధవారం పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లనున్నారు. పోలింగ్ సామగ్రీ పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఎర్రర్ ఫ్రీ ఎన్నికలు: కలెక్టర్ శరత్ ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎర్రర్ ఫీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులు బస చేసిన లాడ్జీలు, హోటల్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలి. అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం ఓటర్లు 13.93 లక్షలు పురుషులు 7.02 లక్షలు సీ్త్రలు 6.91 లక్షలు థర్డ్ జెండర్ 128 మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,609 పోలింగ్ సిబ్బంది 7,069 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 389 వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 1,039 సీసీటీవీ కవరేజ్ పోలింగ్ కేంద్రాలు 689 వీడియో కవరేజీ పోలింగ్ కేంద్రాలు 352 -
ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికలు కీలకం
● ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగిస్తే సహించం ● చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ● ఎస్పీ చెన్నూరి రూపేష్ ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికలు కీలకం సంగారెడ్డి /పటాన్చెరు టౌన్: ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమని, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. మంగళవారం ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో సార్వత్రిక ఎన్నికల విధులకు వచ్చిన సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల గురించి వివరించారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లరాదన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని, అనవసర విషయాలు చర్చించవద్దన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓటర్లు సెల్ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూత్ లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు, సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్, సబ్–డివిజన్ సీఐలు శ్రీధర్ రెడ్డి, చంద్రయ్య, సుధీర్ కుమార్, నాగరాజు, ఎస్ఐలు, వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద’ బహిరంగ సభలో ప్రముఖ గాయకులు
గజ్వేల్/గజ్వేల్రూరల్: గజ్వేల్ పట్టణం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ తన చిట్టచివరి ఎన్నికల ప్రచార సభను సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పట్టణంలోని ఐఓసీ వెనుకభాగంలోని మైదానంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.53 గంటలకు కేసీఆర్ వేదికపైకి చేరుకున్నారు. ఆ సమయంలో జనం ఒక్కసారిగా కేరింతలు కొడుతూ... నినాదాలతో హోరెత్తించారు. మహిళా ప్రజాప్రతినిధులు సీఎంకు తిలకం దిద్ది స్వాగతం పలకగా... మైనార్టీ నేతలు దట్టీ కట్టారు. సభకు అధ్యక్షత వహించిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ముందుగా ప్రసంగించారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యల చిట్టాను సీఎం ముందు ఉంచారు. ఆ తర్వాత మాజీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ తన ప్రసంగాన్ని 3:09గంటలకు ప్రారంభించి అరగంటకుపైగా కొనసాగించారు. ఆకట్టుకున్న ఏపూరి, మధుప్రియల ఆటాపాట కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద’ బహిరంగ సభలో ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, మధుప్రియ తమ ఆటపాటలతో సభికులను ఆకట్టుకున్నారు. అప్పుడెట్లుండె తెలంగాణ... ఇప్పుడెట్లుందంటూ కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు -
24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్కు ఈటల సవాల్
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు మీ అయ్య జాగీరా? అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆదివారం తూప్రాన్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్రావు అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాషాయ కండువా కప్పుకున్న వారికి పెన్షన్లు, రైతుబంధు, డబుల్ బెడ్రూం రాదంటున్నారు. మిస్టర్ సీఎం కేసీఆర్.. మిస్టర్ హరీశ్.. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అయ్య జాగీరా..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ప్రజల ఆస్తులకు కాపాలదారులు మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే జీతగాళ్లు అనే విషయం మరిచిపోతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాజకీయం నుంచి తప్పుకుంటా.. కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమతోనే ఉద్యోగాలు, 24 గంటల విద్యుత్ సరఫరా అని మాట్లాడటం సిగ్గుచేటని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కౌలు రైతు చనిపోతే రూ.లక్ష ఇచ్చే సోయి లేని కేసీఆర్.. పక్క రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులకు రూ.3 లక్షల చెక్కులు అందించి తెలంగాణ వ్యవసాయంలో ఆదర్శం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు తదితర వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. అలాగే ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్లు అందించడంతోపాటు రైతులు సాగు చేసిన ధాన్యానికి క్వింటాల్కు రూ.3,500 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మురళీయాదవ్(నర్సాపూర్), నందీశ్వర్గౌడ్(పటాన్చెరు), రాజు (సంగారెడ్డి), శ్రీకాంత్రెడ్డి (సిద్దిపేట), విజయ్కుమార్ (మెదక్) మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్! -
ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు
జహీరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవవనోపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి, పోలింగ్ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఓటు పడుతుందనే నమ్మకం ఉన్న వారికే తొలి ప్రాధాన్యతగా గుర్తిస్తున్నారు. వలస ఓటర్ల సంబంధీకుల ఆరా తీసి వారికి కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు ఉపాధి నిమిత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై అభ్యర్థుల అనుచరులు దృష్టిసారించారు. జిల్లాకు చెందిన ఓటర్లు ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తాండూర్, వికారాబాద్, పరిగి, మెదక్, సిద్దిపేట, బెంగుళూరు, పూణే, బీదర్, బాల్కి, హుమ్నాబాద్ గుల్బర్గా, ముంబై తదితర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వేలాది మంది వలస వెళ్లారు. వీరితో పాటు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి, పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటున్నారు. వీరి మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామాలవారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు తీసుకుని ఓటర్ల వివరాలు, వారు ఉంటున్న చిరునామా, సెల్ఫోన్ నంబర్లు గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున స్వస్థలాలకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు. రవాణా చార్జీలతో పాటు భోజనం, ఇతర ఖర్చులకు అడ్వాన్స్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఓటర్లను సమన్వయం చేసి ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు రప్పించే బాధ్యతలను కొంత మంది కీలక నేతలకు అప్పగించినట్లు తెలిసింది. న్యూస్రీల్ వలస ఓటర్లపై అభ్యర్థుల గురి పోలింగ్ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు మద్దతు కూడగట్టేందుకు రాయబారాలు విజయంలో వారి ఓట్లే కీలకం కీలక నేతలకు బాధ్యతలు హైదరాబాద్లోనే అధికంగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో జిల్లాకు చెందిన ఓటర్లు సుమారు 20 వేలకు పైగానే ఉన్నారు. వీరిలో అధికంగా హైదరాబాద్ జంట నగరాల్లోనే ఉంటున్నారు. చందానగర్, బీహెచ్ఈఎల్, లంగర్హౌజ్, టోలీచౌకి, మెహిదీపట్నం, ఎల్బీ నగర్, హిమాయత్నగర్, బీరంగూడ, బాలానగర్, సికింద్రాబాద్, మూసాపేట్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు. దీంతో రాజకీయ పార్టీలు వీరి ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరం సంగారెడ్డి జిల్లాకు సమీపంలోనే ఉండటంతో ఓటర్లను రప్పించడం పెద్ద కష్టం కాదని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కొందరికి పోలింగ్ రోజున రప్పించేందుకు కొంత అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కర్ణాటక రాజకీయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎన్నికలపై కర్ణాటక రాజకీయలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్ర అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోందనే అంశాన్ని బీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఓటేస్తే.. ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తుందనే ప్రచారం చేస్తోంది. ఇటీవల జహీరాబాద్లో మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా కర్ణాటక వాసులతో బంధుత్వం ఉన్న మల్లేశంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అక్కడ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా బాగా లేదని, పింఛన్లు నామమాత్రంగా ఇస్తున్నారనే అంశాన్ని ఆయనతో చెప్పించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓటర్లు కాంగ్రెస్ను ఎందుకు ఎన్నుకున్నామా? అని ఆ రాష్ట్రంలోని తమ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పిన మాటలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. హస్తం నేతల ప్రచారం ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం విదితమే. ఆ ప్రభావం ఎక్కువగా జహీరాబాద్ నియోజకవర్గంపై ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆరాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఇటీవల పట్టణంలో ఉన్న షెట్కార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశానికి మంత్రులు రహీం, ఈశ్వర్ఖాండ్రే హాజరయ్యారు. తమ రాష్ట్రంలో ఎన్నికల హామీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ సైతం.. బీజేపీ సైతం కర్ణాటక పార్టీ నేతలతో జహీరాబాద్లో ప్రచారం చేయిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పట్టణంలో బహిరంగ సభను నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన పార్టీ ఆ రాష్ట్ర నేతలతోనైనా కొంతమేరకు ఊపు వస్తుందనే భావిస్తోంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కర్ణాటకతో జిల్లాలో ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెండు నియోజకవర్గాలకు సరిహ ద్దులు ఉన్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రాయ్కోడ్ వంటి మండలాలు కూడా సమీపంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఆరాష్ట్రంతో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీల కోసం కూడా సంబంధాలుంటాయి. ఈ నేపథ్యంలో అక్క డి రాజకీయాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో లేదో తెలియాలంటే వేచిచూడాలి. నేడు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాక జహీరాబాద్: బుధవారం పట్టణానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రాంచందర్ రాజనర్సింహ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
పోల్ చీటీల్లో కొత్తదనం
నారాయణఖేడ్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా జిల్లా అధికారులు ఓటరు స్లిప్లు, ఎపిక్ కార్డుల పంపిణీ ముమ్మరం చేశారు. ఓటర్ల తుదిజాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 13,93,711 మంది. వీరందరికీ పోల్ చీటీలు, కొత్తగా ఓటుహక్కు పొందిన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ మొదలు పెట్టారు. పోస్టల్ సిబ్బంది, బీఎల్వోలు ఇంటింటికీ వాటిని పంపిణీ చేస్తున్నారు. పూర్తి వివరాలతో.. పోల్ చీటీలపై ఓటరు పేరు, చిరునామా, ఓటరు సంఖ్య, పోలింగ్ కేంద్రం, పోలింగ్ తేదీ, సమయం, హెల్ప్లైన్ నంబర్, పలు సూచనలతో పూర్తి వివరాలు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఓటర్లు సులువుగా కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో వాటిని పార్టీల వారే ముద్రించి పంపిణీ చేసేవారు. అయితే ప్రచారం ముగిసినా తర్వాత పోల్ చీటీల పంపిణీ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఆయా పార్టీల శ్రేణులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం దానిని నివారించింది. గత ఎన్నికల నుంచి అధికారికంగానే వీటిని పంపిణీ చేస్తున్నారు. అడ్రస్ చూపే మ్యాప్ గతంలో పోల్ చీటీలో కేవలం ఓటరు ఫొటో, వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఎన్నికల్లో నూతన విధానంలో పోల్ చీటీలను రూపొందించారు. ఫొటో స్థానంలో క్యూఆర్ కోడ్ ఉంది. పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, గ్రామం, పోలింగ్ కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ ముద్రించారు. దాని వెనుక వైపు పోలింగ్ కేంద్రానికి సులువుగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ప్రింట్ చేశారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బూత్స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబరు ప్రింట్ చేశారు. ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలు అందులో వివరించారు. అయితే బూత్లెవల్ అధికారులు తమ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంలో ఓటరుగా నమోదైన వ్యక్తికి మాత్రమే ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటరు పత్రాలు తీసుకున్నట్లు రసీదుగా రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్రలను తీసుకుంటున్నారు. స్లిప్పులు ప్రతి ఓటరుకు అందేలా సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లిన సమయంలో ఎవరైనా తాళం వేసి ఉంటే అలాంటి వారికి పోలింగ్ రోజున బూత్లెవల్ అధికారులు హెల్ప్లైన్ సెంటర్లో అందించనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఈ స్లిప్పుతోపాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళితేనే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. నియోజకవర్గం బూత్లు మొత్తం ఓటర్లు నారాయణఖేడ్ 296 2,31,188 అందోల్ 313 2,49,248 జహీరాబాద్ 314 2,70,785 సంగారెడ్డి 281 2,45,253 పటాన్చెరు 405 3,97,237 -
గెలిచిన ఆరుగురిలో ముగ్గురు అమాత్యులే
జహీరాబాద్: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్ హయాంలోనే ఎం.బాగారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, జె.గీతారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన పి.నర్సింహారెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన సి.బాగన్న, బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కె.మాణిక్రావులకు మంత్రి పదవులు దక్కలేదు. అప్పుడు వారి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 1957 నుంచి 1985 వరకు జరిగిన ఏడు పర్యాయాలు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాగారెడ్డి గెలుపొందారు. పలువురి మంత్రి వర్గంలో బాగారెడ్డికి చోటు లభించింది. చక్కెర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తదితర శాఖలను ఆయన నిర్వహించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ ఫరీదుద్దీన్ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలుపొందడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. వక్ఫ్, మైనార్టీ సంక్షేమం, మత్యశాఖలను నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జహీరాబాద్ అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వు కావడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గీతారెడ్డికి గజ్వేల్ నుంచి జహీరాబాద్కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో తాను ఓటమి పాలవ్వగా బీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రివర్గంలో అవకాశంలభించలేదు. పదవులు దక్కలేదు.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.నర్సింహారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి యోగం కలుగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.బాగన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం పేషీ నుంచి ఆహ్వానం అందింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం బాగన్న తన అనుచర గణంతో హాజరయ్యారు. చివరి వరకు వేచి చూసినా ఆయనకు పిలుపు రాలేదు. మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తితో వెనుదిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే 3 గంటల కరంటే..!
సంగారెడ్డి(గజ్వేల్): కాంగ్రెస్కు ఓటేస్తే 3 గంటల కరంటే ఉంటుందని వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం దుకాణాల వద్ద చెప్పులను క్యూలో పెట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బిందెడు తాగునీళ్ల కోసం దూరం వెళ్లి తెచ్చుకున్నప్పుడు భుజాలు కాయలు కాసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణలో మహా అయితే ఒకటి రెండు చోట్ల గెలిచే బీజేపీ నేత గజ్వేల్లో ఓట్లు దండుకునేందుకు బీసీని సీఎం చేస్తామంటూ చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ను తిప్పలు పెట్టేందుకు ఢిల్లీ నుంచి డబ్బుల సంచులతో బీజేపీ నాయకులు బయలు దేరారన్నారు. అవసరం కోసం దగ్గరికి వచ్చే కాంగ్రెస్, బీజేపీలు కావాలో.. ప్రజల ఆపద, సంపదల్లో పాలుపంచుకుంటున్న సీఎం కేసీఆర్ కావాలో ఆలోచించాలన్నారు. కరోనా కష్ట కాలంలో ఎక్కడ పోయారో ఓట్లు అడుగడానికి వచ్చే ప్రతిపక్ష పార్టీలను అడుగాలన్నారు. రూ.14 వేల కోట్లతో రైతు రుణాలు మాఫీ చేశామని, ఎన్నికల కోడ్ నేఫథ్యంలో పెండింగ్లో ఉన్న రూ.4వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రాగానే పూర్తి చేసి తిరిగి రుణాలు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 13లక్షల2వేల 53 మంది కల్యాణ లక్ష్మి పథకంలో లబ్ధిపొందారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూంలను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. తెలంగాణ సంపదను పెంచి పథకాల రూపాల్లో పేదలకు పంచుతామన్నారు. 24 గంటల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్, నాయకులు పొల్కంపల్లి నరేందర్, కోల సద్గుణ, పిస్క అమరేందర్, మల్లం ఐలయ్య, లక్ష్మన్రాజు, భూములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. : మంత్రి హరీశ్రావు -
హరీశ్ హాజరై..అన్నీ తానై
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా చెమటోడుస్తున్నారు మంత్రి హరీశ్రావు. గురువారం జిల్లాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం రాత్రి సంగారెడ్డిలోనే నిద్రించిన ఆయన ఉదయం ఏడు గంటల నుంచే తన దినచర్యను ప్రారంభించారు. రాత్రి పది గంటల వరకు సుమారు 16 గంటల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రచార సభలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరేలా అన్నీ తానై వ్యవహరించారు. ముఖ్యనేతల నివాసాలకు.. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా నాయకులు బీఆర్ఎస్లో చేరేలా మంత్రి హరీశ్రావు కీలకంగా వ్యవహరించారు. గురువారం ఉదయమే టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనీల్ నివాసానికి వెళ్లిన పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సంగారెడ్డి టికెట్ ఆశించి భంగపడిన రాజేశ్వర్రావు దేశ్పాండే నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఎం కార్యాలయానికి స్వయంగా వెళ్లి.. జిల్లాలో సీపీఎం పార్టీ మద్దతు కూడగట్టేందుకు హరీశ్రావు స్వయంగా సంగారెడ్డిలోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి చింతప్రభాకర్తో కలిసి సీపీఎం నేతలతో చర్చలు జరిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రమే సీపీఎం పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని ఆ పార్టీ నేతలను కోరారు. రోడ్ షోలు, కులసంఘాల సమ్మేళనాలు.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరీశ్రావు పలు చోట్ల రోడ్షోలు, కుల సంఘాల నేతల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం హద్నూర్లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఐదు నెలల్లోనే విఫలమైన తీరును వివరించారు. ఎస్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంత్రి గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఎరుకల కులస్తులతోనూ ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఈనెల 23న జహీరాబాద్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి నర్సాపూర్లో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగసభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం పటాన్చెరులోని ఇస్నాపూర్ సభకు చేరుకొని సభనుద్దేశించి మాట్లాడారు. ఇలా గురువారం రోజంతా సంగారెడ్డి జిల్లాలోనే గడిపారు. మల్లేశ్తో ముచ్చటించిన మంత్రి.. హద్నూర్లో పర్యటించిన హరీశ్రావు కర్నాటక రాష్ట్రంతో బంధుత్వం ఉన్న మల్లేశ్ అనే వ్యక్తితో ముచ్చటించారు. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్న మల్లేశ్ కర్నాటకలోని పరిస్థితులను మంత్రితో తెలిపారు. -
కేసీఆర్ సభ ఇలా..
మెదక్ కలెక్టరేట్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మెదక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన సైడ్ లెట్స్.. ● సాయంత్రం 4.41 గంటలకు సీఎం కేసీఆర్ హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యింది. ● 4.50 గంటలకు సీఎం క్యారీవ్యాన్ ద్వారా సభ స్టేజీపైకి చేరుకున్నారు. ● 4.56 గంటలకు ప్రసంగం ప్రారంభించి 5.13 గంటల వరకు మాట్లాడారు. ● సాయంత్రం 5.35 గంటలకు హెలీప్యాడ్ ద్వారా మెదక్ నుంచి కేసీఆర్ బయల్దేరి వెళ్లిపోయారు. ● సీఎం మాట్లాడుతున్న సమయంలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ● మైక్ స్టాండ్లు, లైట్ స్టాండ్లు, రోడ్ డివైడర్, భవనాలపై నిలబడి ప్రజలు ఆసక్తిగా విన్నారు. ● ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ● మిలట్రీ పోలీస్, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ● సభకు తరలివచ్చిన వాహనాలకు సీఎస్ఐ చర్చి ముందు, వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. -
సీఎం కేసీఆర్ పుట్టిపెరిగింది ఇక్కడే..
దుబ్బాకటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది దుబ్బాక. విప్లవోద్యమాలకు .. తెలంగాణ ఉద్యమానికి కీలకభూమిక పోషించింది.. ఒకే నియోజకవర్గం నుంచి 4 నక్సలైట్ దళాలు (దుబ్బాక, ఇందుప్రియాల్, గిరాయిపల్లి పీపుల్స్వార్ దళాలు, జనశక్తి కూడవెల్లి దళం) కార్యకలాపాలు సాగించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాగే, సీఎం కేసీఆర్కు విద్యాబద్ధులు నేర్పిన గడ్డ, తెలంగాణ ఉద్యమంలోనూ వందలాది కేసులతో జైలు జీవితాలు అనుభవించిన వారితోపాటు పదుల సంఖ్యలో అమరులైన పోరాటాల గడ్డగా దుబ్బాకను చెప్పవచ్చు. నియోజకవర్గంలోని తొగుట మండలంలో నిర్మించిన కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్తో పదికిపైగా నివాస గ్రామాల ప్రజలు తరతరాల నుంచి ఉన్న ఊళ్లూ, పుట్టిపెరిగిన ఇళ్లు, భూములను వదిలి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ► సీఎం కేసీఆర్ విద్యాబుద్ధులు ఇక్కడే.. సీఎం కేసీఆర్ ఓనమాలు నేర్చింది దుబ్బాకలోనే. దుబ్బాకకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న (ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న చింతమడక) నుంచి తన సోదరితో కాలినడకన నడుచుకుంటూ వచ్చి చదువుకున్నారు. దుబ్బాకలోనే 3 నుంచి 10 వ తరగతి చదువుకున్నారు. దుబ్బాకలో కేసీఆర్కు చదువుచెప్పిన గురువులతోపాటు తనతోపాటు చదువుకున్న మిత్రులను ఇప్పటికీ పేరుపెట్టి పిలుస్తుంటారు. తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో రూ.12 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరి చేయించి అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మించారు. ► ఉపఎన్నికల్లో రఘునందన్రావు గెలుపు.. అనారోగ్యంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో 2020లో దుబ్బాకలో ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్రావు గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. దుబ్బాక ఫలితంలో రాజకీయంగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ► నక్సలైట్, జర్నలిస్టు నుంచి.. నక్సలైట్గా.. జర్నలిస్టు స్థాయి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి. చిట్టాపూర్కు చెందిన రామలింగారెడ్డి దుబ్బాకలో ఇంటర్ చదువుకుంటున్న కాలంలోనే విప్లవోద్యమాల బాట పట్టి రాడికల్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడితోపాటు పలు స్థాయిల్లో పనిచేయడంతోపాటు పీపుల్స్వార్ కేంద్ర, రాష్ట్ర కమిటీలోని చాలామంది నేతలతో సంబంధాలు నడిపాడు. జర్నలిస్టుగా 20 ఏళ్లు పని చేశారు. ► ఎంపీ ప్రభాకర్రెడ్డిపై దాడి.. ఎన్నికల ప్రచారంలో తాజాగా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఎంపీపై దాడి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ దుమారం లేపింది. ప్రతిపక్ష పార్టీలు ఎంపీపై పథకం ప్రకారమే దాడి చేయించారంటూ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ ఘటన ప్రస్తుత ఎన్నికల సమయంలో జరగడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలకు దుబ్బాక నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది. -
'పార్ట్ టైం జాబ్' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్కు వచ్చింది. దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్లో చూపిస్తూ వచ్చాడు. చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం! -
తల్లి లేకుండానే అంత్యక్రియలు
మెదక్ మున్సిపాలిటీ : దీపావళి ప్రతీ ఇంట్లో వెలుగులు తెస్తే.. ఆ కుటుంబంలోకి మాత్రం చీకటి తెచ్చింది. పండుగ రోజు టపాసులు కొనేందుకు తల్లి, ఇద్దరు కుమారులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు టైర్ కిందపడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి చెందిన అన్నపూర్ణ మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్నారు. మెదక్లోని కేజీబీవీలో టీచర్గా పని చేస్తూ పృథ్వీ తేజ్ (9), ప్రణయ్ తేజ్ (12) చదివించుకుంటూ జీవిస్తోంది. దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనడానికి కుమారులతో కలిసి వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు స్కూటీపై వెళ్తున్నది. మార్గమధ్యలో గోల్కొండ వీధిలో ప్రధాన రోడ్డుపై స్కూటీని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రోడ్డు పక్కన పడింది. కుమారులు టిప్పర్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. కళ్ల ముందే వారు చనిపోవడం చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం గ్రామానికి పంపించారు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి లేకుండానే అంత్యక్రియలు టేక్మాల్(మెదక్): మెదక్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు చిన్నారుల అంత్య క్రియలు స్వగ్రామమైన కాద్లూర్లో తల్లి లేకుండానే జరిగాయి. కళ్ల ముందే ఇద్దరు కొడుకులు చనిపోవడం చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లడంతో సంగారెడ్డిలోని పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందు తోంది. దీపావళి పండుగ రోజే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కాద్లూర్ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ప్రణయ్తేజ్ (12) మెదక్ గీతా పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, పృఽథ్వీ తేజ్ (9) తుప్రాన్ గీతా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. -
హ్యాట్రిక్ కోసం ఒకరు.. మొదటిసారిగా గెలుపే లక్ష్యంగా మరో ఇద్దరు
హుస్నాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించి, కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒడితెల కుటుంబం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్కుమార్ మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఈసారి గెలిచి అసెంబ్లీలో తన గళం విప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు వారసుడిగా మొదటిసారి ఎమ్మెల్యేగా బోణి కొట్టి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో హుస్నాబా ద్లో ప్రధాన పార్టీల త్రిముఖ పోరుతో రాజకీయం రసవత్తంగా మారింది. ఇందుర్తి నుంచి మొదలుకొని పునర్విభజనలో హుస్నాబాద్గా మారిన నియోజకవర్గంలోని ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. రెండుసార్లు పీడీఎఫ్, ఆరు సార్లు సీపీఐ, మూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించాయి. తెలంగాణ సాధన అనంతరం బీఆర్ఎస్(టీఆర్ఎస్) వరుసగా విజయాన్ని దక్కించుకున్నాయి.ఈసారి ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారడంతో ఎవరు గెలుస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తాయి ఒడితెల సతీష్కుమార్ 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు సెంట్మెంట్గా హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. అదే జోష్ను కొనసాగిస్తూ ఇప్పటికే సగం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. పదేళ్లకాలంలో తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 2018లో సతీష్కుమార్ దాదాపు 73 వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి లక్ష మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు నడుస్తున్నారు. ఉద్యమకారుడిగా ప్రజల్లోకి... హుస్నాబాద్ నుంచి మొదటిసారిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా పని చేసిన అనుభవం, రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా తెలంగాణ బిడ్డగా తన గళాన్ని వినిపించి పేపర్ స్ప్రేకు గురై తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో హుస్నాబాద్ సీటును కాంగ్రెస్కు కేటాయించిన విషయం విధితమే. సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టికెట్ ఆశించి అలకబూనిన అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిని అధిష్టానంతో మాట్లాడించి మచ్చిక చేసుకున్న పొన్నం ప్రభాకర్ ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. మోదీ పథకాలే గట్టెక్కిస్తాయి హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. శ్రీరాంచక్రవర్తి తండ్రి బొమ్మ వెంకటేశ్వర్లు 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బొమ్మ వెంకటేశ్వర్లు వారసుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, అయనకు ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని ముందుకు సాగుతున్నారు. తండ్రి తర్వాత కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటాలు చేశారు. కాంగ్రెస్ని అంటిపెట్టుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తదనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రోద్బలంతో శ్రీరాంచక్రవర్తి బీజేపీలో చేరారు. పార్టీ టికెట్ రావడంతో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధాని మోదీ పథకాలు, అభివృద్ధి పనులను జనంలోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు. -
క్రీడలు విద్యార్థుల జీవితాల్లో అంతర్భాగం కావాలని
సిద్దిపేటఎడ్యుకేషన్: క్రీడలు విద్యార్థుల జీవితాల్లో అంతర్భాగం కావాలని, చదువుతోపాటు క్రీడల్లో ముందుంటే శారీరక, మానసిక దృఢత్వం ఉంటుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమినర్, భూపరిపాలన, స్టాంప్లు, రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ నవీన్మిట్టల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్ –19 (ఎస్జీఎఫ్) జూనియర్ కళాశాలల ఫెడరేషన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, గెలిచిన వారిని చూసి అసూయ పడకుండా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ మాట్లాడుతూ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని స్విమ్మింగ్ ఫూల్ ను వినియోగించుకొని మెళకువలు నేర్చుకోవా లన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్(టీజీఎల్ఏ)రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం మాట్లాడుతూ.. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి అండర్ –19 క్రీడలను ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన ఘనత సిద్దిపేటకే దక్కిందన్నారు. అలాగే, జిల్లా ఇంటర్ విద్యాధికారి, అండర్ –19 క్రీడల చైర్మన్ సూర్యప్రకాశ్, కార్యదర్శి సమ్మయ్య, డీవైఎస్ఓ నాగేందర్, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచంగారి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సత్యనారాయణరెడ్డి, శారద, సురేష్రెడ్డి, భూపాల్రాజు, బు చ్చిరెడ్డి, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్రెడ్డి, క్రీడా పోటీల ఇన్చార్జి వెంకటేశ్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆఖరి రోజు అనూహ్య పరిణామాలు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల చివరి రోజు శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పలుచోట్ల అభ్యర్థులను మార్చడం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ను అధిష్టానం రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ సురేష్షెట్కార్కు ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్రంగానైనా బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో అధినాయకత్వం రంగంలోకి దిగి.. షెట్కార్, సంజీవరెడ్డిలతో చర్చించి సయోధ్య కుదిర్చింది. షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డికి బీ–ఫారం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో సంజీవరెడ్డి గెలుపు కోసం కలిసి పనిచేస్తామని షెట్కార్ వర్గం ప్రకటించింది. ఈ మేరకు ఇరువర్గాల నేతలంతా కలిసి సంజీవరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం టికెట్ అనూహ్యంగా కాటా శ్రీనివాస్గౌడ్కు దక్కడంతో నీలం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో తన గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నీలం మధుకు తొలుత కాంగ్రెస్ అభ్యర్థిత్వం ప్రకటించిన విషయం విదితమే. నామినేషన్ వేసిన ఇద్దరు! చివరి నిమిషంలో బీజేపీ బీ–ఫారం దక్కకపోవడంతో రాజేశ్వర్రావు దేశ్పాండే శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను బరిలో నిలుస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు బీజేపీ బీఫారం దక్కిన పులిమామిడి రాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గురువారమే ఒక సెట్ నామినేషన్ వేసిన రాజు, శుక్రవారం బీజేపీ బీ–ఫారంతో మరోసెట్ నామినేషన్ వేశారు. సంగారెడ్డి బీజేపీ టికెట్ బిగ్ ట్విస్ట్.. సంగారెడ్డి బీజేపీ టికెట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ టికెట్ను ఆ పార్టీ నాయకుడు పులిమామిడి రాజుకు కేటాయించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నాయకత్వం ఆయనకు గురువారం రాత్రి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. తీరా శుక్రవారం ఉదయం విడుదల చేసిన తుది జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్రావు దేశ్పాండే పేరును ప్రకటించింది. కానీ బీ–ఫారం మాత్రం రాజుకు ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ్పాండే.. స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద విలపించారు. తనకు టికెట్ను ఎందుకు ప్రకటించారు..? ఎందుకు మార్చారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫోన్ చేసి ప్రశ్నించారు. ఐదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తనను అవమానించారంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేశ్పాండే అనుచరులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. బీ–ఫారంతో నామినేషన్ వేసేందకు అటువైపు వెళుతున్న బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇవి చదవండి: ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్రావు -
ఉల్లి.. ఘాటెక్కింది మళ్లీ..!
సదాశివపేట (సంగారెడ్డి): కోస్తుంటేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. ఇప్పుడు కొంటుంటే ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరిగ్గా దసరా పండుగకు ఇరవై రోజుల క్రితం సదాశివపేట పట్టణ వీధుల్లో వాహనాల్లో ఉల్లిగడ్డ తీసుకొచ్చి వందకు ఆరు, పదు కిలోల చొప్పున విక్రయించారు. రిటైల్గా రూ 20 కిలో చొప్పున అమ్మారు. దసరా పండుగకు ముందు అమాంతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు, హోటళ్లు, తినుబండారాలు, ఆహారాల దుకాణాల వారు ఉల్లిధర పెరగడంతో వాటి వినియోగాన్ని తగ్గించారు, సదాశివపేటకు వచ్చిన గ్రామీణులు ఉల్లిధర విని అమ్మో అంటున్నారు, మరో నెల రోజుల తర్వాత గాని ఉల్లిధరలు తగ్గుముఖం పట్టదని డీలర్లు పేర్కొంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే ధరలో దాదాపు 50 శాతం పెరిగింది. జూలైలో రూ.20 ఉండగా అక్టోబర్, నవంబర్లో 50 నుంచి 80కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 50 శాతం పెరిగాయి, మహారాష్ట్రంలోని హోల్సెల్ ఽమార్కెట్లో కూడా ఉల్లిధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లి దిగుమతి అవుతుంటాయి. గత వానా కాలం సీజన్లో ఆయా రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2,596 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది, మునిపల్లి, జహిరాబాద్ తదితర మండలాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అత్యదికంగా వెయ్యి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, సదాశివపేట మండలం అరూర్, నందికంది, పెద్దాపూర్తో పాటు కొండాపూర్ మండలం గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్సాన్పల్లి, మల్లేపల్లి, అనంతసాగర్, మారేపల్లి, గంగారం, గ్రామాల్లో ఉల్లి సాగుచేస్తారు. సాధారణంగా ఉల్లిని అధిక భాగం దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాల్లో సాగవుతుంది, అయితే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో రుతుపవనాలు అలస్యంగా రావడం, వచ్చిన అసమానంగా ఉండటం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఉల్లిధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కొరుతున్నారు. -
బీఆర్ఎస్కు తప్పిన రెబల్ బెడద
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టికెట్ల కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడిన ఆశావహులు తగ్గేదేలే అంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు దీటుగా నామినేషన్లు వేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల్లో ఈ పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్షెట్కార్, డాక్టర్ సంజీవరెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, చివరకు అధిష్టానం షెట్కార్ వైపు మొగ్గు చూపింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సంజీవరెడ్డి. తన ముఖ్య అనుచరులతో సమావేశమై బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ దక్కిన షెట్కార్ కూడా నామినేషన్ వేశారు. నర్సాపూర్లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు నామినేషన్ వేయడం రసవత్తరంగా మారింది. ఈ టికెట్ ఆవుల రాజిరెడ్డికి దక్కగా ఆయన నామినేషన్ వేశారు. ఈ అభ్యర్థిత్వం కోసం గాలి అనిల్కుమార్ కూడా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. బుధవారం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆవుల రాజిరెడ్డికి ఇచ్చిన బీ–ఫారం రద్దు చేసి, తనకు సీ–ఫారం ఇస్తుందని గాలి అనిల్కుమార్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్కు తప్పిన రెబల్ బెడద బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థుల కిరికిరి లేకుండా చూసుకుంది. ఉమ్మడి జిల్లాలో పలు స్థానాలకు ఇద్దరు, ముగ్గురు బీఆర్ఎస్ టిక్కెట్లు ఆశించారు. పలుచోట్ల టిక్కెట్లు దక్కని నేతలు తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ తదితర చోట్ల అసమ్మతి రాగం ఆలపించిన నేతలందరిని ఆ పార్టీ అధినాయకత్వం ఆదిలోనే బుజ్జగించింది. రెండు నెలల క్రితమే టికెట్లను ప్రకటించిన గులాబీ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ తేదీ వరకు ఎక్కడా అసమ్మతి లేకుండా జాగ్రత్త పడింది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి కూడా ప్రత్యర్థి పార్టీల్లో అసమ్మతి సెగలు రగులుతుంటే బీఆర్ఎస్లో మాత్రం ఆయా చోట్ల ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. బుజ్జగింపులకు లొంగుతారా? కాంగ్రెస్, బీజేపీల టికెట్లు దక్కనప్పటికీ నామినేషన్లు వేసిన అసమ్మతి నేతలు చివరి వరకు బరిలో ఉంటారా? లేక ఆయా పార్టీల అధినాయకత్వం బుజ్జగింపులకు లొంగుతారా? అనే తేలాల్సి ఉంది. కాంగ్రెస్లోని అసమ్మతి నేతలను ఆ పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ రెబల్ అభ్యర్థులు చివరి వరకు పోటీలో కొనసాగుతారా? లేక తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా? అనేది నామినేషన్ల ఉపసహరణ 15వ తేదీన తేలనుంది. న్యూస్రీల్ తగ్గేదేలే.! టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు నామినేషన్ వేసిన కాంగ్రెస్, బీజేపీ అసమ్మతి నేతలు ఉత్కంఠగా మారిన అధిష్టానాల నిర్ణయం రెబల్స్ లేకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు బీజేపీలోనూ ఇదే తీరు ఒకటీ రెండు స్థానాల్లో బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. సంగారెడ్డి టికెట్ను ఆశించిన రాజేశ్వర్రావు దేశ్పాండే, పులిమామిడి రాజు ఇద్దరూ గురువారం నామినేషన్లు వేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ టికెట్పై అధినాయకత్వం ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయినప్పటికీ ఇద్దరూ బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారగా, బీ–ఫారం ఎవరికి దక్కుతుందోనని కమలం పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. -
‘కాటా’ కే కాంగ్రెస్ టికెట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ టికెట్ను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్కు కేటాయిస్తూ హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ఈ టికెట్ను నీలం మధు ముదిరాజ్కు ప్రకటించిన విషయం విదితమే. కానీ, ఆయనకు బీ ఫారం ఇవ్వలేదు. ఏఐసీసీ ఆదేశాల మేరకు బీ ఫారాన్ని పెండింగ్లో పెట్టినట్లు నీలం మధుకు పీసీసీ నాయకత్వం పేర్కొంది. మరోవైపు నీలం మధుకు టికెట్ ప్రకటించడం పట్ల కాటా శ్రీనివాస్గౌడ్ వర్గం భగ్గుమంది. ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీభవన్ను రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ప్రకటించిన తుది జాబితాలో నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్గౌడ్కు కేటాయిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. చక్రం తిప్పిన దామోదరం పటాన్చెరు టికెట్ను తన అనుచరుడు కాటా శ్రీనివాస్గౌడ్కు ఇప్పించేలా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చక్రం తిప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందుగా ఈ టికెట్ను నీలంమధుకు ప్రకటించడం పట్ల దామోదర అధిష్టానంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరిగి కాటాకే ప్రకటించేలా దామోదర ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, కాటాకు టికెట్ కేటాయించడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు జరిపారు. పేరు: కాటా శ్రీనివాస్గౌడ్ జననం: 13 డిసెంబర్, 1980 తండ్రి: దివంగత దర్శన్గౌడ్ భార్య పేరు: కాటా సుధారాణి (జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు) సంతానం: ఇద్దరు పిల్లలు రాజకీయ జీవితం 2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2018 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 78,775 ఓట్లు పొంది రెండో స్థానంలో నిలిచారు. -
షెట్కార్.. బీఫామ్
పరిశ్రమలకు స్వర్గధామం.. పరిశ్రమలకు స్వర్గధామంగా పటాన్చెరు నియోజకవర్గమని బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డి అన్నారు. వివరాలు 11లో u షెట్కార్.. బీఫామ్ అందుకున్న కుమార్తె నారాయణఖేడ్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సురేశ్ షెట్కార్ బీఫామ్ను ఆయన కుమార్తె గిరిజా షెట్కార్ అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే అందజేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జి రోహిత్ చౌదరి, పీసీసీ సభ్యుడు కర్నె శ్రీనివాస్, నాయకులు అభిషేక్, శివరావు షెట్కార్, మన్సూర్ అలీఖాన్, సూరజ్ తివారీ పాల్గొన్నారు. జనతా కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రహీంకు బీఫామ్ నారాయణఖేడ్: జనతా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మోహతాబ్రాయ్.. ఖేడ్ టికెట్ను అబ్దుల్ రహీంకు ఖరారు చేశారు. ఆయన నాగల్గిద్ద మండలం ఏస్గి గ్రామానికి చెందిన వ్యక్తి. కాగా మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఫామ్ను రాయ్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్, రాష్ట్ర, స్థానిక నాయకులు పండరి, తయ్యబ్, అరుణ, దుల్బానాయక్, మన్సూర్ పాషా పాల్గొన్నారు. -
తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..
సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు మరునాడు కాలువలో శవమై తేలిన ఘటన మండల పరిధిలోని దాతర్పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయిని యాదగిరి–వాణి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరి పెద్దకొడుకు చరణ్(11) రిమ్మనగూడలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం తల్లిని డబ్బులు అడగడంతో చరణ్ను మందలించింది. దీంతో అతను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో చరణ్ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలువ వద్దకు వెళ్లిన పిల్లవాడు ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్లో రాసి.. -
దొరల రాజ్యాన్ని తరిమికొడదాం
పాపన్నపేట(మెదక్): పోలింగ్ బూత్లో టెండర్ ఓటు, చాలెంజ్ ఓట్ల గురించి మాట్లాడుకుంటుంటే వింటుంటాం. అసలు వీటి గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. తమ ఓటు గల్లంతయ్యిదని ఫిర్యాదు చేసే వ్యక్తుల కోసం ఎన్నికల సంఘం ’టెండర్ ఓటు’ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఓటరు ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలలోని సెక్షన్ 42 ప్రకారం ’టెండర్ ఓటు’ ఏర్పాటు చేశారు. మీరు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లినప్పుడు.. అప్పటికే మీ ఓటు ఎవరైనా వేస్తే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారి పరిశీలించి మీ గుర్తింపును ధ్రువీకరిస్తారు. దీని తర్వాత మీరు టెండర్ ఓటును డిమాండ్ చేయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఈవీఎం ద్వారా ఓటు వేయలేరు. బ్యాలెట్ సాయంతోనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. చాలెంజ్ ఓటు.. ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్లో చాలెంజ్ ఓటుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా అక్రమ ఓటర్లను అడ్డుకోవచ్చు. ఎన్నికల ఏజెంట్లు ఈ చాలెంజ్ ఓటును ఉపయోగించుకుంటారు. దీని కోసం రూ.2 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వచ్చినప్పుడు, అతను నకిలీ ఓటర్ అని ఏజెంట్ అనుమానించినప్పుడు చాలెంజ్ ఓటు ఉపయోగపడుతుంది. పోలింగ్ ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారి ఎదుట చాలెంజ్ ఓటు వేస్తాడు. రూ.2 రుసుం కూడా చెల్లిస్తాడు. అప్పుడు ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ అధికారికి అతను సరైన ఓటరు కాదని తెలియజేస్తాడు. దీంతో ప్రిసైడింగ్ అధికారి ఓటరు దగ్గరున్న పత్రాలను తనిఖీ చేసి, అవి సరిగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్ చెప్పినది నిజమని స్పష్టమైతే ఓటరును ఓటు వేయకుండా అడ్డుకుంటారు. దొరల రాజ్యాన్ని తరిమికొడదాం దుబ్బాక: దొరల, రెడ్డిల పాలనతో దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి వెంకట ప్రసన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ కోరారు. సోమవారం ఆయన పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో అణగారిన కులాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పార్టీ ఎన్నికల్లో ముందుకు సాగుతుందన్నారు. అవినీతి ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు. -
ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే!
సాక్షి, మెదక్/సంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా గతంలో ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. కొంత కాలంగా అభ్యర్థులపై తమ అయిష్టతను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ‘‘నోటా’’ ఆప్షన్ను జత చేసింది. దీంతో ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉపేందర్రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి దూడ యాదేశ్వర్, జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. వారిలో పద్మాదేవేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఉపేందర్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాగా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య డిపాజిట్ కోల్పోయారు. ఇక మిగతా వారి సంగతి అంతంత మాత్రమే. ఈ ఎన్నికల్లో 899 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 1,68,911 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 2263 మంది నోటాకు ఓటేసి అభ్యర్థులపై తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ శాఖల ద్వారా అత్యవసర సేవలు అందించే అధికారులకు కేటాయించే 899 పోస్టల్ బ్యాలెట్లలో 49 ఓట్లు చెల్లకుండా పోగా, 3 ఓట్లు నోటాకు పడడం గమనార్హం. ఇప్పటికీ ‘‘నోటా’’ అనే మీట ఉందనే విషయం చాలా మంది ఓటర్లకు తెలియదు. అందువల్లే నోటాకు ఓట్లు తక్కువగా పడుతున్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును నోటాకు కాకుండా సరైన నాయకుడికి వేసి అభివృద్ధికి దోహద పడాలని మేధావులు సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: మాటకు మాట! దూషణల పర్వంగా ప్రచారం!! -
అన్ని చోట్ల ప్రకటన కానీ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీ టికెట్పై ఉత్కంఠ వీడటం లేదు. నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజులే గడువున్నప్పటికీ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు పోటీ పడుతున్న ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ నాయకులు రాజేశ్వర్రావు దేశ్పాండే, పులిమామిడిరాజులిద్దరూ ఆశిస్తున్నారు. బండి సంజయ్ ఆశీస్సులతో ఒకరు, ఈటల రాజేందర్ సపోర్టుతో మరొకరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై కమలం శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ టికెట్ రేసులో పార్టీ నాయకులు శివరాజ్పాటిల్ కూడా ఉండేవారు. ఇటీవల ఆయన పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. దీంతో దేశ్పాండే, పులిమామిడిరాజు మధ్య పోటీ నెలకొంది. జిల్లాలో బీజేపీకి కొంత పట్టున్న నియోజకవర్గాల్లో సంగారెడ్డి ఒకటి. గతంలో ఈ స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకుంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాలను సైతం గెలుచుకుంది. నియోజకవర్గంలో పలు మండలాల్లోనూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా టికెట్ ఖరారు చేసేందుకు జాప్యం జరుగుతుండటం కూడా పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. అన్ని చోట్ల ప్రకటన కానీ.. జిల్లాలో ఒక స్థానానికి తప్ప మిగతా వాటికి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి, మూడో జాబితాల్లో జిల్లాలోని పటాన్చెరు,ఖేడ్, అందోల్, జహీరాబాద్ టికెట్లను ఖరారు చేసింది. కానీ సంగారెడ్డి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రచారంలో వెనుకంజ.. సంగారెడ్డి నియోజకవర్గం టికెట్ల ఖరారు విషయమై జాప్యం జరుగుతుండగా బీజేపీ ప్రచారంలో కాస్త వెనుకబడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికేబీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను రెండు, మూడు సార్లు చుట్టేశారు. అన్ని కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహించారు. ప్రత్యార్థి పార్టీల్లోని కీలక నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకోవడం మరింత పకడ్బందీగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీ య అధ్యక్షుడు ఖర్గే సమావేశాన్ని సంగారెడ్డిలో నిర్వహించారు. ఒక్క బీజేపీ మాత్రం ఇంకా టికెట్ ఖరారు కాకపోవడంతో ప్రచారం ముందుకు వెళ్లలేకపోతోంది. న్యూస్రీల్ బీజేపీ సంగారెడ్డి టికెట్పై కొనసాగుతున్న ఉత్కంఠ నేడో, రేపో తుదిజాబితా ప్రకటన నేడో, రేపో ప్రకటన రాష్ట్రంలో బీజేపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా మంగళ, బుధవారం కానీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి కేటాయించే నియోజకవర్గాల విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత రాగా తుదిజాబితా ప్రకటనకు మార్గం సుగమమైందనే అభిప్రాయం పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. -
నారాయణఖేడ్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలయ్యేలా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాయకులు ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించనుంది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రచారాలకు దూరంగా ఉండాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనడం నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. జిల్లాలో ఉద్యోగుల ప్రవర్తన తీరు గురించి అక్కడక్కడ వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. -
నామినేషన్ల దాఖలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొన్ని అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ వీడటం లేదు. నామినేషన్లకు గడువు దగ్గరకొస్తున్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ టికెట్లు ఖరారు కావడం లేదు. జిల్లాలో సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు టికెట్లు ఖరారయ్యాయి. పటాన్చెరు, నారాయణఖేడ్ స్థానాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. వీటిని ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఖేడ్లో పీసీసీ ఉపాధ్యక్షులిద్దరూ సురేష్ షెట్కార్, డాక్టర్ సంజీవరెడ్డి.. పట్టు వీడటం లేదు. ఇటు పటాన్చెరు విషయంలోనూ ఇంతే. ఇటీవల ఆ పార్టీలో చేరిన నీలం మధు, కాటా శ్రీనివాస్గౌడ్ల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు చోట్ల పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తేలాల్సి ఉంది. కాగా ఆశావహులు ఢిల్లీలోనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. నామినేషన్ల దాఖలు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రెండు టికెట్లపై స్పష్టత రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం ఉంది. కాగా బీఆర్ఎస్ మాత్రం సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించింది. ఇప్పటికే వారు రెండు, మూడు దఫాలు నియోజకవర్గాలను చుట్టేశారు. కానీ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో ఎప్పుడు ప్రచారం చేయాలో? ఓటర్లను ఎప్పుడు కలువాలో? తెలియని పరిస్థితి నెలకొందనే కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేడో, రేపో ప్రకటన ఒకట్రెండు రోజుల్లో పటాన్చెరు, నారాయణఖేడ్ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి వదిలేశారని తెలుస్తోంది. న్యూస్రీల్ తేలని ఖేడ్, పటాన్చెరు టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ ఇప్పటికే మొదలైన నామినేషన్లు -
కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!
సాక్షి, సంగారెడ్డి/పటాన్చెరు: ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహమ్మద్ సయిద్(20), నుమాన్ అలీ(19), హసీం, మజిద్, ఫైజల్ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం! -
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
కొండపాక(గజ్వేల్): కుటుంబ పాలనకు చరమ గీతం పాడుదామని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని లకు డారం, ఎర్రవల్లి, బొబ్బాయిపల్లి, కొండపాక, తిప్పారం, బందారం, సింగారం, చిన్న కిష్టాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెందిన 250 మంది యువత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. తనను గెలిపిస్తే గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మన్నెం శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ -
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్
తొగుట(దుబ్బాక): సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట మదిర సయ్యద్ నగర్ మైనారిటీ నాయకులు ఆదివారం హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి సోనియమ్మ రుణం తీర్చుకుందామని కోరారు. దుబ్బాకలో మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. తనను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిద్దిపేట, గజ్వేల్కు దీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్వామి, నరేందర్రెడ్డి, నర్సింలుగౌడ్, రవీందర్, నిరంజన్, భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
కులం పేరుతో వస్తే ఓట్లు వేయొద్దని
నర్సాపూర్ రూరల్: కులం పేరుతో వస్తే ఓట్లు వేయొద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నాగులపల్లి, మూసాపేట గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచులు సేనాధిపతి, లావణ్య రవి, జీవన్ రెడ్డి, శ్రీధర్ గుప్తా, శేఖర్, జితేందర్ రెడ్డి, బిక్షపతి, రఘువీర్, బలరాం రెడ్డి, అన్నము రవి, మేఘమాల పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నచింతకుంట, పెద్దచింతకుంట గ్రామాల్లో ఆదివారం రాత్రి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, సర్పంచ్ లు సురేష్ గౌడ్, శివకుమార్, మురళి గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్లో.. నువ్వా.. నేనా!?
సాక్షి, సంగారెడ్డి: 'సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్లో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.' – గజ్వేల్ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే గజ్వేల్ ఎన్నో విశేషాలకు నెలవు. ప్రత్యేకించి 1952లో జరిగిన ఎన్నికల్లో మిగితా 15సార్లు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనవాయితీగా వస్తుంది. ఇదే ‘సెంటిమెంట్’ను నమ్ముకొని సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా తిరిగే అవసరమున్నా దృష్ట్యా ఆయన ప్రచార బాధ్యతలను పార్టీ యంత్రాంగమే చేపడుతోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జులుగా మంత్రి హరీశ్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు వ్యవహరిస్తుండగా...సమన్వయ కమిటీ సభ్యులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కేసీఆర్ ప్రాతినిథ్యం ఫలితంగా పదేళ్లలో నియోజకవర్గంలో వచ్చిన మార్పును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలతో పాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రింగురోడ్డు, ఎడ్యుకేషన్ హబ్వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్ట్లే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల మార్పును సైతం ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్షోలు, నృత్యాలతో ఆ పార్టీ నేతలు ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి వంటేరు ప్రతాప్రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట ‘గులాబీ జెండాలే రామక్క’ పాటపై మహిళలతో కలిసి నృత్యం చేస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. బీజేపీ సైతం గట్టిగానే కదన రంగంలోకి దిగింది. ఈ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం వేగం పెంచారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇతర ప్యాకేజీల పంపిణీలో నెలకొన్న జాప్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకర్గంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరిగిందని చెబుతూ...పేదలకు చెందిన వేలాది ఎకరాల భూములను లాక్కొని రోడ్డున పడేశారని ప్రచారం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి బయట పడాలంటే బీజేపీ గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సైతం సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పార్టీ తూంకుంట నర్సారెడ్డి తానూ 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రజలందరికీ 24గంటలు అందుబాటులో ఉన్నానని, కానీ కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు కనీసం దర్శనం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోడని, స్థానికులు సమస్యల పరిష్కారానికి కలవడానికి ప్రయత్నించినా అది జరగదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ల్లో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి గజ్వేల్లో ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. నామినేషన్లు ముగిసిన తర్వాత ప్రచారం తీరు మరింత వేడెక్కె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: 'బండి సంజయ్' నామినేషన్ సందర్భంగా.. భారీ ర్యాలీ! -
అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు!
సాక్షి, మెదక్: రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోలు’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులయ్యారు. 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే స్థానిక ఎమ్మెల్యేలు గెలుపొందగా, మిగితా వాటిలో స్థానికేతరులు గెలుపొందారు. మొత్తంగా తొమ్మిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, బీఆర్ఎస్ రెండు సార్లు, ఒకసారి ఇంటిపెండింట్ గెలుపొందాయి. 1952 నుంచి 1967 వరకు జనరల్ క్యాటగిరీ ఉండగా, 1967 నుంచి అందోల్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మల్యాల రాజయ్య గెలుపొందగా ఆ ర్థిక, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. బాబూ మోహన్ 1998 ఉప ఎన్నిక , 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మూడుసార్లు గెలుపొంది. మార్కెట్, వ్యవసాయ, విద్య, ఉప ముఖ్యమంత్రి పదవులను పొందాడు. అలాగే, ఓపెన్ కేటగిరి సమయంలో జోగిపేటకు చెందిన వ్యక్తి వైశ్యుడైన బస్వ మాణయ్య స్థానిక మొదటి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత 14 సార్లు ఎన్నికలు జరుగగా స్థానికేతరులే గెలుపొందారు. 1967లో రిజర్వుడు తర్వాత స్థానికులకు పోటీ చేసేందుకు అవకాశాలు లభించలేదు. 2018 ఎన్నికల నాటికి స్థానిక నినాదం బలపడింది. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వట్పల్లి మండలంలోని పోతులబోగుడాకు చెందిన చంటి క్రాంతికిరణ్ విజయం సాధించడంతో రెండోసారి ఎమ్మెల్యే వ్యక్తి గెలిచారు. అందోలు ఎమ్మెల్యేలు.. 1952 వెంకట రాజేశ్వర జ్యోషి (కాంగ్రెస్) 1957 బస్వ మాణయ్య (స్వతంత్ర) 1962 ఎస్.లక్ష్మిదేవి (కాంగ్రెస్) 1967 రాజనర్సింహ (కాంగ్రెస్) 1972 రాజనర్సింహ (కాంగ్రెస్) 1978 రాజనర్సింహ (కాంగ్రెస్) 1983 హెచ్.లక్ష్మణ్ జీ (కాంగ్రెస్) 1985 మల్యాల రాజయ్య (టీడీపీ) 1989 దామోదర్ (కాంగ్రెస్) 1994 మల్యాల రాజయ్య (టీడీపీ) 1998 పి.బాబుమోహన్ (టీడీపీ) 1999 పి.బాబుమోహన్ (టీడీపీ) 2004 దామోదర (కాంగ్రెస్) 2009 దామోదర (కాంగ్రెస్) 2014 బాబుమోహన్ (టీఆర్ఎస్) 2018 చంటి క్రాంతికిరణ్ (టీఆర్ఎస్) ఇవి చదవండి: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్రావు -
శివుడి కటాక్షం ఉండాలప్పా..
●పూజ ఫలప్రదమవ్వాలి ●ఓటును వడసి పడదాం ●ఢీఎస్పీ అభ్యర్థి సైతం.. వట్పల్లి(అందోల్): నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంగప్పను ప్రకటించారు. శుక్రవారం మండల పరిధిలోని దుద్యాల సర్వేశ్వరపూరీ క్షేత్రంలో ఆయన పూజలు చేశారు సర్వేశ్వరపూరి క్షత్ర పీఠాధిపతి అంబికా శివయోగి మహరాజ్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలు పెరిగిపోవడంతో ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగు చెందుతున్నారన్నారు. ఝరాసంగం(జహీరాబాద్): బర్దీపూర్ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో బీజేపీ జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్ పూజలు చేశారు. అధిష్టానం టికెట్ కేటాయించగా.. శుక్రవారం మండల పరిధిలోని బర్దీపూర్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. జిన్నారం(పటాన్చెరు): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జిన్నారం మండలం గుమ్మడిదలలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ సురేందర్రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక హోటల్లో వడ తయారు చేశారు. హోటల్లో వడలు తయారు చేస్తున్న సురేందర్రెడ్డి తదితరులు నారాయణఖేడ్: నియోజకవర్గ ధర్మసమాజ్ పార్టీ (డీఎస్పీ) అభ్యర్థి అతిగే జీవన్ బీఫామ్ అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఉన్న పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారధన్ మహారాజ్ అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలంటే డీఎస్పీ అధికారంలోకి రావాల్సి ఉందని అన్నారు. -
తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్రావు
సాక్షి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి కావాలో అందరివాడుగా పేరొంది నిత్యం అందుబాటులో ఉంటున్న చింతా ప్రభాకర్ కావాలో నియోజకవర్గ ప్రజలు తెల్చుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి, జహీరాబాద్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎన్నికల బూత్ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గతంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగ్గారెడ్డి గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఐదు సార్లు అయినా సంగారెడ్డికి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నికల హామీల్లో గల్లికో ఏటీఎం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయారన్నారు. తిరిగి డ్రామాలు చేయడానికి కల్లబొల్లి మాటలతో వస్తాడు! జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ మౌనం వీడి, మొహమాటం పక్కన పెట్టి రంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కలిసి పోతారన్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభలో ఉన్న దాని కంటే ఎక్కువ మంది కేవలం ముఖ్యకార్యకర్తల ఈ మీటింగ్లోనే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని చెప్పిన ఆయనకు సంగారెడ్డి ప్రజల ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా.. రేవంత్ లాంటి రాంగ్ లీడర్లకు మద్దతు ఇవ్వొదని ఉద్ఘాటించారు. మూడోసారి సైతం కేసీఆర్ సీఎం అవుతారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ సైతం 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. నాయకులు బాగా పని చేయాలి! ఈసారి కార్యకర్తలు, నాయకులు బాగా పని చేసి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్న విశ్రాంతి లేకుండా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన మంచి నాయకుడన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతే గోసపడేది ప్రజలేనన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. బీజేపీ డకౌటయితే కాంగ్రెస్ ఇట్ వికెట్ గా నిలిచిపోతుందని చెప్పారు. సంగారెడ్డికి రూ. 570 కోట్లతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లతో సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజలే నా బలం నా బలగం అన్నారు. తామే అభ్యర్థిగా భావించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్రావు అన్నారు. పార్టీకి 75 పైగా సీట్లు వస్తాయని, అన్నీ సర్వేలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవి గెలిపించుకుని కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కట్ అవుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఇటీవల తాండూర్ సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారని, తెలంగాణలో 24 గంటల సరఫరా ఉందన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి.. రైతు బంధు బంద్ చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు అడ్డా కూలీలని, బీరుబిర్యానీలకు అమ్ముడుపోతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవమానపరిచారన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎంత గర్వమో ప్రజలు ఆలోచించాలన్నారు. సమావేశాల్లో ఎంపీ.బీబీపాటిల్, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్చైర్మన్ పట్నం మాణిక్యం, డీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, విజేందర్రెడ్డి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేవిప్రసాద్, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్! -
కేసీఆర్ పాలనలో ఉజ్వల భవిష్యత్
చిన్నకోడూరు(సిద్దిపేట): కేసీఆర్ పాలనలో ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. గురువారం మండల పరిధిలోని బ్రహీంనగర్లో తురక కాశ కులస్తులు, రామన్నపల్లి గ్రామస్తులు మంత్రి హరీశ్రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సిద్దిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మంత్రి హరీశ్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం, సర్పంచ్లు సుభాష్, ఉమేష్ చంద్ర, ఎంపీటీసీలు శ్రీనివాస్ పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ -
ఇంత దారుణంగా.. వివాహితను హత్య చేసిందెవరు?
సాక్షి, సంగారెడ్డి: వివాహిత హత్యకు గురైన సంఘటన గుమ్మడిదల మండలంలో ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ముడావత్ శివనాయక్, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది క్రితం వలసవచ్చి హైదరాబాద్లోని బాలానగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. అతను డ్రైవర్, ఆమె అడ్డా కూలీగా పనులు చేసుకుంటున్నారు. గత నెల 28న మంగమ్మ ఎప్పటిలాగే కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె అదృశ్యంపై భర్త బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం రాత్రి గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు శివనాయక్కు గుర్తించిన ఆ మహిళ మృతదేహం ఒక్కసారి చూడాలని సూచించారు. దానికి అతను అంగీకరించి అక్కడికి వెళ్లి పరిశీలించగా అది భార్య మృతదేహమేనని గుర్తుపట్టాడు. అయితే ఐదురోజుల క్రితం దుండగులు హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇవి చదవండి: 'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు? -
చెత్త కుప్పలో మృతశిశువు
జిన్నారం(పటాన్చెరు): ఏ తల్లీ తన కన్నపేగును తెంచుకోవాలనుకోదు. అయితే రెండు లేక మూడురోజుల శిశువు చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. ఈ హృదయ విదారకర ఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. కుక్కలు శరీరంలో కొంతవరకు తినివేయడం ప్రతిఒక్కరినీ కల్చి వేసింది. పోలీసుల కథనం ప్రకారం... గాంధీనగర్లోని చెత్తకుప్పలో పడేసిన ఒక బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తోంది. దానిని కుక్కలు నోటి ద్వారా కరుచుకొని బయటకు తెచ్చి శిశువుకు చెందిన కొంత భాగాన్ని తినేశాయి. పురిట్లోనే మృతిచెందిందా? లేదా హత్య కోణం ఏమైనా ఉన్నది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని సీఐ నయీమొద్దీన్ తెలిపారు. చెత్త కుప్పలో మృతశిశువు బొల్లారంలో ఘటన -
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
సాక్షి, సంగారెడ్డి: సరదాగా థార్ వాహనం తీసుకొని వెళ్లగా లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలో సోమవారం వేకువజాము చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎస్ఐ అసిఫ్ అలీ కథనం ప్రకారం.. చందానగర్ వాసి షేక్ యాహియా అలియాస్ అంఫాల్ (20), బోడపాటి ప్రణీత్ (23), సామెల్, సంధ్యాయల సాయికార్తీక్ కలిసి వాహనంలో అటువైపు నుంచి కంకోల్కు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వెహికల్ మద్దికుంట శివారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందున్న లారీ ఎడమ నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు దూసుకు వచ్చి ఢీకొంది. కాగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాహియా, ప్రణీత్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరికి సైతం తీవ్రగాయాలు కాగా హైదరాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మృతులు, సామెల్.. బీబీఏ, సంధ్యాయల సాయి కార్తీక్ బీటెక్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఇవి చదవండి: తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై.. -
కలెక్టరేట్ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి?
సాక్షి, సంగారెడ్డి: కలెక్టరేట్ ఉద్యోగి అనుమా నాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. మల్కాపూర్లో ఉన్న తెలంగాణ టౌన్ షిప్లో విష్ణు వర్ధన్ (45) నివాసం ఉంటున్నాడు. అడిషనల్ కలెక్టర్ మాధురి వద్ద సీసీగా అతను విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు నెలల క్రితం అతడి గుండెకు స్టంట్ వేయగా సెలవులో ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మల్కాపూర్ శివారులో అనుమానాస్పదంగా పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడని వినయ్ వివరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
TS Election 2023: 'అప్పుడు స్థాపన.. ఇప్పుడు అమ్మకం' : మల్లికార్జున ఖర్గే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అప్పుడు మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ ఈ ప్రాంతాభివృద్ధి కోసం బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వాటిని విక్రయిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో ఉన్న గంజి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం రెండు, మూడు వేలను భర్తీ చేసి మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నిరుద్యోగులు, రైతుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారన్నారు. బైక్ ర్యాలీ.. హెలిక్యాప్టర్లో సంగారెడ్డికి చేరుకున్న ఖర్గేను కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. స్థానిక తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజిమైదానం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభలో బీఆర్ఎస్కు చెందిన కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో పార్టీ జాతీయ నాయకులు మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వి.హన్మంతరావు, శ్రీధర్బాబు, జిల్లా నాయకులు, అనంతకృష్ణ, చెర్యాల ఆంజనేయులు, కూన సంతోష్ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నోటా (నన్ ఆఫ్ ది అబో) గురించి మీకు తెలుసా..!? -
నోటా (నన్ ఆఫ్ ది అబో) గురించి మీకు తెలుసా..!?
సాక్షి, మెదక్: నోటా (NOTA) ఈ పదం ఎక్కువగా ఎన్నికల సమయంలో వినపడుతూ ఉంటుంది. ఈవీఎం మిషన్లపై చివరగా ఉండే ఈ నోటా గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారు కొందరు దీనిని ఉపయోగిస్తారు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి.. నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైన వారు ఒక్కరూ కనిపించడం లేదని అనుకునే వారి కోసం ఈ ‘నోటా’ మీటను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత లేతదని గుర్తిస్తే ఈవీఎంలపై ఉన్న నోటా బటన్ను నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. దీనిని ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో నోటా బటన్ను నొక్కే వారి సంఖ్య ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూ వస్తుంది. నోటా (‘నన్ ఆఫ్ ది అబో) అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదని చెప్పేందుకు ఎన్నికల సంఘం దీనిని తీసుకొచ్చింది. పోలింగ్ శాతం పెంచడం, ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నోటాను ఎంచుకున్నారు. నోటా ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఎంతలా అంటే.. పలుచోట్ల అభ్యర్థుల తలరాతను మార్చేంతలా ఉంది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువ.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేలకు పైగానే ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు సూచనతో.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెలువరించింది. ఎప్పటి నుంచో ఉన్న తిరస్కరణ ఓటు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గర దీనికోసం 17–ఏ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని తెలుపుతూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఎన్నికల సంఘం నోటాను అమలు చేసింది. పెరుగుతున్న ఆదరణ.. 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో నోటాకు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు నోటా బటన్ను నొక్కేస్తున్నారు. 2014లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు 14,899 ఓట్లు పోలైతే, 2018లో 20,739 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. సిద్దిపేట నియోజవర్గంలో ఏడుగురు అభ్యర్థులకు, మెదక్లో 8 మంది, నారాయణఖేడ్లో 6, అందోల్లో 5, నర్సాపూర్లో 3, జహీరాబాద్లో 10, సంగారెడ్డిలో 10, పటాన్చెరులో 11, దుబ్బాకలో 11, గజ్వేల్లో 9, హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇవి చదవండి: 'కార్యకర్తలను కాపాడుకుంటా..' : మంత్రి హరీశ్రావు -
ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికపై బాలుడు లైంగిక దాడి!
సాక్షి, సంగారెడ్డి: బాలికపై బాలుడు అత్యాచారం చేసిన ఘటన దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్తే.. దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 16న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారం చేశాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పై పోలీసులను వివరణ కోరగా సదరు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
'మద్యం తాగొద్దన్నందుకు' కాదు.. కావాలనే ఇలా చేశారు!
సాక్షి, మెదక్: ఇంటి సమీపాన మద్యం తాగడం సరికాదని ఓ వ్యక్తి, ముగ్గురితో అన్నందుకు గాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. సీఐ నయీముద్దీన్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి వాసి అజీమ్(35) బొల్లారంలోని గాంధీ నగర్లో నివాసముంటూ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. ఇంటికి సమీపంలో ముగ్గురు మద్యం తాగడాన్ని గమనించాడు. రాత్రి సమయంలో ఇక్కడ మద్యం తాగడం సరైంది కాదని లక్ష్మణ్, విశాల్, మన్నూ కుమార్తో అజీమ్ దురుసుగా చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిపై ఉమ్మడిగా దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై మోదగా అక్కడికక్కడే అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని సమీపంలోకి వ్యక్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అజీమ్ను కావాలనే హత్య చేసి ఉంటారని, గతంలో సైతం గొడవలు జరిగాయని పలువురు అంటున్నారు. Follow the Sakshi TV channel on WhatsApp: -
టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ.. అందోలు బీజేపీ టికెట్పై ఉత్కంఠ!
సాక్షి, మెదక్: అందోలు నియోజకవర్గ బీజేపీ టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొదటి నుంచి కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచే మాజీ మంత్రి బాబూమోహన్ టికెట్ల కేటాయింపు సమయంలో కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరు తెరపైకి రావడాన్ని ఆయన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ► అందోలు ఎమ్మెల్యేగా 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది, 1999 సాధారణ ఎన్నికల్లో తిరిగి రెండోసారి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో పట్టు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా చేతిలో బాబూమోహన్ ఓడిపోయారు. ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బాబూమోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ను నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ► ప్రస్తుతం 2023 ఎన్నికల్లో బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో బాబూమోహన్ పేరు లేదు. ఆయన కుమారుడు ఉదయ్బాబూమోహన్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నందని, అందుకే మొదటి జాబితాలో అవకాశం దలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ► ఉదయ్బాబూ మోహన్ పేరును బీజేపీ తరఫున కేటాయిస్తున్నట్లు ప్రముఖ టీవీల్లో ప్రచారం కావడంతో నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రెండు మాసాల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు జితేందర్రెడ్డి అందోలు టికెట్ను ఉదయ్బాబుకు ఇద్దామని బాబూమోహన్తో అన్నట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ► అప్పటి నుంచి ఉదయ్బాబును నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు బాబూమోహన్ ప్రయత్నిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. అందోలు బీజేపీ టికెట్ను మా జీ జెడ్పీ చైర్మన్ బాలయ్య కూడా ఆశిస్తున్న విషయం తెలిసిందే. ► అందోలు టికెట్ తనకే కేటాయించాలని పార్టీ అధిష్టానవర్గంపై బాబూమోహన్ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టికెట్పై తండ్రీకొడుకుల మధ్యే పంచాయితీ ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. -
పొన్నం వర్సెస్ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?
సాక్షి, మెదక్: కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో మొదటి లిస్ట్లో హుస్నాబాద్కు చోటు ఇవ్వలేదు. రేపో మాపో రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ ఖరారు కాకముందే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. టికెట్ నాకే అంటే నాకే అని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. – హుస్నాబాద్ హైదరాబాద్లోని తక్కుగూడలో జరిగిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ విజయభేరికి ఎవరికి వారే వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. ‘తిరగబడుదాం..తరిమికొడదాం’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి. హన్మంతరావు పాల్గొనగా, పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదుకు నిర్వహించి సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ రాగా, రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేసింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ ఒత్తిడి తెస్తోంది. ఈ రెండు మూడు రోజుల నుంచి సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో, హుస్నాబాద్ సీటు కాంగ్రెస్కే కేటాయిస్తారనే భావనతో టికెట్ కోసం పొన్నం ప్రభాకర్, ప్రవీణ్రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చలో కాళేశ్వరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని, ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు చూపేందుకు పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలానికి ఒక బస్సు చొప్పున రైతులు, కాంగ్రెస్ నాయకులతో కాశేశ్వరానికి తరలివెళ్లారు. అలాగే మార్నింగ్ వాక్ పేరిట ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇటీవలె కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచార రథాలకు పూజలు చేయించి ప్రతి రోజూ ప్రచారం చేయిస్తున్నారు. చాపకింది నీరులా ప్రచారం.. మరో వైపు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి చాపకింద నీరులా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాలను చుట్టిముట్టి కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఊరు ఊరునా పరామర్శల పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. టికె ట్ తనకే వస్తుందనే ధీమాతో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం ప్రచ ార రథాలకు పూజలు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా? కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరి మద్దతు ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు నేతలు ఎందులోనూ తగ్గకుండా సీరియస్గా ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఇద్దరు చేతులు కలుపుతారా లేదా చేయి ఇస్తారా అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. -
నర్సాపూర్ను శాసించిన మదన్రెడ్డి వంశస్తులు!
సాక్షి, మెదక్: కౌడిపల్లి అడ్డాగా.. నర్సాపూర్ గడ్డపైరాజకీయాలను శాసించిన చిలుముల వంశం సుదీర్ఘ రాజకీయ చరిత్రకు నేటి నుంచి తెరపడనుందా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కౌడిపల్లికి చెందిన చిలుముల వంశస్తులు పోటీ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కపోవడం చర్చనీయాంశంగా మారింది. విఠల్రెడ్డితో మొదలుకొని.. దివంగత మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు చిలుముల విఠల్రెడ్డి నర్సాపూర్ రాజకీయాలను శాసించారు. 1952లో నర్సాపూర్ నియోజవర్గం ఏర్పడింది. 1957లో జరిగిన మొదటి ఎన్నికల్లో సీపీఐ తరపున కౌడిపల్లికి చెందిన విఠల్రెడ్డి పోటీ చేశారు. 1957 నుంచి 2004 వరకు 11సార్లు శాసనభకు ఎన్నికలు జరగగా విఠల్రెడ్డి పోటీలో ఉన్నారు. అయిదు సార్లు గెలుపొంది ప్రజాసేవ చేశారు. అనంతరం 2009లో మహాకూటమి ఏర్పడడంతో సీపీఐ తరఫున విఠల్రెడ్డి కుమారుడు చిలుముల కిషన్రెడ్డి పోటీలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో విఠల్రెడ్డి తమ్ముడి కుమారుడు చిలుముల మదన్రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మదన్రెడ్డి తెలుగుదేశం తరఫున రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి దక్కేదెవరికో.. ప్రస్తుతం మదన్రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేశారు. టికెట్ రాదని చర్చకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పలుమార్లు ఎమ్మెల్యే మదన్రెడ్డిని పార్టీలోనికి రావాలని ఆహ్వానించినట్లు చర్చ జరిగింది. రెండురోజుల క్రితం విఠల్రెడ్డి కోడలు బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని కిషన్రెడ్డి, ఆమె కొడుకు చిలప్చెడ్ మండల మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డిని మైనంపల్లితోపాటు కాంగ్రెస్ నాయకులు పార్టీలోనికి ఆహ్వానించారు. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చిలుముల వంశస్తులకు ఇస్తారా.. అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సైతం నర్సాపూర్ టికెట్ కేటాయించకపోవడంతో ఏదైనా జరగవచ్చని జనం అంటున్నారు. ఇవి చదవండి: కోడ్ను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు! : భారత ఎన్నికల కమిషన్.. -
ట్రైనింగ్లో పాల్గొన్న ఎన్సీసీ కాడెట్లకు
గజ్వేల్రూరల్: ట్రైనింగ్లో పాల్గొన్న ఎన్సీసీ కాడెట్లకు క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాష్ట్ర ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వీఎం రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లో 12రోజులుగా కొనసాగుతున్న ఎస్ఎన్ఐసీ(స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్) ఆదివారం అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల 17 డైరెక్టరేట్ల పరిధిలోని ఎన్సీసీ, ఎన్ఐసీ కాడెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో కాడెట్లు సంగారెడ్డి సమీపంలోని ఆయుధ కర్మాగారం, హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్, శిల్పారామం, ట్యాంక్బండ్, రామోజీ ఫిల్మ్సిటీ, గోల్కొండ కోట వంటి ప్రాంతాలను సందర్శించి వాటి వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. అనంతరం గ్రూప్ సాంగ్, డ్యాన్స్లలో గెలుపొందిన విజేతలు శిక్షణ ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు క్యాంపు కమాండెంట్ కల్నల్ సునీల్ అబ్రహం తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ పాల్గొన్నారు. -
తృప్తి-అసంతృప్తి.. కమలంలో..!
సంగారెడ్డి: బీజేపీ తొలి జాబితా ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. ప్రధానంగా పటాన్చెరు, నర్సాపూర్ అభ్యర్థుల ప్రకటనపై పలువురు పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభ్యర్థిత్వాల ఎంపిక విషయమై కొన్ని రోజులుగా కసరత్తు చేసిన అధినాయకత్వం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నలుగురిని ఖరారు చేసింది. దుబ్బాకకు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందర్రావు, గజ్వేల్కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పటాన్చెరుకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్, నర్సాపూర్కు మురళీయాదవ్లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో పటాన్చెరు, నర్సాపూర్ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పటాన్చెరులో తిరుగుబావుట.. పటాన్చెరు టికెట్ నందీశ్వర్ గౌడ్కు ప్రకటించగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్నాపూర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో అసంతృప్త నేతలంతా సమావేశమయ్యారు. ఎనిమిది మంది పార్టీ మండల అధ్యక్షులు, కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు, మున్సిపాలిటీల అధ్యక్షులంతా హాజరయ్యారు. ఈ టికెట్ విషయమై అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో మార్చాలని కోరారు. పూటకో పార్టీ మారుతూ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్న వ్యక్తిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కాగా ఈ టికెట్ను నందీశ్వర్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడీల శ్రీకాంత్గౌడ్, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు ఎడ్ల రమేష్ సైతం ఆశించారు. స్వతంత్రంగా బరిలోకి దిగే యోచనలో గోదావరి అంజిరెడ్డి పటాన్చెరు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసిన గోదావరి అంజిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ టికెట్ విషమయై ఆమె అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అధినాయకత్వం మాత్రం నందీశ్వర్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. నర్సాపూర్లోనూ.. మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీయాదవ్కు నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపైనా అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని ఆశావహులైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శింగాయపల్లి గోపీ, నాయకులు రఘువీరారెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అభ్యర్థిత్వం ఎలా ఖరారు చేస్తారని అసమ్మతి నేతలు ప్రశ్నించారు. అధినాయకత్వం ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తొలి విడత అభ్యర్థుల ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కమలం పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. -
నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ ఎవరికీ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాకముందే అసంతృప్తి రాజుకుంటుందా?.. దీని కోసం ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే అలకలు షురూ అయ్యాయా?.. పార్టీకి చెందిన మాజీ ఎంపీలంతా ఇటీవల హైదరాబాద్లో మధుయాష్కి నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని పరిశీలిస్తే అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖేడ్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్షెట్కార్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పార్టీలోని ఇరు వర్గాలు కూడా తమ నాయకుడికే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నాయి. ఎలాగైనా ఈసారి తమ నాయకుడు పోటీలో ఉంటారని ఇరువర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. తొలి జాబితాలో దక్కని చోటు కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ తొలి జాబితాలో ఖేడ్కు చోటు దక్కలేదు. రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఈసారైనా నియోజకవర్గం టికెట్ ప్రకటిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చాకే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీలంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్లో మధుయాష్కి నివాసంలో భేటీ అయ్యారు. అందులో నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న సురేష్షెట్కార్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ రాని ఈ మాజీ ఎంపీలంతా సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నారాయణఖేడ్లో పార్టీ కేడర్ చాలా ఏళ్లుగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టికెట్ రెండో జాబితాలో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
TS Election 2023: నాడు 'దొమ్మాట' నుంచి.. నేడు 'దుబ్బాక' నియోజకవర్గంగా..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాల ఖిల్లాగా దుబ్బాక నియోజకవర్గం పేరుగాంచింది. మొదటి నుంచి విప్లవోద్యమాలకు అడ్డాగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు నక్సలైట్ దళాలు ఈ నియోజకవర్గంలో పనిచేయడంతో దేశవ్యాప్తంగా దుబ్బాక పేరు మార్మోగింది. మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలను కలుపుతూ మధ్యలో ఉండే నియోజకవర్గం దుబ్బాక. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది కావడంతో నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై న చాలామంది ఉన్నత పదవులు పొందారు. మంత్రి పదవితో పాటు, డిప్యూటీ స్పీకర్, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నత బాధ్యతలు చేపట్టి దుబ్బాక నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 1957లో దొమ్మాట నియోజకవర్గంగా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిదశలో రాజగోపాలపేటగా ఉన్న ఈ నియోజకవర్గంలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఉండేవి. ఆ తర్వాత 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజగోపాలపేట స్థానంలో దొమ్మాట నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన దొమ్మాట నియోజక వర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, కొండపాక మండలాలు ఉండేవి. 2001లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డి మిరుదొడ్డి, కొండపాక మండలాల నుంచి 17 గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా తొగుట మండలంను ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి ఐదు మండలాలతో దొమ్మాట నియోజకవర్గం ముఖ చిత్రంగా ఏర్పడింది. 2009లో దుబ్బాక నియోజకవర్గంగా.. 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దొమ్మాట నియోజకవర్గం కాస్త దుబ్బాక నియోజకవర్గంగా అవతరించింది. దుబ్బాకలో కొండపాక మండలంను కలపకుండా గజ్వేల్ నియోజకవర్గంలో చేర్చి.. అప్పటి రామాయంపేట నియోజకవర్గంలో ఉన్న చేగుంట మండలాన్ని దుబ్బాకలో చేర్చారు. అంతేగాకుండా అప్పటి వరకు దుబ్బాక మండలంలోని 11 గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలో ఉండగా వాటిని దుబ్బాక నియోజకవర్గంలో కలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మండలాలు ఏర్పర్చడంతో కొత్తగా రాయపోల్, నార్సింగ్, భూంపల్లి–అక్బర్పేట మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్, భూంపల్లి–అక్బర్పేట మండలాలతో పాటుగా గజ్వేల్ మండలంలోని ఆరపల్లి గ్రామంతో కలిసి దుబ్బాక నియోజకవర్గంగా ఉంది. రాజకీయంగా ఎన్నో మార్పులు.. రాజకీయంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1952లో తొలిసారి రాజగోపాలపేట నియోజకవర్గం పేరిట జరిగిన ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే.వీ.నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచారు. 1957 ఎన్నికల్లో వంగ హనుమంతరెడ్డి అలియాస్ ఆశిరెడ్డి పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో ఎంకే మోహినొద్దీన్ కాంగ్రెస్ తర ఫున గెలిచారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎం.భీంరెడ్డి తర్వాత కాంగ్రెస్లో చేరారు. 1972 ఎన్నికల్లో దుబ్బాక మండలం చిట్టాపూర్కు చెందిన సోలిపేట రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1978లో దుబ్బాకకు చెందిన ఐరేని లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి శాసనసభ ఉపసభాపతి పదవిని పొందారు. 1988లో టీడీపీ ప్రభంజనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోయిన దొమ్మాటలో కాంగ్రెస్ నుంచి ఐరేని లింగయ్య విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కొండపాకకు చెందిన డి. రాంచంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. 1989,1994,1999 లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ తరఫున జర్నలిస్టుగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి పోటీచేసి వరుస విజయాలతో ఉన్న ముత్యంరెడ్డిపై గెలుపొందారు.అనంతరం తెలంగాణ ఉద్యమపరిణామాల్లో భాగంగా 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి గెలుపొందారు. 2014 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి ఘనవిజయం సాధించారు. 2018లో నాలుగోసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా సోలిపేట 66వేల పై చిలుకు ఓట్లతో రాష్ట్రంలోనే 7వ రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్రావు వెయ్యికి పై చిలుకు ఓట్లతో రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అందులో 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 4 పర్యాయాలు బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ విజయం సాధించడం విశేషం. కమ్యూనిస్టు, పీడీఎఫ్, ఇండిపెండెంట్లు ఒక్కోసారి గెలుపొందారు. కీలక పదవులు.. నియోజకవర్గం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినేట్లో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు.1978లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐరేని లింగయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించారు. 1994లో టీడీపీ నుంచి రెండోసారి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా, 1999లో టీడీపీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్రశాసన సభ అంచనాల కమిటీ చైర్మన్గా ఉన్నతమైన పదవులు చేపట్టారు. చదవండి: శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి -
అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి
రాయపోలు/మిరుదొడ్డి(దుబ్బాక): మూడేళ్లలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని, తనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. మండలంలోని రాంసాగర్, ముంగీసపల్లి, వీరానగర్ తదితర గ్రామాలలో గురువారం ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, తొమ్మిదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. అదేవిధంగా అదేవిధంగా అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ మండల నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు మల్లన్నగారి భిక్షపతి, మాదాసు వెంకట్గౌడ్, రవీందర్రెడ్డి, చెన్నగౌని వెంకటేశ్గౌడ్, రాజాగౌడ్, సత్యపాల్రెడ్డి, రాజిరెడ్డి రమేష్ ఉన్నారు. అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు -
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు
కోహీర్(జహీరాబాద్): సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని సేడెగుట్ట తండా, సిద్దాపూర్ తండా, గొడిగార్పల్లి, పర్సపల్లి, బడంపేట, ఖానాపూర్, కొత్తూర్(కె) గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు రైతుబంధు, పింఛన్ల పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ రూ.15లక్షలకు పెంపు, అన్నపూర్ణ పథకంలో సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. మాట తప్పని కేసీఆర్ తప్పకుండా ఆ హామీలను నేరవేరుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్, టీఎస్ఐడీసీ చైరన్ మహ్మద్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, నర్సింలు యాదవ్, స్రవంతిరెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు -
దుబ్బాక గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
దుబ్బాకటౌన్: దుబ్బాక గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని, ఎవరెన్ని నాటకాలాడినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మూర్తి కరుణాకర్రెడ్డి ఎంపీ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రఘునందన్రావు ఎన్ని డ్రామాలు ఆడారో ప్రజలకు తెలుసునన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనన్నా అమలు చేసిన దాఖలాలు లేవని, నయాపైస తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది లేదన్నారు. కేవలం వెయ్యి ఓట్లతో గెలిచిన రఘునందన్రావును ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చిత్తుగా ఓడిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. -
ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
సంగారెడ్డి టౌన్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీ గా జరగాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, వ్యవసాయ శాఖ ఏఈఓలు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు విషయమై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుంచి చిన్న ఫిర్యాదు అందినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని సూచించారు. జిల్లాలో 208 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కనీస మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొను గోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం ఎప్పటికప్పుడు కొనాలని, కొన్న ధాన్యానికి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ట్రాన్స్పోర్టు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపాలన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకం ధాన్యానికి రూ.2,183 లభిస్తుందని తెలిపారు.ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్ఓ వనజాత, డీఆర్ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, డీసీఓ ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏఈవోలు, రవాణా కాంట్రాక్టర్లు, డీటీసీఎస్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి సంగారెడ్డి టౌన్ : జిల్లాలో స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి శరత్ అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్వీప్ యాక్షన్ ప్లాన్పై సమీక్షించి, పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, అన్ని పరిశ్రమలలో ఓటరు చైతన్య వేదికలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న అధికారులలో ఒక రిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. న్యూస్రీల్ ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో చేయాలి ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని డాక్టర్ శరత్ అన్నారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై త్వరగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది శిక్షణలకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
TS Election 2023: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా..
మెదక్: ఎన్నికల నియమావళిని అడ్డుపెట్టుకొని కొందరు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది చేస్తున్న పనులకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న డబ్బును పోలీసులు సీజ్ చేసి కలెక్టరేట్కు తరలిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు పోలీసులు ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం బ్యాంక్ల వద్ద రైతులు, సామాన్య ప్రజల డబ్బులు సీజ్ చేస్తున్నారు. సివిల్ డ్రెస్లో మాటువేసి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్న వారిని పట్టుకొని ఎలాంటి ఆధారాలు లేవని పట్టుకెళ్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ డబ్బును తెచ్చుకోవడానికి రోజుల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. 'శివ్వంపేట మండలం గుండ్లపల్లికి చెందిన రాజశేఖర్రెడ్డి, శ్రావణ్, జీవన్రెడ్డి ముగ్గురు స్నేహితులు. వీరిలో రాజశేఖర్రెడ్డి, శ్రావణ్ ఫౌల్ట్రీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి డబ్బులు అవసరం ఉండి అదే గ్రామానికి చెందిన జీవన్రెడ్డి అనే మిత్రుడి వద్ద రూ. లక్ష అప్పు అడిగారు. ఈనెల 17న జీవన్రెడ్డి శివ్వంపేట మండలంలోని శభాష్పల్లిలోని ఐసీఐసీ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసి అందులో నుంచి శ్రావణ్, రాజశేఖర్రెడ్డికి చెరో రూ. 50 వేల చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలో అప్పటికే బ్యాంకు వద్ద మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ వీరిని గమనించి సమాచారం ఉన్నతాధికారులు తెలిపారు. శ్రావణ్, రాజశేఖర్రెడ్డిలు కారులో వెళ్తుండగా వారిని ఆపి చెక్ చేయగా ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష ఉన్నాయి. వెంటనే నగదును సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి పంపించారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పునే ఉంది కదా అని అడిగితే ఇద్దరూ కారులోనే వెళ్తున్నారు కదా అని పోలీసులు బదులిస్తున్నారు. ఆ డబ్బు కోసం నాలుగు రోజులుగా మెదక్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.' ఓచర్ రాసిందే కానిస్టేబుల్.. శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన నాగయ్య అనే రైతు ఈ నెల 17న రూ.70 వేలకు పాడిగేదెను కొనుగోలు చేశారు. వాటి డబ్బులు కట్టేందుకు ఈనెల 17న శివ్వంపేటలోని ఏపీజీవీబీ బ్యాంక్కు వచ్చి తన అకౌంట్లో ఉన్న రూ.1.49 లక్షలను డ్రా చేయాలని కోరగా, అక్కడే మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఓచర్ను నింపి సదరు రైతుకు ఇచ్చింది. రైతు డబ్బులు డ్రా చేసుకొని బయటకి రాగానే అప్పటికే యూనిఫామ్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఇతర సిబ్బందితో కలిసి రైతును పట్టుకొని నగదును సీజ్ చేసింది. వాటిని మెదక్లోని గ్రీవెన్స్ కమిటీకి పంపించారు. ఆ రైతు నాలుగు రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఇలా పోలీసుల అతిమూలంగా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెప్పు కోసం.. తప్పు! ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబాలకు గురిచేయకుండా అవినీతిపరుల డబ్బు, మద్యం, ఇతర కానుకలను సీజ్ చేయాలి. కానీ, అమాయకులైన వారిని పట్టుకొని డబ్బును సీజ్ చేయడం సరికాదు. అధికారుల మెప్పు పొందడం కోసం ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓచర్ రాసిచ్చి.. డబ్బు పట్టించింది.. నేను రూ.70 వేలు పెట్టి గేదెను కొన్నాను. బ్యాంకులో సివిల్ డ్రెస్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ రూ.1.49 లక్షలకు సంబంధించిన ఓచర్ రాసి ఇచ్చింది. బయటకు రాగానే పట్టిచ్చింది. డబ్బుల కోసం నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్కు తిరుగుతున్నాను. ఈ రోజు రేపు ఇస్తామని అధికారులు తిప్పుతున్నారు. – నాగయ్య, రైతు ఎదుల్లాపూర్ బ్యాంకుల్లో ఉండాలనే నిబంధన లేదు.. పోలీసులు బ్యాంకుల్లో మఫ్టీలో ఉండాలనే నిబంధన లేదు. ఆధారాలు లేకుండా రూ. 50 వేల కన్న ఎక్కువ తరలిస్తే పోలీసులు పట్టుకుంటారు. ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం కానిస్టేబుల్స్ ఇలాంటి పని చేస్తే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – అదనపు ఎస్పీ మహేందర్ -
కుటుంబ కలహాలతో ఒకప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. తీవ్ర విషాదం!
మెదక్: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గజ్వేల్, కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడిగ నర్సింలు (40) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 13 ఏళ్ల కిందట కుటుంబ కలహాలతో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో 8 ఏళ్ళ కిందట రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల రెండో భార్యతో గొడవలు జరుగుతుండడం, వ్యవసాయం కోసం చేసిన అప్పుల కోసం మధనపడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక్కసారిగా.. Follow the Sakshi TV channel on WhatsApp: -
భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు.. ఇంతలోనే విషాదం!
మెదక్: ఎక్కిళ్లు ఓ ట్రాక్టర్ డ్రైవర్ను బలితీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(కె)లో చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన నర్వ సాయిలు(39) పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయిలు మృతిచెందాడు. ఎక్కిళ్లు రావడంతో గుండెపోటుకు గురైనట్టు 108 సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..! Follow the Sakshi TV channel on WhatsApp: -
TS Election 2023: మూడు ముక్కలాట! టికెట్ కోసం త్రిముఖ పోటీ..
సంగారెడ్డి: దుబ్బాక నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. పాతతరం మారినా గ్రూపుల లొల్లి మారడంలేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాల వల్ల ప్రతిసారి పరాభవం ఎదుర్కొంటుందని పలువురు నేతలు అంటున్నారు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్కుమార్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గ్రూపుల మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. అధిష్టానానికి తలనొప్పిగా.. ఈ నేపథ్యంలో దుబ్బాక టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. అయితే ప్రజల్లో ఏ నాయకుడికి ఆదరణ ఉందన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సర్వే చేయించిందని, ఆ సర్వే ఆధారంగానే టికెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆ ముగ్గురు నేతలూ మాత్రం తమకే టికెట్ వస్తుందని తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనివాస్రెడ్డికి టికెట్ కేటాయించగా.. పోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు, బీఆర్ఎస్ సోలిపేట సుజాత మధ్యనే నడిచి చివరకు వెయ్యికి పైగా ఓట్లతో బీజేపీ గెలుపొందడం తెలిసిందే. చెరుకు శ్రీనివాస్రెడ్డి ప్రచారం.. పరిస్థితి అలా ఉంటే చెరుకు శ్రీనివాస్రెడ్డి మరో అడుగు ముందుకేసి 106 రోజులుగా నియోజకవర్గంలో ఆత్మగౌరవ యాత్ర చేపడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల నాలుగైదు రోజుల నుంచి ఏకంగా ప్రచారం మొదలుపెట్టారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ముగ్గురిలో ఎవరిని వరిస్తుందో అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. టికెట్ కోసం త్రిముఖ పోటీ.. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, కత్తి కార్తీకతో పాటు పీసీసీ సీనియర్ నాయకుడు మద్దుల సోమేశ్వర్రెడ్డి తనయుడు గాల్రెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీనివాస్రెడ్డి, శ్రావణ్, కార్తీక కొన్ని నెలలుగా తమకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారు తమ అనుచరులతో గ్రామాల్లో పర్యటిస్తూ ధీమాగా ఉన్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా ఇద్దరు సహకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. -
గులాబీ జోష్..
సిద్దిపేటలో మంగళవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభ విజయవంతమైంది. పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. సభాప్రాంగణం జనంతో కిటకిటలాడింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. పురిటిగడ్డను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. ఆద్యంతం తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్లు.. ముఖ్యమంత్రి స్థాయికి పంపిన ఈ గడ్డను మరిచిపోనని భావోద్వేగానికి గురయ్యారు. – సిద్దిపేట కమాన్ గులాబీ జోష్.. -
ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి
● ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. ● జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై హరీశ్రావు అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ● రాఘవాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం నాయకులు జలపందిరితో సభా స్థలికి చేరుకున్నారు. ● మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రజలను లోనికి అనుమతించారు. ● సాయంత్రం 5.45కు సీఎం హెలికాప్టర్లో ప్రజా ఆశీర్వాద సభకు చేరుకున్నారు. ●హెలికాప్టర్ దిగిన కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకగా, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ పర్సన్ విజిత తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు. ● సీఎం ప్రసంగం అనంతరం కేసీఆర్కు మంత్రి హరీశ్రావు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి, పాదాభివందనం చేశారు. ● 6.34 గంటలకు సభను ముగించుకుని సీఎం సభా ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గంగుండా హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ● ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా!
సాక్షి, మెదక్: కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన ఒక వ్యక్తి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సర్ధన గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కట్ట వెంకటేశం(35) తన భార్య లక్ష్మి మృతి చెందగా మరో మహిళతో వివాహం చేయగా ఆమె ఇటీవల వెంకటేశంతో గొడవపడి వెళ్లిపోయిందని వెంకటేశం తల్లి నర్సమ్మ తెలిపింది. దానికి తోడు ఆయనకు ఫిట్స్ వ్యాధి ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న ఇంట్లో నుంచి వెళ్లి పోయాడని, సోమవారం ఐలేరు చెరువులోపడి మృతి చెందినట్లు చెప్పింది. నర్సమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆనంద్గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కాంగ్రెస్లో రాజుకుంటున్న అసంతృప్తి! రెండో జాబితాతో భగ్గుమనే అవకాశాలు!
సాక్షి ప్రతినిధి, మెదక్: కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ప్రకటనతో అసంతృప్తి రాజుకుంటోంది. జిల్లాలో ఆయా నియోజకవర్గాల టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఆదివారం కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితా ప్రకటించింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి గజ్వేల్, మెదక్ టికెట్లను వరుసగా తూంకుంట నర్సారెడ్డికి, మైనంపల్లి రోహిత్కు కేటాయించింది. అందోల్కు సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్కు మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ను ప్రకటించింది. తొలివిడతలో ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వీటి ప్రకటనతో టికెట్ ఆశించిన భంగపడిన నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి బహిర్గతం కాకపోయినప్పుటికీ లోలోపల రాజుకుంటున్నది. గజ్వేల్.. జశ్వంత్రెడ్డి వర్గం! గజ్వేల్ టికెట్ను తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ సభ్యుడు జశ్వంత్రెడ్డి ఆశించారు. ఆయనకు దక్కడంతో జశ్వంత్ వర్గం లోలోపల రగిలిపోతున్నారు. నర్సారెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ గతంలో గాంధీభవన్ను ముట్టడించి ధర్నా నిర్వహించింది. అంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్లోని రెండు వర్గాలు ఏకంగా బాహాబాహీకి దిగాయి. ఇప్పుడు టికెట్ల ప్రకటనతో అసంతృప్తులు బయట పడకపోయినప్పటికీ అంతర్గతంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్కు దూరంగా మ్యాడం బాలకృష్ణ.. మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్కు ఖరారవుతుందనే సంకేతాలుండగా కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్యనేతలు డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మిగతా ముఖ్యుల్లో ఒకరైన పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ప్రస్తుతానికి స్తబ్ధతగా ఉన్నారు. రోహిత్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో సీనియర్ నేత సుప్రభాతరావుకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం ఉంటుందని సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ భరోసా ఇవ్వడంతో రోహిత్కు మద్దతు పలుకుతున్నారు. జహీరాబాద్ అభ్యర్థిత్వం చంద్రశేఖర్కు ఖరారు చేయగా ఇదే స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న స్థానిక నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అధిష్ఠానం దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని స్థానికేతరులకే కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఎప్పుడు అవకాశం వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరు చోట్ల.. నారాయణఖేడ్లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి ఆశిస్తున్నారు. నర్సాపూర్లో గాలిఅనీల్కుమార్, ఆవుల రాజిరెడ్డి, పటాన్చెరులో కాటా శ్రీనివాస్గౌడ్, గాలిఅనీల్ ఇద్దరూ కోరుతున్నారు. దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, కత్తి కార్తీక పోటీ పడుతున్నారు. సిద్దిపేట్లోనూ ఇద్దరు నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. అవి ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తులు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రెండో జాబితాతో భగ్గుమనే అవకాశాలు! ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు టికెట్లు ఖరారయ్యాయి. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థిత్వం ఎంపిక కొంత క్లిష్టంగా మారగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ఆరింటినీ రెండో, మూడో జాబితాల్లో ప్రకటించాలని యోచిస్తోంది. పెద్దగా ఇబ్బందులు లేని టికెట్ల విషయంలోనే అసంతృప్తులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఇంకా ఆరు టికెట్ల విషయంలో అసమ్మతి భగ్గుమనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ స్థానాలను ఇద్దరు, ముగ్గురు నాయకులు కూడా ఆశిస్తున్నారు. ఒకరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వ్యతిరేకవర్గం నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి రగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
బీజేపీ టికెట్ దక్కేదెవరికి..?
నర్సాపూర్: నర్సాపూర్ బీజేపీ టికెట్ కోసం పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లిగోపి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఓబీసీ నాయకుడు రమేష్గౌడ్, పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, పార్టీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ మల్లేష్గౌడ్, ఆయా మండల శాఖల పార్టీ అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి ఉన్నారు. అయితే ముఖ్య నాయకుల సూచనల మేరకు మండల శాఖల అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి రేస్ నుంచి తప్పుకున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి విజయం కోసం కృషి చేస్తామని ఒప్పుకున్నట్టు సమాచారం. మిగిలిన వారిలో మల్లేష్గౌడ్, పెద్దరమేష్గౌడ్, చిన్న రమేష్గౌడ్ పేర్లను పార్టీ రాష్ట్ర కమిటీ తొలగించి, మురళీయాదవ్, గోపి, రఘువీరారెడ్డిల పేర్లను కేందర పార్టీకి పంపినట్లు తెలిసింది. ఎవరికి వారు ప్రయత్నాలు రాష్ట్ర కమిటీ స్క్రూటినీ అనంతరం గోపి, మురళీయాదవ్, రఘువీరారెడ్డి ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కొందరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తాము పార్టీకి చేసిన సేవలను, గతంలో తాము నిర్వహించిన పదవుల గురించి వివరిస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి మరి. -
మనస్తాపంతో.. నాన్నమ్మకు ఫోన్చేసి.. చివరికి..
మెదక్: మనస్తాపం చెందిన ఒక యువకుడు చెరువులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో చోటుచేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన సంపత్(20) అంబాజిపేట పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంటి నుంచి బైక్పై బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తాను చెరువులో దూకి చనిపోతున్నానని నాన్నమ్మ దుర్గమ్మకు ఫోన్చేసి చెప్పాడు. వెంటనే ఆమె యువకుడి మేనమామలకు చెప్పడంతో వారు అక్కడకు చేరుకుని వెతకగా చెరువులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ తెలిపారు. నాలుగు రోజులుగా సంపత్ మనస్తాపంతో బాధపడుతున్నాడని చెప్పారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com