
మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, పక్కన అభ్యర్థి పద్మ
మెదక్ కలెక్టరేట్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మెదక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన సైడ్ లెట్స్..
● సాయంత్రం 4.41 గంటలకు సీఎం కేసీఆర్ హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యింది.
● 4.50 గంటలకు సీఎం క్యారీవ్యాన్ ద్వారా సభ స్టేజీపైకి చేరుకున్నారు.
● 4.56 గంటలకు ప్రసంగం ప్రారంభించి 5.13 గంటల వరకు మాట్లాడారు.
● సాయంత్రం 5.35 గంటలకు హెలీప్యాడ్ ద్వారా మెదక్ నుంచి కేసీఆర్ బయల్దేరి వెళ్లిపోయారు.
● సీఎం మాట్లాడుతున్న సమయంలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
● మైక్ స్టాండ్లు, లైట్ స్టాండ్లు, రోడ్ డివైడర్, భవనాలపై నిలబడి ప్రజలు ఆసక్తిగా విన్నారు.
● ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
● మిలట్రీ పోలీస్, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
● సభకు తరలివచ్చిన వాహనాలకు సీఎస్ఐ చర్చి ముందు, వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్తో మాట్లాడుతున్న హరీశ్రావు

ఫోన్లో ఫొటో తీస్తున్న వృద్ధుడు

కేసీఆర్, హరీశ్రావు, పద్మ కటౌట్లతో కార్యకర్త

సభకు హాజరైన మహిళా కార్యకర్తలు

యువకుల ఉత్సాహం

కేసీఆర్కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం