ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం | Mitchell Marsh ruled out of Champions Trophy | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం

Jan 31 2025 12:13 PM | Updated on Jan 31 2025 12:57 PM

Mitchell Marsh ruled out of Champions Trophy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వెన్ను గాయం కార‌ణంగా ఈ ఐసీసీ మెగా టోర్నీకి దూర‌మయ్యాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఆసీస్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేసిన జ‌ట్టులో మార్ష్‌కు చోటు ద‌క్కింది. ఇప్పుడు అత‌డి స్ధానాన్ని మ‌రో ఆల్‌రౌండ‌ర్‌తో సెల‌క్ట‌ర్లు భ‌ర్తీ చేయ‌నున్నారు.

స్వ‌దేశంలో భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్ ఆరంభంలోనే త‌ను వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాని క్రికెట్ ఆస్ట్రేలియాకు మార్ష్ తెలియ‌జేశాడు. దీంతో అతడిపై ఎక్కువ బౌలింగ్ లోడ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఉంచ‌లేదు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మార్ష్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 73 పరుగులు చేశాడు. దీంతో సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టుకు టీమ్ మెనెజ్‌మెంట్ అత‌డిపై వేటు వేసింది. అత‌డి స్ధానంలో బ్యూ వెబ్‌స్టార్‌కు చోటు ఇచ్చాడు. ఈ టాల్ ఆల్‌రౌండ‌ర్ త‌న అరంగేట్రంలోనే ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత బిగ్‌బాష్‌లోకి వెళ్లిన మార్ష్ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోలుకోవడానికి  బిగ్‌బాష్ లీగ్ చివరి మూడు మ్యాచ్‌ల‌ను మార్ష్ దాటేశాడు. అయిన‌ప్ప‌టికి అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు.

"మిచెల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవల కాలంలో అతడి నడుము నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానల్ నిర్ణయించింది. అతడు కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టనున్నట్లు" క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా మార్ష్‌​ ఐపీఎల్‌​ ఫస్ట్‌హాఫ్‌కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా మార్ష్ స్ధానాన్ని వెబ్‌స్టెర్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశ‌ముంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆసీస్‌ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్‌! దారుణ వైఫల్యం
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement