ICC Champions Trophy 2025
-
Ind vs SL: నిర్ణయం మార్చుకున్న రోహిత్!.. మరి కోహ్లి?
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు టీమిండియా కేవలం రెండు వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా తొలుత శ్రీలంక.. తర్వాత ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లలో పాల్గొననుంది.ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఈ రెండు సిరీస్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ వన్డే టోర్నీలో ఆడాలనుకునే సీనియర్లు తప్పకుండా లంక, ఇంగ్లండ్లతో సిరీస్లో పాల్గొనాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.అందుబాటులో ఉండాలిఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో చర్చించిన గంభీర్.. కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఈ రెండు సిరీస్లకు అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కోహ్లి, బుమ్రా మాత్రం శ్రీలంకతో వన్డే సిరీస్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ముగిసిన అనంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.లండన్లో కోహ్లి.. అమెరికాలో రోహిత్స్వదేశానికి తిరిగి వచ్చిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కోహ్లి లండన్కు వెళ్లగా.. రోహిత్ శర్మ అమెరికాకు పయనమయ్యాడు. మరోవైపు.. బుమ్రా కూడా సెలవు తీసుకున్నాడు.ఈ నేపథ్యంలో విశ్రాంతి పేరిట ఈ ముగ్గురు శ్రీలంక సిరీస్కు అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ మాత్రం లంకతో వన్డే సిరీస్ ఆడాల్సిందేనని పట్టుబట్టడంతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.లేదంటే కెప్టెన్ అతడే!ఫలితంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్కు కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఒకవేళ అతడు గనుక సమయానికి అందుబాటులోకి రాకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా శుబ్మన్ గిల్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో యువ భారత జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తదుపరి టీమిండియా జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది.చదవండి: NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం? -
Champions Trophy: పాక్ కాదు.. భారత్ మ్యాచ్లకు వేదిక ఇదే?!
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో ఐసీసీ టోర్నీ క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచనుంది. గతేడాది వన్డే వరల్డ్కప్, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే.వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా అవతరించగా.. టీ20 వరల్డ్కప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఇక భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ టోర్నీలో టాప్ సెవన్లో నిలిచిన జట్లు చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.ఇక ఈ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్నట్లు కూడా తెలిపింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం.ఆసియా వన్డే కప్-2023 మాదిరే హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్ను కూడా నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్ల వేదిక గురించి ఐసీసీ చర్చలు జరుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో దుబాయ్ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. భారత్ మినహా మిగతా జట్లు ఆడే మ్యాచ్లకు పాకిస్తాన్ వేదిక అయితే.. రోహిత్ సేన మాత్రం దుబాయ్లో మ్యాచ్లు ఆడేలా ప్రణాళిక రచించేందుకు ఐసీసీ సుముఖంగా ఉందని సంకేతాలు ఇచ్చింది.కాగా బీసీసీఐ నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఐసీసీ ఈ విషయం గురించి వార్షిక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. జూలై 19- 22 వరకు కొలంబో వేదికగా జరుగనున్న మీటింగ్లో ఈ అంశం గురించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇక గతేడాది ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా సారథ్యంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఇక ఈ టోర్నీలో శ్రీలంక- టీమిండియా ఫైనల్ చేరగా.. రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది.చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లుఆతిథ్య దేశం పాకిస్తాన్ నేరుగా ఈ టోర్నీలో చోటు దక్కించుకోగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ వన్డే వరల్డ్కప్ పాయింట్ల పట్టిక ఆధారంగా అర్హత సాధించాయి.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. అభిమానులకు గుడ్న్యూస్ -
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటే..? ఆ జట్టుకు లక్కీ ఛాన్స్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమవుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తమ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విదాల సన్నదమవుతోంది.భద్రతా కారణాల దృష్టా 1996 వన్డే వరల్డ్కప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వలేదు. ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్ను కూడా ఐసీసీకి సమర్పించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఐసీసీ పరిశీలనలో ఉంది. అయితే ఈ టోర్నీలో భారత పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు తెలియజేసినట్లు సమాచారం.గత ఆసియాకప్ మాదరిగానే హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడాల్సిన మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీని కోరినట్లు వినికిడి.టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే..?ఒకవేళ భారత్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీకరించకుండా, పాక్లోనే అన్ని మ్యాచ్లను నిర్వహించాలని పీసీబీ పట్టుబడితే ఏంటి పరిస్థితి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హైబ్రిడ్ మోడల్లో కాకుండా పాక్లోనే టోర్నీ మొత్తాన్ని నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్ను ఐసీసీ అంగీకరిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్కు వెళ్లడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ నుంచి భారత్ వైదొలిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా తప్పుకుంటే శ్రీలంక అర్హత సాధిస్తోంది.భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించగా.. 9వ స్థానంలో నిలిచిన శ్రీలంకకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే భారత్ తప్పుకుంటే శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. -
Champions Trophy 2025: ఇండియా కాకపోతే శ్రీలంక..!
వచ్చే ఏడాది (2025) పాకిస్తాన్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్తో సత్సంబంధాలు లేని కారణంగా భారత్ ఈ టోర్నీని బాయ్కాట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తే తటస్థ వేదికపై తమ మ్యాచ్లు నిర్వహించాలని (హైబ్రిడ్ విధానం) ఐసీసీని కోరవచ్చు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ ససేమిరా ఒప్పుకోదు. ఇదివరకే ఓసారి (ఆసియా కప్ 2023) భారత్ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ విధానానికి ఒప్పుకున్న పాక్ ఈ సారి ఖచ్చితంగా నో చెప్పవచ్చు. ఇదే జరిగితే భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటుంది.మెగా టోర్నీ నుంచి టీమిండియా డ్రాప్ అయిన పక్షంలో ఆ స్థానానికి శ్రీలంక అర్హత సాధిస్తుంది. పూర్ ర్యాంకింగ్ (ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవ్వాలంటే కటాఫ్ తేదీలోపు ర్యాంకింగ్స్లో టాప్-8 జట్లలో ఒకటిగా ఉండాలి) కారణంగా శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించలేదు.కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి ఆతిథ్య దేశ హోదాలో పాక్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు అర్హత సాధించాయి. -
విరాట్ పాకిస్తాన్కు వస్తే ఆ ప్రేమను మర్చిపోతాడు: ఆఫ్రిది
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదంటే హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.భారత క్రికెట్ జట్టు తప్పకుండా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా పాక్ గడ్డ మీద ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానం(టీమిండియా మ్యాచ్లకు వేరే వేదిక)లో ముందుకు వెళ్లాలని ఐసీసీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా ఇక్కడకు రావాలిఈ నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. రోహిత్ సేన పాకిస్తాన్ పర్యటనకు వస్తే చూడాలని ఉందన్నాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టకుండా టీమిండియాను పాకిస్తాన్కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.ముఖ్యంగా విరాట్ కోహ్లికి తమ దేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అతడిని చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆఫ్రిది తెలిపాడు. భారత్లోని అభిమానుల ప్రేమను మరిపించేలా అతడిని తమ ప్రేమలో ముంచెత్తుత్తామని పేర్కొన్నాడు.‘‘భారత క్రికెట్ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు.ఆ ప్రేమను మరచిపోతాడుఅదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్ను చూడాలి. ఒక్కసారి విరాట్ ఇక్కడికి వచ్చాడంటే భారత్లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు.పాకిస్తాన్లో అతడికి అంతటి క్రేజ్ఉంది. ఇక్కడి ప్రజలకు అతడంటే ఎంతో ఇష్టం’’ అని షాహిద్ ఆఫ్రిది ఓ యూట్యూబ్ చానెల్తో పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20లలో కోహ్లికి పాక్పై మెరుగైన రికార్డు ఉంది. వన్డే, టీ20లలో పాక్పై అతడి పరుగుల సగటు 52.15, 70.29. చదవండి: మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్