
మైసూరు: మైసూరు నగరంలోని దివాన్రోడ్డులోని సమృద్ధంశ్వర ఆలయంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు గెలుపొందాలని అభిమానులు విశేష హోమాలు, పూజలు నెరవేర్చారు. ఆర్సీబీ జట్టు గెలుపు కోసం ప్రారి్థంచి ఆర్సీబీ జర్సీ ధరించి అభిమానుల తరపున విశేష పూజలను చెల్లించారు.
దేవస్థానం ప్రధాన అర్చకులు కుమార్ నేతృత్వంలో విజయదుర్గ హోమాన్ని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీ‹Ùగౌడ ఆర్సీబీ జెర్సీ ధరించి పాల్గొన్నారు. ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈసారి ప్రతి ఆటగాడు బాగా రాణించాడు. కార్యక్రమంలో దేవరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమే‹Ù, రాయప్ప, కర్ణాటక విజయ రక్షణ వేదిక అధ్యక్షుడు వినయ్కుమార్, గురురాజిత్ నవీన్, రవిచంద్ర పాల్గొన్నారు.