టీమిండియాతో జాయిన్ అవనున్న‌ వైభ‌వ్, తిలక్‌ వర్మ | Tilak Varma Vaibhav To Join Team India On June 22nd For Ireland Tour After Sri Lanka Tour, More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాతో జాయిన్ అవనున్న‌ వైభ‌వ్, తిలక్‌ వర్మ

Jun 17 2026 8:16 AM | Updated on Jun 17 2026 10:39 AM

Tilak Varma-Vaibhav-To-Join-Team-India-June 22nd-Ireland-Tour

గత కొన్ని రోజులుగా త‌న ఆట‌తీరుతో హాట్‌టాపిక్‌గా మారిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ లంక ఆట‌గాళ్ల‌తో గొడ‌వ వ‌ల్ల మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఇండియా-ఏ జ‌ట్టు త‌ర‌ఫున ట్రై సిరీస్ ఆడేందుకు లంక ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ టీమిండియాతో జాయిన్ అవ్వ‌నున్నాడు. 

వైభ‌వ్ సూర్య‌వంశీతో పాటు యువ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్న తిల‌క్ వ‌ర్మ కూడా జూన్ 22న చెన్నైలో భార‌త సీనియ‌ర్ జట్టుతో క‌ల‌వ‌నున్నాడు. చెన్నై నుంచి భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు బెల్‌ఫాస్ట్‌కు బ‌యల్దేరి వెళ్ల‌నుంది. జూన్ 21న ట్రై సిరీస్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. 

ఒక‌వేళ ఇండియా-ఏ జ‌ట్టు ఫైనల్ చేరితే ఆ సిరీస్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత వైభ‌వ్‌, తిల‌క్‌లు నేరుగా చెన్నైకి వ‌చ్చి జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నారు. ఒక‌వేళ ఇవాళ ఆఫ్గ‌న్‌తో మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఇండియా-ఏ జ‌ట్టు ఇంటిబాట ప‌ట్ట‌నుంది. ఐపీఎల్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 

ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్‌, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌ను జూన్‌ 26న ఆడనుంది. ఇక బీసీసీఐ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను నియమించింది.

చదవండి: ఆఫ్గన్‌-ఏతో కీలక మ్యాచ్‌.. నిలకడగా ఆడుతున్న వైభవ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement