tilak varma
-
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్బౌలర్గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
దివ్యాంగుల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు. -
దుమ్మురేపిన వరుణ్ చక్రవర్తి.. రెండో స్థానానికి ఎగబాకిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా (Team India) ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఏకంగా 25 స్థానాలు మెరుగుపర్చుకుని తొలిసారి టాప్-5లోకి చేరాడు. ఇంగ్లండ్ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసిన వరుణ్ 679 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని ఐదో స్థానంలో నిలిచాడు.అగ్రస్థానంలో ఆదిల్ రషీద్భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో మూడు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు. రషీద్ విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ను రెండో స్థానానికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఆదిల్ రషీద్ ఖాతాలో 718 రేటింగ్ పాయింట్లు ఉండగా.. అకీల్ హొసేన్ ఖాతాలో 707 పాయింట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తికి టాప్ ప్లేస్లో ఉన్న ఆదిల్ రషీద్కు మధ్య కేవలం 39 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.టాప్-10లోకి ఆర్చర్భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్లో మూడు మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా గణనీయంగా తన ర్యాంక్ను మెరుగుపర్చుకున్నాడు. ఆర్చర్ 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరాడు. మరోవైపు భారత బౌలర్ అక్షర్ పటేల్ కూడా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో వరుణ్ చక్రవర్తి (5), అర్షదీప్ సింగ్ (9), రవి భిష్ణోయ్ (10) ఉన్నారు. ఇంగ్లండ్తో సిరీస్లో ఆశించినంతగా రాణించలేకపోయిన భిష్ణోయ్ 5 స్ణానాలు కోల్పోయి ఐదో స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు.రెండో స్థానానికి ఎగబాకిన తిలక్ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి భారత్ను గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma).. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. తిలక్.. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ను కిందకు దించి రెండో స్థానానికి చేరాడు. ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి తిలక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (4), యశస్వి జైస్వాల్ (9) టాప్-10లో ఉన్నారు. ఇంగ్లండ్తో సిరీస్లో తొలి మ్యాచ్లో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ 59 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానానికి చేరాడు. మరో భారత ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా మూడు వైఫల్యాల కారణంగా 12 స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. -
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్పైనే కన్నేసింది. రాజ్కోట్లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్కు అచ్చొచ్చే పిచ్పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్లో బౌలింగ్తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్ను దెబ్బతీసి మ్యాచ్ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్వుడ్, ఆర్చర్, రషీద్లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుతో కోల్కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్ ఝులిపించాడు.సూపర్ ఫినిషింగ్ టచ్ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఫోర్ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ను ఏకంగా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.తిలక్ వర్మ అచ్చం ఆ దిగ్గజం మాదిరేఅంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్తో ఫినిష్ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్గా ఉంచుతున్నాడు.ధోని కంటే కాస్త మెరుగేగతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో టైమ్అవుట్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్లు ఆడి 156కు పైగా స్ట్రేక్రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా రెండు గెలిచింది. ఆధిక్యంలో టీమిండియాతొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రెండో మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాజ్కోట్లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!2️⃣-0️⃣ 🙌Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB— BCCI (@BCCI) January 25, 2025 -
అన్ని ఫార్మాట్లలో రాణించగల బ్యాటర్ తిలక్ వర్మ
ఎంతో మంది హేమాహేమీలున్న భారత్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అదీ మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలాంటి మిడిలార్డర్లో నిలదొక్కుకొని రాణించాలంటే ఎంతో నైపుణ్యంతో పాటు పరిణితి ఉండాలి. పరిస్థితుల తగిన విధంగా తన ఆటతీరు ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జట్టుని ఆదుకోవాలి. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యాటన్ హైదరాబాద్ కి చెందిన 22 ఏళ్ళ తిలక్ వర్మ. అనతి కాలంలోనే జట్టులో నిలకడ గల బ్యాటర్ గా తిలక్ వర్మ పేరు గడిస్తున్నాడు.తిలక్ వర్మకు కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అతని ఆటని పరిశీలించి త్వరలోనే భారత్ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్ అని అంచనా వేసాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. తిలక్ టెక్నిక్, ఆటతీరు, అతని షాట్ మేకింగ్ సామర్థ్యం గురుంచి రోహిత్ ముందే ఊహించి చెప్పడం గమనార్హం.బయాష్ ముందుచూపు తిలక్ వర్మ చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి వద్ద ప్రైవేట్ కోచింగ్ కి పంపేందుకు సరైన వనరులు లేనప్పుడు వర్మని అతని కోచ్ సలాం బయాష్ ఆదుకున్నాడు. అతనికి ఫీజులు, క్రీడా సామాగ్రి అందించి వర్మ క్రికెట్కు దూరమవ్వకుండా చూసుకున్నాడు. బయాష్ ముందుచూపు ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. వర్మ 2018-19లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్లు ఆడి మూడు ఇన్నింగ్స్లలో 86 పరుగులు చే సి, భారత్ ఫైనల్కు చేరుకునేందుకు దోహదపడ్డాడు.ఐపీఎల్ అనుభవంఆలా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వంటి ప్రముఖ జట్టుకి ఎంపిక కావడం బాగా కలిసి వచ్చింది. శనివారం చెన్నైలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ స్కోర్ తో చరిత్ర సృష్టించాడు. తిలక్ కేవలం 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్తో, తిలక్ టీ20ల్లో అవుట్ కాకుండా 300 పైగా పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. భారత్ తరుఫున గత నాలుగు ఇన్నింగ్స్లలో తిలక్ దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 47 బంతుల్లో 120, ఇంగ్లాండ్పై 19, నాటౌట్గా 72 పరుగులు చేశాడు. అంతకుముందు, ఈ రికార్డు న్యూజిలాండ్కు చెందిన మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మన్ టీ20 క్రికెట్లో అజేయంగా నిల్చి 271 పరుగులు చేశాడు.తిలక్ వర్మ బాధ్యతాయుత బ్యాటింగ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా తిలక్ ఒత్తిడికి గురికాకుండా రాణించడం విశేషం. "తిలక్ బ్యాటింగ్ చేసిన విధానం చాలా సంతోషం కలిగించింది. అతనిలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఆడుతుంటే ఇతర బ్యాటర్ల పై ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహం లేదని సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్లో వ్యాఖ్యానించాడు.పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు తిలక్ ని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కూడా ప్రశంసించడం విశేషం. గతంలో ఒకసారి భారత్ భవిష్యత్ బ్యాటర్ గురుంచి అడిగినప్పుడు భారత్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ పేరు చెప్పాడని బాసిత్ గుర్తుచేసుకున్నాడు. "నేను మొహమ్మద్ అజారుద్దీన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, 'తిలక్ వర్మ ఆటతీరు చూసారా అని అడిగాడు. అతను అప్పటికి చాలా చిన్నవాడు. ఐపిఎల్లో మాత్రమే ఆడుతునున్నాడు. నాడు అజారుద్దీన్ చెప్పింది నేడు నిజమైంది, అని బాసిత్ గుర్తు చేసుకున్నాడు. చిన్న తనంలోనే ఎంతో పరిణతిని కనబరుస్తున్న తిలక్ వర్మ భవిష్యత్ లో భారత్ జట్టు తరుఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశిద్దాం. -
తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. రెండో టీ20 భారత్దే (ఫోటోలు)
-
సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సూర్య
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ(Tilak Varma) తన అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో చేధించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆసాదరణ బ్యాటింగ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ప్రశంసల వర్షం కురిపించాడు."గేమ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160 ప్లస్ టార్గెట్ను సులువగానే ఛేదించవచ్చని భావించాం. కానీ ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ వారి వైపు మలుపు తిరిగింది. మేము గత రెండు, మూడు సిరీస్ల నుంచి ఓ అదనపు బ్యాటర్తో ఆడుతున్నాము. అదే బ్యాటర్ మాకు బంతితో రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో వాషింగ్టన్ను ఆడించాము. అయితే గత మ్యాచ్లో దూకుడుగా ఆడినట్లే ఇక్కడ పరుగులు రాబట్టడం కుదరలేదు. కానీ ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ అగ్రిసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలని ముందే నిర్ణయించుకున్నాము.ఈ మ్యాచ్లో మా బాయ్స్ చిన్న చిన్న భాగస్వామ్యాలను నెలకొల్పారు. మా విజయంలో ఆ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మధ్యలో కాస్త నేను కంగారు పడ్డాను. ఇవన్నీ ఆటలో భాగమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ సమయంల తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అతడు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బిష్ణోయ్ కూడా ఈ రెండు మ్యాచ్ల్లో వికెట్ లెస్గా ఉండవచ్చు గానీ, అతడు నెట్స్లో చాలా కష్టపడుతున్నాడు.బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ రోజు బంతితో రాణించికపోయిన బ్యాట్తో రవి తన వంతు సహకారం అందించాడు. అర్షదీప్ కూడా ఆఖరిలో విలువైన పరుగులు చేశాడు. మా కుర్రాళ్లు నాపై ఒత్తిడి తగ్గించారు. దీంతో నేను స్వేఛ్చగా వెళ్లి ఆడేందుకు మార్గం సుగమమైంది. సీనియర్లు, యువకులతో డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ ఒకే మాటపై ఉంటే ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి’’ అని సూర్యకుమార్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్కు సలాం కొట్టిన సూర్యకుమార్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తన అద్బుతప్రదర్శనతో భారత్కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్, అభిషేక్, సూర్య వంటి ప్రధాన ఆటగాళ్లు తేలిపోయిన చోట తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం టెయిలాండర్లతో కలిసి తన సూపర్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ.. ఆఖరివరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ముగించాడు.ఓవరాల్గా వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో అందుకుంది. తద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.సూర్య పిధా.. కాగా హైదరాబాదీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పిధా అయ్యాడు. విజయనంతరం గ్రౌండ్లోకి వచ్చిన సూర్య.. తిలక్ వద్దకు వెళ్లి తల వంచి మరి చప్పట్లు కొడుతూ అభినందించాడు. అందుకు తిలక్ కూడా సంతోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తిలక్, సూర్యకు మంచి అనుబంధం ఉంది.వర్మ భారత జట్టులోకి రాకముందే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యతో కలిసి ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్కోట్లో జరగనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా Tilak Verma with Suryakumar yadav after match yesterday at Chapeuk.!!!!- A beautiful Video, Mumbai Indians boy's..!!pic.twitter.com/y3Jcb2ou3G— MANU. (@Manojy9812) January 26, 2025 -
ఇంగ్లాండ్ తో రెండో టీ20లో భారత్ ఘనవిజయం
-
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో క్రమం తప్ప వికెట్లు పడినప్పటికి తిలక్ మాత్రం తన విరోచిత పోరాటం కనబరిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత నాలుగు టీ20 ఇన్నింగ్స్లలో ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు.తద్వారా టీ20ల్లో రెండు డిస్మిసల్స్(ఔట్లు) మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా తిలక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మాన్ టీ20ల్లో రెండు ఔట్ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో చాప్మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు.టీ20ల్లో రెండు ఔట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..318 తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)271 మార్క్ చాప్మన్ (65*, 16*, 71*, 104*, 15)240 ఆరోన్ ఫించ్ (68*, 172)240 శ్రేయాస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20)ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడగా ఆడారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్కోట్లో జరగనుంది.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
ప్రపంచం మొత్తంలో బుద్ధిమంతుడైన పిల్లాడు.. లవ్ యూ: తిలక్ వర్మ(ఫొటోలు)
-
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్కు దక్కాయి. సంజూ శాంసన్తో పాటు.. సూర్యకుమార్ యాదవ్లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
టీమిండియా భవిష్య కెప్టెన్గా తిలక్ వర్మ!
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్గా తాను తిలక్నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.ఐపీఎల్లో సత్తా చాటికాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలుఅదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో బ్యాటర్గా, సారథిగా సత్తా చాటి ఫైనల్కు చేర్చాడు.ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్వుడ్ బౌలింగ్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.టీమిండియా కెప్టెన్ కావడం ఖాయంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.అభిషేక్ భేష్అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.ఓపెనింగ్ బ్యాటర్కు మేనేజ్మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్రేటు 232.35.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ..
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం(జనవరి 22) నుంచి ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అన్ని విధాల సిద్దమైంది.వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్..ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ(Tilak varma)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీ సాధిస్తే.. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్లలో సెంచరీలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. 22 ఏళ్ల తిలక్ వర్మ గత నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లలోనూ సెంచరీలతో మెరిశాడు. ఆ తర్వాత తిలక్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్లో యువ సంచలనం మరోసారి మూడంకెల స్కోరును అందుకోగల్గితే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్లలో సెంచరీ మార్క్ను అందుకున్నారు.సంజూ శాంసన్, రూసో, ఫిల్ సాల్ట్ వంటి క్రికెటర్లు వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసినప్పటికి.. మూడో సెంచరీని మాత్రం సాధించలేకపోయారు. ఇప్పుడు ఈ రేర్ ఫీట్ సాధించే అవకాశం తిలక్కు లభించింది. తిలక్ ఉన్న అద్భుతమైన ఫామ్లో ఈ అరుదైన రికార్డు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.అతడు మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. గత సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పొజిషేన్(ఫస్ట్ డౌన్)ను తిలక్కు త్యాగం చేశాడు. ఆ పొజిషేన్లోనే బ్యాటింగ్కు వచ్చి సెంచరీలతో మెరిశాడు తిలక్. ఆ సిరీస్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఈ హైదరాబాదీ సత్తాచాటాడు. ఇప్పటివరకు భారత్ తరపున 20 టీ20లు ఆడిన వర్మ..51.33 సగటుతో 616 పరుగులు చేశాడు.ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర వీరులకు చోటు -
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్గా ఉంటే యాక్షన్లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Eng: తుదిజట్టులో పంత్కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే మ్యాచ్లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్కు స్థానం ఉండదు!పంత్కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్గా, బ్యాటర్గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్కు లైన్ క్లియర్గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్బర్గ్లో 47 బంతుల్లోనే 120 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
అన్ని ఫార్మాట్లలో ఆడటమే లక్ష్యం
భారత టి20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ను ఒప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి వరుస మ్యాచ్ల్లో సెంచరీలు కొట్టి భారత టి20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ... మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన భవిష్యత్ లక్ష్యమని అంటున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయిన తిలక్ వర్మ... అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్గానే కాకుండా... బౌలింగ్పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ... కర్ణాటకపై రికార్డు ఛేదన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. తిలక్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... » విజయ్ హజారే టోర్నీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్లో 99 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అనే విషయాన్ని పట్టించుకోలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ ఓవర్లో భారీ షాట్లు ఆడాలని అనుకున్నా... అది కాస్త ఫలించలేదు. ఒక ఆటగాడు 45వ ఓవర్ వరకు క్రీజులో నిలిస్తే 380–400 స్కోరు కూడా ఛేదించగలమని జట్టు సమావేశాల్లో ఎన్నోసార్లు చెప్పాను. జట్టును గెలిపించేంత వరకు క్రీజులో ఉండాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. » కీలక సమయంలో రాణించి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. అంతిమంగా జట్టు విజయం సాధించడమే ముఖ్యం. నా ఇన్నింగ్స్తో అది సాధ్యమైనందుకు ఆనందం రెండింతలైంది. » దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో చర్చించా. నాలుగో స్థానంలో సూర్యకు మెరుగైన రికార్డు ఉందనే విషయం గుర్తుచేశా. ఆ ప్లేస్లో అతడు గతంలో సెంచరీలు సాధించాడు. నాకు మూడో స్థానంలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను అని చెప్పా. దానికి సూర్యకుమార్ ఒప్పుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కింది. » వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా భావించా. అందుకు తగ్గట్లే దక్షిణాఫ్రికాపై వరుస మ్యాచ్ల్లో సెంచరీలు సాధించా. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుంది. » అండర్–19 స్థాయికి ముందు వరకు నేను ఓపెనర్గానే బరిలోకి దిగే వాడిని. స్వింగ్ అవుతున్న బంతులను ఆడేందుకు ఇష్టపడతా. పరిస్థితులు సవాలు విసురుతున్నప్పుడు నాలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ముందుగా క్రీజులో అడుగు పెడితే... అదనపు సమయం లభించడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. » భారత్ ‘ఎ’తరఫున, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశా. అంతర్జాతీయ మ్యాచ్ల కారణంగా రంజీ ట్రోఫీలో నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలు లభించలేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా ఉన్నా. నా వరకు శక్తివంచన లేకుండా ప్రయతి్నస్తున్నా. » మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెట్టడమే నా లక్ష్యం. గతేడాది ఐపీఎల్ నుంచే బౌలింగ్పై మరింత దృష్టి సారించా. ఎర్ర బంతితో ఎక్కువ బౌలింగ్ సాధన చేస్తున్నా. దాని వల్ల టి20, వన్డే క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్గా మరింత ప్రభావం చూపగలనని నమ్ముతున్నా. » జట్టును సమతుల్యంగా ఉంచేందుకు నా వంతు కృషి చేస్తా. అందుకోసం బౌలింగ్పై ఎక్కువ దృష్టి పెడుతున్నా. బౌలింగ్ చేయగల బ్యాటర్ ఉంటే మేనేజ్మెంట్కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రానున్న మ్యాచ్ల్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం ముఖ్యం. అందుకు నేను సిద్ధం. -
హ్యాట్రిక్ సెంచరీల వీరుడికి షాక్.. వరుణ్ వీరోచిత శతకంతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.తిలక్ వర్మ @99ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది. కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.వరుణ్ వీరోచిత శతకంతిలక్, వరుణ్ ఐదో వికెట్కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్కు 71 పరుగులు జోడించారు.చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 109 నాటౌట్గా నిలిచి హైదరాబాద్ను గెలిపించిన వరుణ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్లో శుక్రవారం పంజాబ్తో హైదరాబాద్ ఆడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
99 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో తిలక్ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ ఔటైనా వరుణ్ గౌడ్ సూపర్ సెంచరీతో (109 నాటౌట్) హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ ఔటయ్యాక హైదరాబాద్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వరుణ్ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్ చెలరేగడంతో హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో నికిన్ జోస్ 37, కేవీ అనీశ్ 11, స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ తిలక్ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్ గౌడ్ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్లో తన్మయ్ అగర్వాల్ 35, రోహిత్ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్ 17, తనయ్ త్యాగరాజన్ 25, చామ మిలింద్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్ శెట్టి, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.మయాంక్ హ్యాట్రిక్ సెంచరీస్ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్ను గెలిపించిన సీపీ తనయుడు
విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy 2024-25) ఎడిషన్లో హైదరాబాద్ రెండో గెలుపు నమోదు చేసింది. పుదుచ్చేరితో శనివారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీవీ మిలింద్ అద్భుత బౌలింగ్తో హైదరాబాద్ను గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.కాగా డిసెంబరు 21 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కాగా.. హైదరాబాద్ తొలుత నాగాలాండ్తో తలపడింది. ఆ మ్యాచ్లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం ముంబై చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన తిలక్ సేన.. ఆ తర్వాత సౌరాష్ట్రతో మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.ఆకాశమే హద్దుగా చెలరేగిన సీవీ మిలింద్ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా శనివారం పుదుచ్చేరితో తలపడిన హైదరాబాద్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్(CV Milind) ఆకాశమే హద్దుగా చెలరేగి.. పాండిచ్చేరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టాపార్డర్లో ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు(2), అజయ్ రొహేరా(0)లతో పాటు.. మిడిలార్డర్లో ఫాబిద్ అహ్మద్(7).. అదే విధంగా లోయర్ ఆర్డర్లో అంకిత్ శర్మ(6), గౌరవ్ యాదవ్(13) రూపంలో ఐదు వికెట్లు(5/13) దక్కించుకున్నాడు.సీవీ మిలింద్కు తోడుగా తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లతో రాణించగా.. ముదాసిర్, శరణు నిశాంత్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్ బౌలర్ల ధాటికి పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.తిలక్ మరోసారి విఫలం.. రాణించిన హిమతేజఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(0), నితేశ్ రెడ్డి(5).. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(6) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కొడిమెల హిమతేజ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. తనయ్ త్యాగరాజన్ 22 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖర్లో వరుణ్ గౌడ్ 13(నాటౌట్) చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి తిలక్ సేన 102 పరుగులు చేసి.. పుదుచ్చేరిపై విజయం సాధించింది.సీపీ తనయుడుకాగా సీవీ మిలింద్ మరెవరో కాదు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 30 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇక సీవీ ఆనంద్ కూడా అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడారన్న విషయం తెలిసిందే.తిలక్ వర్మ వరుస వైఫల్యాలుఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో వచ్చిన అవకాశాన్ని టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. సారథిగానూ, బ్యాటర్గానూ అతడు విఫలమమవుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన తిలక్ చేసిన పరుగులు 0, 0, 57, 6. సారథిగానూ చిన్న జట్లపై గెలిపించాడే తప్ప.. పెద్ద జట్లపై విజయం అందించలేకపోతున్నాడు.చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి! -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. తిలక్ వర్మకు చేదు అనుభవం
విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ VHTలో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై తమ తొలి మ్యాచ్లో కర్ణాటకతో తలపడింది.అయితే, ఈ లిస్ట్-‘ఏ’ మ్యాచ్లో ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.టాస్ గెలిచిన ముంబై.. తిలక్ వర్మ డకౌట్నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(64), అభిరథ్ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్ తిలక్ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.ఇక మిడిలార్డర్లో అలెగాని వరుణ్ గౌడ్(1), రోహిత్ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాశ్(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 38.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళఅదే విధంగా తనుష్ కొటియాన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ(19), ఆయుశ్ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్ తామోర్(0), సూర్యాంశ్ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్(5), శార్దూల్ ఠాకూర్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.అయ్యర్ ధనాధన్.. తిలక్ సేనకు చేదు అనుభవంమరో ఎండ్ నుంచి తనుష్ కొటియాన్(37 బంతుల్లో 39 నాటౌట్) సహకారం అందించగా.. అయ్యర్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్ సేనపై జయభేరి మోగించింది.ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్రౌండర్ తనుష్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్ -
MP Vs HYD: రజత్ పాటిదార్ మెరుపులు.. తిలక్ వర్మను వెంటాడిన దురదృష్టం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.రజత్ పాటిదార్ మెరుపులుటాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టంఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్సాయి యాదవ్ 36; హర్ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్సాయి యాదవ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177. బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3. చదవండి: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్తో మ్యాచ్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్లో మంగళవారం మధ్యప్రదేశ్తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్దేవ్ గౌడ్ 21; ప్రభ్సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్దేవ్ గౌడ్ (సి) రమణ్దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్దీప్ (బి) అర్ష్దీప్ 55; నితిన్సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0. -
భీకర ఫామ్లో తిలక్ వర్మ.. హ్యాట్రిక్ సెంచరీలు.. ఇప్పుడు..!
టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ నవంబర్ నెలలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ నెలలో తిలక్ ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 13న సౌతాఫ్రికాపై సెంచరీ (107 నాటౌట్ (56 బంతుల్లో)) చేసిన తిలక్.. ఆతర్వాత నవంబర్ 15న ఆదే సౌతాఫ్రికాపై మరో సెంచరీ (120 నాటౌట్ (47 బంతుల్లో)) బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 23న మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్లో 67 బంతుల్లో శతక్కొట్టిన (151) తిలక్.. ఆతర్వాతి మ్యాచ్లో (నవంబర్ 25) బెంగాల్పై హాఫ్ సెంచరీ (57) చేశాడు. దీని తర్వాత ఒక్క మ్యాచ్లో విఫలమైన తిలక్, తిరిగి ఇవాళ (నవంబర్ 29) బీహార్తో జరిగిన మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీతో (51 నాటౌట్) మెరిశాడు. మొత్తంగా నవంబర్ మాసం తిలక్కు అచొచ్చినట్లుంది. ఈ నెలలో తిలక్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో సత్తా చాటాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా తిలక్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫీట్ను కూడా తిలక్ నవంబర్లోనే సాధించాడు.ఇదిలా ఉంటే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బీహార్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అజేయమైన సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో బీహార్పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలకపల్లి రవితేజ 4 వికెట్లు తీసి బీహార్ను దెబ్బకొట్టాడు. మిలింద్, అజయ్ దేవ్ గౌడ్ తలో 2, నితిన్ సాయి యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. బీహార్ ఇన్నింగ్స్లో కుమార్ రజనీశ్ (22) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. తిలక్ వర్మ (31 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), రోహిత్ రాయుడు (33 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) హైదరాబాద్ను గెలిపించారు. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్కు మరో ఓటమి
రాజ్కోట్: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్ అగర్వాల్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్ త్యాగరాజన్ (32 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్తాన్ బౌలర్లలో మానవ్ సుతార్, అనికేత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో రేపు బిహార్తో హైదరాబాద్ ఆడుతుంది. -
టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ నయా రికార్డ్..!
-
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్గా.. వరల్డ్ రికార్డు!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్-19 ప్రపంచకప్లో భారత్ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడుతున్నాడు.ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలుఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు.ఫోర్లు, సిక్సర్ల వర్షం ఇక్కడా.. తిలక్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మేఘాలయతో మ్యాచ్లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.సహచర బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. రాజ్కోట్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆదిలోనే షాక్ తగిలింది.సుడిగాలి ఇన్నింగ్స్లో ఆఖరి వరకు అజేయంగాఓపెనర్ రాహుల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ సహకారం అందించగా కెప్టెన్ తిలక్ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది.హైదరాబాద్ భారీ విజయంఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు, తనయ్ త్యాగరాజన్ మూడు, మికిల్ జైస్వాల్, సరణు నిషాంత్, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్?.. రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!Tilak Varma becomes the FIRST ever player to score 3 back-to-back T20 centuries.2 for India vs South AfricaToday in SMAT pic.twitter.com/ctVqGgm1wd— Kausthub Gudipati (@kaustats) November 23, 2024 -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్లో అటు బ్యాట్తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. -
ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్వన్గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్స్టోన్ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బిహార్లో ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ టీమిండియా జట్టు వరకు చేరింది. లేటెస్ట్ సెన్సేషన్ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ హీరో అయిపోయాడు. దీంతో ఇతడిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంటర్వ్యూ చేశాడు. నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను, నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? ఈ హెయిర్ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అని సూర్య అడిగాడు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ)దీనికి సమాధానమిచ్చిన తిలక్ వర్మ.. ఏం లేదు, ఈ హెయిర్ స్టైల్ని ఇప్పుడే మొదలుపెట్టా. అప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలామంది ఆయనలానే కనిపిస్తున్నావ్ అని అంటున్నారు. నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది. అందుకే ఇలా పెంచాను అని చెప్పాడు.ఏంటి మరి 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? అని సూర్య అడగ్గా.. అలాంటిది ఏం లేదు, నా పని బాల్, బ్యాట్తో ఆడటం మాత్రమే. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!)Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024 -
సరిలేరు మీకెవ్వరు!
ప్రపంచ క్రికెట్లో ఏ జట్టయినా మేటి ఆటగాళ్ల నిష్క్రమణతో డీలా పడటం సహజమే! టీమిండియా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికితే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఈ ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించగా... దిగ్గజాలను మైమరిపించేందుకు మేమున్నామంటూ యువతరం దూసుకొస్తోంది!సంజూ సామ్సన్ సుదీర్ఘ కెరీర్ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... అడిగి మరీ బరిలోకి దిగిన మూడో స్థానంలో తానే సరైన వాడినని హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ తన సారథ్యంతో సత్తా చాటుతుంటే... హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్రౌండర్గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘ఛోటా పటాకా... బడా ధమాకా’ మాదిరిగా అభిõÙక్ శర్మ చెలరేగుతుంటే... ‘నయా ఫినిషర్’ తానే అని రింకూ సింగ్ నిరూపించుకుంటున్నాడు. టి20ల్లో ప్రమాదకర బౌలర్గా అర్‡్షదీప్ సింగ్ పరిణతి సాధిస్తే... వరుణ్, రవి బిష్ణోయ్ బౌలింగ్లో వైవిధ్యంతో కట్టిపడేస్తున్నారు. వీరంత సమష్టిగా కదం తొక్కుతుండటంతో భారత జట్టు ఈ ఏడాది టి20ల్లో జైత్రయాత్ర సాగించింది. ఆడిన 26 మ్యాచ్ల్లో 24 విజయాలతో అదరగొట్టిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. –సాక్షి క్రీడా విభాగం టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ (2007) గెలిచిన తర్వాత... మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడేందుకు సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియా... ఈ ఏడాది రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చాన్నాళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఆ కల నెరవేర్చుకోవడంతో పాటు... అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. వరల్డ్కప్లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... మరో ఐదు సిరీస్లు సైతం చేజిక్కించుకుంది. అఫ్గానిస్తాన్పై 3–0తో, జింబాబ్వేపై 4–1తో, శ్రీలంకపై 3–0తో, బంగ్లాదేశ్పై 3–0తో, దక్షిణాఫ్రికాపై 3–1తో సిరీస్లు హస్తగతం చేసుకుంది. ఇందులో అఫ్గానిస్తాన్తో సిరీస్ తర్వాత టి20 వరల్డ్కప్ జరగ్గా... ఆ తర్వాత నుంచి సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లతోనే టీమిండియా అద్భుతాలు చేసింది. కోహ్లి, రోహిత్, జడేజా వంటి సీనియర్లు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం... మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా అన్ని సిరీస్లకు అందుబాటులే లేకపోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ... బాధ్యత తీసుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది ఆడిన 26 అంతర్జాతీయ టి20 మ్యాచ్ల్లో భారత్ 24 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. అందులో రెండు ‘సూపర్ ఓవర్’ విజయాలు కూడా ఉన్నాయి. ఓడిన రెండింట్లో ఒకటి వరల్డ్కప్ నెగ్గిన వారం రోజుల తర్వాత సరిగ్గా కుదురుకోకుండానే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ ఒకటి అయితే... తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్లో చివరి వరకు పోరాడి ఓడిన రెండో టి20 మరొకటి. ఈ రెండు మినహా మిగిలిన మ్యాచ్లు చూసుకుంటే మన జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్గా విజయాల శాతాన్ని పరిశీలిస్తే... భారత్ 92.31 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో పాకిస్తాన్ 19 మ్యాచ్లాడి 17 గెలిచి 89.47 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రతి 12 బంతులకో సిక్స్... టీమిండియా జైత్రయాత్ర వెనక యువ ఆటగాళ్ల దూకుడు ఉందనేది వాస్తవం. ఈ ఏడాది గణాంకాలు చూస్తే... భారత జట్టు సగటున ప్రతి 12 బంతులకో సిక్స్ బాదింది. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకునే ప్రతి ఆటగాడు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చెలరేగుతుండటం వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ వంటి హిట్టర్ల వల్ల జట్టు బ్యాటింగ్ శైలి మారిపోయింది. గతంలో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాలనే ధోరణి ఎక్కువగా కనిపించే టీమిండియాలో... ఇప్పుడు బాదుడే పరమావధి అనేది స్పష్టమవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్డౌన్లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు... టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే నూరిపోసానని వెల్లడించాడు.‘వికెట్ పడ్డా ఫర్వాలేదు. దూకుడు మాత్రం తగ్గించొద్దు. సహజసిద్ధమైన షాట్లు ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి’అని లక్ష్మణ్ తనకు చెప్పినట్లు తిలక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ ఏడాది 4.68 బంతులకో బౌండరీ (ఫోర్, సిక్స్) కొట్టిన భారత జట్టు ఈ జాబితాలో ఆస్ట్రేలియా (4.39) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఏడు సెంచరీలు.. 2024 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆటగాళ్లు ఒక్క టి20 ఫార్మాట్లోనే ఏడు సెంచరీలు బాదారు. సంజూ సామ్సన్, తిలక్ వర్మ తాజా సిరీస్లోనే చెరో రెండు సెంచరీలు బాదగా... అంతకుముందు సామ్సన్ హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్పై మరో శతకం సాధించాడు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కూడా ఒక్కోసారి మూడంకెల స్కోరు అందుకున్నారు. ఒక ఏడాదిలో టి20ల్లో ఒక జట్టు ప్లేయర్లు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం విశేషం. సెంచరీ నమోదైన ప్రతి మ్యాచ్లోనూ టీమిండియా 200 పైచిలుకు పరుగులు చేసింది. మొత్తంగా 2024లో తొమ్మిది సార్లు భారత జట్టు 200+ స్కోర్లు నమోదు చేసింది. ప్రపంచంలో మరే జట్టు ఏడు సార్లకు మించి ఈ ఫీట్ అందుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా 9.55 రన్రేట్తో పరుగులు రాబట్టింది. ఇది ఆ్రస్టేలియా (9.87) తర్వాత రెండో అత్యధికం. కేవలం బ్యాటింగ్లోనే మెరుపులు మెరిపిస్తే ఈ స్థాయి జైత్రయాత్ర సాధ్యమయ్యేది కాదు! బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం కూడా తోడవడంతోనే ఈ నిలకడ సాధ్యమైంది. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో భారత జట్టు పదిసార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. సగటున ప్రతి మ్యాచ్లో టీమిండియా 8.39 వికెట్లు పడగొట్టింది. 2023 వరకు టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే ప్రత్యర్థిపై 100 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు ఆ ఫీట్ నమోదు చేయడం కొసమెరుపు! ఫ్యూచర్ స్టార్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇప్పటికే నిరూపించుకోగా... ఇప్పుడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయిన తిలక్ వర్మ... ఈసారి సఫారీ టూర్లో రెండు సెంచరీలతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. నాలుక మడతేసి కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్న తరహాలో... దక్షిణాఫ్రికాలో విధ్వంస రచన చేసిన తిలక్పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఒకే బంతికి భిన్నమైన షాట్లు ఎలా ఆడొచ్చో తిలక్ చివరి మ్యాచ్లో నిరూపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి తిలక్ డీప్ మిడ్వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ చూస్తే అతడు ఎంత పరిణతి సాధించాడో ఇట్టే చెప్పేయోచ్చు. గతంలో సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నించిన తిలక్... తాను కూడా వికెట్కు నాలుగు వైపులా పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ , కోచ్ మాటలను బట్టి చూస్తే... తిలక్ మూడో స్థానంలో కుదురుకున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 టి20లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, రెండు హాఫ్సెంచరీలతో 51.33 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇన్నాళ్లు కోహ్లి ఆడిన మూడో స్థానంలో నిలకడ కొనసాగించగలిగితే 22 ఏళ్ల తిలక్కు మంచి భవిష్యత్తు ఉండనుంది. -
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో తిలక్ సత్తాచాటాడు. ప్రోటీస్తో జరిగిన మూడో టీ20లో అద్బుత సెంచరీతో చెలరేగిన తిలక్.. ఇప్పుడు జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో అదే ఇన్నింగ్స్ను రిపీట్ చేశాడు.ఈ మ్యాచ్లో కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్ అసాంతం తిలక్ అద్బుతమైన ప్రదర్శన కరబరిచాడు. మొత్తం నాలుగు మ్యాచ్ల సిరీస్లో 140 సగటు, 198 స్ట్రైక్రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు రెండు కూడా తిలక్ దక్కాయి.కోహ్లి రికార్డు బ్రేక్ఈ క్రమంలో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా తిలక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.2020-21లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కోహ్లి 147 స్ట్రైక్రేటుతో 231 పరుగులు సాధించాడు. తాజా సిరీస్తో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా ఎగరేసుకుపోయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియా సరికొత్త చరిత్ర.. దెబ్బకు ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆసీస్ రికార్డు బద్దలు..👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్ల్లో 17 విజయాలు నమోదు చేసింది.తాజా మ్యాచ్తో ఆసీస్ అల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.👉టీ20ల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్లో బంగ్లాదేశ్పై భారత్ 297 పరుగులు చేసింది. 👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్పై 2024లో) రికార్డు కనుమరుగైంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్కప్ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వరుసగా రెండు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన సంజూ.. ఆఖరి మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.తిలక్ వర్మతో స్కోర్ బోర్డును ఈ కేరళ స్టార్ బ్యాటర్ పరుగులు పెట్టించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శాంసన్👉అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శాంసన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో సంజూకు ఇది మూడో సెంచరీ. తద్వారా ఈ రేర్ ఫీట్ను సంజూ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచక్రికెట్లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించలేదు.👉అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.భారత్ ఘన విజయంఇక ఈ మ్యాచ్లో 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో శాంసన్తో పాటు తిలక్ వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
తిలక్, సామ్సన్ వీర విధ్వంసం.. మూడో టీ20లో సౌతాఫ్రికా చిత్తు
వాండరర్స్లో బౌండరీల వర్షం... సిరీస్లో తొలి మ్యాచ్ సెంచరీ హీరో, మూడో మ్యాచ్ శతక వీరుడు ఈసారి జత కలిసి సాగించిన పరుగుల ప్రవాహానికి పలు రికార్డులు కొట్టుకుపోయాయి. తిలక్ వర్మ, సంజు సామ్సన్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బాదిన సెంచరీలతో జొహన్నెస్బర్గ్ మైదానం అదిరింది. వీరిద్దరి జోరును నిలువరించలేక, ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టీమిండియా ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉండగా... బౌండరీల ద్వారానే 206 పరుగులు వచ్చాయి. అనంతరం మైదానంలోకి దిగక ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన సఫారీ టీమ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి 10/4 వద్ద నిలిచిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు. జొహన్నెస్బర్గ్: సఫారీ పర్యటనను భారత టి20 జట్టు అద్భుతంగా ముగించింది. అన్ని రంగాల్లో తమ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్ల సిరీస్ను 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్లు), సంజు సామ్సన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్లు) మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తిలక్కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా... వరుసగా రెండు డకౌట్ల తర్వాత సామ్సన్కు ఈ సిరీస్లో ఇది రెండో శతకం కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ధనాధన్ జోడీ... పవర్ప్లేలో 73 పరుగులు... 10 ఓవర్లు ముగిసేసరికి 129... 15 ఓవర్లలో 219... చివరి 5 ఓవర్లలో 64... ఇదీ భారత్ స్కోరింగ్ జోరు! గత కొన్ని మ్యాచ్లలో వరుసగా విఫలమైన అభిõÙక్ శర్మ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఈసారి కాస్త మెరుగైన ఆటతో దూకుడు ప్రదర్శించాడు. అభిషేక్ అవుట య్యాక సామ్సన్, తిలక్ జత కలిసిన తర్వాత అసలు వినోదం మొదలైంది. ప్రతీ బౌలర్పై వీరిద్దరు విరుచుకుపడి పరుగులు సాధించారు. మహరాజ్ ఓవర్లో తిలక్ రెండు వరుస సిక్స్లు కొట్టగా... స్టబ్స్ ఓవర్లో సామ్సన్ అదే పని చేశాడు. సిపామ్లా ఓవర్లో ఇద్దరూ కలిసి 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టారు. కెప్టెన్ మార్క్రమ్ ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోతూ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. సామ్సన్ స్కోరు 27 వద్ద ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన తిలక్ ఒకదశలో అతడిని దాటేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుగా 51 బంతుల్లోనే సామ్సన్ శతకం పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లోనే తిలక్ 41 బంతుల్లో ఆ మార్క్ను అందుకున్నాడు. టపటపా... భారీ ఛేదనను చెత్త ఆటతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గెలుపు గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో హెన్డ్రిక్స్ (0), రికెల్టన్ (1) వెనుదిరగ్గా... మూడో ఓవర్లో అర్ష్ దీప్ వరుస బంతుల్లో మార్క్రమ్ (8), క్లాసెన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్... చివర్లో జాన్సెన్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కొద్దిసేపు నిలబడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (నాటౌట్) 109; అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్లా 36; తిలక్ వర్మ (నాటౌట్) 120; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: జాన్సెన్ 4–0–42–0, కొయెట్జీ 3–0–43–0, సిపామ్లా 4–0–58–1, సిమ్లేన్ 3–0–47–0, మహరాజ్ 3–0–42–0, మార్క్రమ్ 2–0–30–0, స్టబ్స్ 1–0–21–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 1; హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్ దీప్ 8; స్టబ్స్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 43; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36; జాన్సెన్ (నాటౌట్) 29; సిమ్లేన్ (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2; కొయెట్జీ (సి) సామ్సన్ (బి) అక్షర్ 12; మహరాజ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6; సిపామ్లా (సి) అక్షర్ (బి) రమణ్దీప్ 3; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–10, 4–10, 5–96, 6–96, 7–105, 8–131, 9–141, 10–148. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–20–3, పాండ్యా 3–1–8–1, రమణ్దీప్ 3.2–0–42–1, వరుణ్ 4–0–42–2, బిష్ణోయ్ 3–0–28–1, అక్షర్ 2–0–6–2. 283 టి20ల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు. గత నెలలో హైదరాబాద్లో బంగ్లాదేశ్పై భారత్ 297 పరుగులు చేసింది. 210 సామ్సన్, తిలక్ జోడించిన పరుగులు. ఏ వికెట్కైనా భారత్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్పై 2024లో) రికార్డు కనుమరుగైంది. 5 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో బ్యాటర్ తిలక్ వర్మ. భారత్ తరఫున సామ్సన్ ఇదే సిరీస్లో ఆ రికార్డు నమోదు చేయగా... గతంలో మరో ముగ్గురు గుస్తావ్ మెక్కియాన్, ఫిల్ సాల్ట్, రిలీ రోసో ఈ ఘనత సాధించారు. 3 ఒకే మ్యాచ్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చెక్ రిపబ్లిక్, జపాన్ బ్యాటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు. -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్గా 46 రన్స్తో 187కు పైగా స్ట్రైక్రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్బర్గ్ మ్యాచ్లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్లో మూడో మ్యాచ్లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగే తిలక్... ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్లో తిలక్ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్డౌన్లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్రౌండర్గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్దీప్ బౌలింగ్లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో తిలక్.. అర్ష్దీప్ బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
భువనేశ్వర్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై కూడా అర్ష్దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్కు పంపిన అర్ష్దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్కు 80 మ్యాచ్లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్లలో 96 వికెట్లు2. అర్ష్దీప్ సింగ్- 59 మ్యాచ్లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్బర్గ్లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్డౌన్లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా తిరిగి పుంజుకుంది. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.దీంతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(107 నాటౌట్) ఆజేయ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అనంతరం లక్ష్య చేధనలో ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగల్గింది. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మళ్లీ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమ్ మీటింగ్లో మేము చాలా విషయాలు చర్చించుకున్నాము. మా బ్రాండ్ క్రికెట్ను కొనసాగించాలనుకున్నాము. సెంచూరియన్లో అదే చేసి చూపించాము.జట్టులో ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఓ క్లారిటీ ఉంది. మా కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు దూకుడుగా ఆడి నా పనిని సులువు చేస్తున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతుండటం చాలా అనందంగా ఉంది. మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం.మేము సరైన దిశలో వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇక తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 అనంతరం తిలక్ నా గదికి వచ్చి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమివ్వండి అని అడిగాడు.అందుకు నేను సరే అని పూర్తి స్వేచ్ఛగా ఆడమని చెప్పాను. తను చెప్పినట్లే తిలక్ అదరగొట్టాడు. తొలి సెంచరీ సాధించడంతో అతడి కుటంబ సభ్యులు ఆనందపడి ఉంటారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: ఆ నలుగురు మావాడి కెరీర్ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
తిలక్ తుఫాన్.. మూడో టీ20లో భారత్ గెలుపు
గతేడాది విండీస్ గడ్డపై టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్లు (18 టి20లు, 4 వన్డేలు) ఆడాడు. అడపాదడపా రాణించినా... తాజాగా తన 19వ టి20 మ్యాచ్లో చేసిన తుఫాన్ సెంచరీ కెరీర్లో కలకాలం గుర్తుండిపోతుంది. ఇన్నింగ్స్ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్ ఆఖరి బంతిదాకా అజేయంగా నిలిచాడు. సఫారీ గడ్డపై తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని సాఫల్యం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియాను ఓడిపోకుండా నిలబెట్టాడు. వన్డే కెరీర్ను కూడా విదేశీ గడ్డపై (శ్రీలంక) మొదలుపెట్టిన ఈ టాపార్డర్ బ్యాటర్ ఇప్పుడు తొలి శతకాన్ని విదేశంలోనే నమోదు చేయడం విశేషం. సెంచూరియన్: హైదరాబాదీ సంచలనం ఠాకూర్ తిలక్ వర్మ అజేయ సెంచరీతో భారత్కు విజయ తిలకం దిద్దడంతో పర్యాటక జట్టు ఇక ఈ సిరీస్ గెలిచే స్థితిలో తప్ప ఓడే అవకాశం లేదు. మూడో టి20లో 11 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నాలుగు మ్యాచ్ల సిరీస్లో పైచేయి సాధించింది. భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా, శుక్రవారం (15న) జొహన్నెస్బర్గ్లో ఆఖరి నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీస్కోరు చేసింది. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్లు) శతక్కొట్టగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచేశాడు. సిమ్లేన్, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఓడింది. మార్కొ జాన్సెన్ (17 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్లు), క్లాసెన్ (22 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్లు) విరుచుకుపడ్డారు. 51 బంతుల్లోనే సెంచరీ వరుసగా రెండో మ్యాచ్లోనూ సంజూ సామ్సన్ (0) డకౌటయ్యాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్... ఓపెనర్ అభిషేక్తో ధనాధన్ ఆటకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరి జోరుతో 8.1 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరింది. అదే ఓవర్లో అభిషేక్ 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ సూర్యకుమార్ (1), హార్దిక్ పాండ్యా (18; 3 ఫోర్లు) మెరిపించలేదు. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాక తిలక్ విశ్వరూపం చూపించాడు. కేశవ్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన తిలక్... కొయెట్జీ 16వ ఓవర్లో 2 సిక్స్లు, ఒక బౌండరీ బాదడంతో ఈ రెండు ఓవర్ల వ్యవధిలోనే 55 స్కోరు నుంచి అనూహ్యంగా 87కు చేరాడు. 19వ ఓవర్లో ఫోర్ కొట్టి 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రమణ్దీప్ (6 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో భారత్ 200 పైచిలుకు స్కోరు చేసింది. క్లాసెన్, జాన్సెన్ మెరుపులు దూకుడుగా మొదలైన దక్షిణాఫ్రికా లక్ష్యఛేదనకు మూడో ఓవర్ నుంచే ముకుతాడు పడింది. రికెల్టన్ (20), హెండ్రిక్స్ (21), స్టబ్స్ (12), కెపె్టన్ మార్క్రమ్ (18 బంతుల్లో 29; 2 సిక్స్లు) ధాటిగా ఆడే క్రమంలో వికెట్లను పారేసుకున్నారు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి టాప్–4 బ్యాటర్లను కోల్పోయిన సఫారీ 84 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో 136 పరుగుల సమీకరణం ఆతిథ్య జట్టుకు కష్టమైంది. అయితే హిట్టర్ క్లాసెన్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ 6, 6, 6, 0, 4, 1లతో 23 పరుగుల్ని పిండుకున్నాడు. అతని జోరుకు అర్ష్ దీప్ కళ్లెం వేయగా, తర్వాత జాన్సెన్ ధనాధన్ షోతో భారత శిబిరాన్ని వణికించాడు. చివరి 2 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 51 పరుగులు కావాలి. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జాన్సెన్ 26 పరుగులు సాధించాడు. విజయం కోసం దక్షిణాఫ్రికా 6బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి ఓవర్లో అర్ష్ దీప్ అతన్ని అవుట్ చేయడంతో భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 50; తిలక్ వర్మ (నాటౌట్) 107; సూర్యకుమార్ (సి) జాన్సెన్ (బి) సిమ్లేన్ 1; హార్దిక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కేశవ్ 18; రింకూ సింగ్ (బి) సిమ్లేన్ 8; రమణ్దీప్ (రనౌట్) 15; అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–110, 4–132, 5–190, 6–218. బౌలింగ్: జాన్సెన్ 4–0–28–1, కొయెట్జీ 3–0–51–0, సిపామ్లా 4–0–45–0, సిమ్లేన్ 3–0–34–2, మార్క్రమ్ 2–0–19–0, కేశవ్ 4–0–36–2.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) అర్ష్ దీప్ 20; హెండ్రిక్స్ (స్టంప్డ్) (బి) వరుణ్ 21; మార్క్రమ్ (సి) రమణ్దీప్ (బి) వరుణ్ 29; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ 12; క్లాసెన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 41; మిల్లర్ (సి) అక్షర్ (బి) హార్దిక్ 18; జాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 54; కొయెట్జీ (నాటౌట్) 2; సిమ్లేన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–27, 2–47, 3–68, 4–84, 5–142, 6–167, 7–202. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–3, హార్దిక్ 4–0–50–1, అక్షర్ 4–0–29–1, వరుణ్ 4–0–54–2, రవి బిష్ణోయ్ 4–0–33–0.8 ఈ ఏడాది భారత జట్టు టి20ల్లో 8 సార్లు 200 పైచిలుకు పరుగులు సాధించింది. గత ఏడాది భారత జట్టు ఏడుసార్లు ఈ మైలురాయిని దాటింది.12 అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ సాధించిన 12వ భారతీయ క్రికెటర్గా తిలక్ వర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ సామ్సన్ (2), సురేశ్ రైనా (1), దీపక్ హుడా (1), విరాట్ కోహ్లి (1), శుబ్మన్ గిల్ (1), యశస్వి జైస్వాల్ (1), రుతురాజ్ గైక్వాడ్ (1), అభిషేక్ శర్మ (1) ఉన్నారు. అంతర్జాతీయ టి20ల్లో ఓవరాల్గా భారత క్రికెటర్లు 21 సెంచరీలు నమోదు చేశారు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. శతక్కొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా భారీ స్కోర్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అభిషేక్ శర్మ తనవంతుగా మెరుపు అర్ద శతకం (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. తిలక్ కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్దీప్ సింగ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖరి ఓవర్ను మార్కో జన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం నాలుగు పరుగులలు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమ్లేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జన్సెన్కు ఓ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
మరో విజయం లక్ష్యంగా...
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు. మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్కు, ఇటు పేస్ బౌలింగ్కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్లు)నే సమం చేస్తుంది. అందరూ చెలరేగితే... తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం. గెలిపించేది ఎవరు... సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్లేన్ గత మ్యాచ్లో విఫలమైనా... మరో మ్యాచ్లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది. -
సౌతాఫ్రికాతో టీ20లు.. తిలక్ రీ ఎంట్రీ.. ఆర్సీబీ స్టార్ అరంగేట్రం!
టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్పై 3-0తో వైట్వాష్ చేసి సత్తా చాటాడు.సఫారీ పిచ్లపై అంత ఈజీ కాదుఅయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్లను క్లీన్స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.తిలక్ వర్మ పునరాగమనం ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు. ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.ఈసారి ఛాన్స్ పక్కా ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్లో అక్షర్ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రొటిస్తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్లో భాగంగా ఆర్సీబీ యశ్ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు -
భారత్ వర్సెస్ అఫ్గాన్ సెకెండ్ సెమీస్.. తుది జట్లు ఇవే
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది. బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.తుది జట్లుఇండియా-ఎ : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ -
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
పాక్పై విజయం.. భారత్ ‘ఎ’ శుభారంభం
అల్ అమ్రత్: ఎమర్జింగ్ కప్ ఆసియా టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ఒమన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్పై భారత్ విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ‘ఎ’జట్టు 7 పరుగుల తేడాతో పాకిస్తాన్ షహీన్స్ జట్టుపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. యువ భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (35 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... ఓపెనర్లు అభిషేక్ శర్మ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు ఆకట్టుకోవడంతో పవర్ప్లే ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల రాక మందగించినా... చివర్లో తిలిక్ వర్మ ధాటిగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. నేహల్ వధేరా (25; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ షహీన్స్ బౌలర్లలో సూఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరాఫత్ మిన్హాస్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, ఒక సిక్సర్), యాసిర్ ఖాన్ (22 బంతుల్లో 33; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఖాసిమ్ అక్రమ్ (27), అబ్దుల్ సమద్ (25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన దశలో పాకిస్తాన్ షహీన్స్ జట్టు 16 పరుగులకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్, నిషాంత్ సలామ్ చెరో రెండు వికెట్లు తీశారు. అన్షుల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో యూఏఈ జట్టు 4 వికెట్ల తేడాతో ఒమన్పై గెలిచింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తదుపరి మ్యాచ్లో భారత్ ‘ఎ’జట్టు సోమవారం యూఏఈతో తలపడనుంది. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ఇన్నింగ్స్: 183/8 (తిలక్ వర్మ 44, ప్రభ్సిమ్రన్ సింగ్ 36, అభిషేక్ శర్మ 35; సూఫియాన్ ముఖీమ్ 2/28), పాకిస్తాన్ షహీన్స్ ఇన్నింగ్స్: 176/7 (అరాఫత్ మిన్హాస్ 41, యాసిర్ ఖాన్ 33; అన్షుల్ కంబోజ్ 3/33, నిషాంత్ సింధు 2/15). -
Ind vs Pak: భారత్దే విజయం
ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A. జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రన్సింగ్ శుభారంభం అందించగా.. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్లో అలరించాడు.ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- పాక్ యువ జట్టు ఒమన్లోని అల్ అమెరట్ వేదికగా శనివారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు.ప్రభ్సిమ్రన్ ధనాధన్.. తిలక్ కెప్టెన్ ఇన్నింగ్స్కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్దీప్ సింగ్(17) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఆయుశ్ బదోని(2), నిషాంత్ సంధు(6), అన్షుల్ కాంబోజ్(0), రాహుల్ చహర్(4*), రసిద్ దార్ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.ఇక పాక్ బౌలర్లలో ఇమ్రాన్, జమాన్ ఖాన్, మిన్హాస్, కాసిం అక్రం ఒక్కో వికెట్ తీయగా.. సూఫియాన్ ముకీమ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్ రాణించిన కారణంగా పాకిస్తాన్కు తిలక్ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ప్లేయింగ్ ఎలెవన్ఇండియాఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాకిస్తాన్హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా? -
Asia Cup: పాక్తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మొదటి మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్తో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఆక్టోబర్ 19న మస్కట్లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది.ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇండియా జట్టులో తిలక్తో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు దక్కింది.అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు హ్యారీస్ ఉవ్విళ్లరూతున్నాడు.ఫైనల్ ఎప్పుడంటే?కాగా ఆక్టోబర్ 18న హాంకాంగ్, చైనా మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి.గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఎమర్జింగ్ ఆసియాకప్ మ్యాచ్లను భారత్లో ఫ్యాన్కోడ్ యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు.భారత్ ఎ: తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా సలాం, సాయి కిషోర్, రాహుల్ చాహర్పాకిస్థాన్ ఎ: మహ్మద్ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఖాసిమ్ అక్రమ్, అహ్మద్ డానియాల్, షానవాజ్ దహానీ, మహ్మద్ ఇమ్రాన్, హసీబుల్లా ఖాన్ (వికెట్-కీపర్), యాసిర్ ఖాన్, జమాన్ ఖాన్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖిమ్, మెహ్రాన్ ముఖిమ్ , అబ్దుల్ సమద్, ఒమైర్ యూసుఫ్ -
Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా తిలక్ వర్మ
ఒమన్ వేదికగా జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం అభిషేక్ శర్మ, స్పిన్నర్ రాహుల్ చాహర్ భాగమయ్యారు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ)లకు చోటు దక్కింది. అండర్-19 వరల్డ్కప్-2022లో అదరగొట్టిన ఆల్రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం లభించింది. ఇక ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది.కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.ఎమర్జింగ్ ఆసియా కప్నకు భారత్-ఏ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్. -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్గా తిలక్ వర్మ
దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలోని తొలి రెండు మ్యాచ్ల్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వైస్ కెపె్టన్గా రాహుల్ సింగ్ను నియమించారు. గ్రూప్ ‘బి’లో ఉన్న హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్ను హైదరాబాద్లో అక్టోబర్ 11 నుంచి గుజరాత్ జట్టుతో... రెండో మ్యాచ్ను డెహ్రాడూన్లో అక్టోబర్ 18 నుంచి ఉత్తరాఖండ్తో ఆడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ(కెప్టెన్ ), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, కన్నాల నితేశ్, అభిరత్ రెడ్డి, హిమతేజ, రాహుల్ రాధేశ్, రక్షణ్ రెడ్డి, కార్తికేయ కక్, శరణు నిశాంత్, ధీరజ్ గౌడ్.స్టాండ్ బైస్: బుద్ధి రాహుల్, వరుణ్ గౌడ్, రిషబ్ బస్లాస్, భగత్ వర్మ, అజయ్దేవ్ గౌడ్. హెడ్ కోచ్: వినీత్ సక్సేనా. అసిస్టెంట్ కోచ్: ఎస్ఎన్ అమీత్, ఫీల్డింగ్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్: అర్జున్ హోయ్సాలా. ఫిజియో: సవ్యసాచి. వీడియో ఎనలిస్ట్: కృష్ణా రెడి. మసాజర్: సయ్యద్ సాజిద్. -
భారత్-సితో మ్యాచ్.. శాశ్వత్ రావత్ అజేయ సెంచరీ
సాక్షి, అనంతపురం: మిడిలార్డర్ ఆటగాడు శాశ్వత్ రావత్ (235 బంతుల్లో 122 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘సి’జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘ఎ’జట్టు 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ ‘సి’జట్టు బౌలర్ల ధాటికి 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ‘ఎ’జట్టును శాశ్వత్ రావత్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ప్రథమ్ సింగ్ (6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6), హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుషాగ్ర (0) విఫలమయ్యారు. ఈ దశలో షమ్స్ ములానీ (76 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి శాశ్వత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. దులీప్ ట్రోఫీలో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఆకట్టుకుంటున్న ఆల్రౌండర్ షమ్స్ ములానీ మరోసారి తన విలువ చాటుకున్నాడు. భారత్ ‘సి’జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్లో 8 వికెట్లతో సత్తాచాటిన అన్షుల్... ఆరంభంలోనే పదునైన పేస్తో ప్రత్యర్థి టాపార్డర్ను కుప్పకూల్చాడు. జట్టు స్కోరులో సింహభాగం పరుగులు చేసిన శాశ్వత్ అజేయంగా నిలవగా... అతడితో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; తిలక్ వర్మ (రనౌట్) 5; రియాన్ పరాగ్ (సి) సాయి సుదర్శన్ (బి) విజయ్ కుమార్ వైశాఖ్ 2; శాశ్వత్ రావత్ (నాటౌట్) 122; కుమార్ కుషాగ్ర (సి) ఇషాన్ కిషన్ (బి) విజయ్ కుమార్ వైశాక్ 0; షమ్స్ ములానీ (సి) రజత్ పాటిదార్ (బి) గౌరవ్ యాదవ్ 44; తనుశ్ కొటియాన్ (సి) బాబా ఇంద్రజిత్ (బి) అన్షుల్ కంబోజ్ 10; అవేశ్ ఖాన్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు: 13, మొత్తం: (77 ఓవర్లలో 7 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–11; 2–14; 3–17; 4–35; 5–36; 6–123; 7–154, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 14–2–40–3; గౌరవ్ యాదవ్ 17–7–46–1; విజయ్కుమార్ వైశాఖ్ 15–1–33–2; పులి్కత్ నారంగ్ 21–0–58–0; మానవ్ సుతార్ 10–1–38–0. -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్తో నాటౌట్గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
ముంబైపై ఢిల్లీ పైచేయి
-
మంచి మనసు చాటుకున్న తిలక్ వర్మ.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ మంచి మనసు చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతుగా వచ్చిన చిన్నారులకు ఊహించని బహుమతి ఇచ్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్పై విజయంలో తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ లెఫ్టాండర్.. సూర్యకుమార్ యాదవ్(78)తో కలిసి ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. The 𝕊𝕦𝕡𝕝𝕒 shot we've been waiting for 🤌#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/XyiGgWs0fN — JioCinema (@JioCinema) April 18, 2024 మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 34 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు తిలక్ వర్మ. అంతేకాదు.. ముంబై విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రమాదకరంగా మారిన పంజాబ్ కింగ్స్ సంచలనం శశాంక్ సింగ్(25 బంతుల్లో 41) వికెట్ పడగొట్టడంలో భాగస్వామ్యమయ్యాడు కూడా! పంజాబ్ ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపాడు. మిడ్ వికెట్ ఫీల్డ్ పొజిషన్లో ఉన్న తిలక్ వర్మ ఏమాత్రం పొరపాటు చేయకుండా వేగంగా కదిలి క్యాచ్ అందుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన ముంబై ఎట్టకేలకు తొమ్మిది పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఫలితంగా సొంతమైదానం ముల్లన్పూర్లో పంజాబ్ గెలుపొందితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో విజయానంతరం డ్రెస్సింగ్రూంకు వెళ్తున్న తరుణంలో తిలక్ వర్మ.. టెస్టు జెర్సీలు వేసుకున్న ముగ్గురు అమ్మాయిలు ఇంకా స్టేడియంలో ఉండటాన్ని గమనించి.. తన బ్యాటింగ్ గ్లోవ్స్ను వారి వైపునకు విసిరాడు. ఆ ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు గ్లోవ్స్ను క్యాచ్ పట్టి థాంక్యూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పాటు.. ఓ కీలక క్యాచ్ అందుకున్నాడు. అలాగే ఇద్దరు వర్ధమాన క్రికెటర్లు తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ కారణాన్ని కూడా చూపించాడు. తిలక్ వర్మ హ్యాట్సాఫ్’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది టీమిండియాలోనూ అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికీ ముంబై ఫ్రాంఛైజీతో కొనసాగుతున్న ఈ తెలుగు తేజం తిలక్.. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి 208 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ముంబై ఈ ఎడిషన్లో ఏడింట మూడు విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో Scored 34* (18), took an important catch and this… Gave two budding cricketers a reason to believe in their dreams. Tilak Varma, 🙏👍🥹#MumbaiMeriJaan #MumbaiIndians #PBKSvMI | @TilakV9 pic.twitter.com/nZIifQAcZh — Mumbai Indians (@mipaltan) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్కతా నైట్రైడర్స్కు.. హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్కు.. హైదరాబాద్కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
ఐపీఎల్కు ముందు సిక్సర్ల వర్షం కురిపించిన తిలక్ వర్మ..
ఐపీఎల్-2024 సీజన్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుది. మార్చి 22న చెపాక్ వేదికగా తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ క్యాష్రిచ్ లీగ్ కోసం ఇప్పటికే మొత్తం అన్ని జట్లు తమ అస్త్ర, శాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2022 సీజన్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ యువ సంచలనం.. 740 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలోనూ వర్మ సత్తాచాటాడు. ఏకంగా మూడు సెంచరీలను తిలక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే దూకుడును ఐపీఎల్లోనూ కొనసాగించాలని ఈ హైదరాబాదీ ఊవ్విళ్లరుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 24 అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. చదవండి: Hardik Pandya: అప్పటికే ఫిట్గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే! Tilak’s bat striking the 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭 chord in the nets 🎶🤌#OneFamily #MumbaiIndians #NetSetGo @TilakV9 pic.twitter.com/jcsT3NfYBX — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల వయసులో వీళ్లకు ఛాన్స్! రూ. కోటి..
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్ల(2023-24)లో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?! రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్లు, 31 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్ రింకూ సింగ్ రెండు మ్యాచ్లలో కలిపి 55 పరుగులు సాధించాడు. నంబూరి తిలక్ వర్మ హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అండర్19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ గోల్డ్ మెడల్ అందించాడు. శివం దూబే సీఎస్కే స్టార్ క్రికెటర్, ముంబై పేస్ ఆల్రౌండర్ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు. రవి బిష్ణోయి రాజస్తాన్కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్. ముకేశ్ కుమార్ బెంగాల్ పేసర్, 30 ఏళ్ల ముకేశ్ కుమార్ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్ బౌలర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ప్రసిద్ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ మధ్యప్రదేశ్కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్. 27 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు. రజత్ పాటిదార్ లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్. 1993లో ఇండోర్లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు. జితేశ్ శర్మ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్హ్యాండర్ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు -
రెచ్చిపోయిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!
నవీ ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20లో టోర్నీలో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ఆడుతున్న తిలక్.. సెంట్రల్ రైల్వే టీమ్తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 43 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్.. సహచరుడు శివాలిక్తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు రిలయన్స్ 1 స్టార్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇదే టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ రెండో మ్యాచ్లోనే జట్టులో కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ మళ్లీ గాయం బారిన పడ్డాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. హార్దిక్, తిలక్ ఇద్దరు ముంబై ఇండియన్స్కు ఆడనున్న విషయం తెలిసిందే. చదవండి: హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. తొలి మ్యాచ్లోనే..! -
IPL 2024: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ
టీమిండియా యువ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తిలక్ వర్మ గురువారం షేర్ చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ చాంపియన్గా హైదరాబాద్ అవతరించిన విషయం తెలిసిందే. తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ ఫైనల్లో మేఘాలయను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అదే విధంగా వచ్చే ఏడాది ఎలైట్ గ్రూపులో తలపడే అవకాశం దక్కించుకుంది. తిలక్ వర్మ కెప్టెన్గా, బ్యాటర్గా రాణించి జట్టుకు ఈ మేరకు విజయాలు అందించాడు. ఇక తదుపరి అతడు ఐపీఎల్-2024తో బిజీ కానున్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ త్వరలోనే జట్టు శిక్షణా శిబిరంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటిన తిలక్ వర్మను ఐపీఎల్-2022కు ముందు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత రెండు సీజన్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. వరుసగా 397, 343 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ వెస్టిండీస్తో 2023 టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు, 4 వన్డేలు ఆడి .. ఆయా ఫార్మాట్లలో 336, 68 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్లో లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్లలో తొలి మ్యాచ్ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
దుమ్ములేపిన తిలక్ సేన.. చాంపియన్గా హైదరాబాద్
రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. మేఘాలయ టీమ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్- మేఘాలయ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 17న మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్ రాయుడు మూడు, రిషభ్ బస్లాస్, కెప్టెన్ తిలక్ వర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది. కె.నితేశ్రెడ్డి సెంచరీ(122)తో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ ప్రజ్ఞయ్రెడ్డి అజేయ శతకం(141 బంతుల్లో 102 పరుగులు) సాధించాడు. మరోవైపు.. కెప్టెన్ తిలక్ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మేఘాలయను లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ మరోసారి దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 5 వికెట్లు తీసి మేఘాలయ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో 243 పరుగులకే మేఘాలయ కథ ముగిసింది. ఈ క్రమంలో 198 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(62), కెప్టెన్ తిలక్ వర్మ(64) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. తాజా సీజన్లో ప్లేట్ గ్రూప్లో ఉన్న హైదరాబాద్, మేఘాలయ ఇప్పటికే ఎలైట్ డివిజన్కు అర్హత సాధించాయి. వచ్చే ఎడిషన్లో ఎలైట్ గ్రూపులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, మంగళవారం ముగిసిన ఫైనల్లో మేఘాలయపై పైచేయి సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది హైదరాబాద్. తద్వారా ప్లేట్ గ్రూపు చాంపియన్గా అవతరించింది. -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్తో మ్యాచ్లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
తిలక్ వర్మ మెరుపు సెంచరీ.. హైదరాబాద్ ఘన విజయం
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్లేట్ గ్రూప్లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ మెరుపు సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న వర్మ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సెంచరీలతో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సిక్కిం.. హైదరాబాద్ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్లో కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో త్యాగరాజన్ 6 వికెట్లతో సిక్కి పతనాన్ని శాసించగా.. మిలాంద్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ను 463/4 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తిలక్తో పాటు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137; 125 బంతుల్లో) కూడా సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం 384 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన సిక్కిం 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఈ ఏడాది రంజీ సీజన్లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఆ రెండూ క్లిష్టమైనవే! -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
తొలిరోజే దంచికొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు.. 302 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Sikkim Day 1 - Hyderabad lead by 302 runs: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ రంజీల్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆరంభమైన తర్వాత దేశవాళీ జట్టుకు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా అఫ్గన్తో జరిగిన తొలి టీ20లో వన్డౌన్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20తో విరాట్ కోహ్లి పునరాగమనం చేసిన నేపథ్యంలో తిలక్పై వేటు పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు ఈ హైదరాబాద్ బ్యాటర్. ఈ క్రమంలో శుక్రవారం నాటి హైదరాబాద్- సిక్కిం మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. 79 పరుగులకే సిక్కిం ఆలౌట్ ఈ మ్యాచ్లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హైదరాబాద్ బౌలర్లు టి.త్యాగరాజన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సీవీ మిలింద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు సిక్కిం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(137), గహ్లోత్ రాహుల్ సింగ్(83) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. వరుసగా రెండు విజయాలు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ తిలక్ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న చందన్ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. రంజీ తాజా సీజన్లో ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది. తిలక్(అజేయ సెంచరీ) సారథ్యంలో నాగాలాండ్పై, గహ్లోత్ రాహుల్ సింగ్ కెప్టెన్సీలో మేఘాలయపై గెలుపొందింది. తాజాగా మళ్లీ తిలక్ నేతృత్వంలో ఆడుతున్న హైదరాబాద్ ఈసారి సిక్కింను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక రంజీ సీజన్-2024లో హైదరాబాద్కు ఇది మూడో మ్యాచ్! చదవండి: Ranji Trophy 2024: బ్యాట్తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై!