తారలు తరలి వెళ్లారు... | Celebrities from the worlds of film sports,business and politics gather at Dubai Stadium | Sakshi
Sakshi News home page

తారలు తరలి వెళ్లారు...

Published Mon, Feb 24 2025 3:59 AM | Last Updated on Mon, Feb 24 2025 3:59 AM

Celebrities from the worlds of film sports,business and politics gather at Dubai Stadium

దుబాయ్‌: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్‌ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.

టీమిండియా క్రికెటర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్‌ ధావన్, వెంకటేశ్‌ ప్రసాద్‌... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిన సుకుమార్, బాలీవుడ్‌ నుంచి హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి రాగా, వివేక్‌ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్‌ సంగ్మా, త్రిపుర వెస్ట్‌ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్‌ కుమార్‌ దేబ్, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, బ్రిటన్‌ పాప్‌ సింగర్‌ జాస్మిన్‌ వాలియా, బాలీవుడ్‌ చిత్ర గీతాలతో పాపులర్‌ అయిన పాకిస్తాన్‌ సింగర్‌ అతీఫ్‌ అస్లామ్‌ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. 

పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీమ్, పాక్‌ దివంగత ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమార్తె భక్తావర్‌ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారుడు ఖాసీమ్‌ ఖాన్, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement