sonam Kapoor
-
తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్
నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor). కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.బిడ్డ పుట్టాక మారిపోయానుకెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని సోనమ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.నచ్చితేనే చేస్తానా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ వివరించింది. -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
తెల్ల గులాబీలా హీరోయిన్.. వాచ్ ధర అన్ని లక్షలా?!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లో ఆమె ఒకరు. నేషనల్ ఫీల్మ్ అవార్డుతో సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి. అలాగే ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో 2012, 2016లలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేగాదు ఆమె ఇల్లు కూడా భారతీయ వారసత్వ కళకు అద్దం పట్టేలా అత్యంత అందంగా ఉంటుంది. ఫ్యాషన్ పరంగా కూడా సోనమ్కి సాటి లేరెవ్వరూ. అంతలా ఆమె ఫ్యాషన్ వార్డ్ రోబ్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దాని ధర కూడా అంతేస్థాయిలో అవాక్కయ్యేలా ఉంటుంది. మరీ ఆ వాచ్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.సోనమ్ కపూర్(Sonam Kapoor) ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్(Paris Fashion Week)లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో(Elie Saab haute couture show)కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్లో మైమరిపించింది. ఆమె పీస్ఫుల్ డ్రెస్సింగ్ వేర్ మనసుకు ఆహ్లాదంగా కనుచూపుని తిప్పుకోని విధంగా ఉంది. ముఖ్యంగా ఆమె చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ - పియాజెట్ లైమ్లైట్ గాలా ప్రెషియస్ రెయిన్బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్ చేశారు. అచ్చం రెయిన్ బో కలర్స్ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్. బ్రాస్లెట్ మాదిరిగా ఉన్న ఈ వాచ్ ధర దగ్గర దగ్గర రూ. 94 లక్షలు పైనే అంటే.. రూ. 1 కోటి పలుకుతుందట. 1973ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనుసుని దోచుకునేలా హైలెట్గా నిలిచింది. ఇక సోనమ్ తన సోదరి, స్టైలిస్ట్ చిత్ర నిర్మాత రియా కపూర్ డిజైన్ చేసిన డ్రెస్ని ధరించారు. ఆ డ్రస్కి తగ్గట్టు సన్గ్లాసెస్, గులాబీ ఆకారపు చెవిపోగులు, స్టేట్మెంట్ రింగులు, ఈ లగ్జరీ వాచ్తో రాయల్టీగా కనిపించారు సోనమ్. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: 61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..) -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ పాతికేళ్ల పండగలో మెరిసిన తారలు
-
ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో స్టైలిష్గా సోనమ్ (ఫోటోలు)
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
సోనమ్ కపూర్ డ్రీమ్ హౌస్, అది మరో ప్రపంచం
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్లో పాలుపంచుకుంది.మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి. ప్రాచీన వస్తువుల సేకరణ‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్పేపర్తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.అమ్మమ్మ ప్రభావంకపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. -
సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్తో సరికొత్త ట్రెండ్ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్ఫిట్లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్వేర్తో ఫ్యాషన్కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్లో డిఫెరెంట్గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్తో మహారాణిల మెరిసిపోయింది. ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్లెస్లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్ని ధరించానని ఇన్స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్వేర్లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..) -
స్టార్ హీరోయిన్ ఒంటిపై మట్టితో చేసిన డ్రస్ (ఫొటోలు)
-
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
పారిస్ ఫ్యాషన్ వీక్ : గ్లామ్ లుక్తో అదరగొట్టిన మరో బాలీవుడ్ దివా
-
ఘనమైన ఎరుపు, పారాణి మెరుపు : సోనమ్ కపూర్ సౌందర్యం (ఫొటోలు)
-
దుబాయిలో రెస్టారెంట్ ఓపెనింగ్లో సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
Sonam Kapoor: కొత్త ఇంటిలో మోడ్రన్ డ్రెస్లతో సోనమ్ స్టన్నింగ్ లుక్స్..!
-
ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా..
చావు గురించి ఆలోచించడం మంచిదే అంటున్నాడు హాలీవుడ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కెను రీవ్స్. అవును, తను చెప్తోంది నిజమేనని, మరణం గురించి ఆలోచించడం ఒకరకంగా మంచి విషయమేనంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. 21వ శతాబ్దంలో నాలుగో గ్రేటెస్ట్ యాక్టర్గా కీర్తి గడించిన కెను రీవ్స్.. ద బుక్ ఆఫ్ ఎల్స్వేర్ అనే నవల రాశాడు. దీన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాడు. మరణం గురించే ఆలోచనఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. అంటే మరణాన్ని తలుచుకుంటే బతికి ఉన్నంత కాలం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నటుడు చెప్తున్నాడు.సినిమాలు..ఇది కరెక్టే అనిపించడంతో సోనమ్ కపూర్ ఈ క్లిప్పింగ్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కాగా సోనమ్.. సావరియా సినిమాతో హీరోయిన్గా మారింది. ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐషా, థాంక్యూ, బేవకూఫియాన్, భాగ్ మిల్కా భాగ్, ఖుబ్సూరత్, నీర్జ, ప్యాడ్ మ్యాన్, వీరు ది వెడ్డింగ్, సంజు, ద జోయా అక్తర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన బ్లైండ్ సినిమాలో చివరగా కనిపించింది.చదవండి: మళ్లీ తల్లి కాబోతున్నాను -
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్. ఇవాళ తాజాగా 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్ సినిమాలో కనిపించింది. సోనమ్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.సోనమ్ కపూర్ ఇన్స్టాలో రాస్తూ.. 'ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు." అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
32 కిలోలు పెరిగా.. లైఫ్ ఒక్కసారిగా ఛేంజ్: హీరోయిన్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో బరువు పెరగడం ఖాయం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఉన్నట్లుండి బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత మామూలైపోయినప్పటికీ మరికొందరు మాత్రం మరింత లావైపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. సోనమ్- అహుజా దంపతులు 2022 ఆగస్టులో వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.32 కిలోలు పెరిగాఆ సమయంలో తాను ఉన్నట్లుండి లావైపోయానంటోంది సోనమ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ తర్వాత నేను 32 కిలోలు పెరిగాను. నిజంగా చాలా బాధేసింది. కానీ ఆ టైంలో బిడ్డగురించే ఆలోచిస్తామే తప్ప సరైన ఫుడ్ తీసుకోవాలని, వర్కవుట్ చేయాలనే ఆలోచించం. మళ్లీ మామూలవడానికి ఏడాదిన్నర పట్టింది. సడన్గా అన్నీ ఛేంజ్కానీ అప్పటికే లైఫ్ మారిపోతుంది. భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్ అవుతుంది. సడన్గా అన్నీ మారిపోయి కొత్తగా అనిపిస్తాయి. మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సోనమ్ వర్కవుట్స్పై ఎక్కువ ఫోకస్ చేసింది. తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ వావ్.. 20 కిలోలు తగ్గాను.. ఇంకా ఆరు తగ్గాలి అని రాసుకొచ్చింది. ఆ ఆరు కూడా ఎప్పుడో తగ్గేసి స్లిమ్గా మారిపోయింది సోనమ్.చదవండి: ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. చివరి చిత్రమిదేనా? -
స్టయిల్ అండ్ సారీ...ఆహా ఎంత అందం, ఎవరే వీరు? (ఫోటోలు)
-
Sonam Kapoor Weight Loss Photos: ఫిట్నెస్ జర్నీతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ (ఫోటోలు)
-
సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్: నటి ఫిట్నెస్ జర్నీ , ఫ్యాన్స్ ఫిదా
చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్నెస్ పరిస్థితి. ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. మళ్లీ మునుపటి స్థాయికి చేరాలంటే అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే తమ ఫిట్నెస్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడు నెలల్లో 20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది. 2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రసవానంతర బరువు తగ్గే క్రమంలోన్నానంటూ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇన్స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నటి “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6 కిలోలు తగ్గాలి అంటూ చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా మారడానికి 16 నెలలు పట్టిందనే విషయాన్ని చెబుతూ లెహంగాలో అమేజింగ్లుక్లో ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్కు షేర్ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్లు , క్రేజీ వర్కౌట్లు లేకుండానే తనని తాను, కొడుకును చూసుకుంటూ నిదానంగా ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ వావ్.. అద్భుతం అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) కాగా వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లొ వివాహం చేసుకుందిసోనమ్.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో కనిపించిన ఈమె మంచి స్క్రిప్ట్తో ఉంటే OTT ప్లాట్ఫారమ్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది. -
Sonam Kapoor Latest Photos: వరల్డ్ కప్ కోసం వచ్చిన డేవిడ్ బెక్హామ్కు విందుపార్టీ ఇచ్చిన హీరోయిన్ (ఫోటోలు)
-
పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారామె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటిగా పురస్కారం లభించింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అయితే తాజాగా ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పంచుకుంది. సోనమ్ కపూర్ అహూజా పండుగ రోజే ముంబయిలోని కొత్త ఇంటికి చేరింది. ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్కు ఏడాది వయసున్న వాయు కపూర్ అహుజా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇది తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోనమ్కు అభినందనలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్స్టాలో రాస్తూ..'మేము ఈ వారంలో మా కొత్త ఇంటికి మారాం . ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మనసులు ఆశతో నిండి ఉన్నాయి. ఇక్కడ కొత్త జ్ఞాపకాలను కోసం మేము వేచి ఉండలేము' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్తో పాటు తాను ఇంట్లో కూర్చొని ఉన్న అందమైన ఫోటోలు పంచుకుంది. (ఇది చదవండి: ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
Vayu's First Birthday: సోనమ్ కపూర్ తనయుడు వాయు ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్!
సీతారామంతో టాలీవుడ్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా.. తన స్నేహితుడు దుల్కర్పై ప్రశంసలు కురిపించాడు. (ఇది చదవండి: ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా) అయితే అదే సమయంలో ఓ స్టార్ హీరోయిన్ను ఉద్దేశించి రానా చేసిన కామెంట్స్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే 2018లో దుల్కర్, సోనమ్ కపూర్ జంటగా 'ద జోయా ఫ్యాక్టర్' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్కు వెళ్లిన రానాకు ఆమె వ్యవహరించిన తీరు కోపం తెప్పించిందట. దుల్కర్ సెట్లో వెయిట్ చేస్తుంటే.. తాను మాత్రం భర్తతో ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసిందని అన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే రానా వివరణ ఇచ్చారు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తన కామెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సోనమ్, దుల్కర్లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. రానా క్షమాపణల తర్వాత సోనమ్ తన ఇన్స్టాలో స్టోరీస్లో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. అది యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్వెల్ట్ రాసిన కోటేషన్. మె తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేస్తూ.. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి. సంకుచితమైన మైండ్సెట్ గలవారే వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.' అంటూ ఆ కోటేషన్లో ఉంది. అయితే ఈ కోట్ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించి చేసిందనే చర్చ మొదలైంది. రానా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. (ఇది చదవండి: ఖుషి ఈవెంట్లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..) -
ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, నటుడు దుల్కర్ సల్మాన్లకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవపట్టిస్తున్నందుకు చింతిస్తున్నానని, ఏది ఏమైనా తన కామెంట్స్ కారణంగా ఇబ్బందిపడుతున్న సోనమ్, దుల్కర్లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు. (చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!) వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో ప్రిరీలీజ్ ఈవెంట్ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా రానా.. దుల్కర్ మంచితనం గురించి మాట్లాడుతూ...‘ఓ రోజు దుల్కర్ నటిస్తున్న సినిమా షూటింగ్కి వెళ్లాను. ఆ సినిమాలో బాలీవుడ్కి చెందిన పెద్ద నటి హీరోయిన్. షూటింగ్ సమయంలో ఆమె నటనపై ఫోకస్ చేయకుండా.. లండన్లో ఉన్న భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దుల్కర్ ఎండలో అలాగే నిలబడి పోయాడు. ఆమె ఎక్కువ టేకులు తీసుకున్నా.. దుల్కర్ మాత్రం ఓపికగా అలానే ఎదురు చూశాడు. నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్ని నేలకేసి కొట్టాను. కానీ దుల్కర్ మాత్రం చాలా సహనంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. రానా ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ సోనమ్ కపూర్నే అని నెట్టింట ప్రచారం జరిగింది. ఆమెను టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేయడంతో తాజాగా రానా ఆ హీరోయిన్కు సారి చెప్పాడు. I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted. I take… — Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023 -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
నిజాలను చూడటం కష్టం!
‘‘కొన్నిసార్లు నిజాలను చూడటం చాలా కష్టం.. మరి మీరు ఆమె చీకటి ప్రపంచాన్ని చూడ్డానికి రెడీ అవుతారా?’’ అంటూ సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్’ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 7 నుంచి ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో సోనమ్ అంధురాలిగా నటించారు. ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బ్లైండ్ పోలీసాఫీసర్గా సోనమ్ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్ పేర్కొంది.. షోమ్ మఖీజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సోనమ్ కనిపించనున్న తొలి చిత్రం ఇదే కాగా, తల్లయ్యాక (గత ఏడాది ఆగస్ట్ 20న ఓ బాబుకి జన్మనిచ్చారు) కనిపించనున్న చిత్రం కూడా ఇదే అవుతుంది. -
థియేటర్లో లైంగిక వేధింపులు.. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2007లో వచ్చిన సల్మాన్ ఖాన్, రణ్బీర్ కపూర్ నటించిన సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా దక్కించుకుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) జూన్ 9న 1985 ముంబయిలో జన్మించిన భామ కుటుంబసభ్యుల మధ్య 38వ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటరాక్షన్కు హాజరైన సోనమ్ ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. యుక్త వయసులోనే తనపై లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. ఈ చర్చలో అనుష్క శర్మ, అలియా భట్, విద్యాబాలన్ మరియు రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఇది విని వారంతా షాక్కు గురయ్యారు. సోనమ్ కపూర్ మాట్లాడుతూ..'13 ఏళ్ల వయస్సులో ఓ చేదు అనుభవం ఎదురైంది. నా స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లా. స్నాక్స్ తీసుకోవడానికి బయటకు వచ్చా. ఆ సమయంలో ఓ వ్యక్తి నా వెనక నుంచి వచ్చి బ్రెస్ట్ను టచ్ చేశాడు. ఊహించని సంఘటనతో ఒక్కసారిగా భయపడి వణికిపోయా. ఆ సమయంలో ఏం జరుగుతుందో నా కర్థం కాలేదు. ఆ షాక్తో అక్కడే కూర్చుని ఏడ్చేశా.' అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి ఎక్కడా నోరు విప్పలేదని అన్నారు. ఇది విని ఆమె పక్కన ఉన్న నటీమణులు షాక్కు గురయ్యారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని సోనమ్ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల జీవితంలో ఇలాంటి సంఘటనలు, మహిళల వేధింపుల గురించి నోరు విప్పాల్సిన అవసరముందని ఆమె సూచించింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) -
డబ్బు గురించి మాట్లాడిన సోనమ్, నెట్టింట ట్రోలింగ్
డబ్బు విలువ ఉన్నవాడికంటే లేనివాడికే బాగా తెలుస్తుందంటారు. చెమటోడ్చి సంపాదించే పది రూపాయలు కూడా ఎంతో విలువైనవిగానే భావిస్తుంటారు కష్టజీవులు. కానీ ధనవంతులు మాత్రం తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయల ముందు లక్ష రూపాయలు కూడా తక్కువే అని చులకనగా చూస్తారు. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ డబ్బు గురించి ఉపన్యసించింది. ఆమె చెప్పాలనుకున్నదేంటో కానీ తన దగ్గర మాత్రం బోలెడంత ఉందని డప్పు కొట్టుకుంది. ఇది చూసి నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. డబ్బు ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది. డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని! ఎందుకంటే అది మాకు కావాల్సినంత ఉంది. కాబట్టి నేనెప్పుడూ డబ్బులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. నాకైతే రూ.65,000 పెద్ద విషయం కాదు. నా డ్రెస్ చూస్తే మీకర్థమవట్లేదా డార్లింగ్.. అంటూ నవ్వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనేం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? బోలెడంత డబ్బు మాత్రమే ఉన్న నువ్వు ఎంత పేదదానివో, నీ మాటలు అందరూ వింటారని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. View this post on Instagram A post shared by enough internet for tonight (@enoughinternetfortonite) -
భార్యతో ఎన్టీఆర్ వెకేషన్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
► భార్యతో న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ ► కుటుంబంతో వెకేషన్కు వెళ్లిన మహేశ్ బాబు ► ధమాకా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ ► అభిమానులను కలిసిన రష్మిక మందన్నా.. ఎమోషనల్ పోస్ట్ ► గోల్డెన్ డ్రెస్లో మెరిసిపోతున్న పూజాహెగ్డే ► రామ్చరణ్, ఉపాసనల క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by RAVI TEJA (@raviteja_2628) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sandeep Molugu (Sandy Artist) (@sandysartistry) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
కొంటెగా చూస్తున్న రకుల్.. మెరిసిపోతున్న కీర్తి సురేష్
► షెహ్నాజ్ గిల్ స్టన్నింగ్ లుక్స్ ► వైట్ కాస్ట్యూమ్లో శిల్పాశెట్టి గ్లామరస్ లుక్ ► స్టైలిష్ లుక్లో మెరిసిపోతున్న పూజా హెగ్డే ► కొంటెగా చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ► కళావతి గ్యాంగ్ను మిస్సవుతున్న కీర్తి సురేష్ ► శారీలో హీరోయిన్ మీనాక్షి అందాల కనువిందు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
సమంతతో సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్స్..
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే.ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్కి గురయ్యారు. ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వెనుక అందాలు మాత్రమే కాదు.. అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్స్ బోలెడంత మంది ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ గురించి ఓసారి తెలుసుకుందాం. ఇలియానా దేవదాస్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమై గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఇల్లూ బేబీ టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా నిలిచింది. అయితే బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్బై చెప్పిన ఇలియానా తనకు డిస్మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా పేర్కొంది. ఇదొక మానసిక వ్యాధి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు కానీ డాక్టర్ల సూచనతో దీన్నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చట. అనుష్క శర్మ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తాను యాంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చొంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది. సోనమ్ కపూర్ స్టార్ కిడ్గా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే సూపర్ క్రేజ్ను దక్కించుకున్న సోనమ్ డయాబెటీస్తో ఇబ్బంది పడుతుందట. అయితే ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పడానికి ఆమె ఏమీ భయపడలేదు. నయనతార లేడీ సూపర్స్టార్గా పేరు సంపాదిచుకున్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఆమెకి స్కిన్ ఎలర్జీ ఉందట. మూవీ షూటింగ్స్లో భాగంగా తరుచూ మేకప్లు వేసుకోవాల్సి రావడంతో స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని జాగ్రత్తలు వాడుతూ మేకప్ని వేసుకోవడానికి ప్రత్యేకమైన టీమ్ను ఆమె నియమించుకుంది. దీంతో పాటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుందట నయన్. ఎప్పుడైనా సరే కూల్ ఐటమ్స్ ఏం తిన్నా వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోవడం,, స్కిన్ పై రాషస్ రావడం వంటివి జరుగుతుంటాయట. ఇప్పటికీ దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. దీపికా పదుకొణె బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పదుకొణె కొన్నాళ్ల పాటు డిప్రెషన్తో పోరాడినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. దీన్నుంచి బయటపడలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు దీపికా బహిరంగంగానే చెప్పింది. ఎక్కువ డిప్రెషన్కు లోనైతే హార్ట్బీట్ ఒకసారిగా పెరిగి అస్వస్థతకు గురవుతుందట.ఇప్పటికీ రెగ్యులర్గా డాక్టర్స్తో టచ్లో ఉంటానని ఈ బ్యూటీ తెలిపింది. పరిణితీ చోప్రా ప్రియాంక చోప్రా సోదరిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. అయితే అక్క సపోర్ట్ లేకుండానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న పరిణితీ కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు తరుచూ డాక్టర్స్ని కలుస్తానని స్వయంగా ఆమె వెల్లడించింది. సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ఎనలేని స్టార్డమ్ను సొంతం చేసుకున్న సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ నిత్యం అభిమానులతో టచ్లో ఉండేది. అయితే కొంతకాలంగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సామ్ తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. -
నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఇక సోనమ్ కపూర్ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రముఖ సెలబ్రెటీ మ్యాగజైన్ వోగ్కు ఫొటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బిడ్డను ఎలా పెంచాలనుకుంటుందో వివరించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తన బిడ్డ భవిష్యత్తుపై ప్రస్తావించింది. ‘మా నాన్న ఓ హీరో. మాది సెలబ్రెటీ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ మమ్మల్ని చాలా సాధారణంగా పెంచారు. చదవండి: ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే.. మా అమ్మనాన్నలు(అనిల్ కపూర్, సునీత్ కపూర్) నన్ను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్థన్ను చాలా గోప్యంగా పెంచారు. సెలబ్రెటీల లైఫ్కు దూరంగా మీడియా దృష్టికి పడకుండ జాగ్రత్త పడ్డారు. వారు అలా ఎలా ఉంచగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక నా విద్యాభ్యాసం అయితే ఏ స్టార్ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్లో జరిగింది. ఆ తర్వాత జూనీయర్ కాలేజ్ కోసం బోర్డింగ్ స్కూల్కి వెళ్లాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకు అలాంటి జీవితమే ఇవ్వాలనుకుంటున్నా. వారిని సెలబ్రిటీ లైఫ్కు దూరంగా ఉంచాలనుకుంటున్నా. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చెప్పాలంటే.. నా బిడ్డను ఇండియాలో చదివించాలా? లండన్లో చదివించాలా? అని ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నా. భారత్లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్న అనుభూతి ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటే నా బిడ్డ విషయంలో గోప్యత కష్టమవుతుంది. అదే సమయంలో చాలామంది స్టార్ కిడ్స్ ఇక్కడ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత కొన్ని అడ్డంకులను చాలా సులువుగా దాటగలమని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది సోనమ్. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చిన ఆమె ఆగస్ట్ 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. -
ఇది ప్రారంభం మాత్రమే!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ‘శనివారం ఉదయం కొడుకు పుట్టాడు.. 2022 ఆగస్టు 20న ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. చిన్నారి రాకతో మా జీవితాలు మారిపోతాయనే విషయం మాకు తెలుసు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. కాగా సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాలు 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు సోనమ్. ఆ తర్వాత బేబీ బంప్తో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. సోనమ్–అహూజా తల్లితండ్రులయిన సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
కృష్ణాష్టమి తెల్లవారే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం కొడుకు పుట్టాడంటూ సోనమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో గుడ్న్యూస్ పంచుకుంది. 'ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు- సోనమ్ - ఆనంద్' అని రాసుకొచ్చింది. కాగా సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిందీ హీరోయిన్. ఆ తర్వాత మెటర్నటీ షూట్ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే! View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) చదవండి: హీరో వరుణ్తేజ్తో రిలేషన్.. నోరు విప్పిన అందాల రాక్షసి అన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానున్న లైగర్! -
ఆ హీరో ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకున్నాడు?
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనడం కన్నా వారిని రోస్ట్ చేసే షో అనడం బెటరేమో! ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని చిత్రవిచిత్ర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఈ షోకు బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇంకేముంది, వచ్చీరాగానే తన ప్రశ్నలకు పదును పెట్టాడు కరణ్. అర్జున్ను ఉద్దేశిస్తూ సోనమ్తో.. నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్తో ఇతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికామె అది నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని బదులిచ్చింది. అందుకు కరణ్ గట్టిగా నవ్వేస్తూ మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని మరింత ఉడికించాడు. ఈ వ్యవహారంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్.. నువ్వెలాంటి సిస్టర్వి అసలు.. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? ఏంటి? అని అడిగాడు. తర్వాత అర్జున్ను నీ ప్రేయసి మలైకా నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు హోస్ట్. దానికతడు నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్ చేసుకున్నానని చెప్తాడు. ఇక ఈ ప్రోమో హాట్స్టార్లో రిలీజవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి సంభాషణ పూర్తిగా వినాలంటే గురువారం వరకు ఆగాల్సిందే! చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ మహేశ్ బాబు 'పోకిరి' స్పెషల్ షో.. ఫ్యాన్స్కు పండగే -
Sonam Kapoor: ప్రెగ్నెన్సీ కష్టాలు.. ఫొటో షేర్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! తాజాగా ఆమె తన కాళ్లు వాచిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మ కావడానికి చేసే ప్రయాణం అంత అందంగా ఏమీ ఉండదు అని రాసుకొచ్చింది. ఫొటో చూస్తుంటే కాళ్లు వాయడంతో తను ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కాగా సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ హీరోయిన్. అప్పటినుంచి తన ప్రతి కదలికను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. మెటర్నటీ షూట్ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) చదవండి: సింపుల్గా కనిపిస్తున్న ప్రభాస్ టీషర్ట్ అంత ఖరీదా? ‘సీతారామం’ టాక్ ఎలా ఉందంటే... -
ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!
ఒకరి నమ్మకం.. ఇంకొకరికి పిచ్చిగా అనిపించొచ్చు. నవ్వులాటగానూ తోచొచ్చు. అలాంటి నమ్మకాలు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్స్.. గిమ్మిక్స్ చేసే వాళ్లకు ఎక్కువ. అవి సెల్యూలాయిడ్ సెంటిమెంట్స్గానే మిగిలిపోవట్లేదు.. ఆ సెలెబ్రిటీ రియల్ లైఫ్లోనూ భాగమవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వీళ్లే...! ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఈ ఊసుపోని కబుర్లను మేం పోగేసుకు రావట్లే మరి.. ఆ పిచ్చిలో పడి! ఎనిమిదే కావాలి.. బిహైండ్ ది స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్! ఆ బాబుక్కూడా ఓ సెంట్మెంట్ ఉండండోయ్. అది వాళ్లమ్మ నీతూ సింగ్ జన్మదిన తేదీ. అది ఎనిమిది. తాను ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఎనిమిదో తేదీనే మొదలుపెడ్తాడు.. వెళ్తాడు. తన దగ్గరున్న కార్ల నంబర్ కూడా ఎనిమిది వచ్చేలానే చూసుకుంటాడు. అదీ ఆ అబ్బాయి సెంట్మెంట్! పడితేనే హిట్.. ..ఎక్కడండీ.. ఎవరండీ..? అని అంత ఆత్రం ఎందుకండీ..? ఎక్కడంటే మరి.. షూటింగుల్లోనే. ఎవరంటే మరి.. సోనమ్ కపూర్ అహూజా. షూటింగ్ అప్పుడు సెట్స్లో ఒక్కసారైనా ఆమె కిందపడితే ఆ సినిమా సూపర్ హిట్టే అట. అలా ఒకట్రెండు సినిమా సెట్స్లో ఆమె పడితే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. అప్పటి నుంచి ఆ నమ్మకాన్ని.. సెంట్మెంట్ను వానిటీ వ్యాన్లో పెట్టుకుని తిరుగుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు. ఓ నిమ్మకాయ.. నాలుగు మిరపకాయలు.... అది బెంగాలీ బ్యూటీ బిపాశా బసు సెంటిమెంట్. తన ఇంటి ప్రధాన గుమ్మాలు, కార్లు.. ఇలా పరుల దృష్టి పడుతుంది అని అనుమానమున్న ప్రతి చోటా అలా నిమ్మకాయలు, మిరపకాయలను ఓ ఇనుప వైరుకి గుచ్చి కడుతుందట బిపాశా. అవి దుష్టదృష్టి నుంచి తనను, తన ఇంటిని కాపాడుతాయనే గట్టి నమ్మకం ఆమెదని బిపాశా సన్నిహితుల చెప్పే మాట. దేవుడి దయ.... మీద కత్రీనా కైఫ్కు మహావిశ్వాసం. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు విధిగా ముంబైలోని సిద్ధివినాయకుడి గుడి, మౌంట్ మేరీ చర్చ్, అజ్మీర్లోని షరీఫ్ దర్గా.. ఇలా మూడింటినీ దర్శించుకుని వస్తుందట. ఆ దర్శనాల వల్ల తన సినిమా హిట్ అవుతుందని ఆమె నమ్మకం. కూర్చుంటేనే వరిస్తుంది.. స్పోర్ట్స్ అంటే అభిషేక్ బచ్చన్ ప్రాణం పెడ్తాడని బాలీవుడ్కే కాదు.. భారతదేశంలోని అతని అభిమానులు అందరికీ తెలుసు. క్రికెట్ అంటే క్రేజ్ అతనికి. ఎంతంటే.. వెర్రి నమ్మకాలను క్రియేట్ చేసేంత! క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతను గ్యాలరీలోనైనా.. ఇంట్లో అయినా.. కూర్చున్న చోట నుంచి కదలడట.. మ్యాచ్ అయిపోయేంత వరకు. ఏమట పాపం? అని అడక్కండి! తాను కదిలితే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోతుందని భయమట పాఫం! దీనికి లాజిక్ కూడా చెప్తాడు ఆ హీరో.. అస్తమానం అటూ ఇటూ కదులుతూ.. తిరుగుతూ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన్ని దిక్కులకు పాకి అది టీమ్ మీద ప్రభావం చూపుతుంది అంటూ! ‘ఓహో.. తమరు అలా ఆ నెగెటివ్ ఎనర్జీని కుర్చీకి కట్టేస్తారన్నమాట’ అని అభిమానులు గాట్ హిజ్ పాయింట్ అన్నమాట. నాట్ ఆన్ థర్స్డేస్.. బాలీవుడ్ డాన్స్ కింగ్.. గోవిందా తెలుసు కదా! సెంటిమెంట్లలో అతనిదొక విధము. గురువారాలు గోవిందాకు అచ్చిరావుట. అదొక్క నమ్మకమే కాదు.. జ్యోతిష్యుడి సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయడుట. ఆఖరుకు క్రాఫ్ చేయించుకోవాలన్నా.. హెయిర్ వీవింగ్ చేయించుకోవాలన్నా జ్యోతిష్యుడు వారం, వర్జ్యం చూసి ఘడియలు లెక్కబెట్టి ముహూర్తం నిర్ణయించాల్సిందే! అంతెందుకు షూటింగ్లో కెమెరా ముందు ఏ యాంగిల్లో నిలబడాలో గోవిందా సర్కు డైరెక్టర్ కాదు చెప్పాల్సింది.. సర్ ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాలి. ఇదండీ ఇతని సంగతి! -
లండన్లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్లో ఫిక్సయితే.. బ్లైండ్గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్గా రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్గా సోనమ్కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్లాంటి పాత్రలతో బాక్సాఫీస్పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
సోనమ్ కపూర్ ఇంట్లో రూ. 2.4 కోట్ల నగదు చోరీ.. నర్సు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును న్యూఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసులో సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ కపూర్ అత్త కేర్ టేకర్గా పనిచేస్తున్న అపర్ణ రూతు విల్సన్ అనే నర్సు ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ అమృత షెర్గిల్ మార్గ్ నివాసంలో జరిగిన ఈ ఘటనలో నర్సు ఆమె భర్త సుమారు రూ. 2.41 కోట్ల విలువైన నగలు, డబ్బును దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది పోలీసుల వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా తల్లిని చూసుకునేందుకు కేర్ టేకర్గా అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు. అపర్ణ భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై అదే నెల 23న సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆహుజా ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు విచారించారు. చదవండి: వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్ అలాగే మంగళవారం రాత్రి సరితా విహార్లోని అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరపగా అసలు విషయం బయటపడింది. దీంతో అపర్ణతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత మార్చిలోనే సోనమ్ మామయ్య, ఆమె భర్త ఆనంద్ ఆహుజా తండ్రి హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నేరస్థులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. -
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవి 23న జరగగా,హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్టేకర్స్, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఇంట్లో సోనమ్ భర్త ఆనంద్ అహుజా పేరేంట్స్తో పాటు అతని నానామ్మ సరళ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందని ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు గర్భవతిగా ఉన్న సోనమ్ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్ ఇటీవలె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
తన బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్
Sonam Kapoor Shares Her Latest Baby Bump Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన భర్త అనంద్ ఆహుజాతో కలిసి తన ప్రగ్నెన్సీని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన తాజా బేబీబంప్ ఫొటోషూట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనమ్. వైట్ సారీతో డిఫరెంట్ చీరకట్టుతో ఇచ్చిన ఈ ఫొటోషూట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేస్తూ.. అబుజానీ బర్త్డే పార్టీ సందర్భంగా దిగిన ఫొటోలని, ఈ చీరను తన సోదరి రియా కపూర్ డిజైన్ చేసినట్లు ఆమె పేర్కొంది. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ కాగా సోనమ్ కపూర్ను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సినిమా ఈవెంట్స్కు, అవార్డు ఫంక్షన్స్ ఆమె స్టైలిష్, డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ దుస్తులు ధరించి అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తన బేబీబంప్ ఫొటోషూట్లో కూడా సోనమ్ తనదైన ఫ్యాషన్ దివాను చూపించింది. డిఫరెంట్ చీరకట్టుతో దిగిన ఆమె బేబీబంప్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తల్లి కాబోతోన్న సోనమ్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్, అప్రమత్తం చేసిన యామీ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎంత కఠినంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ, ఎంతటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనేది మాత్రమే చెబుతారు’ అని పేర్కొంది. అలాగే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్నానంటూ సొనమ్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
ప్రెగ్నెన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్
Sonam Kapoor Announces Her Pregnancy, Shares Baby Bump Pics: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. నీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే ఒక కుటుంబం నీ రాక కోసం ఎదురుచూస్తుంది'. అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
Sonam Kapoor: పింక్ లెహంగాలో సోనమ్ సోయగాలు.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంది. 'సావరియా' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది సోనమ్. రామ్ మాధవనీ దర్శకత్వంలో వచ్చిన 'నీర్జా' చిత్రంతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో మోస్ట్ గ్లామరస్గా కనువిందు చేసే 'సోన'మ్ అందాలు ఓసారి చూసేద్దామా. సావరియా సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన సోనమ్ అనిల్ కపూర్ వారసురాలైన తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ ప్రేమ్ రతన్ ధన్పాయో చిత్రంలో రాజకుమారి మైథిలీ దేవిగా అలరించిన సోనమ్ సన, సోంజ్, జిరాఫీ వంటి ముద్దుపేర్లతో ఈ బాలీవుడ్ భామను పిలుస్తారు తొలి చిత్రం సావరియా, రాంజనా, ఖుబ్సూరత్, చిత్రాలకు 4 అవార్డులను సొంతం చేసుకుంది సావరియా, ఢిల్లీ-6, ఐ హేట్ లవ్ స్టోరీస్, థ్యాంక్ యూ, నీర్జా సినిమాలకు స్టార్డస్ట్ అవార్డ్స్ అందుకుంది నీర్జా చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 8 అవార్డులను సొంతం చేసుకుందీ బ్యూటీ యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన ధీరే ధీరే సాంగ్లో హృతిక్ రోషన్తో పాటు కలిసి నటించింది నాలుగు ఫిలీంఫేర్ అవార్డులను కొల్లగొట్టిందీ సోనమ్ 2018లో వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుందీ కపూర్ వారసురాలు -
Anamika Khanna: నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్లకు
పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక. Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది. అలా మొదలైంది.. డ్యాన్స్తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది. అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్లు గీసేది. ఇలా గీసిన స్కెచ్లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్గా తొలిగుర్తింపు లభించింది. దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగింది. అంతర్జాతీయంగా అనా–మిక.. ‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నారు. ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు. ఏకే– ఓకే వర్క్షాపులు, లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, పారిస్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్కతాలో తన డిజైనర్ స్టోర్ను ఏర్పాటు చేసింది. తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్ను ఆకట్టుకుంటున్నారు. చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు? View this post on Instagram A post shared by Anamika Khanna (@anamikakhanna.in) -
న్యూస్ రీడర్గా శ్రీకాంత్ కొడుకు.. అంత ఈజీ కాదంటున్న అషూ
►న్యూస్ రీడర్ అయిన శ్రీకాంత్ కొడుకు ►ఆ కండిషన్లో షూటింగ్ చేయడం అంత సులువు కాదంటున్న అషూ రెడ్డి ► బుంగమూతి పెట్టిన అనుష్క శర్మ ► బిగ్బాస్ లహరి శరి స్టన్నంగ్ ఫోటోలు View this post on Instagram A post shared by Aditya Music (@adityamusicindia) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం
Sonam Kapoor In Rhea Kapoor Wedding: ‘‘మీరు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులే. మరిది కంటే కూడా ఒక స్నేహితుడిగానే మీరంటే నాకు ఎక్కువ అభిమానం. ఇప్పుడు మీరెంత సంతోషంగా ఉన్నారో.. నేను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను. లవ్ యూ’’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ తన సోదరి రియా కపూర్ భర్త కరణ్ బులానీ పట్ల ఆప్యాయతను చాటుకున్నారు. అతడితో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన ఆమె... తనకున్న గొప్ప స్నేహితుల్లో మరిదిగారు కూడా ఒకరంటూ ప్రేమను కురిపించారు. కాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చిన్న కుమార్తె, నిర్మాత రియా కపూర్- యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కరణ్ బులానీ శనివారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత 12 ఏళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్లో ఉంటున్న సోనం కపూర్ సోదరి రియా వివాహానికి హాజరయ్యేందుకు ముంబైకి వచ్చారు. వివాహ తంతు జరుగుతున్న సమయంలో సోనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక చెల్లెలి పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోనం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Rhea Kapoor: నా బెస్ట్ఫ్రెండ్ని పెళ్లాడాను.. ఎంతగా ఏడ్చానో.. పూజా హెగ్డేపై డైరెక్టర్ ఆర్కే సెల్వమణి ఫైర్ -
హల్చల్ :గెస్ చేయమన్న కౌశల్..అవసరం లేదంటున్న సదా
► భర్తతో చిరునవ్వులు చిందిస్తున్న సోనమ్ కపూర్ ► గోవా డైరీస్ ఫోటో షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ ► ఊహల్లో మునిగిన దీప్తి సునయన ► ఫోటోలో ఉన్న హీరోయిన్ గెస్ చేయమంటున్న కౌశల్ ► గుర్తిండి పోయే రోజుంటున్న సింగర్ హేమచంద్ర ► అందరికీ ఇదే ఫిలింగ్ ఉంటుందా అని ప్రశ్నిప్తున్న అనిత ► దీనికి పదాలు అవసరం లేదంటున్న సదా ► ఫ్యామిలీతో బుల్లితెర నటి అష్మిత ► కేవలం ప్రేమ మాత్రమే అంటున్న యాంకర్ రవి View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
12 ఏళ్ల తర్వాత.. నాకేమీ కొత్తగా అనిపించడం లేదు.. కానీ
Rhea Kapoor- Karan Boolani Pic After Mariage: ‘‘12 ఏళ్ల తర్వాత.. నాకు మరీ అంత సంతోషంగా ఏమీ లేదు. అలా అని నర్వస్గా కూడా ఫీలవడం లేదు.. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అత్యుత్తమైన వ్యక్తివి కూడా. కానీ ఈరోజు నేను ఎంతగా ఏడ్చానో.. భయంతో వణికిపోయానో నాకే తెలుసు. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు కదా! ప్రతిరోజు రాత్రి 11 గంటల కంటే ముందే.. నా తల్లిదండ్రులు నిద్రపోకముందే.. ఇంటికి చేరుకునే అమ్మాయిని నేను. ఇప్పుడు మనదైన సరికొత్త కుటుంబంలో కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం నిజంగా గొప్ప అనుభూతి’’ అంటూ బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ భావోద్వేగానికి గురయ్యారు. సోదరి రియా వివాహానికి హాజరైన సోనం కపూర్ దంపతులు కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్- సునీత కపూర్ల చిన్న కుమార్తె రియా కపూర్ పెళ్లి శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జుహులో గల అనిల్ కపూర్ ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో రియా- కరణ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా భర్త కరణ్ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన సందర్భంగా అతడిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భర్త ఆనంద్ అహుజాతో సోనం కపూర్ ప్రాణ స్నేహితుడిని జీవిత భాగస్వామిగా పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా కరణ్ బూలానీ పలు యాడ్స్ నిర్మించి గుర్తింపు పొందాడు. రియా సైతం పలు బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక ఇద్దరూ కలిసి ఐషా, వేక్ అప్ సిద్ వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇక వీరి వివాహానికి హాజరయ్యేందుకు రియా సోదరి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్ లండన్ నుంచి ముంబైకి చేరుకున్నారు. ఈ వివాహ వేడకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఆ హీరోయిన్ పారితోషికం కేవలం 11 రూపాయలు!
ముంబై: ‘‘ఫ్లైయింగ్ సిఖ్’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్ అక్తర్, సోనం కపూర్కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు పారితోషికం తీసుకున్నారు. సోనం సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట. భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్ ఓంప్రకాశ్.. ‘‘ఇది లవ్స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది. సినిమాలో తను భాగం కావాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. మా మధ్య అప్పటి నుంచి అనుబంధం ఉంది. భాగ్ మిల్కా భాగ్ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు. కాగా 2013లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో మిల్కాసింగ్ ఇష్టసఖి పాత్రలో సోనం నటించింది. చదవండి: ఆచార్య షూటింగ్ పూర్తి.. వైజాగ్లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్! -
ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్ పెట్టిన హీరోయిన్!
Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఏడాది తర్వాత లండన్ నుంచి భారత్కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్ను ధరించింది. ఫ్యాషన్ ఐకాన్గా చెప్పుకునే సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు పీరియడ్స్ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవల ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. 'లండన్లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది. -
నిజం చెప్పండి తారలూ.. మీరు ప్రెగ్నెంట్స్ కదూ!
Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్ కపూర్, నేహా కక్కర్లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు. కోవిడ్ వల్ల ఏడాది కాలంగా లండన్లోనే ఉండిపోయిన సోనమ్ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో దిగింది. ఫ్యాషన్ ఐకాన్గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్ జాకెట్ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడింది. మరోవైపు బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్ప్రీత్ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్ప్రీత్ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్ కేరింగ్ చూస్తుంటే కన్ఫామ్గా ఆమె గర్భవతే అని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు 'ఇండియన్ ఐడల్ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. #sonamkapoor returns to India after more than a year. She had left with hubby #anandahuja and they have been in London due to to Covid-19. Father #anilkapoor comes to pick her up at the Mumbai airport. pic.twitter.com/qnMiJxPfHA — Viral Bhayani (@viralbhayani77) July 13, 2021 -
హల్చల్ : సోనమ్ సొగసులు..దీప్తి సునయన వయ్యారాలు
♦చీర కట్టులో దీప్తి సునయన ♦ తమ్ముడి షర్ట్ను దొంగతనం చేసిన అనుపమ ♦ క్యూట్ లుక్స్లో సనయా ఇరానీ ♦ పొలం దున్నుతున్న అభిజీత్ ♦ బ్రేక్ ఫాస్ట్తో తమన్నా.. ఆ షో కోసమేనా? ♦ వోగ్ ఫోటో షూట్లో సోనమ్ కపూర్ ♦ నిషా అగర్వాల్ను పొగిడేస్తున్న కాజల్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by pradeep machiraju (@pradeep_machiraju) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
అదృష్టవశాత్తూ బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు: హీరోయిన్
లండన్/ముంబై: బాలీవుడ్ బంధాలపై హీరోయిన్ సోనం కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టవశాత్తూ తాను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పేర్కొన్నారు. కాగా హృతిక్ రోషన్- సుజానే ఖాన్, ఆర్బాజ్ఖాన్- మలైకా అరోరా, సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ వంటి పలు బీ-టౌన్ జంటలు ఇప్పటికే వైవాహిక బంధానికి స్వస్తి పలకగా, తాము కూడా విడిపోతున్నట్లు ఆమిర్ ఖాన్- కిరణ్ రావు శనివారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వోగ్ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేవుడి దయ వల్ల నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. ఎందుకంటే, అక్కడ(బాలీవుడ్) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి’’ అని సోనం పేర్కొన్నారు. ఇక వివాహం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ... ‘‘పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడపగలుగుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి అవిజ్యామైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు. లండన్లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా 2018లో సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
ఐశ్.. 75 లక్షల చీర కట్టింది.. మరి శిల్పా, కరీనా ఏమైనా తక్కువా!?
వెబ్డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం అంటే వివాహమే. ఒంటరిగా సాగుతున్న జీవన ప్రయాణంలో భాగస్వామి అడుగుపెట్టడంతో జీవితం పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు చాలా మంది. అచ్చంగా మన సొంతమయ్యే తోడుతో బంధం ఏర్పడే ఆ అపురూప ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లిరోజున ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి.. ఆపాదమస్తకం ఎలా తయారు కావాలి అన్న విషయాల గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తమ స్తోమతకు తగ్గట్లుగా బడ్జెట్లో అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే, మనలాగా ఆర్థిక లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజు మరింత అందంగా కనబడేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఐశ్వర్యారాయ్ మొదలు ప్రియాంక చోప్రా వరకు పలువురు హీరోయిన్లు ధరించిన దుస్తులు, వాటి ఖరీదు తదితర వివరాలు తెలుసుకుందాం. డిజైన్లు నచ్చితే.. అచ్చంగా అవేకాకపోయినా అలాంటి వాటిని పోలిన దుస్తుల్లో మెరిసిపోయేందుకు రెడీ అవ్వొచ్చు కదా. ఏమంటారు?! రూ. 75 లక్షల ఖర్చు! మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ 2007, ఏప్రిల్ 20న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకువచ్చిన ఈ జంట.. పెళ్లిరోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్.. తమ సంస్కృతికి పెద్దపీట వేస్తూ.. నీతా లుల్లా డిజైన్ చేసిన కాంజీవరం చీర ధరించింది. బంగారు తీగలు, స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ. 75 లక్షలట. అప్పటి వరకు ఒక పెళ్లికూతురు ధరించిన అత్యంత ఖరీదైన అవుట్ఫిట్ ఇదేనని ఫ్యాషన్ నిపుణుల మాట. మరి ఐశ్వర్యారాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా! ‘సాగరకన్య’ చీర ధర అరకోటి! ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకోవడంతో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. 2009లో రాజ్కుంద్రాను వివాహమాడిన ఈ ‘సాగరకన్య’.. పెళ్లినాడు తరుణ్ తహిలియాని రూపొందించిన అవుట్ఫిట్ ధరించారు. ఇందులో దాదాపు 8000 స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ఇమిడిఉన్నాయట. దాని ధర రూ. 50 లక్షలు అని ఫ్యాషన్ వర్గాల భోగట్టా. ‘సవ్యసాచి’ డిజైన్తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లిరోజున తమ వస్త్రధారణ మరింత స్పెషల్గా ఉండేలా చూసుకున్నారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన అవుట్ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు. ఆనాడు అనుష్క ధరించిన పేస్టల్ కలర్ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట. అత్యంత ఖరీదైన, అందమైన దుస్తుల్లో సోనం! ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు పొందింది స్టార్ కిడ్ సోనం కపూర్. సినిమాలతో పాటు తన వస్త్రధారణ పట్ల తన అభిరుచితో ఎంతో మంది అభిమానం చూరగొన్న ఈ భామ.. 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. అనురాధా వకీల్ రూపొందించిన ఎరుపు రంగు అవుట్ఫిట్లో మెరిసిపోయిన సోనం.. దీనికోసం సుమారు 70- 90 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. పిగ్గీచాప్స్ సైతం తనదైన స్టైల్లో.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండేసి సార్లు పెళ్లిప్రమాణాలు చేసిన ఈ జంట.. తమదైన శైలి డిజైన్లతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలట. దీప్వీర్.. రెండు కళ్లుచాలవంటే నమ్మరు! బీ-టౌన్లో అత్యంత రొమాంటిక్ కపుల్గా పేరొందిన జంట దీపికా పదుకొనె- రణ్వీర్ సింగ్. సుమారు ఐదేళ్ల పాటు ప్రణయ బంధంలో మునిగితేలిన దీప్వీర్ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది, ఉత్తరాది పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లినాడు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. సవ్యసాచి డిజైన్ చేసిన అవుట్ఫిట్లు ధరించి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘‘సదా సౌభాగ్యవతి భవ’’ అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.. తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట. ఇక వీరే కాదు.. కరీనా కపూర్(50 లక్షలు), ఊర్మిళా మటోంద్కర్(నాలుగున్నర లక్షలు), బిపాసా బసు(4 లక్షలు), దియా మీర్జా(3 లక్షలు), ఇషా డియోల్(3 లక్షలు) వంటి నటీమణులు సైతం స్పెషల్ డేను అందమైన దుస్తులు ధరించి మరింత స్పెషల్గా మార్చుకున్నారు. చదవండి: తాను అక్రమ సంతానాన్ని అని తెలుసుకున్న ‘లోకి’ ఏం చేయబోతున్నాడు? -
సోనమ్ వల్ల గొడవ, చివరికి తన్నులు తిన్నా: హీరో
గొడవలకు దూరంగా ఉండే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బాల్యంలో మాత్రం ఓ విద్యార్థిని చెడుగుడు ఆడేశాడట. తన కజిన్ సోనమ్ కపూర్ను ఏడిపించిన వ్యక్తిని నిందిస్తూ పట్టపగలే చుక్కలు చూపించబోయాడట! కానీ అతడు పెద్ద బాక్సర్ కావడంతో అర్జున్ వాచిపోయిన కన్నుతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో వివరంగా తెలియాలంటే ఇది చదివేయండి.. అర్జున్ కపూర్, అతడి కజిన్ సోనమ్ కపూర్ ఆర్య విద్యా మందిర్ పాఠశాలలో చదివేవారు. ఇద్దరికీ బాస్కెట్బాల్ ఆడటం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఓసారి సోనమ్ స్కూల్ గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడుకుంటుండగా సీనియర్లు వచ్చి ఆమె దగ్గరున్న బాల్ను లాక్కున్నారు. ఆడింది చాలు, ఇప్పుడు మేం ఆడుకుంటామని దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో సోనమ్ గుక్క పెట్టి ఏడ్చుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్లి ఓ అబ్బాయి నాతో చెడుగా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేసింది. నిజానికి అర్జున్ గొడవలకు దూరంగా ఉండే మనిషి. కానీ తన సోదరిని ఏడిపించారని తెలియగానే అతడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అర్జున్ తన కజిన్ను ఏడిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అతడు అలానే కాసేపటి వరకు చూసీచూసీ చివరకు అర్జున్ ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడట. దీంతో కమిలిపోయిన ముఖంతో అర్జున్ ఇంటికి వెళ్లగా.. అంతా తన వల్లే జరిగిందని బాధపడిన సోనమ్ క్షమాపణ కూడా చెప్పింది. అయితే అతడో బాక్సర్ అని తెలియక గొడవ పెట్టుకున్నానని, కానీ అతడిచ్చిన పంచ్కు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సి వచ్చిందని అర్జున్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పైగా ఈ గొడవకు అంతటికీ తనే కారణమంటూ తనను సస్పెండ్ చేశారని తెలిపాడు. తనకు ఇంతటి ఘోర అవమానం జరిగినందుకు గానూ ఇకపై ఏం జరిగినా స్కూల్లో నీ గురించి నువ్వే చూసుకో అని సోనమ్కు గట్టిగా చెప్పానని పేర్కొన్నాడు. కాగా అర్జున్ చివరిసారిగా 'సర్దార్ కా గ్రాండ్సన్' చిత్రంలో కనిపించాడు. ఇందులో జాన్ అబ్రహాం, నీనా గుప్తా, అదితిరావు హైదరీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అర్జున్ ప్రస్తుతం 'ఏక్ విలన్ 2', 'భూత్ పోలీస్' చిత్రాలు చేస్తున్నాడు. చదవండి: మలైకా ఇంటి దగ్గర్లో బాలీవుడ్ నటుడి కొత్త విల్లా! -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు మేకప్తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్తో, మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి. ఐశ్వర్యరాయ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ దీపికా పదుకొనే విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ ప్రియాంక చొప్రా విత్ అవుట్ మేకప్- విత్ మేకప్ అలియా భట్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అనుష్క శర్మ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ కరీనా కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సోనమ్ కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ నర్గిస్ ఫఖ్రీ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అమీషా పటేల్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సుష్మిత సేన్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ -
రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ సోదరి, నిర్మాత రియా కపూర్ పుట్టిన రోజు నేడు. నేటితో ఆమె 34 వ వసంతంలో అడుగుపెట్టనున్నారు. అయితే, లండన్ ఉన్న కారణంగా చెల్లెలు బర్త్డేకు తన దగ్గర ఉండలేకపోయానని సోనం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు, ఇన్స్టావేదికగా రియాకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు, తనతో ఉన్న జ్జాపకాలను షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ళతో నేను మిస్ అయిన తొలి పుట్టిన రోజని రియాతో ఉన్న ఫోటోలను ట్యాగ్ చేసింది. ‘హ్యపీ బర్త్ డే మై స్వీట్ సిస్టర్..నువ్వు నా మంచి నేస్తం...లవ్యూ సోమచ్ డియర్’ అని చెప్పింది. ‘‘ నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. చిన్నదానివైన నీ సలహలు నేను ఎప్పటికి మరచిపోలేను’’ అని తన మనస్సులోని భావాలను ఇన్స్టా వేదికగా పంచుకొంది. కాగా, సోనం కపూర్ తన భర్తతో ఆనంద్తో కలిసి లండన్లో ఉంటుంది. కాగా, వీరి తల్లి సునితా కపూర్ నా గారాల పట్టీ రియా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు అని విష్ చేసింది. ‘నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి’..జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించింది. ఇక రియా ప్రియుడు కరన్ బులానీ కూడా తన ఆమెకు ఇన్స్టా వేదికగా బర్త్డే విషెస్ చెప్పాడు. ఆమెతో ఉన్న కొన్ని ఫోటోలను జత చేశాడు. ఈ లవ్బర్డ్స్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఇన్స్టాగ్రా వేదికగా పంచుకున్నారు..కరన్ బులాని ‘నిన్ను సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.. ప్రేమతో నిండిన జన్మదిన శుబాకాంక్షలు ’అని తన ప్రేమను ఎక్స్ప్రేస్ చేస్తూ లవ్ ఎమోజీను షేర్ చేశాడు అనిల్ కపూర్- సునీతా కపూర్లకు సోనమ్, రియా, హర్షవర్దన్ ముగ్గురు సంతానం. కాగా, సోనమ్ చివరిసారిగి ఎకె వర్సెస్ ఎకెలో నటించింది. తండ్రి అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో లీడ్ రోల్లో నటించింది. తాజాగా బైండ్ సినిమాలో కనిపించనున్నారు. దీన్ని షోమ్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. చదవండి: 24 ఏళ్లు.. కానీ 23వ బర్త్డే చేసుకుంటా : హీరోయిన్ -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ..
‘చూపు ఉన్నవాళ్లు చూడలేనివాళ్లలా నటించడం అనుకున్నంత సులువు కాదు. అందుకే నా కొత్త చిత్రం కోసం కళ్లకు గంతలు కట్టుకుని సాధన చేస్తున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. హిందీ చిత్రం ‘బ్లైండ్’లో సోనమ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో చూపులేని పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారామె. ఈ పాత్రను బాగా చేయడానికి చూపులేనివాళ్లను గమనిస్తున్నారట సోనమ్. అలానే ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు గంతలు కట్టుకుని ఒకసారి, మామూలుగా ఓసారి నటించి చూసి అందులో వ్యత్యాసాలను గమనిస్తున్నారట. అలానే ఈ పాత్ర కోసం ఓ కోచ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సోనమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్కాట్ల్యాండ్లోని గ్లాస్గో ప్రాంతంలో జరుగుతోంది. షోమే మక్జీ దర్శకత్వంలో ఈ సినిమాను సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. -
లిప్లాక్తో కొత్త సంవత్సరానికి స్వాగతం
బాలీవుడ్ జంట సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. తన భర్త ఆనంద్ను గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. 2021కు స్వాగతం పలుకుతున్నా.. ఈ ఏడాదంతా స్నేహితులు, ప్రేమ, పని, ప్రయాణాలు, ఆధ్యాత్మిక, ఇలా అన్నింటి మేళవింపుతో నిండనుంది. మరిన్ని మంచి క్షణాలు ఎంజాయ్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్గా మారగా ఆమె అభిమానులు సోనమ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట లండన్లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. (చదవండి: 'ఓసారి నీ భర్తను చూడు, ఎంత దరిద్రంగా ఉన్నాడో') ఇదిలా వుంటే సోనమ్ కపూర్ "ఏకే వర్సెస్ ఏకే" అనే నెట్ఫ్లిక్స్ చిత్రంలో నటించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె తండ్రి అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు సోనమ్ కిడ్నాప్ ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. (చదవండి: అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్
కుమార్తె కిడ్నాప్ అయితే ఏ తండ్రి అయినా చాలా ఆందోళన చెందుతాడు. అనిల్ కపూర్ మీద కక్షతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ అతని కుమార్తె సోనమ్ కపూర్ను కిడ్నాప్ చేశాడు. అతని నుంచి అనిల్ కపూర్ తన కుమార్తె ను ఎలా రక్షించుకున్నాడు?ఇది నిజంగా జరగలేదు. కాని నిజంలా జరిగింది. దానినే ఇప్పుడు ‘మెటా మూవీ’, ‘ఫిల్మ్ వితిన్ ఏ ఫిల్మ్’, ‘మాక్యుమెంటరీ’ అంటున్నారు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా విడుదలైన ఈ సినిమా తండ్రి అనిల్ కపూర్ ఎలా ఉంటాడో అన్న ఆనవాలు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది.‘ఏకె వెర్సెస్ ఏకె’ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తాజాగా విడుదలైన సినిమా. ఇందులో ఒక ఏకె అనిల్ కపూర్. మరో ఏకె అనురాగ్ కశ్యప్. ఒక హీరో ఒక దర్శకుడి మధ్యలో వచ్చిన తగాదా ఆ హీరో కుమార్తెను ఆ దర్శకుడు కిడ్నాప్ చేసే వరకూ వెళుతుంది. ఇది సినిమాయే అయినా అందరూ ఇందులో తమలాంటి ఫిక్షనల్ పాత్రలనే పోషించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇది పూర్తిగా కొత్త నేరేటివ్. డాక్యుమెంటరీలా అనిపించే సినిమా. లేదా సినిమాలా అనిపించే డాక్యుమెంటరీ. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని వచ్చి దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. పోలీస్ స్టేషన్కు వెళితే అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ఇంటికి వచ్చి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు. కిడ్నాపర్ అయిన అనురాగ్ కశ్యప్ ‘నువ్వొక్కడివే నీ కూతురుని కనుగొనాలి’ అని కండీషన్ పెట్టడంతో అనిల్ కపూర్ ఒక్కడే బయలుదేరుతాడు. అతన్ని నీడలా అనురాగ్ కశ్యప్ అనుసరిస్తాడు కెమెరాతో. కూతురి కోసం కలవరపడిపోయే తండ్రిలా అనిల్ కపూర్ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విక్రమాదిత్య మోత్వానే దీని దర్శకుడు. అనురాగ్ కశ్యప్ నటించి డైలాగులు కూడా రాశాడు. ‘వీడి హిట్ సినిమాలు తెచ్చిన కలెక్షన్లన్నీ కలిపి వీడి తమ్ముడి ఒక్క ఫ్లాప్ సినిమా తెచ్చింది’ అని అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్ను వెక్కిరిస్తాడు. మన మీద మనం జోక్ చేసుకోవడం ఎదగడానికి గుర్తు. అనురాగ్ కశ్యప్, అనిల్ కపూర్ ఎదిగి చేసిన సినిమా ఇది. ప్రయోగాలు నచ్చేవారు చూడాల్సిన సినిమా ఇది. -
పోలీసులకు సోనమ్ కపూర్ బంధువు ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్ మూగ జీవాలను హింసించిన ఇద్దరూ జంతువుల కేర్ టేకర్స్పై ముంబైలోని మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన కుక్కలపై సదరు కేర్ టేకర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలను చూసి ఆమె, తన భర్త భయపడ్డామని పోలీసులకు తెలిపారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ టేకర్స్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ప్రియా సింగ్ నెల రోజులుగా వికలాంగ జంతువులను సంరక్షించేందుకు సొంతంగా షెల్టర్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసుకునేందుకు ఆమె ప్రకాష్ శామ్యూల్ బింగ్, రాంప్రాతాప్ పాస్వాన్ అనే ఇద్దరూ కేర్ టేకర్స్ను నియమించారు. ప్రస్తుతం వారి దగ్గర 4 కుక్కలు, 12 పిల్లులు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రియా సింగ్ సీసీ టీవీ పుటేజ్ను పరిశీలించగా కేర్ టేకర్స్ జంతువులను కొడుతూ ఆనందిస్తున్న దృశ్యాలు వెలుగు చుశాయి. దీనిపై మలబార్ హిల్స్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సదరు కేర్ టేకర్స్ రెండు వికలాంగ కుక్కలను కర్రతో కొడుతూ ఆనందం పొందుతూ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నెల 16 తేదీ సీసీ టీవీ ఫుటేజ్లో ఈ రోజు ఈ కుక్క కొడుతాను అంటూ గాయపడిన కుక్కను చూపిస్తూ.. ఆపై మరోక కుక్క వైపు వెళ్లి ఇప్పుడు ఈ కుక్కను కొడతాను అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్టు తెలిపారు. అంతేగాక ప్రకాష్ అనే కేర్ టేకర్ గాయపడిన కుక్కలలో ఒకదాని మొహంపై టవల్ పెట్టి కర్రతో దానిని తీవ్రంగా బాధించాడని ఆయన తెలిపారు. వీరిఇద్దరిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఐపీసీ 34, 428లతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
నీ భర్త దరిద్రంగా ఉన్నాడు: హీరోయిన్కు మెసేజ్
బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్ కపూర్పై ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. తనపై వచ్చే విమర్శలకు ఆమె ధీటైన సమాధానాలిస్తారు కూడా! అయితే ఈ సారి సోనమ్ను కాకుండా ఆమె భర్తను టార్గెట్ చేయడంతో ఆమె తన సహనాన్ని కోల్పోయారు. ఓ అమెరికన్ ఇన్ఫ్లూయెన్సర్.. సోనమ్ను నెపోటిజం ఉత్పత్తిగా పిలుస్తూ ఘాటు విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా "నీ భర్త ఏమైనా హాట్గా ఉన్నాడని ఫీలవుతున్నావా? అంత సీన్ లేదు, ఒకసారి కళ్లు తెరిచి చూడు, అతను ఎంత దరిద్రంగా ఉన్నాడో" అని రాసుకొచ్చింది. ఈ మెసేజ్ చూసిన సోనమ్కు కోపం నషాళానికంటింది. తన వరకు ఏమైనా అంటే ఊరుకునేదేమో కానీ, మధ్యలో తనను భర్తను లాక్కొచ్చినందుకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆమె చేసిన మెసేజ్ను స్క్రీన్షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో యాడ్ చేశారు. (చీరకట్టుకు లక్ష రూపాయలు) "ఈ పోస్ట్ వల్ల మీకు ఫాలోవర్లు పెరుగుతారు. ఇదే కదా, నువ్వు నా నుంచి ఆశించింది. మనసులో అంత ద్వేషం పెట్టుకోవడం మీకంత మంచిది కాదు. నాకు తెలుసు, కేవలం తారల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి పోస్టులు చేస్తుంటారు. ఏదైతేనేం, నీ కోరిక నెరవేర్చా" అని సోనమ్ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి ప్రతికూల మెసేజ్లను అసలు పట్టించుకోకండని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ భామ ప్రస్తుతం తన భర్త ఆనంద్తో కలిసి లండన్లో నివసిస్తున్నారు. ఆమె చివరిసారిగా 'జోయా ఫ్యాక్టర్' సినిమాలో నటించారు. (నెటిజన్ ట్రోల్.. సోనమ్ గట్టి కౌంటర్) -
డాలీతో చీర కట్టించుకోవాలంటే రూ.35 వేలు ఫీజు
వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. డాలీ చేత చీర కట్టించుకోవాలంటే కనీసం 35 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సిందే. 15 ఏళ్ల క్రితం చీర కట్టుకోవడాన్ని కష్టంగా మొదలుపెట్టి దానినే అభిరుచిగా మార్చుకొని ఇప్పుడు రికార్డులు కొట్టేస్తున్న బెంగళూరు మహిళ డాలీ జైన్ గురించి తెలుసుకోవాల్సిందే! నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అంటే పెద్ద కష్టం. నిన్నటి తరం అమ్మలు సౌకర్యం కోసం ఎప్పుడో కుర్తాలోకి మారిపోయారు. బెంగళూరుకు చెందిన డాలీ అనే మహిళ మాత్రం 15 ఏళ్లుగా వందల రకాల సై్టల్స్లో చీర కట్టడం అనే కాన్సెప్ట్ను సాధన చేస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్తోనే సక్సెస్నూ సాధిస్తోంది. బాలీవుడ్ తారలకు డాలీ కట్టు సందర్భానికి తగ్గట్టు రకరకాల స్టైల్లో చీరలు ధరించడం కూడా ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యమే ప్రత్యేకతగా కలిగిన డాలీ జైన్ బాలీవుడ్ నటిమణులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల సతీమణులకూ ఇష్టమైన సై్టలిస్ట్గా మారిపోయింది. డాలీ జైన్ ఖాతాదారులలో నీతా అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సోనమ్ కపూర్లు, ప్రియాంకాచోప్రా, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులకు కూడా డాలీ చీర కట్టింది. సబ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతాదారులకు డాలీ చీరలు కడుతుంది. అత్తమామల ఒత్తిడి పెళ్లికి ముందు డాలీ జీన్స్, టాప్స్ ధరించేది. పెళ్లయిన తర్వాత అత్తారింట్లో చీరకట్టుకోవాల్సిందే అన్నారు. ఆ నిర్బంధంలో డాలీ చీర కట్టుకోవడం నేర్చుకుంది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ – ‘మొదట్లో మా ఇంట్లో వాళ్ల మీద చాలా కోపంగా ఉండేది. కానీ, చీర కట్టుకోవడం నేర్చుకున్నాక దానిని స్టైల్గా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు విభిన్న రకాల చీరకట్టు పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రెడిట్ అంతా మా అత్తమామలకే. పెళ్లి తర్వాత వాళ్లు జీన్స్, టాప్స్ వేసుకోవడం ఒప్పుకునుంటే ఎప్పటికీ చీరకట్టులో నైపుణ్యం సాధించేదాన్ని కాదు’ అని నవ్వుతూ చెబుతుంది డాలీ. రికార్డుల డ్రేపింగ్ ఒక చీరను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో డాలీ పేరు నమోదయ్యింది. రెండవసారి ఒక చీరను 325 విధాలుగా కట్టి తన రికార్డును తనే బద్దలు కొట్టింది. అంతేకాదు, ఒకటిన్నర సెకన్లలో చీరను కట్టి రికార్డు సృష్టించింది. 2015లో ‘స్ట్రాంగ్ వుమన్ ఆఫ్ ఆనర్‘ను కూడా అందుకుంది. మనలోని చిన్న ప్రతిభ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. కష్టపడటం, అంకితభావంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అనే పెట్టుబడి మాత్రమే మనం పెట్టాల్సింది అని డాలీ నిరూపిస్తోంది. -
నెటిజన్ ట్రోల్.. సోనమ్ గట్టి కౌంటర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది.ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు ముందస్తుగా హోం క్వారంటైన్కు పరిమితమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని పలు దేశాలు నిబంధనలు విధించాయి. అయితే సినీ సెలబ్రిటీలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే ట్రోలింగ్కు గురవుతారన్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ లండన్లో క్వారంటైన్ నింబంధనలు ఉల్లఘించారని, ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. ఇటీవల సోనమ్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను ఫోస్ట్ చేశారు. ‘అవుట్ డోర్ వర్కవుట్’ అనే కాప్షన్ కూడా జతచేశారు. దీంతో ఆ ట్విటర్ యూజర్ సోనమ్ హోం క్వారంటైన్లో లేరని కామెంట్ చేశాడు. (లంబోర్గిని లగ్జరీ కారులో రజనీ) I’m in my own garden attached to my building dude.. fully quarantining.. people have too much time.. just ignore https://t.co/PiYvzDsWTn — Sonam K Ahuja (@sonamakapoor) July 19, 2020 సోషల్మీడియాలో తనపై వచ్చిన వ్యాఖ్యలపై సోనమ్ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. ‘నేను మా సొంత తోటలో ఉన్నాను. అది మా ఇంటి పక్కనే ఉంటుంది మిత్రమా.. నేను పూర్తిగా నిర్భందంలోనే ఉన్నాను. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని విస్మరించాలి’ అని సోనమ్ ట్విటర్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. గతవారం సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్ వెళ్లారు. సినిమాల విషయానికి వస్తే.. సోనమ్ కపూర్ చివరగా గతేడాది ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. (అభిషేక్.. గట్టి హగ్ ఇవ్వాలనుంది) -
నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్ కపూర్
‘నీకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు’ అని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్ను ఉద్ధేశించి పేర్కొన్నారు. మంగళవారం సోనమ్ కపూర్ 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ తన పెద్ద కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా సోనమ్ ఈసారి తన బర్త్డేను తండ్రి అనిల్ కపూర్తో కలిసి జరుపుకోవడం విశేషం. లాక్డౌన్ కాలంలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి న్యూఢిల్లీలో ఉన్న సోనమ్.. సోమవారం ముంబైకు చేరుకున్నారు. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’) ‘ఒక కూతురిగా నీకంటే ఎవరూ బాగా ఉండలేరు. ఆనంద్ అహుజాకు సరైన భాగస్వామి. సినిమా తెరపై ఒక స్టార్. నువ్వు నా నమ్మకం, ఆనందం, నీకు తండ్రిగా ఉండటం గర్వకారణం. నా అందమైన సోల్. అలాగే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి. ఇప్పుడు మాస్టర్ చెఫ్ కూడా అయ్యావు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోనమ్. ఈ రోజు నువ్వు మా అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తునే ఉంటా.’ అంటూ అనిల్ కపూర్ తన కూతురు సోనమ్పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున ) View this post on Instagram To a daughter like no other, the perfect partner to @anandahuja, a star on screen and an icon with an unimitable style. She's my confidant, my joy, my pride, the most generous hearted soul I know, (the only person I am shit scared of) & now a bona fide master chef! Happy Birthday, @sonamkapoor! I’m so happy that you’re here with all of us today! Love You, Always! A post shared by anilskapoor (@anilskapoor) on Jun 8, 2020 at 11:30am PDT కాగా అనిల్ కపూర్ పోస్ట్పై కూతురు సోనమ్ స్పందించారు. తండ్రికి ‘లవ్ యూ డాడీ’ అని కామెంట్ చేశారు. అలాగే అతని అల్లుడు ఆనంద్ అహుజా స్పందిస్తూ.. ‘సోనమ్ కేవలం మిమ్మల్ని మాట్రమే భయపెట్టడం లేదు. నన్ను కూడా భయపెడుతుంది’ అని సరదాగా కామెంట్ చేశాడు. View this post on Instagram The best best husband in the world , who gives me everything that I truly need. He is my blessing on my birthday. Love you @anandahuja from the first day I hugged you. A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Jun 8, 2020 at 12:33pm PDT -
‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’
‘‘అన్ని అడ్డంకులు అధిగమించి మే 19న మేం పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నాకింకా గుర్తు. నా వధువు నవ్వుతూ ఉంది. తనను చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... అవి ఆనంద భాష్పాలు. మా పెళ్లి మాటలు, వివాహ తంతు ఒక్కరోజులోనే పూర్తై పోయింది. అట్టహాసాలు, ఆర్భాటాలు లేవు. హనీమూన్కి కూడా వెళ్లలేదు. ఆ విషయం గురించి తను నన్ను ఇప్పటికీ ఆటపట్టిస్తూనే ఉంటుంది. తను నా జీవితంలోకి రావడం అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన విషయం’’ అంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన పెళ్లినాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సునీత కపూర్, తాను కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్ హీరోలే) కపూర్ ఖాన్దాన్కు చెందిన అనిల్, ఫ్యాషన్ డిజైనర్గా పేరొందిన సునీత 1984లో మేరీ జంగ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. వారి అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం తమ పెళ్లి రోజు సందర్భంగా సునీతకు తన ప్రేమను వెల్లడించిన నాటి జ్ఞాపకాలను అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు.(మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్) ‘‘నా గర్ల్ఫ్రెండ్ సునీత దగ్గరకు వెళ్లి.. భార్యగా నా జీవితంలో అడుగుపెడతావా అని అడిగాను.. మా పెళ్లి ఆలస్యంగా జరిగింది. తను నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉండగలదు. తన కోసం నేనేం చేయగలను. తన కన్న కలలను కొంతమేర అయినా నిజం చేయగలనా అని నిరూపించేందుకు ఆ సమయాన్ని వినియోగించుకున్నాను. కనీసం ఒక ఇల్లు కొని, పనిమనిషిని పెట్టకోగలననే నమ్మకం వచ్చిన తర్వాత తనను పెళ్లిచేసుకోవాలనుకున్నాను. ఆ మాత్రం పొందేందుకు తను అర్హురాలే కదా. ఇంకోవిషయం కెరీర్ తొలినాళ్లలోనే పెళ్లి ఎందుకు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అయితే సునీత సాంగత్యం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేనన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ప్రేమా, కెరీరా అనే ప్రశ్నలు మాలో తలెత్తలేదు. మా దృష్టిలో ఆ రెండూ ముఖ్యమే. సమాంతరంగా సాగాల్సిన విషయాలే. ఎల్లప్పుడూ మా మధ్య అవగాహన, ప్రేమ ఇలాగే ఉంటుంది. నా ప్రేమ, జీవితం సునీతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని అనిల్ కపూర్ తన ఇన్స్టాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. కాగా అనిల్ కపూర్- సునీత జంటకు కూతుళ్ళు సోనం కపూర్, రియా కపూర్.. కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు సినిమా రంగానికే చెందిన వారు కావడం విశేషం. View this post on Instagram How 19th May became the best day of our lives! I proposed to my girlfriend Sunita and asked her to be my wife... our wedding had been delayed a lot because I wanted to be sure that I could take care of her in the way she deserved and give her everything she could ever dream of...in the very least, I needed to be able to afford to buy a house and hire a cook!! I just wanted to be worthy of her... We got married on 19th May, against all odds....I still remember when I entered her house on our wedding day and saw my bride, she was smiling and I had tears in my eyes... Tears of happiness, but also nervousness... I mean it was my wedding day! Our wedding was planned and executed within a day, and yes we may not have had a big wedding or even a honeymoon, which she still teases me about, but it was still the best thing that ever happened to me....it was now or never for us and I’m so glad we took the leap that day and started our lives together... many people prophesied that marrying so early would be disastrous for my career, but all I knew was that I did not want to waste another day without her and wanted her by my side through it all... for us it was never career or love.. it was always love AND career... I won’t say in the end we lived happily ever after...because it is not even close to the end of our love story... we still have a lot of love to share together, forever.... Happy Anniversary to the love of my life, my wife Sunita... @kapoor.sunita A post shared by anilskapoor (@anilskapoor) on May 19, 2020 at 1:53am PDT -
కుటుంబంలోకి స్వాగతం రానా: హీరోయిన్
‘‘డార్లింగ్ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనం కపూర్.. ప్రేమజంట రానా దగ్గుబాటి, మిహిక బజాజ్కు అభినందనలు తెలిపారు. తన స్నేహితురాలి చేయి అందుకోబోతున్న రానాను తమ స్నేహ బృందంలోకి ఆహ్వానించారు. కాగా తన ప్రేమకు మిహిక బజాజ్ ఓకే చెప్పిందంటూ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ సినీ సెలబ్రిటీలు సహా అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. ) ఇక ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. కాగా మిహిక, సోనం మంచి స్నేహితులు. ఒకరికి సంబంధించిన వేడుకలో మరొకరు సందడి చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ప్రస్తుతం రానా, మిహికల రిలేషన్షిప్ హాట్టాపిక్గా మారడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు సోనం.. మిహికను విష్ చేయడంతో.. గతంలో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోనం కపూర్ పుట్టినరోజు సందర్భంగా మిహిక షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా సోనం మెహందీ సమయంలో మిహిక సందడి చేసిన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా హైదరాబాద్లో పుట్టిపెరిగిన మిహిక.. ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి డ్యూ డ్రాప్ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. (‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’) -
‘సోనంను ఆయన బాగా చూసుకునేవారు’
ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు. ఇర్ఫాన్ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్, ఇర్ఫాన్లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్లు స్లమ్డాగ్ మిలియనీర్, డీ-డే, చాకొలెట్ : డీప్ డార్క్ సీక్రెట్స్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి : పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది -
నేను లేకుండా హనీమున్కి..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక చిత్ర పరిశ్రమలో పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. బాలీవుడ్ నటీనటులు కరోనావైరస్పై అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు తమ కుంటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్కపూర్ తన భార్య సునితా కపూర్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తన జీవిత భాగస్వామి ఫ్యాషన్ డిజైనర్ సునితా కపూర్ గురించి ఓ రహస్యాన్ని వెల్లడించారు. (కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్) ‘నన్ను పెళ్లి చేసుకోవాలని సునితకు ప్రపోజల్ పెట్టినప్పుడు, మేరీ జంగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే సునితా పెళ్లికి ముందే నాకు ఇల్లు ఉండాలి, వంట మనిషి ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టారు. అనంతరం ఇళ్లు, వంట గది, వంటకు సాయం చేసే మనిషి కూడా ఉంటుందని చెప్పాను. అనంతరం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత నేను మూడు రోజుల పాటు షూటింగ్కి వెళ్లాను. కానీ మా మేడం మాత్రం నేను లేకుండా ఒక్కతే హనీమూన్కు విదేశాలకు వెళ్లింది(నవ్వుతూ). ఇక నా కూతురు రియా కపూర్ మంచి కుక్, సోనమ్ కపూర్ కూడా వంట చేయటంలో ఆసక్తిని కనబరుస్తోంది’ అని అనిల్ కపూర్ సరదాగా చెపుకొచ్చారు. అనిల్ కపూర్, సునితా కపూర్ వివాహం జరిగి 35 ఏళ్లు అవుతోంది. వీరికి రియా, సోనమ్తోపాటు కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్నారు. సోనమ్, హర్షవర్ధన్ నటనలో కొనసాగుతుండగా, రియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సోనమ్కపూర్ చాక్లెట్ వాల్నట్ కేకు తయారు చేసిన ఓ ఫోటోను తన ఇన్స్ట్రామ్లో షేర్ చేశారు. View this post on Instagram Made chocolate walnut cake today. I had run out of chocolate and @fortunegourmetindia sent me some amazing quality chocolate. Thanks so much @missdevi for organising. Love you A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on Apr 10, 2020 at 5:43am PDT -
దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’
కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు, జాతి ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘దియ జలావో’ దిగ్విజయంగా పూర్తయింది. ఆదివారం యావద్దేశం విశేషంగా స్పందించింది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపారు. అయితే నిన్న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొంతమంది దీపాలు వెలిగించడానికి బదులు టపాసులు పేల్చటంపై అన్ని వర్గాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టపాసులు కాల్చడంపై బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, తాప్సీ పన్ను, రిచా చద్దాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా వారు స్పందించారు. ‘‘ రాంగ్ మెమో’ అనే శీర్షికతో తాప్సీ ఓ వీడియోను షేర్ చేశారు. ‘’ కొంతమంది దీన్ని జాతర అనుకుంటున్నారు’’ అని ట్వీట్ చేశారు. ‘‘ కొంతమంది టపాసులు కాలుస్తున్నారు. కుక్కలు బయట అరుస్తున్నాయి. ఇదేమన్నా దీపావళి అనుకుంటున్నారా?.. నాకంతా తికమకగా ఉంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉండింది. కొంతమంది మూర్ఖులు టపాసులు కాల్చడం వల్ల దక్షిణ ఢిల్లీలో.. పక్షులు, కుక్కలు, సైరన్ల మోత మోగుతోంద’’ ని మండి పడ్డారు సోనమ్ కపూర్. People are bursting crackers. Just FYI . They dogs are freaking out. Do people think it’s Diwali? I’m so confused. — Sonam K Ahuja (@sonamakapoor) April 5, 2020 There was complete peace and quite, and now the birds ,dogs and sirens are freaking out in south Delhi because some morons decided to burst fire crackers tonight. — Sonam K Ahuja (@sonamakapoor) April 5, 2020 ‘‘ టపాసులు ఎందుకు కాలుస్తున్నార’’ని రిచా చద్దా ప్రశ్నించారు. Why crackers ? Why? — TheRichaChadha (@RichaChadha) April 5, 2020 -
అక్కడ మాకు స్క్రీనింగ్ చేయలేదు: హీరోయిన్
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని... అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సోనం కపూర్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి మంగళవారం లండన్ నుంచి ఢిల్లీకి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటుగా... గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.(భారత్పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు!) ఈ క్రమంలో తన అనుభవాలను సోనం తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘‘మేం లండన్ నుంచి బయల్దేరుతున్నప్పుడు స్క్రీనింగ్ చేయలేదు. ఈ విషయం తెలిసి షాకయ్యాం. అయితే భారత్కు చేరుకోగానే... మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్పోర్టు అధికారులు ఫారమ్లో నింపమన్నారు. అయితే అంతటితో ఆగిపోకుండా మరోసారి మా పాసుపోర్టులు పరిశీలించి మేం చెప్పింది నిజమా కాదా అని చెక్ చేశారు. అక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. (‘కరోనా’ పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన ) అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని... స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంద్వారా దీని వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. తమలో వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ తాము హోం క్వారంటైన్లో ఉంటున్నామని వెల్లడించారు. వైద్యులు, అధికారులు చెప్పిన మాటలు వినాలని.. వైద్య పరీక్షల నిమిత్తం వారికి సహకరించాలని సోనం విజ్ఞప్తి చేశారు. కాగా చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 8000 మంది మరణించారు. ఇక భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 147కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ సెంటర్లు, పార్కులు తదితర జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట్లను మూసివేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’ -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
వెస్ట్రన్ డ్రెస్కి ఇండియన్ హారం
స్కర్ట్, క్రాప్టాప్స్, ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్ ఇలాంటి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీ ధరిస్తేనే బాగుంటుంది, సంప్రదాయ ఆభరణాలు అస్సలు నప్పవు అనుకుంటారు. కానీ, వెస్ట్రన్ దుస్తులకు మీదకు ఇప్పుడు మన వెడ్డింగ్ జ్యువెలరీనీ మ్యాచ్ చేయవచ్చు. బ్లాక్ థండర్ వెస్ట్రన్ కాక్టెయిల్ పార్టీలకు, ఈవెనింగ్ క్యాజువల్ డ్రెస్గా పేరొందింది నల్లటి మ్యాక్సీ డ్రెస్. దీనికి మన వివాహ వేడుకల సమయంలో ధరించే కుందన్ నెక్లెస్, చెవి లోలాకులు అద్భుతమైన కాంబినేషన్గా అదరగొట్టేస్తాయి. గౌన్ ‘వి’ నెక్లో ఉంటే దానికి రాణి హారం వేసి, పైన కుందన్ నెక్లెస్ ధరించవచ్చు. అంతేకాదు వివాహ వేడుకల సమయంలో ధరించే మీనకారి చెవి జూకాలు కూడా ఈ వెస్ట్రన్ డ్రెస్ మీదకు బాగా నప్పుతాయి. వైట్ వండర్ వెస్ట్రన్ పార్టీలలో నలుపు ఎలాగో తెలుపు డ్రెస్ కూడా అంత అద్భుతమైన అందంతో తళుక్కుమంటుంది. తెల్లటి డ్రెస్ వేసుకుంటే దానిమీదకు పోల్కి నెక్లెస్, పెద్ద పెద్ద బంగారు గాజులు వేసుకుంటే ఇండోవెస్ట్రన్ కలయికతో అద్భుతమైన లుక్ని తీసుకురావచ్చు. సంప్రదాయ లెహంగా చోలీ డ్రెస్సుల మీదకు ఉపయోగించే ఆక్సిడైజ్డ్ సిల్వర్ గాజులు, నెక్లెస్, జూకాలు, నెక్లెస్ వంటివి జీన్స్–వైట్ షర్ట్ మీదకు మాక్సీ డ్రెస్సుల మీదకు సరైన ఎంపిక అవుతుంది. హాత్ఫూల్ వివాహవేడుకల్లో వేళ్లను–మణికట్టును కలుపుతూ ఉండే హాత్ఫూల్ ఆభరణం పాశ్చాత్య దుస్తులకు భిన్నమైన లుక్ తీసుకువస్తుంది. డిన్నర్ పార్టీకి పొడవాటి చేతులున్న టాప్స్, స్ట్రాప్స్ బ్లౌజ్లు ధరించినప్పుడు హాత్ఫూల్ను అందంగా అలంకరించుకోవచ్చు. వరసల హారాలు వివాహ వేడుకల కోసం బంగారు హారాలు తీసుకుంటారు. ఇవి మళ్లీ సంప్రదాయ చీర, లెహంగాల మీదకే బాగుంటాయనుకుంటే పొరపాటు. టర్టిల్ నెక్, కాలర్ షర్ట్స్, డీప్ నెక్ టాప్స్ ధరించినప్పుడు ఒకటికి మూడు వరసలు ఉన్నవి, పచివర్క్ హారలు కూడా ధరించవచ్చు, -
ఆరెస్సెస్ చీఫ్పై హీరోయిన్ ఫైర్!
న్యూఢిల్లీ: విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు. ‘‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సోనం కపూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్ అయ్యారు. -
క్యాబ్లో భయంకర అనుభవం: హీరోయిన్
లండన్: గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్లను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించారు. ‘ లండన్లో ఉబెర్ క్యాబ్లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి... అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడమే అత్యంత శ్రేయస్కరం. నేనైతే వణికిపోయాను’ అంటూ లండన్ క్యాబ్ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని... దాంతో తాను క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.(చదవండి : ఉబర్ యాప్లో ఇక ‘నిఘా ఫీచర్’) ఈ క్రమంలో కొందరు సోనమ్ ట్వీట్కు సానుకూలంగా స్పందించగా... మరికొందరు మాత్రం లండన్లో ఉబెర్ సేవలపై గతంలో నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ఉబెర్ విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లండన్లో ఉన్న సోనమ్.. అక్కడికి బయల్దేరిన క్రమంలో బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో.. సదరు సంస్థ తీరు బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని.. మరోసారి అందులో ప్రయాణించబోనని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్లో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ అనే ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది. Hey guys I’ve had the scariest experience with @Uber london. Please please be careful. The best and safest is just to use the local public transportation or cabs. I’m super shaken. — Sonam K Ahuja (@sonamakapoor) January 15, 2020