
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవి సింధు అద్భుత ప్రదర్శనలతో విజయ పరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన యమగూచిపై 21-13, 22-20తో విజయం సాధించింది. తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ 21-13 తో మ్యాచ్ ను కైవసం చేసుకున్న సింధూకు రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
యమగూచి లాంగ్ ర్యాలీలు ఆడుతూ సింధూని బాగా అలిసిపోయేలా చేసి పాయింట్లను సాధించింది . ఒకానొక దశలో 6 పాయింట్ల వెనుకంజలో ఉన్నయమగూచి... సింధూని దాటేసింది. కానీ చివర్లో పుంజుకున్న సింధు రెండు గేమ్ పాయింట్స్ని సేవ్ చేసి గేమ్తో పాటుగా మ్యాచ్ ని కూడా కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment