PV Sindhu
-
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్లు గెలిచి చాంపియన్గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్కి ఫిదా అవుతూ కామెంట్స్పెట్టారు.ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్లో స్టైల్ చేసి అలా వదిలేసింది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్కు ట్రెండీ స్టైల్ను జోడించాయి. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది.ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ -
సింధుకు షాక్
జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్ –500 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్టిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్లో తడబడింది. ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
కలలు రూపుదిద్దుకుంటున్నాయి.. సింధు పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలిసారి..
ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జి క్వాలిఫయర్తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నిర్వహిస్తారు. బరిలో పీవీ సింధుమరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరిన్ని క్రీడా వార్తలుహరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్లో జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది. -
హోం.. స్వీట్ హోం.. భర్తతో సింగపూర్లో పీవీ సింధు (ఫొటోలు)
-
సింధు సులువుగా...
న్యూఢిల్లీ: ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధు వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ 46వ ర్యాంకర్ మనామి సుజి (జపాన్)పై గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. తొలి గేమ్లో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధుకు ఆ తర్వాత కాస్త ప్రతిఘటన ఎదురైంది. జపాన్ ప్లేయర్ వరుస పాయింట్లు సాధించడంతో సింధు ఆధిక్యం 14–13తో ఒక పాయింట్కు చేరింది. ఈ దశలో సింధు చెలరేగి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 17–13తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ చేజార్చుకొని ఆ వెంటనే మళ్లీ మూడు పాయింట్లు సాధించింది.అదే జోరులో తొలి గేమ్ను 21–15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ సింధు దూకుడు కొనసాగింది. వరు సగా ఐదు పాయింట్లు నెగ్గిన భారత స్టార్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఆధిక్యం 13–3కు, 17–5కు పెరిగింది. సింధు స్మాష్లకు మనామి వద్ద సమాధానం లేకపోయింది. చివరకు రెండో గేమ్తోపాటు మ్యాచ్ కూడా సింధు వశమైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సింధు సత్తాకు పరీక్షగా నిలువనుంది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జంగ్ (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–3తో మరిస్కాపై ఆధిక్యంలో ఉంది. అయితే చివరిసారి వీరిద్దరు గతేడాది డెన్మార్క్ ఓపెన్లో తలపడగా మరిస్కా విజేతగా నిలిచింది. మరో భారత ప్లేయర్ అనుపమ ఉపాధాŠయ్య్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అనుపమ 6–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని... పురుషుల సింగిల్స్లో బరిలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కిరణ్ జార్జి సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ అలెక్స్ లానీర్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ కిరణ్ జార్జి 22–20, 21–13తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో కేరళకు చెందిన కిరణ్ తొలి గేమ్లో 14–20తో వెనుకబడ్డాడు. ఈ దశలో కిరణ్ అనూహ్యంగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి తొలి గేమ్ను దక్కించుకోవడం విశేషం. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (ఇండోనేసియా)ను ఓడించిన అలెక్స్ ఈ మ్యాచ్లో తొలి గేమ్ను చేజార్చుకున్నాక గాడి తప్పాడు. రెండో గేమ్లో కిరణ్ ఆరంభం నుంచే జోరు ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ హాంగ్ యాంగ్ వెంగ్తో కిరణ్ ఆడతాడు. పురుషుల డబుల్స్లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 20–22, 21–14, 21–16తో కెన్యా మిత్సుహాషి–హిరోకి ఒకమురా (జపాన్) జంటపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్లో 20–19తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు సమర్పించుకొని గేమ్ను కోల్పోయారు. అయితే రెండో గేమ్ నుంచి భారత జోడీ అతి విశ్వాసం కనబర్చకుండా జాగ్రత్తగా ఆడింది. స్కోరు 15–13 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 19–13తో ముందంజ వేశారు. అదే జోరులో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జోడీ 1–4తో వెనుకబడ్డా వెంటనే తేరుకుంది. నిలకడగా రాణించి 13–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. మహిళల డబుల్స్లో ముగిసిన పోరు మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో భారత పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) 9–21, 21–23తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమితో (జపాన్)లపై, రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) 6–21, 7–21తో హా నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) చేతిలో... అశ్విని భట్–శిఖా గౌతమ్ (భారత్) 7–21, 10–21తో యి జింగ్ లీ–జు మిన్ లువో (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) 18–21, 17–21తో హిరోకి మిదోరికవా–నత్సు సైతో (జపాన్) చేతిలో... అశిత్ సూర్య–అమృత (భారత్) 8–21, 11–21తో పో సువాన్ యాంగ్–లింగ్ ఫాంగ్ యు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. -
సింధు బోణీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ సింధు 21–12, 22–20తో షువో యున్ సుంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో మనామి షిజు (జపాన్)తో సింధు ఆడుతుంది. భారత్కే చెందిన అనుపమ ఉపాధ్యాయ్ ముందంజ వేయగా... మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. అనుపమ 21–17, 21–18తో రక్షిత శ్రీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక 22–20, 16–21, 11–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 13–21తో పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్ 15–21, 10–21తో చున్ యి లిన్ (చైనీస్ తైపీ) చేతిలో, ప్రణయ్ 21–16, 18–21, 12–21తో లీ యాంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో, ప్రియాన్షు 16–21, 22–20, 13–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–19, 14–21, 27–25తో యుషీ తనాకా (జపాన్)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ 23–21, 19–21, 21–16తో వె చోంగ్ మాన్–కాయ్ వున్ తీ (మలేసియా)లపై నెగ్గారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 21–23, 19–21తో అరీసా ఇగారషి–అయాకో సకురామోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్షిప్లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది. -
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
భారత్ నుంచి 21 మంది బరిలోకి
న్యూఢిల్లీ: భారత్లో జరిగే అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో కళకళలాడనుంది. ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత నెలలో వివాహం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీతో కొత్త సీజన్ను ప్రారంభించనుంది. సింధు, లక్ష్యసేన్తోపాటు పారిస్ ఒలింపిక్ చాంపియన్స్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ నంబర్వన్ షి యుకి (చైనా) వంటి అంతర్జాతీయ స్టార్లు ఇందులో భాగం కానున్నారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్లో ముగ్గురు, మహిళల సింగిల్స్లో నలుగురు, పురుషుల డబుల్స్లో రెండు జోడీలు, మహిళల డబుల్స్లో 8 జంటలు, మిక్స్డ్ డబుల్స్లో 4 జోడీలు టోర్నీలో ఆడనున్నాయి. ‘ఈ టోర్నీలో చాలా మంది భారత షట్లర్లు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ పురోభివృద్ధికి ఇది సంకేతం. ఈ ఏడాది పురుషుల సింగిల్స్లో టాప్–20 నుంచి 18 మంది, మహిళల సింగిల్స్లో టాప్–20 నుంచి 14 మంది ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు కూడా మరిన్ని విజయాలు సాధిస్తారనే నమ్మకముంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. భారత ఆటగాళ్ల జాబితా పురుషుల సింగిల్స్: లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్. మహిళల సింగిల్స్: పీవీ సింధు, మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్, ఆకర్షి కశ్యప్. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సాయి ప్రతీక్–పృథ్వీరాయ్. మహిళల డబుల్స్: పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో, రుతుపర్ణ–శ్వేతపర్ణ, మానస రావత్–గాయత్రి రావత్, అశ్విని భట్–శిఖా గౌతమ్, సాక్షి–అపూర్వ, సానియా సికందర్–రష్మీ గణేశ్, మృణ్మయీ దేశ్పాండే–ప్రేరణ అల్వేకర్. మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, సతీశ్ కుమార్–ఆద్య వరియత్, రోహన్ కపూర్–రుత్వివక శివాని, అశిత్ సూర్య–అమృత. -
అందమైన కుందనాల బొమ్మలా సింధు.. సంతోషకర క్షణాలు (ఫొటోలు)
-
బాడ్మింటన్ థీమ్, మసాబా లెహంగా..మహారాణిలా పీవీ సింధు (ఫొటోలు)
-
మహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు
భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు పెళ్లి వేడుక లేటెస్ట్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. చాలా సాదాసీదాగా, ఆట తప్ప, మరో ధ్యాస లేదు అన్నట్టుగా కనిపించే సింధు ఫ్యాషన్లో కూడా పర్ఫెక్ట్ అనిపించుకుంది. నిశ్చితార్థం మొదలు, ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, సంగీత్, మూడు ముళ్ల ముచ్చట, రిసెప్షన్ ఇలా ప్రతీ వేడుకలో చాలా ఎలిగెంట్గా, సూపర్ స్టైలిష్గా మెరిసిపోయింది.తన చిరకాల స్నేహితుడు వెంకట దత్త సాయితో పీవీ సింధు వివాహ వేడుక (డిసెంబర్ 22)అత్యంత సుందరంగా, స్టైలిష్గా జరిగింది. గ్లామరస్ బ్రైడల్ లుక్తో అందర్ని కట్టి పడేసిందీ జంట. 'మాచీ-మ్యాచీ' లుక్స్తో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. తాజాగా ప్రీవెడ్డింగ్ షూట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో సీ గ్రీన్ డిజైనర్ లెహంగాలో అందంగా కనిపించింది. మరొక సెట్ చిత్రాలలో, బ్యాడ్మింటన్-ప్రేరేపిత పాస్టెల్ బ్లూ లుక్లో మెరిసారు.ఈ ఎథ్నిక్ పాస్టెల్ కలర్ లెహంగా డిజైనర్ మసాబా కలెక్షన్లోనిది. అంబర్ బాగ్ టిష్యూ లెహంగా సెమీ-షీర్ స్టైల్తో గోల్డ్-టోన్డ్ ఫాయిల్ ప్రింట్లతో వచ్చింది. దీని జతగా ఎంబ్రాయిడరీ దుపట్టా మరింత అందంగా అమిరింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే లేయర్డ్ నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు అతికినట్టు అమరాయి. మహారాణిలాంటి ఆమె లుక్తో సమానంగా దత్త సాయి మ్యాచింగ్ లుక్లో అదిరిపోయాడు. గోల్డ్ టోన్ ప్రింట్లతో కూడిన 'అంబర్ బాగ్' కుర్తా సంప్రదాయ పంచెకట్టుతో స్పెషల్గా కనిపించాడు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)ఇంకా చాలా విశేషాలుఈ కస్టమ్ క్రియేషన్లో బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్ కాక్స్, బంగారు పతకాలు (టోక్యో , రియో ఒలింపిక్స్లో సింధు సాధించిన విజయాలకు ప్రతీక) ఉంగరాలు, పేపర్ ఎయిర్ప్లేన్ మోటిఫ్స్, సొగసైన జడ స్టైల్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. -
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
తల్లితో కలిసి బుట్టబొమ్మలా.. మంచులో భర్త ప్రేమలో తడిసి ముద్దవుతూ ఇలా (ఫొటోలు)
-
నా ప్రేమ, సంతోషం.. అన్సీన్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
హల్దీ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు.. దత్తపై ప్రేమను కురిపిస్తూ..
-
అద్భుత క్యాప్షన్తో సంగీత్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
శ్రీవారి సేవలో పీవీ సింధు దంపతులు
-
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫొటోలు)
-
పీవీ సింధు పెళ్లి ముస్తాబు : ఈ డిజైనర్ లెహంగా వివరాలు తెలుసా?
-
తాళికట్టి.. తలంబ్రాలు పోసి.. భార్యను ముద్దాడి (ఫొటోలు)
-
PV Sindhu: తన ప్రేమ కథను బయట పెట్టిన సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(Pv Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయితో సింధు వివాహం ఆదివారం(డిసెంబర్ 22) అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్పూర్ వేదికగా జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది.అందుకు హృదయం’ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. అయితే తాజాగా సింధు ఓ ఇంటర్వ్యూలో వెంకట సాయితో తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఓ విమాన ప్రయాణం తమద్దరిని కలిపిందని సింధు తెలిపింది. వోగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. అక్టోబర్ 2022లో తొలిసారి వెంకట దత్త సాయిని సింధు కలిసినట్లు తెలుస్తోంది.రెండేళ్ల కిందట మేమిద్దరం కలిసి ఒకే విమానంలో ప్రయాణించాం. ఆ ప్రయాణంతో అంతామారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని మరింత దగ్గర చేసింది. అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అన్పించింది. అప్పటి నుంచి మా లవ్ జర్నీ మొదలైంది. మా నిశ్చితార్థం కూడా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.మాజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అది చాలా భావోద్వేగభరిత క్షణం. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి.. నా జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం కోసం అన్ని ముందే ప్లాన్ చేశాను. అందుకు దత్తా కూడా తనవంతు సాయం చేశాడని ఓ ఇంటర్వ్యూలో సింధు పేర్కొంది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
పీవీ సింధు పెళ్లి సందడి: పాపులర్ డిజైనర్లు, స్పెషల్ మేలిముసుగు
బాడ్మింటర్ స్టార్ పీసీ సింధు తన కలల రాకుమారుడితో ఏడడుగులు వేసింది. ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో దత్త సాయితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా పీవీ సింధు వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాదు, మొత్తం పెళ్లి వేడుకల్లో ప్రఖ్యాత డిజైనర్లకు సంబంధించిన అందమైన దుస్తులను ఎంపిక చేసుకోవడం విశేషం. సబ్యసాచి ముఖర్జీ నుంచిమనీష్ మల్హోత్రా వరకు, తన ప్రతీ బ్రైడల్ లుక్లోనూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది .డిజైనర్ మనీష్ మల్హోత్రా పీవీ సిందు ఐవరీ-టోన్డ్ బ్రైడల్ చీర వివరాలను ఇన్స్టాలో పంచుకున్నారు.పెళ్లి ముహూర్తానికిబంగారు, వెండి జరీతో చేతితో నేసిన చీరను ముహూర్తానికి కట్టుకుంది. ఈ చారలో బద్లా జర్దోజీ ఎంబ్రాయిడరీ దీనికి స్పెషల్ ఎట్రాక్షన్. ఆమెధరించిన మేలి ముసుగులో పీవీ సింధు, వెంకటదత్తసాయి పేర్లు రాసి ఉండడం మరో ఎట్రాక్షన్.సింధుతో తన వివాహానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ కలర్ బ్రోకేడ్ షేర్వానీలో అందంగా కనిపించాడు వెంకట దత్త సాయి. దీనికి సింధుతో కలిసి మ్యాచింగ్ అన్కట్ డైమండ్ ఆభరణాలను ఎంచుకున్నాడు. బంగారు, వెండితో తయారుచేసిన స్టోల్,షాఫా జతచేసి తన వెడ్డింగ్ లుక్కి సరైన న్యాయం చేశాడు.వరమాల వేడుకకు సబ్యసాచి ముఖర్జీవరమాల వేడుక కోసం సింధు , వెంకట దత్త సాయి ఇద్దరూ సబ్యసాచి ముఖర్జీ దుస్తులను ఎంచుకున్నారు. గోల్డెన్ అండ్ రోజ్ కలర్ ఎంబ్రాయిడరీ రెడ్ లెహంగా ,ఫుల్ స్లీవ్ చోలీతో, షీర్ దుపట్టా ధరించింది. వరుడు వెంకట సాయి గోల్డెన్ వర్క్, లేత గోధుమరంగు రంగు షేర్వానీలో అందంగా కనిపించాడు. ఈ ఔట్ఫిట్కి పగిడి(తలపాగా), ముత్యాల హారం మరింత లుక్ తెచ్చిపెట్టాయి. రిసెప్షన్ లుక్ ఈ జంట ఫల్గుణి షేన్ పీకాక్ స్టైలిష్ ఔట్ఫిట్ లెహెంగాలో పెళ్లి కళ ఉట్టి పడుతూ కనిపించింది సింధు. స్వరోవ్స్కీ, సీక్విన్ క్రిస్టల్ వర్క్ను కలిగి ఉన్న ఐవరీ టల్లే లెహెంగా ఆమె రూపానికి మరింత గ్లామర్ అందించింది. డైమండ్-లేయర్డ్ నెక్లెస్, పచ్చల పెండెంట్, మ్యాచింగ్ చెవిపోగులతో పాటు, ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ను కూడా ధరించింది.మరోవైపు, వెంకట దత్త సాయి టోనల్ సిల్క్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ డిటైలింగ్తో సొగసైన భారీ ఎంబ్రాయిడరీ బ్లేజర్, బ్లాక్ వెల్వెట్ బంద్ గాలా ధరించారు. సంగీత్, హల్దీకిఇక సంగీత్, హల్దీ వేడుకల్లో అబు జానీ సందీప్ కోశ్లా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు సింధు, సాయి దంపతులు. -
ఆటలోనే కాదు..ఫ్యాషన్లోనూ ట్రెండ్ సెట్ చేసిన పీవీ సింధు
పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్ పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ వైభంగా ముగిసింది. పెళ్లి కూతురులుక్లో ముగ్ధమనోహరంగా అందర్నీ మెస్మరైజ్ చేసింది.హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్లో వివాహం చేసుకుంది పీవీ సిందు. ఈ సందర్భంగా సింధు డిజైనర్ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్ రూపొందించిన ఫ్యాషన్ ఔట్ఫిట్స్తో తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్ ఆభరణాలు కొత్త ట్రెండ్కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్లోనూ ట్రెండ్ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Manish Malhotra High Jewellery (@manishmalhotrajewellery)పీవీ సింధు, సాయి మ్యాచింగ్ ఆభరణాలుప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెలరీ కలెక్షన్లోని పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు పొదిగిన మల్టీ-లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు ధరిస్తే, వరుడు డబుల్ లేయర్ నెక్లోస్ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడియాలు, బంగారు గొలుసు సింధు బ్రైడల్ లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేశారు అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు, -
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
PV Sindhu Pre-wedding : పీవీ సింధు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
గ్రాండ్ గా పీవీ సింధు రిసెప్షన్.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన పీవీ సింధు.. క్యూట్ కపుల్ (ఫొటోలు)
-
హైదరాబాద్ వచ్చిన పీవీ సింధు..నేడు వివాహ రిసెప్షన్ (ఫొటోలు)
-
నేడు సింధు వివాహ రిసెప్షన్... ప్రముఖులు హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకల్లో భాగంగా నేడు మరో కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా మంగళవారం రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు సచిన్ టెండూల్కర్ తదితరులను సింధు ఆహ్వానించింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆదివారం రాత్రి రాజస్తాన్లోని ఉదయపూర్లో సింధు పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులైన కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వధూవరులను ఆశీర్వదించారు. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్షిప్ పతకాలు సహా పలు గొప్ప విజయాలతో భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా సింధు గుర్తింపు తెచ్చుకోగా... పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. -
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్పూర్లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఉదయ్పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో రాజమహల్లాంటి వేదికపై ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఆమె తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయిని వివాహమాడింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న (మంగళవారం) హైదరాబాద్లో వీరి వివాహా రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ప్రభుత్వ పెద్దలు హాజరయ్యే అవకాశముంది. -
‘వివాహ ఆహ్వానం’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్లోని ఉదయపూర్లో సింధు వివాహం జరగనుంది. -
ఎంగేజ్మెంట్ చేసుకున్న పీవీ సింధు.. ఫోటో వైరల్
భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. శనివారం పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నది."ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు" అని లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్ను క్యాప్షన్గా సింధు జోడించింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇద్దరూ కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా డిసెంబర్ 22న ఉదయ్పూర్ వేదికగా సింధు-సాయి జంట వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. సింధు వివాహ వేడుకలు ఈ నెల 20 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇరు కుటంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ కాబోయే జంట ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వంటి ప్రముఖలను తమ పెళ్లికి ఆహ్వానించారు. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) -
పెళ్లి పనుల్లో పీవీ సింధు బిజీ బిజీ.. ఫోటోలు వైరల్
-
సచిన్ను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు జంట.. ఫోటోలు వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో సింధూ తన జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్పూర్లో జరగనుంది.ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిసి తమ వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న వెంకట్, సింధు జోడికి శుభాకాంక్షలు. మీ ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లికి రావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.ఎవరీ వెంకట దత్తసాయి?హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు. అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో డిప్లొమా పూర్తి చేశారు.వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ సాయి కలిసి పనిచేశాడు. అయితే వెంకట సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ముందుగానే పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ఇరు కుటంబాల పెద్దలు వీరిద్దిరి పెళ్లిని నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్లకు ఐసీసీ షాక్!?In badminton, the score always starts with 'love', & your beautiful journey with Venkata Datta Sai ensures it continues with 'love' forever! ♥️🏸 Thank you for personally inviting us to be a part of your big day. Wishing you both a lifetime of smashing memories & endless rallies… pic.twitter.com/kXjgIjvQKY— Sachin Tendulkar (@sachin_rt) December 8, 2024 -
కాబోయే భర్తతో కలిసి డిన్నర్కు వెళ్లిన పీవీ సింధు... ఫొటోలు చూశారా?
-
పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్తో రిలేషన్!.. బ్యాక్గ్రౌండ్ ఇదే!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.ఆసక్తికర విషయాలుఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఢిల్లీ క్యాపిటల్స్తోనూఅనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్గా, ఇన్హౌజ్గా కన్సల్టెంట్గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.లింక్డిన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.కృతజ్ఞతలు సింధుఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు. ఉదయ్పూర్ వేదికగాకాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్లోని ఉదయ్పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే?
-
పీవీ సింధు పెళ్లి బాజాకు మూహూర్తం ఫిక్స్.. వరుడు ఇతడే (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పారాణితో ముస్తాబుకానుంది. ఆమె పెళ్లి బాజాకు మూహూర్తం కూడా ఖారారైంది. ఈ నెల 22న ఉదయ్పూర్ (రాజస్తాన్)లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరుగనుంది. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె నవ వధువుగా పెళ్లి పీటలెక్కబోతోంది. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది. తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. ‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను ఉదయ్పూర్లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్లో రిసెప్షన్ను ఏర్పాటు చేస్తాం. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయి’ అని రమణ వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలు, రెండు వరుస ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతం... 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన సింధు... 2017, 2018లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పతకాలు గెలుచుకుంది. -
సింధు నిరీక్షణ ముగిసె...
లక్నో: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సింధు చాంపియన్గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్లో ఈ ఏడాది సింధుకిదే తొలి టైటిల్కాగా... ఓవరాల్గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్ టోర్నిలో సింధు ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ‘ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్గా ఉండటమే. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్గా ఉంటే వరుసగా నాలుగో ఒలింపిక్స్లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి నుంచి కొత్త సీజన్ను ప్రారంభిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది. లక్ష్య సేన్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ లక్ష్య సేన్కే టైటిల్ లభించింది. 31 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–6, 21–7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై గెలిచాడు. లక్ష్య సేన్కు 15,570 డాలర్ల (రూ. 13 లక్షల 31 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నిలు ఆడగా... ఈ టోర్నిలోనే ఫైనల్కు చేరుకొని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ–సాయిప్రతీక్ (భారత్).. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీలు రన్నరప్గా నిలిచాయి. గాయత్రి–ట్రెసా జోడీ అదుర్స్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ టైటిల్ను సొంతం చేసుకుంది. గాయత్రి–ట్రెసా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 21–11తో బావో లి జింగ్–లి కియాన్ (చైనా) జంటను ఓడించింది. ఈ ఏడాది ఓవరాల్గా గాయత్రి–ట్రెసా జోడీ 20 టోర్నిలు ఆడి ఎట్టకేలకు తొలి టైటిల్ను దక్కించుకుంది. గాయత్రి–ట్రెసా జంటకు 16,590 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సంవత్సరం నిలకడగా రాణించిన గాయత్రి–ట్రెసా ద్వయం ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. -
ఫైనల్లో పీవీ సింధు
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్ల్లో చిత్తు చేసింది. సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది. లక్ష్యసేన్ ముందంజ.. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్)పై వరుస గేమ్ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్ సులువుగా మ్యాచ్ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్ 13–21, 19–21తో జియా హెంగ్ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో జియా హెంగ్తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఫైనల్కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సెమీస్లో ఓడింది. గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్ (థాయిలాండ్)పై గెలుపొందగా...టాప్ సీడ్ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్ – లి ఖియాన్ చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్లో ఐదో సీడ్ తనీషా–ధ్రువ్ జంట 21–16, 21–15తో జీ హాంగ్ జూ–జియా యీ యాంగ్ (చైనా) ద్వయంపై గెలిచింది. -
క్వార్టర్స్లో సింధు
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21–10, 12–21, 21–15తో ఐరా శర్మ (భారత్)పై శ్రమించి గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ డాయ్ వాంగ్తో సింధు ఆడుతుంది. హైదరాబాద్కే చెందిన వలిశెట్టి శ్రియాన్షి సంచలనం సృష్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–12, 21–15తో ప్రపంచ 32వ ర్యాంకర్ మాళవిక (భారత్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో భారత క్రీడాకారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
సింధు శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–17, 21–15తో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కే చెందిన వలిశెట్టి శ్రేయాన్షి, మాళవిక బన్సోద్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ్, తస్నిమ్ మీర్, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్, ఐరా శర్మ కూడా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో భారత క్రీడా కారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–12, 21–12తో ఆదిల్ (మలేసియా)పై, ప్రియాన్షు 21–13, 21–12తో కార్తికేయ (భారత్)పై గెలిచారు. భారత్కే చెందిన మైస్నం మెరాబా, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి, రిత్విక్ కూడా తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 19వ ర్యాంక్లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్లో జార్స్ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
సింధు ఐదో‘సారీ’
కుమమోటో: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 23వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 16–21, 17–21తో పోరాడి ఓడిపోయింది. మిచెల్లి లీ చేతిలో సింధుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. మిచెల్లిపై 10 సార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను సొంతం చేసుకున్నా... ఆ తర్వాతి రెండు గేముల్లో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో రెండుసార్లు (మిక్స్డ్ టీమ్ మ్యాచ్, సింగిల్స్ సెమీఫైనల్) సింధును ఓడించిన మిచెల్లి ఆ తర్వాత 2023లో థాయ్లాండ్ ఓపెన్లో మూడోసారి సింధుపై నెగ్గింది. ఈ ఏడాది ఆర్క్టిక్ ఓపెన్లో నాలుగోసారి సింధును ఓడించిన మిచెల్లి నెల తిరిగేలోపు జపాన్ ఓపెన్లో మరోసారి గెలుపు రుచి చూసింది. -
సింధు శుభారంభం
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్మమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న బుసానన్తో జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవరాల్గా సింధు, బుసానన్ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది. అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. -
శుభారంభంపై సింధు దృష్టి
కుమమొటో: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట (పీవీ) సింధు, లక్ష్యసేన్ వైఫల్యాలను అధిగమించి టైటిళ్ల వేటలో పడాలనే పట్టుదలతో జపాన్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జపాన్ మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ జరగనుంది. ఇద్దరు భారత అగ్రశ్రేణి షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేకపోయారు. గతంలో ఒక సీజన్లో వరుస టైటిల్స్ సాధించిన వారు ఇప్పుడు కనీసం క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ పీవీ సింధు ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్లో తొలి రౌండ్లోనే విఫలమైనా... డెన్మార్క్ ఓపెన్లో మాత్రం క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ లక్ష్యసేన్ మాత్రం ఈ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే కంగుతిని ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 29 ఏళ్ల సింధు... థాయ్లాండ్కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్తో తలపడనుండగా, పురుషుల ఈవెంట్లో 23 ఏళ్ల లక్ష్యసేన్ మలేసియాకు చెందిన లియోంగ్ జున్ హవొను ఎదుర్కొంటాడు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే... అతను రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ ఆంథోనీ గిన్టింగ్ (ఇండోనేసియా)తో పోటీపడే అవకాశముంది. ఇక డబుల్స్లో ఒకే ఒక్క భారత జోడీ బరిలో ఉంది. పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన సూ యిన్ హూ–లిన్ జి యున్ జోడీతో తలపడుతుంది. కొత్త కోచ్ల మార్గదర్శనంలో టోర్నీ కోసం సిద్ధమైనట్లు సింధు చెప్పింది. ‘నేనిపుడు బాగా ఆడుతున్నాను. శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉన్నాను. కొన్ని లోపాలపై కసరత్తు చేశాం. కోర్టులో డిఫెన్స్, స్పీడ్ మెరుగుపర్చుకునేందుకు ఇటీవల బాగా శ్రమించాను. జపాన్తో పాటు త్వరలో చైనాలో జరిగే టోరీ్నలోనూ రాణిస్తాను’ అని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం, కోచ్ లీ స్యూన్, అనూప్ శ్రీధర్లతో ఆమె శిక్షణ తీసుకుంటుంది. -
2028 ఒలింపిక్స్లో ఆడతా!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్లో పతకం అంచనాలతో బరిలోకి దిగినా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో కూడా ఆమె విఫలమైంది. ఈ నేపథ్యంలో సింధు భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. అయితే తాను ఆటను ఇంకా ముగించలేదని సింధు స్పష్టం చేసింది. ఫిట్గా ఉంటే 2028లో లాస్ ఏంజెలిస్లో జరిగే ఒలింపిక్స్లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం గెలిచిన సింధు... 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించింది. వచ్చే ఒలింపిక్స్ సమయానికి సింధుకు 33 ఏళ్లు నిండుతాయి. ‘ఆ సమయానికి నేను ఫిట్గా, గాయాలు లేకుండా ఉంటే కచి్చతంగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతాను. ఇప్పుడైతే నా ఆలోచన ఇదే. కాబట్టి ప్రస్తుత నా లక్ష్యం పూర్తి స్థాయిలో ఫిట్గా ఉండేందుకు ప్రయతి్నంచడం. అప్పుడు సహజంగానే ఆడాలనే ప్రేరణ లభిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ఎంతో సాధించాలనే తపన ఉంది. మరిన్ని టైటిల్స్ గెలిచి పోడియం మీద నిలబడాలని భావిస్తున్నా. నా ఆటతో భవిష్యత్ తరాలను స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నా. అందుకోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తా’ అని సింధు పేర్కొంది. పారిస్లో ఓటమితో తానేమీ బాధ పడలేదని, పరాజయంతో ప్రపంచం ఆగిపోదని ఆమె అభిప్రాయ పడింది. ‘నా కెరీర్లో రెండు ఒలింపిక్స్లు అద్భుతంగా సాగాయి. అయితే ప్రతీసారి అలా జరగదు. మూడోసారి పతకం గెలవలేకపోయా. నేను బాగానే ఆడానని అనుకుంటున్నా. అక్కడితో అంతా ముగిసిపోలేదు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి పారిస్ వైఫల్యంపై బాధ లేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు’ అని సింధు చెప్పింది. తన ఆటతీరు మెరుగుపర్చుకునే క్రమంలో మాజీ ఆటగాళ్లు లీ హ్యూన్, అనూప్ శ్రీధర్ల వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మార్పు తప్పనిసరి అవుతుందని... అదే కారణంతో గత కోచ్ల వద్ద శిక్షణకు గుడ్బై చెప్పి కొత్త కోచ్లను ఎంచుకున్నట్లు సింధు వివరించింది. త్వరలో జరిగే జపాన్, చైనా ఓపెన్లపై దృష్టి పెట్టానని, మళ్లీ వరుస విజయాలు దక్కుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.‘ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నా. పూర్తి ఫిట్గా కూడా మారాను. స్పీడ్, డిఫెన్స్కు సంబంధించి కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. కోచ్ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. వారి పర్యవేక్షణలో రాబోయే జపాన్, చైనా టోర్నీల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. అక్కడినుంచే మ్యాజిక్ మొదలవుతుంది. చూస్తూ ఉండండి’ అని సింధు వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలో తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని... ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాబోయే ఏడాదిన్నర కాలంలో అది సిద్ధమవుతుందని సింధు వెల్లడించింది. -
టీడీపీ కబ్జాలకు చెక్ పెట్టిన పీవీ సింధు
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
గుడ్న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.సింధు భావోద్వేగంఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.ఇందులో నా భాగస్వాములు, నా టీమ్ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సింధుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్ సెంటర్కు పునాది వేసింది.వైఎస్ జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధుఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్పాట్ తగలనుందా? View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) -
పీవీ సింధు అకాడమీ కబ్జా.. ?
-
సింధు పరాజయం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 13–21, 21–16, 9–21తో ప్రపంచ 8వ ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను కోల్పోయినా వెంటనే తేరుకొని రెండో గేమ్ను దక్కించుకుంది.అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో గ్రెగోరియా ధాటికి సింధు చేతులెత్తేసింది. గతంలో గ్రెగోరియాపై 10 సార్లు గెలిచిన సింధు మూడుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 4,675 డాలర్ల (రూ. 3 లక్షల 92 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పీవీ సింధు శుభారంభం.. లక్ష్య సేన్ విఫలం
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న రెండో టోర్నమెంట్లో ఆమె జయకేతనం ఎగురవేసింది. విశ్వక్రీడల తర్వాత ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు... మంగళవారం మొదలైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం అందుకుంది.మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్లో సింధు 21–8, 13–7తో విజయం సాధించింది. అయితే, తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో సింధు విజేతగా నిలిచి ప్రిక్టార్టర్స్కు అర్హత సాధించింది.ఇక నాలుగో సీడ్ హాన్ యువె (చైనా), పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) మధ్య తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు తలపడుతుంది. మరోవైపు.. భారత్కే చెందిన రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మాళవిక 13–21, 12–21తో థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, ఆకర్షి కూడా 13–21, 12–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో లౌరెన్ లామ్ (అమెరికా)తో ఉన్నతి హుడా పోటీపడుతుంది.ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–12, 19–21, 14–21తో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 18–21, 22–24తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది. సోనమ్ గురికి రజతంన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత జట్టు రజత పతకంతో బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకాన్ని సాధించింది. 22 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు అర్జున్ (188.3 పాయింట్లు) ఐదో స్థానంలో, దివ్యాంశ్ (124 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (109.9 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రిథమ్ (197.2 పాయింట్లు) నాలుగో స్థానంలో, సురభి (176.6 పాయింట్లు) 5వస్థానంలో నిలిచారు. -
Denmark Open 2024: కళ్లన్నీ వాళ్లిద్దరిపైనే..
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్లో ఫామ్లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.ఆ అడ్డంకిని దాటితేనేరెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్కు ఫిన్లాండ్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు. లక్ష్య సేన్ గాడిన పడతాడా?పురుషుల సింగిల్స్లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.డబుల్స్లోఇక మహిళల డబుల్స్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు. -
తొలిరౌండ్లో సింధు ఓటమి
పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. ఫిన్లాండ్లో మంగళవారం మొదలైన ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 16–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయింది. గతంలో మిచెల్లి లీపై 10 సార్లు గెలిచిన సింధు నాలుగోసారి ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ 23వ ర్యాంకర్ సుంగ్ షువో యున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మాళవిక 21–19, 24–22తో నెగ్గగా... ప్రపంచ 39వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకర్షి 21–19, 21–14తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్లో కిరణ్ జార్జి 21–16, 13–21, 21–19తో లుకాస్ క్లియర్»ౌట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. -
Arctic Open 2024: సింధు పునరాగమనం
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్లో లక్ష్య సేన్ అన్సీడెడ్గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్లో భారత టాప్ స్టార్కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్లో రస్మస్తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్తో పోటీపడే అవకాశముంటుంది. -
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
సింధు కన్సల్టింగ్ కోచ్గా లీ హ్యూన్
పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్ను కన్సలి్టంగ్ కోచ్గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్ను కోచ్గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది.దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్పై అనూప్కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్షిప్లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
మళ్లీ విజయాలు అందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ను తాత్కాలిక కోచ్గా ఎంచుకున్న సింధు దాదాపు గత మూడు వారాలుగా అతనితో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోందని, తన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కొనసాగుతోందని శ్రీధర్ వెల్లడించాడు. ‘సింధు ఆటలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంతో పాటు కొన్ని కొత్త విషయాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటి వరకు మేం ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా పక్కా ప్రణాళికతో సాధన చేస్తున్నాం. ఈ మూడు వారాల్లో ఆమె ఆటలో చాలా మార్పు వచ్చింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సింధులో మరిన్ని విజయాలు సాధించాలనే తపన ఉంది. గతంలోకంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతోంది. ఈ సాధనతో వచ్చే టోరీ్నల్లో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆరంభ రౌండ్లలో బాగా ఆడితే ఆ తర్వాత టైటిల్స్ సాధించడం లాంఛనమే అవుతుంది. ఆమె ఆటలో నిలకడ తీసుకొచ్చి మరిన్ని విజయాలు వచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని అనూప్ శ్రీధర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక కోచ్గానే వచ్చాను కాబట్టి ఒక్కో వారం చొప్పున సమీక్ష చేస్తూ కోచింగ్ కొనసాగిస్తున్నానన్న శ్రీధర్... ఇదే కారణంతో సుదీర్ఘ కాలపు ప్రణాళికలు వేయడం లేదని స్పష్టం చేశాడు. సింధు కన్సల్టింగ్ కోచ్గా లీ హ్యూన్పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్ను కన్సల్టింగ్ కోచ్గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్ను కోచ్గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది. దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్పై అనూప్కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్షిప్లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్కు ఫ్రాన్స్లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకోవడమే మంచిదా..?
మన దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో (Paris Olympics 2024) పతకం లక్ష్యంగా బరిలోకి దిగి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన ఓటమికి గల కారణాలను వివరిస్తూ..తన మనసు శరీరం విరామం కోరుకుంటుందంటూ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంది. మానసిక శారీరం ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకుని బ్యాడ్మింటన్లో కొనసాగుతానని చెప్పుకొచ్చింది. ఇక్కడ పీవీ సింధు తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య నిపుణులు స్వాగతించడమే గాక ప్రశంసించారు. నిజానికి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకోవడమే మంచిదా..? నిపుణులే ఏమంటున్నారంటే..ఏ వృత్తి లేదా క్రీడల్లో ఒత్తిడి అనేది సహజం. ప్రతిసారి మనదే పైచేయి అవుతుందని చెప్పలేం. అలాగే మనపై మన వాళ్లు పెట్టుకునే భారీ అంచనాలు ఒక్కోసారి తలకిందులై విమర్శలపాలవ్వుతాం. అలాంటప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అన్నికంటే ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన క్లిష్టమైన సమయం అని అంటున్నారు నిపుణులు. ఇక్కడ పీవీ సింధుపై భారీ అంచానలు ఉన్నాయి. ఈసారి ఒలింపిక్స్లో పసిడి పతకం గెలుచుకుంటుందనుకున్నారు. అలాగే ఆమె కూడా విజయం తనదే అని గట్టిగా విశ్వసించింది. అందుకోసం జరిగిన ప్రిపరేషన్లో గాయాలు, ఒత్తిడి మాములుగా ఉండవు. తీరా బరిలోకి దిగాక ప్రత్యర్థి ఎత్తు, దూకుడు ఊహకందని విషయం అనేది తెలిసిందే. అనుకోని రీతీలో పరాజయం పాలైతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడికైన జీర్ణించుకోలేని బాధ, ఆవేదన ఉంటాయి. అయినా ఆటలో గెలుపోటములు సహజం అని తెలిసినా..ఒక్కోసారి ఇంత కష్టం వృధా అయ్యిందన్న బాధ నిలువనియ్యదు. అలాంటప్పడే ఏ మనిషి అయినా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అమూల్యమైన సమయం. ఇక్కడ కోపం, బాధను పక్కన పెట్టి మానసికంగా దృఢంగా ఉండేందుకు యత్నించాలి. అంటే ఆరోగ్యంపై పూర్తి దృష్టిసారించగలిగితేనా ఏదైనా చేయడం సాధ్యం అవుతుందనేది గుర్తించాలి. అదే పని సింధు చేసింది ఇక్కడ. అలుపెరగని ప్రాక్టీస్, ఒత్తిడులతో అలసిపోయానని చెప్పడమే గాక తన మనుస్సు, శరీరం విశ్రాంతి కోరుకుంటుందనే సంకేతాల్ని గుర్తించి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది సింధు. అన్ని సంపదల్లోకెల్లా "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న నానుడిని స్పురణకు తీసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పకనే చెప్పింది అని నిపుణులు అంటున్నారు. ఆటలోనే కాదు జీవనశైలిలోనూ స్ఫూర్తిగా నిలిచిందంటూ సింధు నిర్ణయాన్ని కొనియాడుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడైనా శరీరం, మనసు తాను బాగాలేను, సిద్ధంగా లేను అని చెబుతున్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కాస్త విశ్రాంతి తీసుకుని నూతన ఉత్సాహంతో మళ్లీ కార్యరంగంలోకి దిగి మంచి మంచి విజయాలను అందుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగుంటాం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?) -
Olympics 2024: హార్ట్ బ్రేక్.. మనూ చేజారిన పతకం
Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది. అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది. మనూ ప్రయాణం సాగిందిలా..👉మొత్తం 3 సిరీస్లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు👉తొలి సిరీస్👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ.. 👉ఐదింటిలో రెండు సఫలం👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్లో సౌత్ కొరియా షూటర్👉రెండో సిరీస్👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ👉తొలి ఎలిమినేషన్- యూఎస్ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్👉మూడో సిరీస్👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్👉మూడో స్థానానికి పడిపోయిన మనూ👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్లో మనూ ఓటమి👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్నాలుగో స్థానంలోసౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్కు స్వర్ణంఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్వ్స్కికి రజతంహంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యంనాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012 👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020 -
భారత్ కు మరో పథకం..
-
అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు
‘‘ప్యారిస్లో అందమైన ప్రయాణం.. కానీ... జీర్ణించుకోలేని ఓటమి. నా కెరీర్లో అత్యంత కఠినమైన సమయం. జరిగినదాన్ని నా మనసు అంగీకరించేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సిందే.ఈ ప్రయాణంలో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు గాయాలతో సతమతమయ్యాను. సుదీర్ఘకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సవాళ్లన్నంటినీ అధిగమించి.. ఇక్కడి దాకా వచ్చి.. విశ్వ క్రీడల్లో మూడోసారి నా అందమైన, అద్భుతమైన దేశానికి ప్రాతినిథ్యం వహించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం.ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచానంటూ మీరు పంపే సందేశాలు.. ఇలాంటి కష్టకాలంలో నాకెంతో ఊరట కలిగిస్తున్నాయి. ప్యారిస్ 2024లో నేను, నా జట్టు అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశాం. ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు.ఇక.. నా భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే... ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కచ్చితంగా ఆటలో కొనసాగుతా. అయితే, కొంతకాలం బ్రేక్ తీసుకుంటా. ఇది కేవలం చిన్న విరామం మాత్రమే.నా శరీరం.. ముఖ్యంగా నా మనసుకు ఇది చాలా అవసరం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. నా కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వను. నాకెంతగానో ఇష్టమైన క్రీడను మరింతగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాను’’ అని భారత బ్యాడ్మింటన్ పూసర్ల వెంకట సింధు ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది.రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిప్యారిస్ ఒలింపిక్స్లో తన ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోవడం పట్ల సింధు విచారం వ్యక్తం చేసింది. అయితే, ఓటమి తనను కుంగదీయలేదని.. వేగంగా తిరిగి వస్తానని.. ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.పసిడి పతకం గెలుస్తానని ధీమారియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్- 2020లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల నడుమ ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో దిగింది పీవీ సింధు. ఆమె గత రికార్డుల దృష్ట్యా మహిళల సింగిల్స్ విభాగంలో పతకం ఖాయమని విశ్లేషకులు భావించారు. సింధు సైతం ఈసారి పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.చేదు అనుభవంఅయితే, రౌండ్ ఆఫ్ 16లోనే ఆమె పోరాటం ముగిసిపోయింది. గురువారం నాటి ప్రిక్వార్టర్స్లో అనూహ్య రీతిలో 29 ఏళ్ల పీవీ సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నంబర్ 13 ర్యాంకర్ అయిన సింధు.. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో తలపడింది. ప్రత్యర్థి చేతిలో 19–21, 14–21తో ఓడిపోయింది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ సెమీస్లో హి బింగ్జియావోతోనే పోటీపడిన సింధు.. ఆమెను ఓడించి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం బింగ్జియావో సింధుపై పైచేయి సాధించింది.Paris 2024: A Beautiful Journey but a Difficult Loss ❤️This loss is one of the hardest of my career. It will take time to accept, but as life moves forward, I know I will come to terms with it.The journey to Paris 2024 was a battle, marked by two years of injuries and long… pic.twitter.com/IKAKu0dOk5— Pvsindhu (@Pvsindhu1) August 2, 2024 -
భారత్కు ‘బ్యాడ్’మింటన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో గురువారం భారత్కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్లో సహచరుడు ప్రణయ్ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు. పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పోరాడినా... పురుషుల డబుల్స్లో ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది. ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో తలపడిన గత మూడు మ్యాచ్ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పతకం గెలవలేకపోయారు. ప్రణయ్ అవుట్ సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్పై ఉన్నాయి. భారత నంబర్వన్, సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు. -
నాకౌట్ దశకు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్ల ర్యాలీ జరిగింది. చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్గా భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్): ప్రవీణŠ జాధవ్ X వెన్చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీభారత్ X బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ప్రి క్వార్టర్స్ చేరిన పీవీ సింధు (ఫొటోలు)
-
Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్లో ఆకుల శ్రీజ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.మూడో సీడ్ పై లక్ష్య గెలుపుబుధవారం నాటి మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్లో అన్సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్కు ఇవే తొలి ఒలింపిక్స్. Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan ChristieSensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024 ఆకుల శ్రీజ సంచలన విజయంమరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్కు చెందిన జియాన్ జెంగ్తో తలపడింది.తొలి గేమ్లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.ఫైనల్లో స్వప్నిల్ కుసాలే50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్ఈవెంట్కు అర్హత సాధించాడు.ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు! -
Olympics 2024: ప్రి క్వార్టర్స్ చేరిన పీవీ సింధు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్- ఎమ్ టాపర్గా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బుధవారం నాటి మ్యాచ్లో ఎస్టోనియా షట్లర్ క్రిస్టిన్ కౌబాను 21-5, 21-10తో ఓడించి ప్రి క్వార్టర్స్కు అర్హత సాధించింది.ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్లో సింధు.. మాల్దీవుల షట్లర్ ఫాతిమాత్ నబాహ అబ్దుల్ రజాక్ను 21-9, 21-6తో ఓడించింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ప్రి క్వార్టర్స్లో సింధు.. గ్రూప్-ఎన్ టాపర్, చైనాకు చెందిన హి బింగో జియావోను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇదిలా ఉంటే.. టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీపడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే.కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్-2016లో రజతం సాధించిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలిచింది. ముచ్చటగా మూడో మెడల్ మెడలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు.. ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.చదవండి: మను మహరాణి -
పారిస్ ఒలింపిక్స్ 2024: ఫ్యామిలీతో రామ్చరణ్ సందడి (ఫోటోలు)
-
రామ్ చరణ్తో పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్లో అరుదైన దృశ్యం!
పారిస్ ఒలింపిక్స్లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది. View this post on Instagram A post shared by Rhyme Konidela (@alwaysrhyme) -
Paris olympics: సత్తా చాటిన పీవీ సింధు.. తొలి మ్యాచ్లో ఘన విజయం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్పై పీవీ సింధు గెలుపొందింది.గ్రూప్ దశ మ్యాచ్లో సింధూకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు వరుస గేమ్ల్లో ప్రత్యర్ధిని 21-9, 21-6 తేడాతో చిత్తు చేసింది. ఇక, ఆట ప్రారంభమైన 29 నిమిషాల్లోనే సింధూ మ్యాచ్ను ముగించడం విశేషం. PV SINDHU REGISTERS A SOLID VICTORY AT THE PARIS OLYMPICS. 🏸 pic.twitter.com/bDT24lasyr— Cricfobia (@Cricfobia22) July 28, 2024 #Olympics | In her quest for 3rd medal in the Olympics at the trot, Indian ace shuttler PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq of Maldives in straight sets of 21-9 & 21-6 to clinch her first victory at #Paris2024— ANI (@ANI) July 28, 2024 -
యువ భారత్ ప్రతీకలు వాళ్లు
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవంలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడం అనిర్వచనీయమైన అనుభూతి. ఒలింపిక్ వేదికపై తొలిసారి పతాకధారిగా టీమిండియాకు ముందు నిలవడంతో ఇది నాకు మరింత ప్రత్యేకం. గతంలో రియో, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నా ఇవి నాకు మూడో విశ్వక్రీడలు. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని మాటల్లో వర్ణించలేం. ఈసారి కూడా అంతే. పారిస్ క్రీడాగ్రామంలో అడుగుపెట్టగానే కొత్త ఉత్సాహం వచి్చంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఈసారి భారత బృందంలో 70 మందికి పైగా అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు. వారు కాస్త ఆందోళన చెందుతుండొచ్చు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో నా పరిస్థితి కూడా అంతే. కానీ ఈసారి విశ్వక్రీడల్లో అరంగేట్రం చేస్తున్న వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారు యువభారతానికి ప్రతీకల్లా కనిపిస్తున్నారు. ఈ తరం మరింత ఉత్సాహంగా ఉంది. తాము ఎవరికంటే తక్కువ కాదనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సాధించిన విజయాల వల్ల వారి ఆలోచనల్లో ఈ మార్పు వచి్చంది. ఒలింపిక్స్కు సిద్ధమయ్యే క్రమంలో ప్రభుత్వ సహకారం మరవలేనిది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన ప్రేరణ, మానసిక బలం అథ్లెట్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న 117 మంది భారత బృందం అటు అనుభవజు్ఞలు, ఇటు యువకులతో సమతూకంగా ఉంది. ప్రతీ అథ్లెట్ తమ తమ విభాగాల్లో అత్యుత్తమ శిక్షణ పొందడంతో పాటు... మానసిక స్థయిర్యాన్ని సాధించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇతోధిక సాయం చేసింది. అథ్లెట్లు అడిగిన సౌకర్యాలన్నింటినీ క్రీడాశాఖ సమకూర్చింది. ఇప్పుడు యావత్ భారతావని నమ్మకాన్ని నిలబెట్టడం అథ్లెట్ల బాధ్యత. పారిస్ ఒలింపిక్స్–2024లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసేందుకు సిద్ధంగా ఉండండి. -
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్స్టాగ్రామ్లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు.