
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. స్వామివారిని 70,815 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకోగా, తలనీలాలను 25,245 మంది భక్తులు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారికి రెండు గంటల్లో దర్శనమవుతోంది.