![శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం](/styles/webp/s3/article_images/2025/02/16/15udg03-240047_mr-1739646326-0.jpg.webp?itok=Wd_-fATz)
శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
ఉదయగిరి: ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ శైవక్షేత్రాలైన సిద్దేశ్వరం, బైరవకోనకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు డీఎం శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయగిరిలో ఉదయం 7 గంటలకు బస్సు బయల్దేరి సిద్దేశ్వరం చేరుకుంటుందన్నారు. అనంతరం 9.30 గంటలకు సిద్దేశ్వరంలో బయలుదేరి 11 గంటలకు భైరవకోనకు చేరుకుంటుందని చెప్పారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు భైరవకోనలో బయలుదేరి 2 గంటలకు ఉదయగిరికి చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ను ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ముడమాల రమేష్రెడ్డి, స్థానిక నాయకులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment