నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,002 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్కు సంబంధించి 28,376 మందికి గానూ 27,539 మంది హాజరయ్యారు. 837 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 1,399 మందికి గానూ 1,234 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరు ఫత్తేఖాన్పేటలోని విశ్వసాయి, రవీంద్రభారతి, రావూస్, కృష్ణచైతన్య, అరవింద్నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణను ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment