
అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఇండో – నేపాల్ 4వ ఎంజీకే అంతర్జాతీయ కరాటే చాంపియన్షిప్లో నెల్లూరీయులు ప్రతిభ చూపారు. ఇటీవల నేపాల్లో జరిగిన ఈ పోటీల్లో అండర్ – 19 విభాగం కటా ఈవెంట్లో స్పోర్ట్స్ కరాటే ఫౌండేషన్కు చెందిన పునీత్ బంగారు పతకం, అండర్ – 15 కటా ఈవెంట్లో ఎన్.ఇందుమతి బంగారు పతకం, అండర్ – 13 కటా ఈవెంట్లో ఎన్.ప్రియ సిల్వర్ మెడల్ సాధించారని మాస్టర్ షిహాన్ మురళి సోమవారం తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సహకారం అందించిన నెల్లూరు జిల్లా యూత్ ఆఫీసర్, నెహ్రూ యువ కేంద్రం అధికారి మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.