భర్త విదేశాల్లో.. భార్య ఆత్మహత్య.. అత్తామామలపై అనుమానం | - | Sakshi
Sakshi News home page

భర్త విదేశాల్లో.. భార్య ఆత్మహత్య.. అత్తామామలపై అనుమానం

Oct 9 2023 12:18 AM | Updated on Oct 10 2023 1:10 PM

- - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: అత్తమామల వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పైలా తులసయ్య, మోహినీల కుమార్తె నీలాపు మీనాకుమారి(22)ని ఏడేళ్ల కిందట అదే మండలం నీలాపుపుట్టుగ గ్రామానికి చెందిన నీలాపు మోహన్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల బాబు తులసీదాసు, రెండున్నరేళ్ల పాప ధనుశ్రీలు ఉన్నా రు.

ఏడు నెలల కిందట భర్త మోహన్‌బాబు విదేశాలకు వలస వెళ్లిపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలైనట్లు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నా రు. మామ జగ్గారావు, అత్త అన్నపూర్ణలు ప్రతి రోజు తమ కుమార్తెతో గొడవలకు దిగడంతో పలుమార్లు సర్ది చెప్పినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం మరోమారు గొడవ కావడంతో మీనాకుమారి సా యంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటిలోనే ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డ చావుకు అత్తింటి వారే కారణమంటూ గ్రామంలో పెద్దలతో పంచాయతీ పెట్టారు.

తమ కోడలు కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని అత్తామామలు పంచాయతీలో చెప్పడంతో ఇరు కుటుంబాల మ ధ్య రాజీ కుదరలేదు, మృతురాలి తల్లి పైలా మోహిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఇంటిని పరిశీలించింది. అనంతరం మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement