హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం

Published Fri, Feb 21 2025 8:12 AM | Last Updated on Fri, Feb 21 2025 8:08 AM

హామీల

హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం

శ్రీకాకుళం న్యూకాలనీ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేకుంటే ఉద్యమాలు తప్పవని ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వి.రమణమూర్తి అన్నారు. శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్‌లో అత్యవసర కార్యవర్గ సమావే శం నిర్వహించారు. అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ ఉద్యోగవర్గాల కు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రికి ఎస్టీయూ సంఘం తరఫున పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే పీఆర్సీని అమలుపర్చేలా చర్యలు చేపట్టాలని, ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌ బకాయిలు, పెండింగ్‌ డీఏలను ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ, శ్రీనివాసరావు, రామారావు, శ్రీధర్‌, తేజ, లక్ష్మణరావు, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

గోవుల వాహనాలు సీజ్‌

సరుబుజ్జిలి: కబేళాకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 28 గోవులను పట్టుకున్న ట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. హిరమండ లం నుంచి వాహనాల్లో పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో గురువా రం సరుబుజ్జిలి జంక్షన్‌ వద్ద పోలీస్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు వాహనాల్లో ఉన్న 8 మందిని విచారణ చేయగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గోవుల ను కొనుగోలుకు చేసి కబేళాకు తరలించినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. వీరిపై కేసు లు నమోదు చేసి వామనాలను సీజ్‌ చేసి ఆమ దాలవలస జూనియిర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. గోవులను విజయనగరం జిల్లా గుర్జంగివలస గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

పట్టుబడిన వాహనం

No comments yet. Be the first to comment!
Add a comment
హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం   1
1/1

హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement