ఘనంగా సహస్రకలశాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సహస్రకలశాభిషేకం

Published Wed, Mar 26 2025 2:00 AM | Last Updated on Wed, Mar 26 2025 2:00 AM

ఘనంగా సహస్రకలశాభిషేకం

ఘనంగా సహస్రకలశాభిషేకం

మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్‌ సిమెంట్‌ పరిశ్రమలో నిర్వహిస్తున్న శ్రీదేవిభూదేవి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సహస్రకలశాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో వెయ్యిన్నొకటి (1001) కలశాలతో సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, పంచామృతంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 19 న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు పేర్కొన్నారు. అనంతరం జీయర్‌స్వామి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి సారిగా ఏకోత్తర సహస్ర అభిషేక మహోత్సవం నిర్వహించారని ఈ అభిషేక తీర్థం ఎన్నో గొప్పఫలితాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహనరావు, అరుణ దంపతులు, జూపల్లి వినోద్‌రావు, భార్గవి దంపతులు, రంజిత్‌రావు, యూనిట్‌ హెడ్‌ శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement